కవితను వెంటాడుతున్న విషాదాలు.. ఆ చేదు జ్ఞాపకాలు మరువకముందే భర్త కన్నుమూత

కరోనా మహమ్మారి ఎంతోమంది సెలబ్రిటీల ఇళ్లలో విషాదం మిగిల్చింది. గత ఏడాదికి కాలంగా చాలామంది నటీనటులు, వారి వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడం జరిగింది. కాగా సౌత్ ఇండియన్ సీనియర్ యాక్ట్రెస్ పాలిట శాపంగా మారింది కరోనా. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. గత పది రోజుల క్రితమే కవిత కొడుకు సంజయ్‌ రూప్‌‌ మృతి చెందాడు. కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచాడు. దీంతో ఒక్కసారిగా కృంగిపోయిన కవితకు తన భర్త మృతితో మరో షాక్ తగిలింది. కొడుకు మరణం తాలూకు చేదు జ్ఞాపకాలు మరవకముందే అదే కరోనా మహమ్మారి కవిత భర్తను పొట్టన పెట్టుకుంది. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన కవిత భర్త దశరథ రాజు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. దశరథ రాజు మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు కవితను పరామర్శిస్తున్నారు. 11 ఏళ్ల వయసులో వెండితెరపై అడుగుపెట్టిన కవిత తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా సౌత్‌లో దాదాపు 350కు పైగా సినిమాల్లో ఆమె నటించింది. కొన్ని సినిమాల్లో మేజర్ రోల్స్ చేసి మూవీ విజయంలో భాగం పంచుకుంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ