Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. 'ఆచార్య' నుంచి కీలక అప్‌డేట్

కరోనా కష్టకాలం నుంచి సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వాయిదాపడ్డ సినిమాలు ఒక్కొక్కటిగా సెట్స్ మీదకొచ్చి షూటింగ్స్ ఫినిష్ చేసుకుంటున్నాయి. ఈ లిస్టులో , పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు నటిస్తున్న పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. వీటి కోసం వేయికన్నులతో ఆతృతగా ఎదురుచూస్తోంది టాలీవుడ్ లోకం. ఈ నేపథ్యంలో తాజాగా మెగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఓ వార్త మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూనే చిత్రంలో ఎంతో కీలకమైన సిద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే టాకీ పార్టు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ జరుగుతోందని విన్నాం. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్న అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. అయితే ఈ చిత్ర రిలీజ్ విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది. దసరా కానుకగా విడుదల కానుందని, లేదు లేదు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించబోతున్నారని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' రిలీజ్ విషయంలో దర్శకనిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్సయినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ బాణీలు కడుతున్నారు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌తో ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారట కొరటాల.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ