రాజు తలుచుకుంటే, వరాలకు కొదవా?.. సీఎంపై అల్లు అరవింద్ కామెంట్స్
ప్రస్తుతం టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదాలు, నెలకొన్న సమస్యల అందరికీ తెలిసిందే. ఆన్ లైన్ టికెటింగ్ విధానం, వంద శాతం ఆక్యుపెన్సీ, రోజూ మూడు ఆటలే అనే విధానం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కామెంట్లతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది. ఏపీ ప్రభుత్వం మీద, మంత్రుల మీద చేసిన కామెంట్లకు అందరూ షాక్ అయ్యారు. ఇండస్ట్రీకి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధం లేదని నిర్మాతలు కూడా ప్రకటించారు. అలా మొత్తానికి కొందరు నిర్మాతలు, మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. అలా ఓ వైపు జరుగుతూనే ఉంది. అయితే తాజాగా అఖిల్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ఈవెంట్లో మాట్లాడారు. తమ పరిస్థితిని అర్థం చేసుకోండని ఏపీ సీఎం జగన్కు అల్లు అరవింద్ విన్నవించుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్కు ఇది మొదటి ఫంక్షన్. దీని తర్వాత ప్రీరిలీజ్ వేడుక, విడుదలైన తర్వాత సక్సెస్మీట్ తప్పకుండా ఉంటుందని అన్నాడు. గీతాఆర్ట్స్లో విజయవంతమైన చిత్రాలు మేము కాదు ఇచ్చింది.. ప్రేక్షకులు మాకు ఇచ్చారని, తెలుగు ప్రేక్షకుల గొప్పదనాన్ని చెప్పాడు. మన వాళ్లను చూసి బాలీవుడ్ వాళ్లు కూడా సినిమాలు విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారంటూ అల్లు అరవింద్ అన్నాడు. ఈ వేదికగా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిగారిని కోరేది ఏంటంటే.. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేక ఇబ్బందుల్లో ఉందని తెలిపాడు. రాజు తలుచుకుంటే, వరాలకు కొదవా? దయచేసి మీరు తలుచుకుని, పరిశ్రమలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపమని ఈ వేదికగా కోరుతున్నానని తెలిపాడు. మీరు చిత్ర పరిశ్రమను ఎంత ప్రోత్సహిస్తారో, అన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతాయని అన్నాడు. తాను చేసే విన్నపాన్ని ఇండస్ట్రీ విన్నపంగా తీసుకోండని అల్లు అరవింద్ వేడుకున్నాడు.
Comments
Post a Comment