Daggubati Venkatesh : ‘నారప్ప’ సెన్సార్ అప్డేట్.. ఫ్యాన్స్‌లో అనుమానాలు!

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల మీద పదే పదే రూమర్లు పుట్టుకొస్తున్నాయి. సెట్స్ మీదున్న కొన్ని చిత్రాలు, షూటింగ్ పూర్తి చేసుకున్న మరికొన్ని సినిమాలను ఓటీటీలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా చిత్రాల పేర్లే వినిపిస్తున్నాయి. అవి రెండూ కూడా పక్క భాషల నుంచి తీసుకుని రీమేక్ చేస్తున్న చిత్రాలే. తమిళం నుంచి అసురన్‌ను నారప్పగా.. మళయాలం నుంచి దృశ్యం 2ను అదే పేరుతో వెంకటేష్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇవి రెండూ కూడా ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయి. నారప్పను గత ఏడాది నుంచి చెక్కుతూనే ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రియమణి, కార్తీక్ రత్నం వంటి వారు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. అయితే , దృశ్యంను సురేష్ బాబు 70 కోట్లకు ఓటీటీ సంస్థకు అమ్మేశారంటూ వార్తలు వస్తున్నాయి. వాటిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే నారప్ప నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందంటూ సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ వేసింది. దీంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. నారప్ప సెన్సార్ పూర్తయింది.. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాం అని చెప్పారు. కానీ అది ఓటీటీలోనా? థియేటర్లోనా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వెంకీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒకటి తేల్చి చెప్పండంటూ ట్వీట్లు పెడుతున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ