కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నా.. చిరంజీవి ఎమోషనల్

మెగాస్టార్ తన మేనళ్లుడు రిపబ్లిక్ సినిమా గురించి బాగానే తాపత్రయపడుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం జరగడం, ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. కొందరు కోమాలోనే ఉన్నాడని అంటే.. ఇంకొందరు అయితే మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. అలా తేజూ ఆరోగ్య పరిస్థితి మీద గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని, త్వరగా కోలుకుంటున్నాడని నాగబాబు చెప్పేశాడు. అయితే సాయి ధరమ్ తేజ్ చిత్రం అక్టోబర్ 1న విడుదల కాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసేసింది. దర్శకుడు, హీరోయిన్ ఇలా అందరూ మీడియా ముందుకు వచ్చారు. మెగా హీరోలు కూడా సాధ్యమైనంత వరకు రిపబ్లిక్ చిత్రాన్ని ముందకు తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ సెలెబ్రిటీలకు స్పెషల్ షో వేసినట్టు తెలుస్తోంది. తాజాగా చిరంజీవి రిపబ్లిక్ సినిమా గురించి ఓ పోస్ట్ పెట్టేశాడు. ‘సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో అందుతాయని ఆశిస్తూ, ఆ చిత్ర యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్‌కి ‘రిపబ్లిక్’ చిత్ర విజయం కూడా కోలుకోవడానికి కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. దేవాకట్టా దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ఐశ్వర్యా రాజేష్ వంటివారు నటించారు. ఇప్పటికే వదిలిన ట్రైలర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ