‘నల్లమల’ టీజర్‌.. అసూయ పడ్డాను అంటూ దేవా కట్టా కామెంట్స్

బిగ్ బాస్ షోతో , బాగానే ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో స్నేహితుల్లా మారిన ఆ ఇద్దరూ ఇప్పుడు హీరో హీరోయిన్లుగా మారారు. అంటూ ఈ ఇద్దరూ ఇప్పటికే దుమ్ములేపేశారు. ఏమున్నవే పిల్ల ఏమున్నవే అంటూ ఒకే ఒక్క పాటతో నల్లమల సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశాడు. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా దర్శకుడు దేవా కట్టా విడుదల చేశాడు. ఈ ఈవెంట్‌కు రావడం అంత ఇష్టం లేకపోయినా వచ్చాను అని అసలు విషయం చెప్పేశాడు. అయితే టీజర్‌లో అమిత్ చెప్పిన డైలాగ్స్, చివర్లో పులి ఉండే షాట్ బాగుంది. ఏమున్నవే పిల్లా అనే పాటను తన ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్ సమయంలో విన్నాను అని, అలాంటి పాట నాకు ఎందుకు లేదు అని అసూయ పడ్డానంటూ దేవా కట్టా చెప్పుకొచ్చాడు. అయితే ఈ చిత్రంలో అద్భుతమైన నటీనటులున్నారని దేవా కట్టా అన్నాడు. ఇక దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ సినిమా గురించి ఓ రెండు విషయాలు చెబుతానని అన్నాడు. అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటామని, బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చా ఆయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయిందంటూ.. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే ఈ కథ అని చెప్పుకొచ్చాడు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ