Posts

Showing posts from June, 2021

Crrush: ఆ మూడు జంటలను నగ్నంగా బంధించిన డైరెక్టర్.. అలా వర్కవుట్ కాకపోవడంతో ఇలా!

Image
నటుడిగా, దర్శకుడిగా తనదంటూ ప్రత్యేకమైన దారి అంటూ దూసుకుపోతున్నారు . సీనియర్ నటుడు చలపతి రావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సినీ రంగంలో ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న ఆయన, విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే 'ఆవిరి' సినిమాతో అట్రాక్ట్ చేసిన ఆయన ఈ సారి అడల్ట్ కామెడీ మూవీ ''తో రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ అడల్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. తన సొంత బ్యానర్ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కోసం అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు రవిబాబు. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా 'క్రష్' అనే టైటిల్‌తో వస్తున్న ఆయన, అదే రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తూ కాళ్లపై ఉన్న వెంట్రుకలను షేవ్ చేసుకుంటున్న అమ్మాయిని, డోర్ పక్కనే ఉండి మాస్క్ ధరించి అదంతా చూస్తున్న ముగ్గురు అబ్బాయిలను చూపిస్తూ గతంలో పోస్టర్స్ వదిలిన రవిబాబు ఈ సారి ఏకంగా మూడు జంటలను నగ్నంగా బందీ చేసిన ఫొటో రిలీజ్ చేశారు. ఇక రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ ఆన్ లైన్ వేదికలపై ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. అర్థనగ్న సన్నివేశాలు, డబుల్

ఆ వార్త చూడగానే గుండె తరుక్కుపోయింది.. గొప్ప మనసు చాటుకున్న సంపూర్ణేష్ బాబు

Image
చిన్న హీరోనే కానీ రియల్ హీరో, మనసున్న మంచి మనిషి, ఆపదలో ఉన్నారంటే సాయం చేయడంలో ఎప్పుడూ ముందే అని నిరూపించుకుంటున్నారు . సాటి మనిషి కష్టాల్లో ఉంటే తట్టుకోలేని ఆయన, ఇప్పటికే చాలా సందర్భాల్లో ఔదార్యం చాటుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సీసీసీకి, అలాగే వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కి, రీసెంట్‌గా సినీ జర్నలిస్టు TNR అకాల మరణంతో వారి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన సంపూర్ణేష్ బాబు.. తాజాగా తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లలకు సాయం చేసి మంచి మనసున్న హీరో అనిపించుకున్నారు. దుబ్బాక పురపాలక పరిధిలో ఉంటున్న నరసింహచారి దంపతులు అప్పుల భారం మోయలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. ఈ విషయం తెలుసుకొని సంపూర్ణేష్ బాబు వారికి 25 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ప్రతి మనిషికి జీవితంలో కష్టం, ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయని, వాటికి ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యకు పాల్పడి కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని సంపూ అన్నారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టిన సంపూర్ణేష్ బాబు.. ''దుబ్బాకలో నరసింహచారి గారి కుటుంబంలో జరిగిన ఈ వార్త చూసి గుండె తరుక

టీడీపీ బ్రతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే.. తారక్ పొలిటికల్ ఎంట్రీపై బాబు మోహన్ సెన్సేషనల్ కామెంట్స్

Image
గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడటంతో ఒక్కసారిగా అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్‌పై పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీకి ఓ యువ నాయకుడి అవసరం ఉందనే టాక్ మొదలైంది. అంతేకాదు జూనియర్ మాత్రమే తెలుగు దేశం పార్టీ జెండాను తిరిగి రెపరెపలాడించగలడు అనే చర్చలు షురూ కావడం, దానిపై చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు రియాక్ట్ కావడం చూశాం. కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై సీనియర్ నటుడు, రాజకీయవేత్త సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో 2009 ఎన్నికల్లో ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళితే జనం భారీగా వచ్చారు. తాతలా వాగ్ధాటి ఉన్నవాడు కావడంతో అంతా అట్రాక్ట్ అయ్యారు. ఆ సమయంలోనే తారక్ ఎంట్రీ ఖారరైందని అంతా భావించగా అనూహ్యంగా ఆ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు ఎన్టీఆర్. అయితే మళ్ళీ రీసెంట్‌గా టీడీపీ హవా తగ్గడంతో ప్రతిఒక్కరూ ఎన్టీఆర్ వైపే చూస్తున్నారు. పార్టీకి తిరిగి పూర్వ వైభవం రావాలంటే ఆయనే దిక్కు అని చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల నడుమ బాబు మోహన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 'టీడీపీకి బలం చేకూరాలంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఉండ

సినిమా రౌండప్: ప్రభాస్‌తో డ్రీమ్.. ఒంటరిగానే బెస్ట్.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Image
లైన్ లోకి 'ఉప్పెన' బ్యూటీ తొలి సినిమా 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకుంది హీరోయిన్ . గ్లామర్ ట్రీట్‌కి కాస్త దూరంగా ఉంటూనే తనదైన నటనతో అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో నటిస్తోంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌లో కృతి జాయిన్ అయింది. ధనుష్.. 100 కోట్లపైనే తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ఇటీలే చెన్నైలోని పోయిస్‌ గార్డెన్‌లో కొత్త ఇల్లు నిర్మించుకోబోతున్నారు. ఇటీవలే దీనికి భూమి పూజ కూడా చేసిన ఆయన ఈ ఇంటి కోసం ఏకంగా 100 కోట్లపైనే ఖర్చు చేస్తున్నారట. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఈ ఇంటిని తనకు నచ్చిన రీతిలో డిజైన్ చేయించుకుంటున్నారట ధనుష్. ఒంటరిగానే బెస్ట్ 'జయం' సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సదా.. తన పెళ్లి విషయమై ఓపెన్ అయింది. తన మనస్తత్వానికి మ్యాచ్ అయ్యేవాడు దొరికితేనే పెళ్లి లేదంటే ఒంటరిగానే ఉంటా అని చెప్పింది. అయినా ఒంటరి జీవితమే బెస్ట్ అంటూ తన మనసులోని మాట బయటపెట్టింది సదా. ప్రభాస్‌తో హీరోయిన్ డ్రీమ్ పా

అవికా గోర్ పాప్ కార్న్.. వర్షపు జల్లుల్లో తడిసిన అందాలతో చిన్నారి పెళ్లి కూతురు

Image
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో కెమెరా ముందుకొచ్చి బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంది . తన సొంత పేరు కంటే ఎక్కువగా చిన్నారి పెళ్లి కూతురు అంటేనే అంతా గుర్తుపట్టే రేంజ్‌లో ఫేమస్ అయింది. ఇక ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ''సినిమా చూపిస్తా మావ, లక్ష్మి రావే మా ఇంటికి, మాంజా, ఎక్కడికిపోతావు చిన్నాదాన, రాజు గారి గది 3'' చిత్రాల్లో నటించి కాస్త బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఆఫర్స్ అన్నీ ఓకే చేస్తూ ఏకంగా ఆరు సినిమాలకు కమిటైంది అవికా. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్న ఆమె, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ జోడీగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. వర్షపు జల్లుల్లో తడిసిన అందాలతో యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది ఈ చిన్నారి పెళ్లి కూతురు. ఇకపోతే ఆది సాయి కుమార్‌ సరసన అవికా నటిస్తోన్న ‘అమరన్‌’ మూవీ ఏప్రిల్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బలవీర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం

సునిశిత్‌ని తాట తీసిన నందమూరి ఫ్యాన్స్.. హరికృష్ణనే కాదు ఏ హీరోని తిట్టనంటూ వీడియో

Image
సాక్రిఫైజింగ్ స్టార్, ట్రెండింగ్ స్టార్ ఇలాంటి స్టార్లు చాలానే ఉన్నాయి మనోడికి.. పెట్టుకున్నవే కాబట్టి ఎన్నైనా స్టార్లు ఉంటాయి కానీ.. ఈ స్వయం ప్రకటిత స్టార్ తాట తీసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు రంగంలోకి దిగడంతో క్షమించండి మహాప్రభో అంటూ వాళ్ల కాళ్లపై పడ్డాడు. ఇంతకీ ఈ స్టార్ ఎవరంటే . లావణ్య త్రిపాఠితో నాకు పెళ్తైంది.. తమన్నాతో కాపురం చేశా.. బాహుబలి సినిమా నాతో చేయాల్సింది.. బాహుబలి హీరో ముందు నేనే.. ఆర్ ఆర్ ఆర్ ఛాన్స్ నాకే.. అసలు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్‌లు హీరోలే కాదు.. రాజమౌళి దర్శకుడే కాదు.. ఇలాంటి కామెంట్స్‌తో యూట్యూబ్‌లో హల్ చల్ చేసిన సునిశిత్ ఆ మధ్య కాలంలో జైలుకి కూడా వెళ్లొచ్చాడు. నోటికి వచ్చినట్టు వాగడంతో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇతగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే జైలు నుంచి వచ్చిన తరువాత కూడా మనోడిలో మార్పురాలేదు. పాత పాటే పాడుతూ స్టార్ హీరోలందరిపైన నోటికొచ్చినట్టు వాగడం మొదలుపెట్టాడు. రీసెంట్‌గా హరికృష్ణ గురించి నోటికొచ్చినట్టు పేలడంతో ఇతని తాట తీసేందుకు రంగంలోకి దిగారు నందమూరి అభిమానులు

కవితను వెంటాడుతున్న విషాదాలు.. ఆ చేదు జ్ఞాపకాలు మరువకముందే భర్త కన్నుమూత

Image
కరోనా మహమ్మారి ఎంతోమంది సెలబ్రిటీల ఇళ్లలో విషాదం మిగిల్చింది. గత ఏడాదికి కాలంగా చాలామంది నటీనటులు, వారి వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడం జరిగింది. కాగా సౌత్ ఇండియన్ సీనియర్ యాక్ట్రెస్ పాలిట శాపంగా మారింది కరోనా. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. గత పది రోజుల క్రితమే కవిత కొడుకు సంజయ్‌ రూప్‌‌ మృతి చెందాడు. కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచాడు. దీంతో ఒక్కసారిగా కృంగిపోయిన కవితకు తన భర్త మృతితో మరో షాక్ తగిలింది. కొడుకు మరణం తాలూకు చేదు జ్ఞాపకాలు మరవకముందే అదే కరోనా మహమ్మారి కవిత భర్తను పొట్టన పెట్టుకుంది. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన కవిత భర్త దశరథ రాజు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. దశరథ రాజు మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు కవితను పరామర్శిస్తున్నారు. 11 ఏళ్ల వయసులో వెండితెరపై అడుగుపెట్టిన కవిత తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా సౌత్‌లో దాదాపు 35

Sadha: స్టార్ హీరోతో సీక్రెట్ ఎఫైర్‌.. ఆ సమయంలో మంచు మనోజ్ చుక్కలు చూపించాడు! సదా ఓపెన్ కామెంట్స్

Image
గ్లామర్ ఇండస్ట్రీ అన్నాక జనం నోళ్ళలో పలు రకాలుగా నానడం కామన్. నటీనటులపై, ముఖ్యంగా హీరోయిన్స్ విషయమై కుప్పలు తెప్పలుగా గాసిప్స్ పుట్టుకొస్తుంటాయి. ఓ హీరోయిన్ మరో హీరోతో కాస్త క్లోజ్ రిలేషన్ మెయిన్‌టైన్ చేసినా లేదా వరుసపెట్టి రెండు మూడు సినిమాల్లో నటించినా వాళ్ళ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ రూమర్స్ వైరల్ చేస్తుంటారు. హీరోయిన్ విషయంలో సరిగ్గా ఇదే జరిగిందట. ఈ విషయాలతో పాటు తన కెరీర్ ముచ్చట్లను తాజాగా 'ఆలీతో సరదాగా' వేదికపై పంచుకుంది సదా. తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన 'జయం' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది సదా. ఆ తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ పలు సౌత్ ఇండియన్ భాషల్లో ఫేమస్ హీరోయిన్ అయింది. విక్రమ్ హీరోగా శంకర్ రూపొందించిన ‘అపరిచితుడు’ సినిమా ఆమెను ఫుల్ పాపులర్ చేసేసింది. కాగా తాజా పోగ్రామ్‌లో కెరీర్ ఆరంభం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా జరిగిన అన్ని విషయాలను షేర్ చేసుకున్న సదా.. మంచు వారబ్బాయి రియల్ క్యారెక్టర్ బయటపెట్టింది. మంచు మనోజ్‌తో కలిసి 'దొంగ దొంగది' సినిమాలో నటించింది సదా. ఎప్పుడూ చలాకీగా ఉండే మంచు మనోజ్.. ఆ సినిమా షూటింగ్ సమయంలో

Kathi Mahesh: కత్తి మహేష్ చనిపోవాలంటూ దారుణమైన పోస్ట్‌లు.. ఖుషీ డైలాగ్‌తో IPS పీవీ సునీల్ కుమార్ కౌంటర్

Image
నెల్లూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మూవీ క్రిటిక్ మహేష్ కత్తి తీవ్ర గాయాల పాలై.. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కొన్నాళ్లు పాటు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకోనున్నారు. తలకి తగిలిన గాయాలు నయం అవుతుండగా.. నుదిటి ఎముకకు, ముక్కుకు శస్త్ర చికిత్సలు పూర్తయ్యాయి. అయితే కంటికి బలమైన గాయాలు కావడంతో పలు దఫాలుగా ఆపరేషన్స్ చేయనున్నారు శంకర ఆసుపత్రి వైద్యులు. అయితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం లేదని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. కత్తి మహేష్‌కి యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఒక వర్గం దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. మానవత్వం మరిచిపోయి కత్తి మహేష్ చనిపోవాలంటూ వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. కళ్లు పోయాయని.. చనిపోతాడని.. ఘోరమైన చావు రావాలని ఇలా రకరకాల కామెంట్లు పెడుతూ తెగ సంబరపడుతున్నారు. ఇక కత్తి మహేష్ తిరిగి కోలుకుంటున్న తరువాత కూడా.. దారుణమైన కామెంట్లు పెడుతూనే ఉన్నారు. అయితే వీటిపై ఐపీఎస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ..

Allari Naresh: సభకు నమస్కారం అంటూ అల్లరోడి ఎంట్రీ.. వాళ్ళను విమర్శించడమే ధ్యేయంగా ముందడుగు!

Image
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్. వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో కామెడీ పండిస్తున్న ఆయన.. తెలుగు తెరపై రాజేంద్రప్రసాద్ తరువాత స్థానంలో నిలిచాడని చెప్పుకోవచ్చు. మినిమమ్ గ్యారంటీ హీరోగా దర్శకనిర్మాతలకు బెటర్ ఛాయిస్ అవుతున్న ఈ అల్లరోడు '' అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. నేడు (జూన్ 30) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా ‘నాంది’ సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇప్పుడు 'సభకు నమస్కారం' అంటున్నాడు. స‌తీశ్ మ‌ల్లంపాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. అల్లరోడి కెరీర్‌లో 58వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. తాజాగా విడుదలైన పోస్ట‌ర్‌లో ఓ వైపు జేబులో నోట్ల క‌ట్ట‌లు, మ‌రోవైపు జేబులో మందు సీసా కనిపిస్తుండటం చూస్తుంటే ఇది పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని అర్థమవుతోంది. ఈ చిత్రంలో నరేష్ క్యారెక్టర్ గత సినిమాలకు పూర్తి భిన్నంగ

Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో అలాంటి రిలేషన్.. ఫొటోతో సహా మ్యాటర్ రివీల్ చేసిన రష్మిక

Image
నేటితరం ప్రేక్షకుల మనసులో క్రేజీ హీరో హీరోయిన్లుగా బలమైన ముద్ర వేసుకున్నారు విజయ్ దేవరకొండ- . 'గీత గోవిందం' సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి టాలీవుడ్ ప్రేక్షకలోకం ఫిదా అయింది. ఆ తర్వాత 'డియర్ కామ్రెడ్' సినిమాలోనూ అదే రేంజ్ రొమాన్స్ పండించి సూపర్ హిట్ జోడీ అనిపించుకుంది ఈ జంట. దీంతో జనాల్లో ఈ పెయిర్ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకుంది. ఇక వీలుచిక్కినప్పుడల్లా వీళ్ళిద్దరూ సరదాగా కలుస్తుండటం చూసి ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలుకావడం, వాటిపై అటు రష్మిక ఇటు స్పందించడం చూశాం. తాజాగా మరోసారి అదే అంశం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్ అభిమానులతో పంచుకుంటున్న రష్మిక.. తాజాగా కొద్దిసేపు తన ఇన్స్‌స్టా వేదికగా చాట్ చేసింది. ఈ కార్యక్రమంలో చాలా విషయాలపై ఆమె ఓపెన్ అయింది. విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమంటూ మనసులో మాట బయటపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని తేల్చిచెప్పింది. తన బెస్ట్ ఫ్రెండ్ విజయ్ అని ఆమె చెప్పడం విశేషం. ఇక.. విజయ్ దేవరకొండతో దిగిన ఫొటోల్లో చాలా ప్రత్యేకమైన ఫొటో ఇదే అని తెలుపుతూ 'డియర్‌

నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిదేంటి?.. నెటిజన్ ప్రశ్నకు రష్మిక క్యూట్ రిప్లై

Image
నేషనల్ క్రష్ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. చిన్న పిల్లలా ఆమె చేసే చేష్టలు, పెట్టే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌‌‌కు అందరూ ఫిదా అవుతుంటారు. అలా చేసే అల్లరికి ఎంతో మంది అభిమానులున్నారు.అందుకే సోషల్ మీడియాలో రష్మికకు అంతటి అభిమాన గణం ఉంది. అయితే తాజాగా రష్మిక తన అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో రష్మిక తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో ఎక్కువగా ప్రపోజల్స్ రావడం, ఫ్లర్టింగ్ కామెంట్లు రావడంతో రష్మిక ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఒక్క బాలీవుడ్ సినిమాలో నటించకపోయినా కూడా రష్మికకు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఉత్తరాదిన కూడా రష్మిక తన మార్క్ వేశారు.అలా మొత్తానికి నేషనల్ క్రష్ అనిపించుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఆమె చేసే అల్లరికి తోడవుతుంటుంది. సోషల్ మీడియాలో రష్మిక రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే తాజాగా రష్మిక మందన్నా తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏదైనా అడగండి.. ఆన్సర్ చెబుతాను అని చిట్ చాట్ చేయడం మొదలుపెట్టేశారు. అందులో ఓ నెటిజన్.. నన్ను పెళ్లి చేసుకో అని నేరుగా అడిగేశారు. దానికి రష్మిక తెలివిగా సమాధానం ఇ

Daggubati Venkatesh : ‘నారప్ప’ సెన్సార్ అప్డేట్.. ఫ్యాన్స్‌లో అనుమానాలు!

Image
ప్రస్తుతం టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల మీద పదే పదే రూమర్లు పుట్టుకొస్తున్నాయి. సెట్స్ మీదున్న కొన్ని చిత్రాలు, షూటింగ్ పూర్తి చేసుకున్న మరికొన్ని సినిమాలను ఓటీటీలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా చిత్రాల పేర్లే వినిపిస్తున్నాయి. అవి రెండూ కూడా పక్క భాషల నుంచి తీసుకుని రీమేక్ చేస్తున్న చిత్రాలే. తమిళం నుంచి అసురన్‌ను నారప్పగా.. మళయాలం నుంచి దృశ్యం 2ను అదే పేరుతో వెంకటేష్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇవి రెండూ కూడా ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయి. నారప్పను గత ఏడాది నుంచి చెక్కుతూనే ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రియమణి, కార్తీక్ రత్నం వంటి వారు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. అయితే , దృశ్యంను సురేష్ బాబు 70 కోట్లకు ఓటీటీ సంస్థకు అమ్మేశారంటూ వార్తలు వస్తున్నాయి. వాటిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే నారప్ప నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందంటూ సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ వేసింది. దీంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యా

RRR పోస్టర్‌పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల చురకలు.. రివర్స్ కౌంటర్ వేసిన చిత్రయూనిట్

Image
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఈ మధ్య సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా ట్రోల్స్, మీమ్స్ చేయడంలోనూ తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. అందులోనూ ప్రత్యేకంగా సినిమా వాళ్లను బాగానే వాడుకుంటున్నారు. సినిమాల నుంచి అప్డేట్లు అంటూ వచ్చే కొత్త కొత్త పోస్టర్లను తమ శైలిలో ఎడిట్ చేస్తుంటారు. సినిమాల్లో హీరోలు బైకులు రైడ్ చేసే పోస్టర్లు వస్తే తమ పనితనాన్ని చూపిస్తుంటారు. ఆ పోస్టర్లను ఎడిట్ చేసి వాటికి హెల్మెట్ పెట్టి ఓ మీమ్ వేస్తుంటారు. అలా తాజాగా ట్రాఫిక్ పోలీసుల దృష్టి మీద పడింది. నేటి ఉదయం ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే పోస్టర్ ఒకటి వచ్చింది. మూవీ షూటింగ్ అప్డేట్ అంటూ టీం ఓ ట్వీట్ వేస్తూ సరికొత్త పోస్టర్‌ను వదిలింది. ఓ రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయిందని, ఇప్పటికే రెండు భాషలకు వీరు డబ్బింగ్ కూడా పూర్తి చేసేశారని , బుల్లెట్ మీద షికార్లు కొడుతున్న ఫోటోను ఆర్ఆర్ఆర్ టీం వదిలింది. ఇక అలాంటి ఫోటో దొరికితే ట్రాఫిక్ పోలీసులు వదులుతారా? తమ టాలెంట్‌ను చూపించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు గ్రాఫిక్స్‌ల్ హెల్మెట్ పెట్టేశారు.. ఇప్పుడు పర్ ఫెక్ట్‌గా ఉందని, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఉండండి అని ట్

అమ్మ హిందూ, నాన్న ముస్లిం.. క్యాన్సర్ రావడంతో అలా.. హీరోయిన్ సదా కామెంట్స్

Image
హీరోయన్ గురించి దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జయం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకున్నారు. అయితే జయం సినిమా అంత పెద్ద హిట్ అయినా కూడా వెంటనే ఆఫర్లు రాలేదట. ఇక తన ఫ్యామిలీ కూడా సినిమా పరిశ్రమకు ఏ మాత్రం సంబంధం లేదని, ఎక్కడి నుంచి వచ్చిన తాను ఇలా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చానని సదా చెప్పుకొచ్చారు.తాజాగా షోలోకి గెస్ట్‌గా వచ్చిన సదా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను అందరి ముందు బయటపెట్టేశారు. ముంబై గోవా మధ్యలో ఉండే రత్నగిరి ప్రాంతానికి చెందిన వారమని తమ ఫ్యామిలీ గురించి సదా వివరించారు. అమ్మ ప్రభుత్వ ఉద్యోగి. నాన్న డాక్టర్ అని సదా తెలిపారు. సినీ పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. అయితే చిన్నప్పటి నుంచి మాత్రం డ్యాన్సులు చేయడం ఇష్టం. స్కూల్ యానివర్సరీ ఫంక్షన్‌లో ముందుండేదాన్ని. చదువుల్లో కూడా ఎప్పుడూ ఫస్టే. ఇంటర్‌లో 92 శాతం వచ్చింది. ఓసారి మా స్కూల్‌కు ఎమ్మేల్యే వచ్చారు. మా ప్రిన్సిపాల్‌తో నా గురించి మాట్లాడారు. సినిమా అవకాశాలు ఏమైనా కావాలంటే చెప్పండి అని అన్నారట. అదే విషయాన్ని మా పేరెంట్స్‌తో చె

Vignesh Shivan : పెళ్లికి ముందే పిల్లల్ని కంటారా?.. నెటిజన్ ప్రశ్నకు విఘ్నేశ్ శివన్ అదిరిపోయే కౌంటర్!

Image
ప్రియుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అయితే నయన్ మాత్రం సోషల్ మీడియాకు ఆమడ దూరంలో ఉంటారు. ఆమెకు సోషల్ మీడియా ఖాతాలు కూడా ఉండవు. కానీ ఆమె అభిమానులు మాత్రం నయన్ గురించి తెలుసుకునేందుకు విఘ్నేశ్ శివన్‌ను ఫాలో అవుతుంటారు. అప్పుడప్పుడు నయన్‌కు సంబంధించిన విషయాలు విఘ్నేశ్ షేర్ చేస్తుంటారు. ఇక నయనతారతో దిగే రొమాంటిక్ ఫోటోలను విఘ్నేశ్ శివన్ షేర్ చేస్తే అవి తెగ వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య విఘ్నేశ్ శివన్ తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తున్నారు. మొన్న ఆదివారం నాడు కూడా విఘ్నేశ్ తన ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెట్టారు. అలా విఘ్నేశ్‌కు రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంట్లో ఎక్కువగా నయనతారకు సంబంధించిన విషయాలే ఉన్నాయి. అలా తనను నయనతారకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతుంటే ఎలా అనిపిస్తోందని ఓ నెటిజన్ అడిగేశాడు. అలా అడుగుతుంటే ఎంతో గర్వంగా ఉందని విఘ్నేశ్ చెప్పుకొచ్చారు. అయితే కొందరు నెటిజన్‌లు మాత్రం కొంటె ప్రశ్నలను అడిగేశారు. నయనతారను ముద్దుపెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేయండని ఓ నెటిజన్ అడిగాడు. ముద్దు పెట్టుకునే బిజీలో నేను ఉంటే.. ఫోటో తీయడానికి ఎవ్వరూ లేరు అని కౌంటర్ వేశారు. మరో నెటిజన్ ఇంకాస్త ముందుకువెళ్

భూ వివాదంలో టాలీవుడ్‌ బడా ప్రొడ్యూసర్.. సి కళ్యాణ్‌పై పోలీస్ కేసు నమోదు

Image
టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ నిర్మాత సి కళ్యాణ్‌పై నమోదైంది. భూ వివాదంలో ఆయన చిక్కుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. షేక్‌పేట భూవివాదంపై వచ్చిన ఫిర్యాదు పరిశీలించి సి కళ్యాణ్‌తో పాటు మరో ముగ్గురిపై ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అమెరికాలో వైద్యుడిగా ప‌నిచేస్తున్న స్వ‌రూప్ అనే వ్య‌క్తి 1985 సంవత్సరంలో షేక్‌పేటలో ఫిలింన‌గ‌ర్ హౌసింగ్ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. ఈ స్థ‌లాన్ని 2015 సంవత్సరంలో నారాయణ మూర్తి అనే వ్య‌క్తికి లీజుకు ఇచ్చాడు. లీజుకు తీసుకున్న ఆ స్థలంలో అప్ప‌టి నుంచి నారాయణ మూర్తి ఓ ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. అయితే సోమ‌వారం సాయంత్రం సమయంలో ష‌రూఫ్‌, శ్రీకాంత్‌, తేజ‌స్వీ అనే ముగ్గురు వ్య‌క్తులు సదరు ఆర్గానిక్ స్టోర్‌కు వెళ్లి నిర్మాత సి. క‌ళ్యాణ్ పంపించాడ‌ని చెప్పి.. స్టోర్‌కు తాళం వేయడంతో ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఆర్గానిక్ స్టోర్ య‌జ‌మాని సి. క‌ళ్యాణ్‌తో పాటు ఆ ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు క‌ళ్యాణ్‌తో పాటు ఆ ముగ్గురిపై కూడా కేసు న‌మోదు

RRR: బుల్లెట్‌పై జెట్ స్పీడుతో ఎన్టీఆర్, రామ్ చరణ్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్

Image
దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ . దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి. పైగా ఈ మూవీతో స్టార్ హీరోలు , తెర పంచుకోనుండటం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఎప్పటికప్పుడు అనుకోని కారణాలతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడటంతో రిలీజ్ డేట్ మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగా, నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ ఇచ్చారు జక్కన్న. RRR సినిమాకు సంబంధించి రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం ఫినిష్ అయిందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఇతర భాషలకి త్వరలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారని తెలిపారు. ఈ మేరకు బుల్లెట్‌పై జెట్ స్పీడుతో వెళ్ళుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టిల్ రిలీజ్ చేశారు. దీంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ న్యూస్ తెలియడంతో RRR ఈ ఏడాది అక్టోబర్ లోనే రిలీజ్ చేసే అవకాశం ఉందనే మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌త

Rgv: అరియానాతో మరో బోల్డ్ వీడియో.. జస్ట్ చిల్ అంటూ హేటర్స్‌కి ఆర్జీవీ మెసేజ్! నేరుగా ఆ మాట చెబుతూ..

Image
ఏది చేసినా అందులో ఓ కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. విమర్శలు, ప్రశంసలు లాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ఆయన.. నిత్యం ఏదో ఒక అంశంతో జనం నోళ్ళలో నానుతుంటారు. సోషల్ మీడియాలో హైలైట్ కావడం ఎలా? అనేది వర్మకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో అనిపిస్తోంది రీసెంట్ పరిణామాలు చూస్తుంటే. సమాజంలోని ప్రతి అంశంపై ఫోకస్ పెట్టే వర్మ బోల్డ్ విషయాలను ఓపెన్ గానే మాట్లాడుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ' బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ' ఏ మేర చర్చల్లో నిలిచిందో తెలిసిందే. సాధారణమైన ఇంటర్వ్యూలకు బిన్నంగా బోల్డ్ అంశాలను జోడిస్తూ యంగ్ యాంకర్‌తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు వర్మ. తనదైన కెమెరా యాంగిల్స్ ఉపయోగిస్తూ జిమ్ములో అరియానా అందాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక విడుదలకు ముందు ఈ ఇంటర్వ్యూను సినిమా రేంజ్‌లో పబ్లిసిటీ చేశారు. అయితే ఈ వీడియో రిలీజ్ అయ్యాక వర్మపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయడమే గాక, కూతురు వయసున్న యంగ్ యాంకర్‌తో అలాంటి పనులేంటి? అంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే అలాంటి విమర్శలను పెద్దగా లెక్కచేయని రామ్ గోపాల్ వర్మ.. ఎవరేమనుకుంటే నాకేంటి? అంటూ మరో అడుగు ముందుకేశారు. ఓ వీడియో ద

Vignesh Shivan: అది జరిగాకే నయనతారతో పెళ్లి.. అందుకే వెయిటింగ్! సీక్రెట్ ఫొటో బయటపెడుతూ ఓపెన్

Image
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ ప్రేమ సంగతులు, పెళ్లి ముచ్చట్లకు నిత్యం వార్తల్లో ఎంతో కొంత స్పేస్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడే కాదు ఎప్పటినుంచో నయన్ పెళ్లి మ్యాటర్ అనేది ఓ హాట్ టాపిక్. గతంలో కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పెళ్లి పీటల దాకా వెళ్లిన లవ్ స్టోరీకి అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తోంది నయనతార. ఈ ఇద్దరిది కూడా చాలాకాలంగా కొనసాగుతున్న లవ్ ఎఫైర్. మొదటి సీక్రెట్‌గా నడిపించినా ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. దీంతో మ్యాటర్ మరోసారి చర్చల్లో నిలిచింది. నయనతార- విగ్నేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్నినెలలుగా వార్తల ప్రవాహం కొనసాగుతోంది. కానీ ఆ మూడు ముళ్ళ బంధానికి మాత్రం ముహూర్తం కుదరలేదు. దీంతో వాళ్లిద్దరు ఎక్కడ కనిపించినా ప్రేక్షకుల నుంచి ముందుగా వచ్చే ప్రశ్న 'మీ పెళ్లి ఎప్పుడు?'. ఈ నేపథ్యంలో తాజాగా విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించగా మళ్ళీ ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే దీనిపై ఆయన చెప్పిన సమాధానం విని షాకయ్యారు నెటిజన్లు. ముందు డబ్బు సంపాదించాలి.. ఆ తర్వాతే పెళ్లి అని విగ్నేష్ పేర్కొనడం ఆశ్చర్యం కలిగించిం

సినిమా రౌండప్: ఒకే ఒక జీవితం.. గతం గతః అంటూ అనుష్క ఎమోషనల్! అందుకే రంగంలోకి..

Image
అనుష్క ఎమోషనల్ పోస్ట్ మనిషి జీవితం, మారుతున్న రోజుల్లో ఎలా బ్రతకాలి అనే దానిపై స్టార్ హీరోయిన్ అనుష్క పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందమైన ప్రతిరోజు మాయమైపోతోంది కాబట్టి పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఆమె పేర్కొంది. జ‌రిగినదాన్ని త‌లుచుకుని బాధ పడొద్దని, అంద‌రిపై ప్రేమ‌ను చూపించండి అని తెలుపుతూ.. ప్ర‌తిదానిలో కూడా మంచిని వెతుకుతూ ముందుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేయండి అని చెప్పింది. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉండాలని అనుష్క చెప్పింది. ఒకే ఒక జీవితం ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమా చేస్తున్న శర్వానంద్.. తన 30వ సినిమాగా 'ఒకే ఒక జీవితం' సినిమాను ప్రకటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని అమల, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందుకే రంగంలోకి.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. అనూహ్యంగా తెలంగాణ వాదంతో సీవీఎల్‌ నరసింహారావు ఈ ఎన్నికల బరిలో దిగారు. అయితే తాను బరిలో నిల

Prakash Raj: ప్రకాష్ రాజ్, నాగబాబులను ఏకిపారేసిన కోటా.. ‘MAA’ ఎన్నికల్ని అనౌన్స్ చేయాల్సిందెవరు?

Image
మా ఎన్నికలు గురించి మాట్లాడటానికి నాగబాబుకి ఏం అవసరం ఉందని ప్రశ్నించారు సీనియర్ నటుడు కోటాశ్రీనివాసరావు. మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌కి కొందమంది సీనియర్ నటులు సపోర్ట్ చేస్తూ ప్యానర్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు కోటా. ఈ ఇష్యూపై ఆయన మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ మంచి నటుడై ఉంటే ఉండుగాక.. ఎన్నికల టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాలి తప్పితే.. మా ఎన్నికల్ని ఎవరు ప్రకటించారు? ఇప్పుడున్న కమిటీ ప్రకటించకుండా వీళ్లు హడావిడి ఏంటి? ఈ ఇష్యూలో నాగబాబు ఎందుకు హడావిడి చేస్తున్నారు.. ఆయనకు ఎందుకు ఈ ఇష్యూ.. మరి చిరంజీవి గారు మద్దతు ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ.. ప్రకాష్ రాజ్ గారు మాత్రం నాకు చిరంజీవి గారి మద్దతు ఉంది అని చెప్తారు. మద్దతు ఉంటే ఉండొచ్చు కానీ.. దీనిపై నాగబాబు ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలి. ప్రకాష్ రాజ్ అనే కాదు.. మిగిలిన వాళ్లు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు. నేను కూడా దీనిపై మాట్లాడకూడదనే అనుకున్నా.. కానీ ఈ కరోనా టైంలో ఈ గోల ఎందుకు పెడుతున్నారనేదే నా బాధ. ఎన్నికలు అంటూ ప్రకటనలు ఇచ్చిన ప్రకాష్ రాజ్ గారికి ఈ మాత్రం తెలియదా? జయసుధ సపోర్ట్ చేసిందని ప్రకాష్ రాజ్ అంటున్నారు..? ఆమెకు

Shaakuntalam : ఇంకొంత కాలం ఎదురుచూపులు తప్పవు.. ‘శాకుంతలం’పై నీలిమ గుణ కామెంట్

Image
దర్శకుడు గుణ శేఖర్, ఆయన కూతురు కలిసి ఓ అద్బుతాన్ని సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. గుణ టీంతో కలిసిన దిల్ రాజు సినిమాను భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్దమయ్యారు. గత రెండు మూడు నెలల క్రితమే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు నుంచే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో గుణ టీం బిజీగా ఉంది. ఇక సైతం పూర్తి స్క్రిప్ట్‌ను అవపోసన పట్టేశారు. అయితే సమంత, గుణశేఖర్ టీం స్పీడుకు కరోనా అడ్డు కట్టవేసింది. మంచి ఫాంలో ఉండి షూటింగ్ చేస్తోన్న చిత్రయూనిట్‌పై సెకండ్ వేవ్ ప్రభావం చూపించింది. సెకండ్ వేవ్ కారణం సినిమా షూటింగ్‌లన్నీ కూడా వాయిదా పడ్డాయి. అయితే తాజాగా శాకుంతలం సినిమా మీద సమంత అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. సమంత ఫస్ట్ లుక్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గుణ టీంకు రిక్వెస్ట్‌ల మీద రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. అయితే దీనిపై నీలిమ గుణ తాజాగా స్పందించారు. అభిమానులను కూల్ చేసేందుకు ప్రయత్నించారు. తాము ఇప్పుడే రెండో షెడ్యూల్‌ను ప్రారంభించాం.. ఇక ఫస్ట్ లుక్ రావాలంటే చాలా సమయం పడుతుందని నీలిమ గుణ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆమె వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘శాకుంతలం నుంచి సమంత ఫస్ట్ లుక్ ఇ

RRR షూటింగ్‌లో రామ్ చరణ్.. అదిరిపోయే స్టైలీష్ పిక్స్

Image
మెగా పవర్ స్టార్ ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చాలా రోజుల తరువాత మళ్లీ ఈ మధ్యే షూటింగ్‌ను పున: ప్రారంభించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన టీం.. సెకండ్ వేవ్ వల్ల ఎన్నో తిప్పలు పడింది. మధ్యలో నటీనటులు, దర్శకుడికి కూడా కరోనా సోకింది. అలా సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. అలా ఎప్పటికప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.అయినా కూడా ఆర్ఆర్ఆర్ మీదున్న అంచనాలేమీ తగ్గడం లేదు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ అంతా పూర్తయింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన వ్యవహారాలన్ని కూడా పూర్తయ్యాయి. దాదాపు 350 కోట్లకు పైగా అమ్ముడుపోయాయనే టాక్ వినిపిస్తోంది. అలా సినిమా షూటింగ్ పూర్తి కాకముందే బడ్జెట్‌ను రికవరీ చేసినట్టైంది. అలా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే ఎన్నోరికార్డులను బద్దలు కొట్టేస్తోంది. అయితే గత వారంలోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈక్రమంలో రామ్ చరణ్ సెట్స్ మీదకు వెళ్లారు. దాని కోసం ముంబై నుంచి స్పెషల్‌గా హెయిర్ స్టైలీష్ట్‌ను తీసుకొచ్చారు. మొత్తానికి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ మారిపోయి.. సెట్స్ మీదకు అడుగుపెట్టేశారు. అయితే తాజాగా ర

Mahesh Kathi: కత్తి మహేష్‌‌కి శస్త్ర చికిత్స పూర్తి.. అంతా సేఫ్, అవన్నీ పుకార్లే.. 3 వారాల్లో ఇంటికి

Image
నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూవీ క్రిటిక్ కత్తి మహేష్‌కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జూన్ 26 తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు హైవే వద్ద లారీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తలతో పాటు కన్నుకి బలమైన గాయాలు అయ్యాయి. అయితే ఆయన్ని హుటాహుటిన దగ్గర్లోని హాస్పటల్‌కి తరలించగా.. ప్రాణాపాయం తప్పింది. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చెన్నై ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం కత్తి మహేష్ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు.. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన సన్నిహితులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ అడిషనల్ డీజీపీ, ఐపీఎస్ పీవీ సునీల్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు.. కొంతమంది దళిత నాయకులు చెన్నై వెళ్లి కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వాళ్లు అందించిన వివరాల ప్రకారం.. కత్తి మహేష్ చాలా వరకూ కోలుకున్నారని.. ఆదివారం నాడు లిక్విడ్ ఫుడ్ కూడా తీసుకున్నట్టు తెలియజేశారు. అయితే కత్తి మహేష్ తల నుదిటి భాగంలో ఎముక విరిగిందని.. దానికి సోమవారం నాడు శ

Chiru153 : లూసిఫర్ రీమేక్.. చిరు కోసం పనిలో నిమగ్నమైన తమన్

Image
ప్రస్తుతం మెగాస్టార్ సినిమాలు లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత రెండు రీమేక్లతో రెడీగా ఉన్నారు. వాటి తరువాత మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టేశారు. ఆచార్య తరువాత చిరంజీవి మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. డైరెక్టర్ జయం మోహన్ రాజా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ట్వీట్ వేశారు. లూసిఫర్ రీమేక్‌కు సంబంధించిన పోస్ట్ పెట్టేశారు. ఇందులో దర్శకులు, సంగీత దర్శకులు ఇద్దరూ కూడా ఉన్నారు. లూసిఫర్ రీమేక్ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు చెప్పేశారు. మళయాలంలో మోహన్ లాల్‌కు ఇచ్చిన ఎలివేషన్స్ కంటే ఎక్కువగానే తెలుగులో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు తమన్ మంచి బ్యాక్ గ్రౌండ్ థీమ్‌ను సెట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తమన్ వేసిన ట్వీట్ మెగా ఫ్యాన్స్ అలరిస్తోంది. అసలే ఇప్పుడు తమన్ మంచి ఫాంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ దుమ్ములేపుతున్నారు. చివరగా వకీల్ సాబ్ సినిమాకు తమన్ కొట్టిన నేపథ్యసంగీతం అదిరిపోయింది. అంతకు ముం

Oke Oka Jeevitham : Sharwa30.. ‘ఒకే ఒక జీవితం’ అంటోన్న శర్వానంద్

Image
యంగ్ హీరో ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. సరైన హిట్టు కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. చివరగా వచ్చిన శ్రీకారం సైతం నిరాశపరిచింది. అయితే ఇప్పుడు శర్వానంద్ మంచి ఫాంలో ఉన్నారు. తాజాగా తన 30వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్‌ను ప్రకటించారు.. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను రివీల్ చేసేశారు. శర్వా 30 అంటూ ఇంతకాలం పిలుస్తూ వచ్చిన ప్రాజెక్ట్ టైటిల్ బయటకు వచ్చింది. అంటూ వదిలిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఉన్న ఈ ఒక్క జీవితంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చేయాలనే కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ప్రపంచంలోని చూడదగ్గ ప్రదేశాలన్నింటిని ఫస్ట్ లుక్‌లో పెట్టేశారు. ఇక వాటిని చూసేందుకు బయల్దేరినట్టు ఓ గిటార్‌ను వేసుకుని శర్వానంద్ దర్శనమిచ్చారు. కానీ ఇందులో శర్వానంద్ మొహాన్ని మాత్రం చూపించలేదు. శ్రీ కార్తిక్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ మూవీలో ప్రియదర్శి, అక్కినేని అమల, రీతూవర్మ నటించనున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తరువాత అమల ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. అలా ఇప్ప

Sadha : విక్రమ్-సదా రిలేషన్ తెలిసి షాక్.. అది లీకైతే సినిమా ఏం కావాలంటూ ఆవేదన చెందిన శంకర్!

Image
విక్రమ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన అపరిచితుడు సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తమిళ, తెలుగు నాట ఈ సినిమా రికార్డులు ఎప్పటికీ చెక్కుచెదరవు. డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులో ఈ చిత్రం కాసుల వర్షాన్ని కురిపించింది. టేకింగ్, నటన, సదా అందాలు ఈ సినిమాను బ్లాక్ బస్టర్‌ను చేసేశాయి. అయితే తాజాగా ఈ మూవీ గురించి మాట్లాడుతూ సదా కొన్ని విషయాలను బయటపెట్టేశారు. అలీతో సరదాగా షోలో గెస్ట్‌గా రాబోతోన్న సదా ఎన్నో విషయాలను పంచుకున్నారు. మామూలుగానే కాంట్రవర్సీలకు ఎంతో దూరంగా ఉండే.. సదా సోషల్ మీడియాలోనూ ఎక్కువ యాక్టివ్‌గా ఉండరు. అలాంటి సదా తాజాగా తన పర్సనల్, ప్రొఫెషన్ విషయాల గురించి బయటపెట్టేశారు. అందులో భాగంగా జయం, అపరిచితుడు సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈమేరకు వదిలిన ప్రోమో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఇందులో అపరిచితుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన వింత సంఘటన గురించి చెప్పుకొచ్చారు. మామూలుగా కొందరు హీరో హీరోయిన్లు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తారో స్క్రీన్ వెనకాల అలానే ఉంటారు. అయితేకొందరు మాత్రం తెరపై హీరో హీరోయిన్లుగా నటించినా కూడా తెర వెనుక బ్రదర్ సిస్టర్ అని పిలుచుకుంటారు. అల

చాలా బాధగా ఉంది.. ఏదో ఒక రోజు తప్పకుండా అతన్ని కలుస్తా.. రష్మిక మందన కామెంట్స్ వైరల్

Image
'ఛలో' అంటూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన .. ఆ తర్వాత ''గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, బీష్మ'' సినిమాలతో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అందం, అభినయంతో క్రేజీ బ్యూటీగా దర్శకనిర్మాతలకు బెటర్ ఛాయిస్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ రెమ్మ్యూనరేషన్ కూడా భారీ గానే పుచ్చుకుంటోంది. మరోవైపు తన క్యూట్ లుక్స్‌తో భారీ ఫాన్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ కన్నడ బ్యూటీ. నేషనల్‌ క్రష్‌గా ప్రతి ఒక్కరి గుండెల్లో పర్మినెంట్‌గా గూడు కట్టుకుంది. అయితే రష్మిక మందనపై ఉన్న అభిమానంతో ఆమెకు చూడడానికి ఇటీవల ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్‌పేట అని గూగుల్‌‌లో వెతికిమరీ తెలుసుకొని ఆమె స్వస్థలానికి చేరుకున్నాడు సదరు అభిమాని. రష్మిక ఇంటికి కూడా వెళ్ళాడు కానీ ఆ సమయంలో రష్మిక అక్కడ లేకపోవడంతో అతను తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. ఈ విషయం తెలుసుకొని ట్విట్టర్ వేదికగా రష్మిక స్పందించింది. ఓ అభిమాని తనను కలిసేందుకు చాలాదూరం ప్రయాణించి కర్ణాటక లోని మా ఇంటి వరకూ వచ్చాడని తెలిసిందని పేర్కొంటూ దయచేసి ఇలాంటి పనులు ఎవర

Anushka : కనెక్ట్ అయి ఉండండి.. అవన్నీ కనుమరుగవుతున్నాయ్.. అనుష్క శెట్టి పోస్ట్ వైరల్

Image
స్వీటీ ఎంత మృధుస్వభావం కలదో అందరికీ తెలిసిందే. ఎక్కడా కూడా కాంట్రవర్సీలంటూ ఉండవు. తనకు ఉన్న స్టార్డంను కూడా ఉపయోగించుకోదు. ఎంతో సింపుల్‌గా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఎక్కడికైనా వెళ్లినా సరే తన వీఐపీ స్టేటస్‌ను ఉపయోగించుకోరు. అలా ప్రవర్తన, స్వభావం, మంచిదనానికి ఎంతో మంది అభిమానులున్నారు. తెరపై ఆమె నటనను చూసి అభిమానించే వారి కంటే రియల్ లైఫ్‌లోని ఆమెను చూసి ఆరాధించే వారే ఎక్కువ ఉంటారు. సోషల్ మీడియాలోనూ అనుష్క హద్దుల్లోనే ఉంటారు. అవసరం మేరకు అనుష్క స్పందిస్తుంటారు. మంచి మాటలనే చెబుతూ అందరిలోనూ స్ఫూర్తి నింపుతుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తోంది. ‘అందరూ ప్రేమగా ఉండండి. మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి.. ఏమని ఫీల్ అవుతున్నారో తెలపండి. అతిగా స్పందిస్తున్నారని మీరేమీ బాధపడకండి.. అలా ఎక్కువగా చూపించండి. ఎక్కవ జాగ్రత్తగా చూసుకోండి. ప్రపంచంలో ఇంకా మంచిదనం ఉందని నిరూపించండి. మీరు ఫీల్ అయ్యేదాన్ని చెప్పేందుకు భయపడకండి. ప్రతీ విరహంలోనూ మంచిని, బ్యూటీని వెతకండి. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి. గతంలో జరిగిన దాని గురించి తలుచుకుంటూ బాధపడకండి.. కొత్త ఆరంభాలన

MAAలో గొడవలకు ముఖ్య కారణం అదే.. గత విషయాలు తవ్వుతూ జీవిత షాకింగ్ కామెంట్స్

Image
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ()లో లుకలుకలు.. ఈ మాట వినడం కొత్తేమీ కాదు. ఎన్నోసార్లు పతాక శీర్షికల్లో ఈ హెడ్‌లైన్ చూశాం. ఇందుకు ప్రధాన కారణం 'మా' వర్గాల్లో విభేదాలు రావడమే. ఇకపోతే ప్రతి ఎన్నికల సమయంలో ఒక వర్గంపై మరో వర్గం మాటల తూటాలతో రాజకీయ వేడిని తలపిస్తున్నాయి మా ఎలక్షన్స్. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు నెలల్లో జరగబోతుండగా.. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు తమ పోటీని కన్ఫర్మ్ చేశారు. సీనియర్ నటి రాజశేఖర్ కూడా బరిలో ఉన్నట్లు దాదాపు కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే వర్గ పోరు మొదలైనట్లు తాజా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రకాష్ రాజ్ తన ప్యానెల్‌ని ప్రకటించగా.. మంచు విష్ణు 'మా' కార్మికులకు అండగా నిలుస్తానని హామీ ఇస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరోవైపు ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేష్ ఇప్పుడే ఎన్నికల హడావిడి ప్రారంభించడంపై తన అసంతృత్తి తెలియ జేశారు. ప్రకాష్ రాజ్ వర్సెస్ వీకే నరేష్ ఎపిసోడ్స్ అనంతరం జీవిత రాజశేఖర్ కూడా మీడియా ముందుకొచ్చి చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు. అసోసియేషన్‌లో గొడవలకు ముఖ్య కారణం ఈగోలేనని చెప్పిన జీవిత.. ఒ

Vignesh Shivan : నయన్‌తో ఎక్కడున్నా సరే.. అంతా బాత్రూంలోనే.. విఘ్నేశ్ శివన్ కామెంట్స్ వైరల్

Image
దర్శకుడిగా, పాటల రచయితగా విఘ్నేశ్ శివన్‌కు ఎంత మంచి పేరు ఉన్నా కూడా ప్రస్తుతం ప్రియుడిగానే అందరూ గుర్తిస్తున్నారు. అని రాసేకంటే.. నయనతార ప్రియుడు అనే సంబోధిస్తుంటారు. అలా నయన్ క్రేజ్ మొత్తం విఘ్నేశ్ శివన్‌ను కమ్మేస్తుంటుంది. అయినా కూడా విఘ్నేశ్ శివన్ తన కంటూ ఓ గుర్తింపును సాధించుకున్నారు. నిర్మాత, దర్శకుడిగా మంచి విజయాలను అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు సమంత, నయన తార, విజయ్ సేతుపతి వంటివారితో ప్రయోగం చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా విఘ్నేశ్ శివన్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేశారు. లైవ్ చాట్‌లోకి రావడంతో ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రశ్నలు సంధించారు. అయితే వీటిలో చాలా మంది నయనతారకు సంబంధించిన విషయాలనే అడిగేశారు. అందరూ నయనతారకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతుంటే మీకు ఎలా అనిపిస్తోంది అని ఓ నెటిజన్ అడిగేశారు. చాలా గొప్పగా ఉందంటూ విఘ్నేశ్ శివన్ సమాధానమిచ్చేశారు. అయితే కొందరు దర్శకులు స్క్రిప్ట్ రాసేందుకు ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. పాటలు రాసేందుకు కూడా వారికంటే కొన్ని ప్రదేశాలను ఎంచుకుంటారు. అక్కడికే వెళ్లి రాసుకుంటారు. అలా మీరు ఏ ప్లేస్‌లో ఉండి స్క్రిప్ట్, పాటలు రాసుకుంటారు? అని ఓ నెటిజన్

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అంగముత్తు షణ్ముఖం కన్నుమూత

Image
గతేడాది కరోనా కారణంగా ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది సినీ పరిశ్రమ. కోవిడ్ సోకి పలువురు సినీ నటులు తిరిగిరాని లోకాలకు వెళ్లి విషాదం మిగిల్చారు. ఆ తర్వాత సెకండ్ వేవ్ లోనూ పలువురి మరణాలతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఆనారోగ్య కారణాలతో ఇంకొందరు సినీ ప్రముఖులు మరణిస్తుండటం ఇండస్ట్రీలో మరింత విషాదం నింపుతోంది. ఆదివారం రాత్రి చెన్నైలో ప్రముఖ సినీ కళా దర్శకుడు (60) క్యాన్సర్‌తో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న షణ్ముఖం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటునప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత రాత్రి తుది శ్వాస విడిచారు. తమిళంతో పాటు తెలుగులో అలాగే ఇతర భాషల్లో కూడా ప్రముఖ హీరోల చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా ఆయన సేవలందించారు. సినీ కళా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్యకు మూడుసార్లు కార్యదర్శిగా పనిచేశారు అంగముత్తు షణ్ముఖం. ఆయన మరణ వార్త తెలిసి తమిళ సినీ ప్రముఖులు, దక్షిణ భారత సినీ ప్రముఖులతో పాటు దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి తదితరులు సంతాపం తెలియజేశారు

MAA పోరుపై విజయశాంతి షాకింగ్ రియాక్షన్.. ఆయన్ను సపోర్ట్ చేస్తూ రాములమ్మ ఓపెన్ కామెంట్స్

Image
మరో రెండు మూడు నెలల్లో ' ఎలక్షన్స్' జరగనుండగా ఇప్పటినుంచే ఫిలిం నగర్ వాతావరణం వేడెక్కింది. అధ్యక్ష పీఠం కోసం పోటీ రసవత్తరంగా మారడంతో ఈ ఎన్నికలపై సినీ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, సీనియర్ నటి జీవిత రాజశేఖర్, హేమ పోటీలో ఉండగా వీరిలో సినీ పెద్దల సపోర్ట్ ఎవరికి లభిస్తుందనేది హాట్ టాపిక్ అయింది. ఇంతలో మరో నటుడు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటన చేశారు. మరోవైపు ఇప్పటినుంచే అధ్యక్ష బరిలో ఉన్న పోటీదారులంతా ఎవరికి వారు వ్యూహరచన చేసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ మెంబెర్స్‌ని కూడా ప్రకటించి ప్రెస్ మీట్ ద్వారా కోసం తాను చేయాలనుకుంటున్న పనులపై వివరణ ఇచ్చారు. అలాగే మంచు విష్ణు సైతం అధికారికంగా తాను MAA ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు బహిరంగ లేఖ విడుదల చేసి సినీ కార్మికుల కష్టసుఖాల్లో వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల నడుమ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు సీవీఎల్‌ నరసింహారావు ప్రకటించడం, ప్రత్యేకమైన వాదనతో ఆయన రంగంలోకి దిగుతుండటం ఉత్కంఠకు తెరలేపింది. వృత్తిరీత్యా లాయర్ అయిన సీవీ

Kasthuri Shankar : ఇక్కడ హాస్పిటల్స్ లేవా?.. రజనీకాంత్ అమెరికాకు వెళ్లడంపై కస్తూరీ శంకర్ ఫైర్

Image
నటి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే కస్తూరీ శంకర్ ఇప్పుడు తెలుగు వారందరికీ తులసిగా పరిచయం. గృహలక్ష్మి సీరియల్‌తో తులసి పాత్రలో కస్తూరీ శంకర్ ఇప్పుడు అందరికీ దగ్గరయ్యారు. అలా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటోన్న కస్తూరీ..సోషల్ మీడియాలో తనలోని మరో కోణాన్ని చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో కస్తూరీ సంధించే ప్రశ్నలు.. వేసే కౌంటర్లు,చేసే విశ్లేషణలు అందరినీ ఆకట్టుకుంటాయి. స్వతాహాగా లాయర్ అవ్వడం, సామాజిక అంశాల మీద పట్టు ఉండటం, సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణలు చేయడంతో కస్తూరీ శంకర్ ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటారు. అలా తాజాగా కస్తూరీ ఓ అంశం మీద స్పందించారు. ‘మే నెల నుంచి మన ఇండియన్స్ ఎవ్వరూ కూడా అమెరికాకు వెళ్లే చాన్స్ లేదు. యూఎస్ మన మీద బ్యాన్ వేసింది. మెడికల్స్ కోసం కూడా అవకాశం ఇవ్వలేదు. అయితే ఇలాంటి సమయంలో ఎలా వెళ్లారు? ఎందుకు వెళ్లారు?. అప్పుడేమో అలా సడెన్‌గా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు.. ఇప్పుడేమో ఇలా. ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది.. రజినీ సర్ ప్లీజ్ అన్నీ క్లారిటీగా చెప్పండి. ఎన్ఆర్‌ఐలు అక్కడే ఉండేవారు లేదా అక్కడ పని చేసేవారికి మాత్రమే ఇండియా నుం

Vijay Sethupathi : విజయ్ సేతుపతితో తమన్నా.. అలాంటి షో కోసం ఒకే చోటకు!

Image
మిల్కీ బ్యూటీ ప్రస్తుతం దూసుకుపోతోన్నారు. అటు వెండితెర, ఇటు ఓటీటీల్లో అవకాశాలు కొల్లగొడుతూ ఫుల్ ఫాంలో ఉన్నారు. అయితే తాజాగా తమన్నా బుల్లితెరపైనా అడుగుపెట్టేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఓ ఫోటో, ఇచ్చిన సమాచారం అందరినీ ఆకట్టుకుంటోంది. అది కూడా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి బుల్లితెర మీద రచ్చ చేసేందుకు తమన్నా సిద్దంగా ఉన్నారు. ఈ మేరకు తమన్నా షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మామూలుగా బయట ఎక్కడా కూడా కనిపించరు. ఆయన తన సినిమాలతోనే క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటారు. అలాంటి విజయ్ సేతుపతి ఓ షోలో కనిపించబోతోన్నారు. అది కూడా వంటల ప్రోగ్రాంలో. పాల సుందరి తమన్నా హోస్ట్‌గా ఈ షో రాబోతోన్నట్టు తెలుస్తోంది. మాస్టర్ చెఫ్ అంటూ తెలుగులో రాబోతోన్న ఈ షోలో విజయ్ సేతుపతితో తమన్నా రచ్చ చేయనున్నారు. త్వరలో జెమినీ టీవీలో రాబోతోన్న మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో షూటింగ్‌లో విజయ్ సేతుపతి ఉండటం నాకెంతో సంతోషంగా ఉంద.. ఇదో కుకింగ్ షో, షూటింగ్ స్టార్ట్ కాకముందు ఇలా ఎంజాయ్ చేశామంటూ తమన్నా ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి మరింత స్టైలీ

Bandla Ganesh : ఇకపై అలానే పిలుస్తా.. పవన్ కళ్యాణ్‌కు కొత్త పేరు పెట్టేసిన బండ్ల గణేష్

Image
మాటల తుపానుగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. స్టేజ్ ఎక్కితే చాలు స్టార్ రైటర్లను మించే పోయేలా ప్రాసలతో పిచ్చెక్కిస్తుంటారు. పొగడాలన్నా, సెటైర్లు వేయాలన్నా కూడా బండ్ల గణేష్ స్టైలే వేరు. ఇక ఇప్పుడు నెటిజన్లు బండ్ల గణేష్‌ను ఒక విషయం పదే పదే గుర్తు చేస్తుంటారు. ఏదైనా సినిమాకు రైటర్‌గా పనిచేయ్ అన్నా.. నువ్ ఇచ్చే ఎలివేషన్స్ ఓ రేంజ్‌‌లో ఉంటాయని కామెంట్లు పెడుతుంటారు. ఆ మధ్య జరిగిన వకీల్ సాబ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ స్పీచ్ ఎంతగా హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆనాడు వేణు శ్రీరామ్, దిల్ రాజు ఎంతో ఎమోషనల్ అయినా కూడా బండ్లన్న స్పీచే వైరల్ అయింది. ఇక చివరకు ఇచ్చిన ప్రసంగం కూడా నెట్టింట్లో అంతగా వైరల్ అవ్వలేదు. ఇక బండ్ల గణేష్ ఈ మధ్య మా ఎన్నికల సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరుపున మాట్లాడిన మాటలు అందరినీ కట్టిపడేశాయి. మీడియా అడిగిన ప్రశ్నలకు సైతం అంతేస్థాయిలో సమాధానాలు ఇచ్చారు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మామూలుగా అయితే బండ్ల గణేష్ తన హీరో పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా కీర్తిస్తారు. తనకు తాను భక్తుడిని అని ప్రకటించుకున్నారు. వకీల్ సాబ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ఇంకాస్త గట్టిగా

PSPK28 : పవన్ కళ్యాణ్ పాత్రలో ఎనర్జీ ఇదే.. లీక్ చేసిన హరీష్ శంకర్

Image
పవన్ కళ్యాణ్ కాంబోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఓ అభిమాని దర్శకుడిగా మారి తన హీరోను ఎలా చూపిస్తాడో నిరూపించే చిత్రమే గబ్బర్ సింగ్. ఓ రీమేక్ సినిమాలో మార్పులు చేర్పులు చేసి అంతటి బ్లాక్ బస్టర్ హిట్‌ను కొట్టడం, అభిమానులకు చిరస్థాయిగా నిలిచిపోయేలా గబ్బర్ సింగ్‌ను మలచడం అంత ఈజీ ఏమీ కాదు. కానీ హరీశ్ శంకర్ దాన్ని అవలీలగా చేసేశారు. అలా గబ్బర్ సింగ్ కాంబో మళ్లీ రిపీట్ కావాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తూ వచ్చారు. అలా మొత్తానికి హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీస్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలెన్నోబయటకు వచ్చాయి. ఈ సారి కేవలం వినోదం మాత్రమే కాదంటూ కాన్సెప్ట్ పోస్టర్‌ను వదిలిన క్షణం నుంచే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైలిష్ట్ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కలిసి ఫస్ట్ లుక్, క్యారెక్టర్ లుక్ ఎలా ఉండాలనేది నిర్ణయించారని త్వరలోనే రాబోతోందంటూ అంచనాలు పెంచేశారు. అలా ఈ PSPK28పై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతోన్నాయి. అయితే తాజాగా హరీశ్ శంకర్ మరో విషయాన్ని లీక్

మా బాబు గోల్డ్.. ఆ మాటకు అంతా ఫిదా.. రామ్ చరణ్‌పై దర్శకుడి కామెంట్స్ వైరల్

Image
మెగా పవర్ స్టార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వ్యక్తిత్వానికి ఎంతో మంది అభిమానులున్నారు. తెరపై నటనతోనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. కెరీర్ ప్రారంభంలో కాస్త కాంట్రవర్సీలకు దగ్గరగా ఉన్నారు. కానీ రామ్ చరణ్ ఇప్పుడు ప్రస్తుతం కూల్ మోడ్‌లోనే ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా రామ్ చరణ్‌లో ఎంతో మార్పు కనిపిస్తూ వస్తోంది. అయితే మరీ ముఖ్యంగా రామ్ చరణ్ మెగా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. తాజాగా రామ్ చరణ్ తనను పలకరించడానికి పాదయాత్ర చేసిన అభిమానిని కలిశారు. తన స్వగృహానికి ఆ అభిమానిని పిలిచి ఆప్యాయంగా హత్తుకున్నారు. ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఇలా ఎందుకు వచ్చారు? ఎన్ని రోజులుగా ప్రయాణం చేశారు?అంటూ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆ అభిమానిని అభిప్రాయాలను కూడా తెలుసుకుని గౌరవించారు. లోపలకి వెళ్లి మాట్లాడుకుందామా? అని రామ్ చరణ్ ఆ అభిమానిని అడిగారు. పక్కనే ఉన్న స్వామి నాయుడిని చూపిస్తూ ఈయనను కూడా లోపలకు రమ్మంటారా? లేదా నాతోనే పర్సనల్‌గా మాట్లాడతావా? అని ఫ్యాన్‌ అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఇక ఈ మాటతో అ

ఆ నలుగురే కాదు.. ఇంకొకరు! 'మా' ఎలక్షన్స్ బరిలో మరో నటుడు.. అది కూడా అలా!!

Image
ఎలక్షన్స్ రాజకీయ వేడిని తలపిస్తున్నాయి. ఎన్నికలు రావడానికి ఇంకా చాలా సమయమే ఉన్నా సినీ వర్గాల్లో వాడివేడి చర్చలు నడుస్తున్నాయి. అధ్యక్ష పీఠం కోసం పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ మెంబర్స్‌ని ప్రకటించారు. అయితే ఆయనకు మెగా హీరోల మద్దతు లభిస్తోందని తెలుస్తుండగా.. మరో పోటీదారు మంచు విష్ణుకు నరేష్ మద్దతు లభించనుందని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరికి తోడు మరోవైపు జీవిత రాజశేఖర్, హేమ బరిలో నిలవడంతో ఈ పోటీపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 'మా' అధ్యక్ష బరిలో ఉన్న నలుగురు ఎవరికి వారు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా మరో నటుడు ఈ పోటీలో నిలుస్తున్నారనే విషయం బయటకొచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటన చేశారు. 'మా' ఎలక్షన్స్‌లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నట్లు ఆదివారం ఉదయం ఆయన తెలిపారు. తన ప్యానల్‌ తెలంగాణ వాదమని, సినిమా అవకాశాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలని నరసింహారావు అన్నారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. Also Read: ఇప్పటిదాకా 'మా&

Varun Tej : ఒకే బెడ్‌పై ముగ్గురు మెగా హీరోలు.. చిన్నప్పటి నుంచి అంతేనట!

Image
మెగా హీరోలంతా చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగారు. రామ్ చరణ్, , , వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇలా అందరూ కూడా ఒకే చోట ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసి ఉండటం, పెరగటం వల్ల ఈ కజిన్స్ మధ్య మరింత అనుబంధం ఏర్పడింది. అయితే చిన్నతనం నుంచి ఒకే చోట పెరగడంతో నిహారికను మరదల్లా కాకుండా సిస్టర్‌లానే చూసేవాళ్లమని సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్‌లు ఆ మధ్య కొన్ని ఇంటర్వ్వూల్లో చెప్పుకొచ్చారు. అలా మెగా హీరోలంతా ఎంతో సఖ్యతతో ఉంటారు. సోషల్ మీడియాలో అయితే ఒకరి మీద మరొకరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు సోషల మీడియాలో వేసుకునే కౌంటర్లు వైరల్ అవుతుంటాయి. బావా అంటూ ఇద్దరూ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు. తాజాగా సాయి ధరమ్ తేజ అసలు గుట్టు విప్పేశారు. పిల్లలంతా ఒకే చోటకు చేరితో పడుకునేటప్పుడు ఎంత గొడవ చేస్తారో అందరికీ తెలిసిందే. నేను పడుకుంటాను అంటే నేను పడుకుంటాను అని ప్లేస్ కోసం కొట్లాడుతుంటారు. అలా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముగ్గురు కలిసి ఒకే బెడ్ మీద ప్రశాంతంగా పడుకునేవారట. ఇప్పటికీ అలానే పడుకుంటున్నామని సాయి ధరమ్ తేజ్ ఓ ఫోటో షేర్ చేశారు. అందు

క్రికెటర్‌తో ఏడడుగులు వేసిన శంకర్ కూతురు.. పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా సీఎం! ఫొటోస్ వైరల్

Image
త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో స్టార్ క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోద‌ర‌న్‌‌తో డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఆ పెళ్లి వేడుక కూడా జరిగిపోయింది. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతా అనుకున్నట్లుగానే తమిళనాడులోని మహాబలిపురంలో శంకర్ పెద్ద కూతురు ఐశ్వ‌ర్య‌ వివాహం జరిగింది. క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో ఆమె ఏడడుగులు నడిచింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పెళ్లి మహోత్సవంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రోహిత్ దామోద‌ర‌న్‌‌ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్‌ లీగ్‌లో పాల్గొంటున్నారు. ఆయన తండ్రి తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త. మధురై పాంతర్స్‌ క్రికెట్‌ టీమ్‌కు యజమాని కూడా ఆయనే. ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక తాలూకు పిక్స్ వైరల్‌గా మారాయి. శంకర్‌ కూతురు ఐశ్వర్య వృత

అల్లు స్నేహారెడ్డి కూడా మొదలుపెట్టేసింది.. ఫాలోయింగ్‌ను ఇలా వాడేసుకుంటోందా?

Image
అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో ఎంతటి క్రేజ్, ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే బన్నీకి తగ్గట్టుగానే కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతోన్నారు. బన్నీ భార్య అనే ట్యాగ్‌తోనే స్నేహారెడ్డికి ఈ రేంజ్ ఆధరణ దక్కింది. అయితే ఆమె షేర్ చేసే వీడియోలు, ఇచ్చే అప్డేట్లే ఇంతటి ఫాలోయింగ్ రావడానికి కారణం. అలా అల్లు స్నేహారెడ్డడి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకపోస్ట్ చేస్తుంటారు. మొన్నీ మధ్య స్నేహారెడ్డి అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేశారు. స్టార్ హీరోల భార్యల్లో అల్లు స్నేహారెడ్డికి మాత్రమే ఇంతటి క్రేజ్ దక్కింది. ఇన్ స్టాగ్రాం ఖాతాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్లను సొంతం టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోన్నారు. అయితే స్నేహారెడ్డికి వచ్చిన ఈ క్రేజ్‌ను బాగానే వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. మామూలుగా అర్హ, అయాన్, అల్లు అర్జున్‌లకు సంబంధించిన విషయాలనే షేర్ చేసే స్నేహారెడ్డి తాజాగా ఓ ప్రొడక్ట్ గురించి పోస్ట్ చేసి ప్రమోట్ చేస్తోంది. ఇలా సౌందర్య ఉత్పత్తులకు స్నేహారెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌‌గా వ్యవహరించడం ఇదే మొదటి సారి. చర్మ సౌందర్యం, కేశాల సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను అల్లు స్నేహారెడ్డి ప్రమోట్

నా కర్తవ్యం అదే.. సంపూర్ణంగా సేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి! 'మా' ఎన్నికలపై మంచు విష్ణు బహిరంగ లేఖ

Image
గత మూడు నాలుగు రోజులుగా 'మా' ఎలక్షన్స్ అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 'మా' అధ్యక్ష బరిలో ఉన్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ప్రకటించి ప్రెస్ మీట్ పెట్టగా.. తాజాగా 'మా' అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బహిరంగ లేఖ పోస్ట్ చేశారు విష్ణు. ఈ ఏడాది జరగబోతున్న ‘మా’ అధ్యక్ష పదవికి తాను నామినేషన్‌ వేస్తున్నానని తెలుపుతూ ఆయన వివరణ ఇచ్చారు. ''మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి నేను నామినేషన్‌ వేస్తున్నానని 'మా' కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియజేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమనే నమ్ముకున్న కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబసభ్యుల భావాలు, బాధలు బాగా తెలుసు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. మా నాన్నగారు మోహ

కత్తి మహేష్ కోలుకోవాలంటూ మానవత్వం చాటిన పవన్ ఫ్యాన్స్.. వీళ్ళు మాత్రం మరీ దారుణంగా..!

Image
ఫ్యాన్స్‌తో సినీ క్రిటిక్ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కత్తి మహేష్ వ్యాఖ్యలపై ఎదురు దాడికి దిగుతూ ఆయనపై పవన్ ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపించడం చాలా సందర్భాల్లో చూశాం. అయినప్పటికీ పవన్ అభిమానులను రెచ్చగొట్టడం పనిగా పెట్టుకొని సంచలన కామెంట్స్ చేస్తూ వచ్చారు కత్తి మహేష్. అయితే అదే కత్తి మహేష్‌కి ఆక్సిడెంట్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ స్పందిస్తున్న తీరు చర్చల్లో నిలుస్తోంది. సాటి మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే ఆయన కోలుకోవాలని కోరుకోవడం సహజమే. అది శత్రువు అయినా ఆపద సమయంలో అన్నీ మరచి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని భావిస్తుంటారు జనం. ఒక రకంగా చెప్పాలంటే తాజాగా కత్తి మహేష్- పవన్ ఫ్యాన్స్ విషయంలో అదే జరుగుతోందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు చాలా దెబ్బలు తగలడంతో పాటు కన్ను మొత్తం పోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు మానవత్వంతో స్పందిస్తుండటం

హాట్ టాపిక్ అయిన శంకర్ కూతురి పెళ్లి.. క్రికెటర్‌తో ఫిక్స్ చేసిన స్టార్ డైరెక్టర్

Image
ఫేమస్ డైరెక్టర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. త‌న పెద్ద కూతురు ఐశ్వ‌ర్య‌కు పెళ్లి చేసే పనిలో పడ్డారు శంకర్. ఓ క్రికెటర్‌తో ఫిక్సయిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ ఇష్యూ అయింది. త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో స్టార్ క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోద‌ర‌న్‌‌తో ఐశ్వ‌ర్య‌ పెళ్లి నిశ్చయించారట డైరెక్టర్ శంకర్. దీంతో బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయమై ఆరా దీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. రోహిత్‌ తండ్రి దామోదరన్‌ తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త అని, మధురై పాంథర్స్ టీమ్‌కి స్పాన్సర్‌గా కూడా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లికి సంబంధించిన ముందస్తు కార్యక్రమాలు ఫినిష్ చేశారని, త్వరలో పెళ్లి జరగబోతోందని సమాచారం. క‌రోనా నేప‌థ్యంలో కుటుంబ స‌భ్యులు, కొద్దిమంది స‌న్నిహితుల మ‌ధ్య నిరాడంబ‌రంగా మ‌హాబ‌లిపురంలో వీరి వివాహాన్ని చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో పాటు బంధువులు, స్నేహితులు, స‌న్నిహితులు అందరికీ పెద్ద పార్టీ అరేంజ్ చేయాల‌ని శంక‌ర్‌ భావిస్తున్నారట. భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ వస్తున్న శంకర్..

Nandini Rai: పోసాని శవం పక్కన నందినీరాయ్ డాన్స్.. వైరల్‌ వీడియో

Image
పోసాని ఫొటోకి దండపడింది. శవం దగ్గర పూలు చల్లి పడుకోబెట్టేశారు.. తల దగ్గర అగరబత్తి కూడా వెలిగించేశారు. ఇక ఏడుపు గోలలే ఉంటాయి అనుకుంటే.. ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది అని ఓ రేంజ్‌లో స్టెప్‌లు వేస్తుంది. శవం పక్కనే ఉండగా.. రెచ్చిపోయి డాన్స్‌లు చేస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శవం పక్కన ఉండగా ఈ చిందులేంటి పాపా.. అంటే!! ప్రస్తుతం ఈ అమ్మడు 'ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో పోసాని చనిపోయే సీన్ ఉండటంతో ఫన్నీ మూమెంట్ అంటూ సెట్స్‌కి సంబంధించిన లొకేషన్ వీడియోను షేర్ చేసింది నందినీరాయ్. పనిలో పనిగా హీరో ధనుష్‌‌ని కూడా ట్యాగ్ చేసింది నందినీరాయ్. ఎందుకు అంటే.. ఆమె డాన్స్ చేస్తున్న మాస్ బీట్ ధనుష్ నటించిన 'జగమే తందిరమ్‌' చిత్రంలోనిది. ఇందులో మురగేషన్‌ అనే వ్యక్తి చనిపోయినప్పుడు ఇదే మాస్ బీట్ వస్తుంది. సో.. దాన్ని ఇప్పుడు ఇలా పోసాని శవం దగ్గర వాడేసింది నందినీరాయ్.

పవన్ లేని తెలుగు సినిమా పవర్ లేని ఇండియా అట!! కాస్త కాదు బాగా ఎక్కువైదంటూ సెటైర్లు

Image
పవన్ భక్తుడు బండ్లగణేష్ సమయం వచ్చిన ప్రతిసారి తన భక్తిని చూపిస్తూనే ఉంటుంటారు. దాన్ని అభిమానం అని కొందరంటే భజన అనే వాళ్లు చాలామందే ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని కామెంట్లు చేసినా.. దారుణంగా ట్రోల్ చేసినా మాత్రం వెనక్కి తగ్గరు. మైనేమ్ ఈజ్ బండ్ల గణేష్.. మై గాడ్ ఈజ్ అని తన ఫ్లోలో తాను వెళ్లిపోతూనే ఉంటారు. అయితే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌పై భక్తి చూపించిన ప్రతిసారీ కూడా బండ్లను ట్రెండింగ్‌లో ఉంచుతుంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అంతేకాదు.. బండ్ల గణేష్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. నువ్ కుమ్మెయ్ బండ్లన్నా అని అండగా నిలుస్తుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ స్పీచ్ ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బల్లగుద్ది చెప్తున్నా.. నేను మీ భక్తుడ్ని సామీ’ అంటూ బండ్ల గణేష్ చేసిన ప్రసంగం.. పవన్ అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. గొప్ప గొప్ప స్క్రిప్ట్ రైటర్లు కలాలు సైతం వణికేలా ఊపేశాడు బండ్ల గణేష్. అతను మాట్లాడిన ఒక్కోమాటా యూట్యూబ్‌లో తూటాలా పేలింది. దెబ్బకి బండ్ల గణేష్ ట్రెండింగ్ నెంబర్ 1లో నిలిచారు. ఇదిలా ఉంటే

ఏడు రోజులు.. ఆరు రాత్రులు!! గ్యాప్ తరువాత మళ్లీ మొదలు.. ఇదేదో తేడాగా ఉందే!

Image
సక్సెస్ ఫుల్ ప్రొడ్యుసర్‌గా విజయవంతమైన చిత్రాలను నిర్మించిన .. లాంగ్ గ్యాప్ తరువాత ‘డర్టీ హరి’ చిత్రానికి దర్శకత్వం వహించి సక్సెస్ అయ్యారు. ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ చిత్రాలతో ఆకట్టుకున్న ఈయన గేర్ మార్చి యూత్‌ని అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. ‘డర్టీ హరి’ చిత్రాన్ని బోల్డ్‌గా తీసిన ఎంఎస్ రాజు.. అదే ఫ్లోని కంటిన్యూ చేస్తూ ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ పతాకంపై ఎంఎస్ రాజు కుమారుడు హీరో సుమంత్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజు పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర ప్రీలుక్ విడుద‌ల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. విహార యాత్రకు వెళ్లిన ఓ జంట.. ఏడు రోజుల్లో.. ఆరు రోజుల్లో ఏం చేశారన్నదే ఈ సినిమా కథాశం కాగా.. ప్రీ లుక్ పోస్టర్‌ కూడా కాన్సెప్ట్ బేస్డ్‌గానే ఉంది. ‘’ అనే టైటిల్‌తో పాటు బీచ్.. ఒడ్డున బోట్‌లు.. ఇవన్నీ చూస్తే ఈ సినిమా కూడా బోల్డ్ కంటెంట్ మాదిరే ఉంది. అయితే జూన్ 7 ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. అయితే తిరిగి ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ పరిసర ప్ర

అదే నా కల.. ‘దేవుడి’ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నా.. బండ్ల గణేష్ న్యూస్ చానెల్!

Image
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. నెటిజన్లు వేసే ప్రశ్నలకు బండ్ల గణేష్ సమాధానాలు ఇస్తుంటారు. ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లకు వెంటనే స్పందిస్తుంటారు. మెగా అభిమానులు గురించి పెట్టే కామెంట్లకు అయితే వెంటనే రియాక్ట్ అవుతుంటారు. ఇక వార్తల్లో హైలెట్ అవ్వడం అన్నది బండ్ల గణేష్‌కు సర్వ సాధారణం. నిన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ మీడియా సమావేశం సందర్బంగా బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అందరికంటే ఎక్కువగా బండ్ల గణేష్ స్పీచ్‌కే ఫిదా అయ్యారు. మామూలుగానే బండ్ల గణేష్ మైక్ దొరికితే దంచి అవతల పారేస్తారు. అయితే మెగా అభిమానులు మాత్రం కొన్ని రోజులు ఓ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. మెగా చానెల్ ఒకటి ఉండాలని, మీడియా ఎప్పుడూ కూడా మెగా ఫ్యామిలీని కించపరిచేలా, తక్కువ చేసి చూపిస్తోందనే భావన అభిమానుల్లో ఉంది. అందుకే చిరంజీవి ఓ ఛానెల్ పెట్టాలని మెగా అభిమానులు డిమాండ్ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్‌ని కూడా అభిమానులు ఇదే డిమాండ్ చేస్తుంటారు. అలా తాజాగా బండ్ల గణేష్‌కు ఓ నెటిజన్ ట్వీట్ పెట్టారు. నమస్తే బండ్ల అన్నా.... మీరు త్వరగా చానల్ పెడతారని.. మేము ఎంతో ఆసక్తిగా ఎదురు