Posts

Showing posts from July, 2020

బ్రేకింగ్: ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ములకు పితృ వియోగం

Image
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) కన్నుమూశారు. ఈ రోజు (శనివారం) ఉదయం 6 గంటలకు ఆయన మరణించినట్లు సమాచారం. వయసు పైబడటంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా 'లవ్ స్టోరీ' సినిమా రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అతిత్వరలో ఈ 'లవ్ స్టోరీ' చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

నాగచైతన్య అంటే ఇష్టం ఆ కోరిక తీరితే చాలు.. సమంత ఫీలైతే నాకేంటి? జబర్దస్త్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Image
బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో ఎంతోమంది కళాకారులకు లైఫ్ ఇచ్చి వారిని ఫేమస్ చేసేసింది. జబర్దస్త్ పంచులతో రెచ్చిపోతున్న కమెడియన్స్ బుల్లితెర ప్రేక్షకులకు ఇస్తున్న వినోదాల విందు అంతకంతకూ రెట్టింపవుతోంది. సరికొత్త గెటప్స్, స్కిట్స్ వేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో లేడీ గెటప్స్ వేసుకొని ఆడవాళ్ళుగా అలరించిన కమెడియన్స్ అమితంగా పాపులారిటీ కూడగట్టుకున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లేడీ కమెడియన్ వినోదిని పలువురు కమెడియన్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూ ఆసక్తికర విషయాలు రాబడుతోంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ (ప్రియాంక) తన మనసులో ఉన్న విషయాలు, సీక్రెట్స్ వెల్లడిస్తూ తెగ సిగ్గుపడింది. లేడీ గెటప్పులో బుల్లితెరపై వినోదాలు పంచిన సాయి తేజ.. ఇప్పుడు ప్రియాంకగా మారి పోయాడు. అంటే ఆడవారిగా మారేందుకు గాను సర్జరీ చేయించుకొని పూర్తి ఆడదానిగా రూపాంతరం చెందాడు. అప్పట్లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ క్రమంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో యంగ్ హీరో నాగచైతన్యపై ఆమె చూపిన ఇంట్రెస్ట్ జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. త్వరలోనే తనను జీరో సైజ్‌లో చూస్తారని చెప్పిన ప్ర

అదో వ్యసనం.. విరాట్ కోహ్లీ, తమన్నాలను వెంటనే అరెస్ట్ చేయాలి.. హైకోర్టులో పిటిషన్

Image
టీమ్ ఇండియా కెప్టెన్ , టాలీవుడ్ హీరోయిన్ తమన్నాలు వెంటనే అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం సంచలనంగా మారింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ (జూదం)ను ప్రోత్సహించే ప్రకటనల్లో నటిస్తున్నందుకు గాను వీరిపై పిటిషన్ వేశాడు చెన్నైకి చెందిన ఓ న్యాయవాది. మోసపూరితమైన ఆన్‌లైన్ గేమ్‌లకు ప్రచారం చేస్తూ యువతను వీరు పెడదోవ పట్టిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేమ్ అనేది యువతలో ఓ వ్యసనంగా మారుతోందని, ఆన్‌లైన్ గేముల నిర్వాహకులు భారీగా నగదు, బోనస్‌లు ప్రకటిస్తుండడంతో యువత దీనికి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే ఆ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ అన్నింటినీ నిషేధించాలని సదరు న్యాయవాది కోరారు. అంతేకాదు బాధ్యతారహితంగా వాటిని ప్రమోట్ చేస్తున్న కోహ్లి,తమన్నాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. Also Read: ఇటీవల ఓ యువకుడు ఆన్‌లైన్ గేముల కోసం అప్పులు చేసి.. తిరిగి చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడులో ఈ తరహా ఆత్మహత్యలు చాలా ఎక్కువైపోయాయని తెలిపారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు దీనిపై వచ

నాకు కరోనా వస్తే.. ఇదే చేస్తా, ప్లాస్మా దాతలకు విజయ్ దేవరకొండ సన్మానం

Image
కరోనా వ్యక్తి నుంచి వ్యక్తి సోకుతుంటే.. కరోనా సోకిన వ్యక్తి కోలుకున్న తరువాత ప్లాస్మా దానం ద్వారా అదే వ్యక్తి ఊపిరిపోసుకుంటున్నాడు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, రికవరీ రేటు ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశమే.. ఇక కరోనా వారియర్స్ ప్లాస్మా దానం చేయాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. సెలబ్రిటీలు రంగంలోకి దిగి ప్లాస్మా దానం చేయాలని కోరుతున్నారు. తాజాగా కరోనా ను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన వారిని హీరో ,సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను హీరో విజయ్ దేవర కొండ లాంచ్ చేసారు. ఈ మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. "ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అభినందిస్తున్నాను.. ఎన్నో అపోహల మధ్య ఎందరో ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. కరోనా విషయంలో ప్రపంచం మొత్తం ఏకం అవుతుంది.ఒక్క కోవిడ్ పేషెంట్ 500 ఎంఎల్ ప్లాస్మా దానం చేస్తే ఇద్దరు కోవిడ్ పేషేంట్ లను కాపాడ వచ్చు. ఈ రోజు 120 మంది ప్లాస్మా దానం చేశారు. 200 మంది పేషెంట్‌ను కాపాడాము.. ప్లాస్మా దానం చేసిన వారు కారోనా యోధులు.. వాళ్ళు

సోనూసూద్ బాటలో తాప్సీ.. ఇంటర్‌లో 94 శాతం మార్కులొచ్చిన అమ్మాయికి సర్‌ప్రైజ్ గిఫ్ట్

Image
ఎవరికైనా ఆపద వస్తే దేవుణ్ని తలుచుకుంటారు. కానీ లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి మాత్రం వలస కార్మికులు, పేదలు, విదేశాల్లో చిక్కుకుపోయిన వారు సోనూసూద్‌ను అంత కంటే ఎక్కువగా తలుచుకుంటున్నారు. మదనపల్లె రైతుకు ట్రాక్టర్ పంపడం, కూరగాయలు అమ్ముకుంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఉద్యోగం ఇప్పించడం.. ఇలాంటి మంచి పనులు చేస్తూ.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సోనూసూద్‌ చూపిన మార్గంలో నడవడానికి సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. హీరోయిన్ కూడా ఓ మంచి పని చేసి వార్తల్లో నిలిచారు. పీయూసీ పరీక్షల్లో 94 శాతం మార్కులు తెచ్చుకున్న ఓ స్టూడెంట్‌కు పై చదువుల కోసం స్మార్ట్ ఫోన్ అవసరమైంది. ‘నా కూతురికి 94 శాతం మార్కులొచ్చాయి.. కరోనా కారణంగా చదువుకోవాలంటే స్మార్ట్ ఫోన్ అవసరం. సాయం చేయండి ప్లీజ్’ అని అమ్మాయి తండ్రి అభ్యర్థించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమెకు ఐఫోన్ కొనిచ్చారు. అనంతరం తాప్సీ మాట్లాడుతూ.. ‘మరింత మంది అమ్మాయిలు చదువుకోవాలి. ప్రతి చిన్నారి చదువుకోవాలి. మనకు మరింత మంది డాక్టర్లు కావాలి. రేపటి భారతాన్ని మరింత మెరుగైన దేశంగా మార్చడానికి నేను అందించే చిరు సాయం ఇది’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకకు చెందిన ఆ

నిఖిల్ 20: పెళ్లి తర్వాత బిజీ అవుతున్న నిఖిల్! మరో సినిమా ఫిక్స్

Image
ఇటీవలే తన ఇష్ట సఖి పల్లవిని పెళ్ళాడి ఓ ఇంటివాడైన టాలీవుడ్‌ యంగ్ హీరో సినిమాల పరంగా వేగం పెంచేశాడు. ఈ మ‌ధ్యే ‘అర్జున్ సుర‌వ‌రం’ సినిమాతో హిట్ అందుకొని హుషారుగా ఉన్న ఆయన తన 20వ సినిమా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు నిఖిల్. ఎల్ఎల్‌పీ (ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌) బ్యాన‌ర్‌పై నారాయణ్‌దాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు సంయుక్త నిర్మాణంలో ఈ మూవీ రూపొందనుంది. Also Read: సోనాలీ నారంగ్ సమర్పణలో తెరకెక్కనున్న ఈ మూవీ డైరెక్టర్, ఇతర నటీనటుల వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు. ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను రెయిన్‌బో రీల్స్ చూసుకోనుంది. భారీ బ‌డ్జెట్‌ కేటాయించి ఈ సినిమా నిర్మించనున్నారట. అయితే ఈ మూవీకి సైన్ చేయడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసిన నిఖిల్.. ఈ బ్యానర్‌లో బిగ్ హిట్స్ సాధిస్తామనే నమ్మకముందని తెలిపారు. కాగా ఇప్పటికే చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘కార్తికేయ 2’, ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ డైరెక్ష‌న్‌లో '18 పేజెస్' సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి తర్వాత ఒకేసారి మూడు సినిమాలతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తిక

నా భర్త సైకో.. వేధిస్తున్నాడు, పాపతో పాటు అతన్నీ వదిలేస్తా: స్వాతి నాయుడు

Image
యాంకర్ స్వాతి నాయుడు.. యూట్యూబ్‌లో వివిధ రకాల వీడియోలతో సంచలనం అవుతూ ఉంటుంది. శృంగారభరిత కథల్ని చెప్పి రక్తికట్టించడంలో ఆరితేరిన తన పర్సనల్ లైఫ్‌లో పడుతున్న ఇబ్బందుల్ని తెలియజేస్తూ వీడియో వదిలింది. ఇది వ్యూస్ కోసం పెట్టిన వీడియోనా లేక నిజంగానే తన భర్త అవినాష్ పడుతున్న బాధనో తెలియదు కాని.. తన భర్త అవినాష్ తాగి గొడవ చేస్తున్నాడంటూ వీడియో వదిలింది యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు. తన పర్సనల్ విషయాలు ఇప్పటి వరకూ చెప్పుకోలేనివి తప్పక చెప్పాల్సి వస్తుందంటూ తన బాధను చెప్పుకొచ్చింది స్వాతి నాయుడు. మాకు ఇటీవలే పాప పుట్టింది.. ఆమెకు అనారోగ్యంగా ఉంది.. ఆ టెన్షన్‌లో ఉన్నా.. మేం కొత్త ఇళ్లు ఒకటి కడుతున్నాం.. ఆ పనుల్ని చూసుకుంటున్నాడు నా భర్త. లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రతిరోజు నా మొగుడు రాత్రి అవ్వగానే తాగడం మొదలుపెడుతున్నాడు. తాగుతూనే ఉంటాడు.. అడిగితే అబద్ధాలు ఆడుతున్నాడు.. అందరి తాగుబోతుల్లాగే తాగాలని లేదు అంటూనే తాగుతూనే ఉన్నాడు. చిన్న పాపతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. పాపను చూడమన్నా చూడటం లేదు.. ప్రతి చిన్న విషయానికి కోప్పడుతున్నాడు.. చాలా గొడవలు అవుతున్నాయి.

Jersey Movie: నానికి అరుదైన గుర్తింపు.. అంతర్జాతీయ చిత్రోత్సవానికి ‘జెర్సీ’

Image
నేచురల్ స్టార్ నానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ చిత్రోత్సవానికి నటించిన 'జెర్సీ' చిత్రం ఎంపికైంది. నాని నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన చిత్రం ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఆగష్టు 9 నుంచి 15 వరకూ జరిగే ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ‘జెర్సీ’ చిత్రం ప్రదర్శన కానుంది. 2019 ఏప్రిల్ 19 విడుదలైన జెర్సీ చిత్రం.. నానిని నటుడిగా మరో మెట్టు ఎక్కించింది. నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించారు. తన తండ్రిని హీరోగా చూడాలని కోరుకున్న ఓ కొడుకు చెప్పే కథే ‘జెర్సీ’. ‘జెర్సీ’ కథ వందలో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు. సక్సెస్ అవ్వకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది. ఈ చిత్రంలో నాని కొడుకుగా రోనిత్ అద్భుతమైన పాత్రను పోషించారు. సత్యరాజ్, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ‘మళ్లీ రావా’ వంటి ఫీల్ గుడ్ మూవీతో దర్శకుడిగా ప్రశంసలు దక్కించుకున్న గౌతమ్ తిన్ననూరి క్రికెట్ నేపథ్యంలో జర్నీని ‘జెర్సీ’గా ప్రేక్షకులకు అందించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్‌లో సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనూ జాన్ సినిమాటోగ్రఫీ

అల్లు అర్జున్ 21: బన్నీ అభిమానులను హుషారెత్తించే అప్‌డేట్.. ఆ డైరెక్టర్‌తో కన్ఫర్మ్

Image
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ అభిమానులను హుషారెత్తించే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. బన్నీ కెరీర్‌లో 21వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుపుతూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఇద్దరు వ్యక్తులు నది ఒడ్డున నిలబడి అవతల ఒడ్డున ఉన్న ఊరిని చూస్తూ కనిపిస్తున్నారు. ఈ మేరకు తన తదుపరి సినిమా విశేషాలు తెలుపుతూ ఎక్జైట్ అయ్యారు అల్లు అర్జున్. ''నా తదుపరి చిత్రం కొరటాల శివ గారితో చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. కొంతకాలంగా దీని కోసమే ఎదురుచూస్తున్నాను. సుధాకర్‌ గారి మొదటి ప్రాజెక్టుకు నా శుభాకాంక్షలు. శాండి, స్వాతి, నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమను చూపించే మార్గం'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంతో సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. Also Read: యువ సుధా ఆర్ట్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రూపొందనున్న ఈ చిత్రానికి శాండీ, స్వాతి, నట్టీలు సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. సామాజిక అంశాలతో భా

Allu Arjun: మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం ఆయనే.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

Image
తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని ప్రస్థానం దివంగత అల్లు రామలింగయ్యది. దాదాపు పన్నెండు వందల సినిమాలలో నటించిన ఘనత ఆయన సొంతం. ఆ రోజుల్లో వెండితెరపై నవ్వులు పూయించడంలో అల్లు రామలింగయ్యను మించిన యాక్టర్ లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రొటీన్ కామెడీని తన మార్క్ హాస్యం జోడిస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారాయన. దాదాపు 50 ఏళ్ల పాటు తన నటనతో కితకితలు పెట్టించి నవ్వించిన ఆయన 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. 1929 అక్టోబర్ 1వ తేదీన పాలకొల్లులో జన్మించిన 2004 సంవత్సరంలో సరిగ్గా ఇదే తేదీ (జులై 31వ తేదీ) ఈ లోకం విడిచి వెళ్లారు. అయితే ఈ రోజు సందర్భంగా తన తాతయ్యను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు స్టైలిష్ స్టార్ . ''తాతయ్య మమ్మల్ని వదిలివెళ్లిన ఈ రోజు నాకు గుర్తుంది. ఆయన గురించి అప్పటి కంటే ఇప్పుడు చాలా తెలుసుకున్నాను. నాకు అనుభవం వచ్చేకొద్దీ ఆయన పడిన కష్టాలు, కృషి, పట్టుదల ప్రయాణం ఏంటనే విషయం అర్థమైంది. ఓ పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాపై ఉన్న మక్కువ కారణంగానే మేమంతా ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం'' అని పేర్కొన్నారు అల్లు అర్జున్

Anchor Varshini: ఆది అక్కడ బాగా రొమాంటిక్.. వర్షిణీ!! అక్కడ అంటే ఎక్కడో చెప్పు అంటూ ఓపెన్ అయ్యాడు

Image
పెళ్లి కళ వచ్చేసిందే బాలా.. పల్లకిలి తెచ్చేసిందే బాలా.. అంటూ హుషారైన పాటతో ఎంట్రీ ఇచ్చింది యాంకర్ వర్షిణి. అదేంటి.. జబర్దస్త్‌లో స్టెప్పులేస్తే అనసూయ వేయాలి కాని.. ఏంటి అంటే ‘ఢీ’ షోనుంచి ఈమెను ‘జబర్దస్త్’ స్టేజ్ మీదికి తీసుకుని వచ్చారు. నాది మల్టీ హీరోయిన్ పర్శనాలిటీ అంటారు అంటూ తెగ పొంగిపోతున్న వర్షిణికి ఆది ఆదిలోనే పంచ్ వేశాడు. ఇది మల్టీ డిజార్డర్ పర్సనాలిటీ అంటారు పోయి డాక్టర్‌కి చూపించుకో అని పంచ్ పేల్చాడు. అక్కడ రొమాంటిక్ గానే ఉంటావు కదా.. ఇక్కడేంటి ఇలా ఉంటావు అని వర్షిణి అడగడంతో.. అక్కడా అంటే ఢీ అని క్లియర్‌గా చెప్పు.. లేదంటే ఎక్కడెక్కడో అనుకుంటారు అని లేనిపోని డౌట్‌లను రైజ్ చేసి యూట్యూబ్ ఛానల్స్‌కి మంచి థంబ్ నెయిల్ ఇచ్చాడు ఆది. ఇక వర్షిణి పక్కన నిలబడాలంటే ఓ రేంజ్ ఉండాలిరా.. అని వర్షిణి పక్కకు వచ్చి ఆది స్టైల్‌గా నిలబడే ప్రయత్నం చేయగా.. నువ్ పక్కకి వెళ్లరా అంటూ ఆదికి దిమ్మదిరిగే పంచ్ వేసింది వర్షిణి. మొత్తానికి వీరి కాంబినేషన్‌లో స్కిట్ బాగా పేలేట్టుగానే ఉంది. ఇక రాకెట్ రాఘవ, చలాకీ చంటిలు కూడా ఫన్ నింపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చలాకీ చంటి టీంలో సుధాకర్, దుర్గారావు‌లు తెగ నవ్వి

షాకింగ్.. వనిత విజయ్ కుమార్‌పై మరో కేసు.. మూడో పెళ్లి తర్వాత వరుస వివాదాల్లో హీరోయిన్!

Image
సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వనిత మూడో భర్తగా పీటర్ పాల్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. అయితే వీరి వివాహం జరిగిన మరునాడే ఈ కొత్త జంటపై నమోదు కావడంతో అంతా షాకయ్యారు. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త పీటర్ పాల్.. వనితను పెళ్లి చేసుకున్నాడంటూ పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ కేసు పెట్టింది. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ఆగకుండా వనిత విజయ్ కుమార్‌పై వరుసపెట్టి పోలీస్ కేసులు నమోదవుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వనిత మూడో పెళ్లి చేసుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ కావడంతో పలు మీడియా ఛానెల్స్ ఆమెతో చర్చా వేదికలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వనిత.. సినీ నటి,దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింద. నీకు ఒక్క భర్త ఉంటే మాత్రం ఏమన్నా పతివ్రతావా అంటూ ఆమెపై రెచ్చిపోయింది. దీంతో వనితపై పోలీస్ కేసు పెట్టింది లక్ష్మీ రామకృష్ణన్. Also Read: ఇలా ఇప్పటికే వనితపై రెండు పోలీస్ కేసులు నమోదు కాగా.. తాజాగా ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ కూడా పోలీ

టాలీవుడ్‌లో కూడా ఉంది.. ఇండస్ట్రీపై ఇలియానా సంచలన వ్యాఖ్యలు.. ఇష్యూ వైరల్

Image
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండీస్ట్రీలో నెపోటిజంపై వాదనలు తీవ్రమయ్యాయి. ఎందరో సినీ నటులు ఇండస్ట్రీలో బంధు ప్రీతి ఉందని, ఆ కారణంగా తమకు అవకాశాలు దక్కడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ యాక్టర్స్ ఎక్కువగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో గోవా బ్యూటీ టాలీవుడ్ లోనూ నెపోటిజం ఉందంటూ సంచలన కామెంట్స్ చేయడం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా.. టాలీవుడ్ మొత్తాన్ని నెపోటిజం నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసింది. కొత్త నటీనటులను, బయటనుంచి వచ్చిన వాళ్ళను ఇక్కడ ఎదగనీయరని ఈ గోవా బ్యూటీ చెప్పడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. దీంతో ఇలియానాపై ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'నిజంగానే టాలీవుడ్‌లో కొత్తవారిని ఎదగనీయకపోతే మరి నువ్వు ఎలా స్టార్ హీరోయిన్ అయ్యావు?' అని ప్రశ్నిస్తూ ఆమెపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. Also Read: పలు సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ పట్టేశాక బాలీవుడ్ బాట పట

భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి.. భవిష్యత్తులో ఇంకెన్ని చూడాలో! రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన

Image
కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. 2020 ఆరంభం నుంచే కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ప్రజల ఆర్ధిక స్థితిగతులు ఛిద్రమయ్యాయి. నేటికీ కరోనా కల్లోలానికి బ్రేకులు పడకపోతుండటంతో జనం వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరోయిన్ తాజా పరిస్థితులపై స్పందిస్తూ ప్రతి రోజూ భయం భయంగా బ్రతకాల్సిన సిచువేషన్ నెలకొందని పేర్కొంది. 2020 సంవత్సరమంతా ఇబ్బందులతోనే కొనసాగుతోందని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలను నేర్పిందని చెప్పిన రకుల్.. అందరం కూడా స్వీయ రక్షణను, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కరోనాను ఎదుర్కొనే ప్రయత్నం చేద్దామని సూచించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని విపత్తులు, రోగాలు, యుద్దాలను చూసే అవకాశాలున్నాయని, అయినా కూడా ఎలాంటి ఆపదలు మన దరికి చేరవనే నమ్మకంతో, ధైర్యంతో జీవిద్దామని ఆమె తెలిపింది. అందరూ ఇంటి వద్దనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమి కొట్టాలని ఆమె కోరింది. Also Read: గత కొంతకాలంగా టాలీవుడ్‌లో రకుల్ హంగామా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. గతేడాది 'మన్మథుడు 2' సినిమాలో కనిపించిన ఈ అమ్మడ

హీరో పేరు వాడేస్తూ నయా మోసం.. పోలీసులను ఆశ్రయించిన శరత్ కుమార్

Image
పెరుగుతున్న టెక్నాలజీని తమకు అనువుగా వాడుకుంటూ నయా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సామాజిక మాధ్యమాలు, ఆన్ లైన్ వేదికలు ఉపయోగిస్తూ ఎదుటి వ్యక్తిని బురిడీ కొట్టించి లక్షలు, కోట్లలో సొమ్ము కాజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. జనం వీక్‌నెస్ క్యాష్ చేసుకుంటూ సినీ ఇండస్ట్రీ, సెలెబ్రిటీల పేర్లతో భారీ సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇటీవలే సింగర్ సునీత పేరుతో ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి రాగా.. తాజాగా కోలీవుడ్ నటుడు పేరు వాడుతూ ఓ వ్యక్తి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. శ‌ర‌త్ కుమార్ ‘అఖిల భార‌త స‌మ‌త్తుల మక్కల్ క‌ట్చి’ పేరుతో ఓ పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఈ పార్టీ పేరు చెప్పి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారట. ఈ విషయం శరత్ కుమార్ దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ అయిన ఆయన, స్వయంగా తానే రంగంలోకి దిగి ఆ వ్య‌క్తి వివరాలు ఆరాదీసి అతనితో ఫోన్‌లో మాట్లాడి హెచ్చరించారు. అతను కోవైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని తెలిసి.. అనంతరం పోలీసులను ఆశ్రయించారు శరత్ కుమార్. ఈ మేరకు చెన్నై పోలీస్‌కమిషనర్‌‌కు తన ఫిర్య

రియల్ ఎస్టేట్ స్కామ్: కోట్లు కోల్పోయిన నయనతార, రమ్యకృష్ణ?

Image
ఒక అక్రమ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతిలో ప్రముఖ నటీమణులు , మోసపోయినట్టు సమాచారం. అలాగే, భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలీ టెండూల్కర్ కూడా అదే కంపెనీ చేతిలో మోసపోయారట. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ చేసిన స్కామ్ వల్ల ఈ ముగ్గురు సెలబ్రిటీలతో పాటు మరికొంత మంది ప్రముఖులు కోట్ల రూపాయలు కోల్పోయినట్టు తెలిసింది. ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ దేశ వ్యాప్తంగా ఉన్న వీవీఐపీలకు కొన్ని ఎకరాల స్థలాన్ని విక్రయించిందని ఆరోపణలు వస్తున్నాయి. మంచి వ్యవసాయ భూములను ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అక్రమంగా సొంతంగా చేసుకుని విక్రయించిందని సమాచారం. Also Read: ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ సేకరించిన భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీస్ నిర్మించడానికి ప్లాన్ చేశారట. అయితే, వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు రావడంతో ఈ నిర్మాణాలను ఆపేశారని సమాచారం. ఈ గొడవల్లో అసలు ఆ కంపెనీ సేకరించిన స్థలం వ్యవసాయ భూమి అని బయటపడింది. ఈ స్థలంలో భవనాలు నిర్మించడానికి ఆ కంపెనీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ భూములను ఎకరం లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన సదరు కంపెనీ సెలబ్రిటీలకు రూ. 10 కోట్లకు విక్రయించిందని ఆర

మహేష్ బాబుకి ఇష్టమైన గుత్తి వంకాయ్ పలావ్.. ప్రతిరోజూ ఈ రెస్టారెంట్‌ నుంచే!

Image
సూపర్ స్టార్ వయసు చెప్తే నమ్మరు కాని... ఆయన మరో ఐదేళ్లలో హాఫ్ సెంచరీకి చేరువవుతున్నారు. 1975 ఆగష్టు 9న పుట్టిన మహేష్ బాబు 45 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఊరికోండి బాస్.. ఈమధ్య ఆయన కొడుకు గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోలు చూస్తే ఎవరైనా ఆయనకు 45 ఏళ్లు అంటే నమ్ముతారా?? గౌతమ్ అన్నయ్యో.. కుదిరితే తమ్ముడన్నా నమ్మేస్తారు అంత యంగ్‌గా ఉన్నారు మహేష్ బాబు. పైగా ఈ లాక్ డౌన్‌లో పూర్తి విరామం దొరకడంతో ఫిట్ నెస్‌పై ఫుల్ టైం కేటాయించారు మహేష్ బాబు. ఈ వీడియోలను మహేష్ బాబు సతీమణి నమ్రత షేర్ చూస్తుంటుంది కూడా. అయితే మహేష్ బాబు ఇంత యంగ్‌గా కనిపించడానికి ఏం తింటారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఆయన ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారని.. షూటింగ్ సమయంలో ప్రత్యేకించి ఇంటి నుంచి భోజనం వస్తుందని.. కుదరకపోతే ప్రత్యేకించి డైట్ కోసం ఆయన వెంట కుక్ ఉంటారని చాలా వార్తలు చూస్తూ ఉంటాము. అయితే మహేష్ బాబు ఏమి తింటారో తెలియదు కాని.. ఓ రెస్టారెంట్ నుంచి మాత్రం ప్రతిరోజు ఆయనకు ఇష్టమైన గుత్తివంకాయ పలావ్ వెళ్తూ ఉంటుందట. ఆ హోటల్ పేరే ‘ఉలవచారు’. హా!! ఆ రెస్టారెంట్ పేరు ఉలవచారే.. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో... అదే మన బాలయ

నాని హీరోయిన్ హాట్ పిక్: షర్ట్ ఓకే.. ప్యాంట్ ఏది బేబీ!!

Image
హీరోయిన్ అను ఇమ్మానుయేలు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. నేచురల్ స్టార్ నాని ‘మజ్ను’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ఎన్‌ఆర్ఐ బ్యూటీ.. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేసింది. ఆ తరవాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ చిత్రాల్లో నటించింది. అను చివరిగా 2018లో వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో అక్కినేని నాగచైతన్య సరసన కనిపించింది. ప్రస్తుతం ‘అల్లు అదుర్స్’ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జంటగా నటిస్తోంది. Also Read: వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే అను ఇమ్మానియేలు.. సోషల్ మీడియాలో కూడా అందాలు ఆరబోస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు షేర్ చూస్తూ ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. వీరితో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంటుంది అను. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె కేవలం షర్ట్ మాత్రమే ధరించింది. కింద ప్యాంట్ లేదు. నిజానికి ఇదొక ఫ్యాషన్. దీ

రానా విడుదల చేసిన హర్భజన్ సింగ్ ‘ఫ్రెండ్‌షిప్’ గ్లింప్స్.. ఇంట్రస్టింగ్!

Image
‘ఫ్రెండ్‌షిప్’ మూవీ ద్వారా ప్రముఖ క్రికెటర్ హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్, సతీష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాన్‌పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జేపీఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్, రజినీకాంత్ ఆంథమ్ ఆకట్టుకున్నాయి. Also Read: కాగా, నేడు వరల్డ్ ఫ్రెండ్‌షిప్ డేను పురష్కరించుకుని ‘గ్లింప్స్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ పేరిట వీడియోను వదిలారు. ఈ వీడియోను హీరో రానా దగ్గుబాటి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది. సుమారు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ద్వారా సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. హర్భజన్, సతీష్ స్నేహితులుగా కనిపించారు. భజ్జీ పోలీసు వాహనం నుంచి స్నేహితులతో దిగుతూ కనిపించారు. అంటే, ఇది క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. అర్జున్ పాత్ర స్టైలిష్‌గా ఉంది. ఇక ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ స్కో

యాంకర్ ఝాన్సీ, సింగర్ సునీత కన్నీటి పర్యంతం.. ఇద్దరి పెళ్లి మళ్లీ ఎప్పుడు?

Image
సినిమా ఫీల్డ్.. కంటికి కనిపించే రంగుల వెనుక చీకటి జీవితాలు లెక్కల్లో తేలేవి కావు. ఒక్కొక్కరిదీ ఒక్కో బతుకు పోరాటం.. గెలిచిన వాళ్లు విజేతలుగా నిలిచినా.. వారి వారి వ్యక్తిగత జీవితాల్లో ఆనందం శూన్యమే. ఒంటిపై రంగు.. ముఖంపై చిరునవ్వు కెమెరా ముందు వరకే.. ఒక్కసారి పర్సనల్ లైఫ్‌లోకి తొంగిచూస్తే ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యధ. , .. పేరు, పలుకుపడి, డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. కాని గ్లామర్ ఫీల్డ్‌లో చాలామందికి ఎదురయ్యే సమస్యే వీళ్లనూ వెంటాడింది. భర్తతో విభేధాల కారణంగా వాళ్లకు దూరమై.. పిల్లల కోసం ఒంటరి జీవితం ఈదుతున్నారు. మళ్లీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఈ ఇద్దరికీ పలు సందర్భాల్లో ఎదురైనా చిరునవ్వే సమాధానం అంటూ దాటవేసిని ఈ ఇద్దర్నీ మళ్లీ అదే ప్రశ్న వేసి నవ్వించాడు.. ఏడిపించాడు.. కమెడియన్ అలీ. ఈటీవీలో ప్రసారమయ్యే ‘’ కార్యక్రమానికి గెస్ట్‌లుగా వచ్చారు సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ. ఆగష్టు 3న ప్రసారం అయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. దాదాపు నాలుగు నిమిషాల నిడివితో ఉన్న ఈ ప్రోమో చాలా ఎమోషనల్‌గా సాగింది. ఆడారు.. పాడారు.. నవ్వించారు.. చివరికి ఏడిపించేశారు. మొదటిగా ఝాన్సీని స్టేజ్ మీదికి త

RGV Missing: తనపైనే సినిమా.. వాళ్లందరినీ వాడేస్తోన్న వర్మ.. సరికొత్త జోనర్‌లో!

Image
వివాదాస్పద దర్శకుడు మరో సంచలనానికి తెర తీశారు. తన మీదే ఒక సినిమాను తీస్తున్నారు. కాకపోతే, ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయిన రియల్ క్యారెక్టర్లను ఆయన వాడేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాతో ఒక జోనర్‌ను పరిచయం చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా పేరు ‘ఆర్జీవీ మిస్సింగ్’. ఈ సినిమాతో ఫిక్షనల్ రియాలిటీ (FR) అనే జోనర్‌ను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా వర్మ తొలిసారి ప్రవేశపెడుతున్నారు. ఈ జోనర్‌లో సినిమాలు కల్పితాలైనా అయ్యుండొచ్చు, జరిగిన కథలైనా అయ్యుండొచ్చు, నిజ ఘటనల ఆధారంగా అయినా అయ్యుండొచ్చు అని వర్మ వెల్లడించారు. అసలు వ్యక్తులపై రూపొందించిన పాత్రలను వర్ణించడానికి, ఫిక్షనల్ స్టోరీలో నిజ ఘటనలు చూపించడానికి ఈ జోనర్‌ను వాడతానని వర్మ వివరించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు సంబంధించి వర్మ వరుస ప్రకటనలు చేశారు. ‘ఆర్జీవీ మిస్సింగ్’ స్టోరీ లైన్‌ను కూడా వెల్లడించారు. Also Read: ‘‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో విడుదలయ్యే నా ఎఫ్ఆర్ ఫిల్మ్ టైటిల్ ‘ఆర్జీవీ మిస్సింగ్’. స్టోరీ ఐడియా: ఆర్జీవీ తప్పిపోవడంతో ఆర్జీవీ కంపెనీ స్టాఫ్ షాక్ అవుతారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఆ వివాదాస్పద దర్శకుడు ఇద

ఓ ఇంటివాడైన ‘నేను లోకల్’ రచయిత.. వివాహ వేడుకకు హాజరైన ‘జబర్దస్త్’ స్టార్స్

Image
కరోనా సమయంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసపెట్టి శుభకార్యాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ శుభకార్యాలు జరుపుకుంటున్నారు మన తారలు. మే నెలలో హీరో నిఖిల్ సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ పెళ్లాడారు. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఆ తరవాత రానా దగ్గుబాటి పెళ్లి నిశ్చయమైంది. రానా, మిహీకా బజాజ్ పెళ్లిని ఖరారు చేస్తూ ఇరుకుటుంబాలు రోకా ఫంక్షన్ కూడా చేసుకున్నాయి. తాజాగా హీరో నితిన్ కూడా పెళ్లి చేసుకున్నారు. తాను ప్రేమించిన అమ్మాయి షాలిని కందుకూరిని హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పెళ్లాడారు. ఈ వివాహ వేడుక పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. అయితే, తాజాగా సినీ పరిశ్రమ నుంచి మరో సెలబ్రిటీ ఓ ఇంటివాడయ్యారు. యువ రచయిత ప్రసన్న కుమార్, మౌనికల వివాహం బుధవారం జరిగింది. రాత్రి 8.45 గంటలకు మచిలీపట్నంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో కొద్దిమంది బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన, హీరో అశ్విన్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, హైపర్ ఆది, అవినాష్ తదిత

బిగ్ బాస్ 4లో ప్రముఖ ఛానల్ యాంకర్.. ఆమెను తట్టుకోవడం కష్టమే సుమీ!

Image
బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో పడటంతో ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న ఆసక్తి బుల్లితెర వర్గాల్లో ఉంది. ఇప్పటికే 15 మంది కంటెస్టెంట్స్‌తో కూడిన లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 1. పూనమ్ భజ్వా 2. శ్రద్దాదాస్ 3. హంసా నందిని 4. సింగర్ సునీత 5. మంగ్లీ (సింగర్) 6. హీరో నందు (గీతా మాధురి భర్త) 7. వైవా హర్ష 8. అఖిల్ సార్దక్ 9. యామినీ భాస్కర్ 10. మహాతల్లి (యూట్యూబ్ సంచలనం) 11. అపూర్వ 12. పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్) 13. మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్) 14. ప్రియ వడ్లమాని 15. సింగర్ నోయల్ ఈ 15 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. శ్రద్ధాదాస్ తాను బిగ్ బాస్‌లో పాల్గొనడటం లేదని తెలిపింది. వీరితో హీరో తరుణ్, యాంకర్లు విష్ణు ప్రియ, ఝాన్సీలు తమకు బిగ్ బాస్‌కి వెళ్లే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సీజన్‌లో ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కి చెందిన యాంకర్ ఉండబోతుందట. గత రెండు సీజన్లు (సీజన్ 2, సీజన్ 3)లలో ఈ ఛానల్ తరుపున ఇద్దరు యాంకర్లు రంగంలోకి దిగారు. సీజన్ 2లో దీప్తి నల్లమోతు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా రాగా.. సీజన్ 3లో జర్నలిస్ట్ జాఫర్ బిగ్ బాస్ కం

మహేష్ ఫస్ట్ మూవీకి 21 ఏళ్లు: ఆశ్చర్యపోయిన ప్రిన్స్.. ఎన్నో మధుర జ్ఞాపకాలన్న దర్శకేంద్రుడు

Image
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన .. ‘రాజకుమారుడు’ సినిమాతో సోలో హీరోగా పరిచయమయ్యారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించారు. పరుచూరి బ్రదర్స్ పవర్‌ఫుల్ డైలాగులు రాశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ నేటికి సరిగ్గా 21 ఏళ్ల క్రితం 1999 జులై 30న విడుదలైంది. Also Read: ‘రాజకుమారుడు’ సినిమా 21 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 21 ఇయర్స్ స్పెషల్ పోస్టర్‌ను ట్వీట్ చేసింది. అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. ‘‘21 ఏళ్లా.. ఎలా. నా తొలి సినిమాను ఎంతో ప్రత్యేకంగా మలిచిన రాఘవేంద్రరావుకు కృతజ్ఞతలు. అనుభవం నుంచి నేను నేర్చుకున్న విషయం నాకెప్పుడూ గుర్తుంటుంది. మీతో, మన అద్భుతమైన టీమ్‌తో పనిచేయడం నా అద

పాలు పట్టిస్తున్న మెగా కోడలు.. ఉపాసన ఒడిలో..!! వైరల్ అవుతున్న షాకింగ్ పిక్

Image
రామ్ చరణ్ సతీమణిగా, మెగా కోడలిగా అందరికీ సుపరిచితం . సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ మెగా ఫ్యామిలీ విశేషాలను అందరి ముందుంచే ఆమె.. తాజాగా ఓ షాకింగ్ పిక్ షేర్ చేసింది. తన ఒడిలో పులిని కూర్చోబెట్టుకొని స్వయంగా పాలు పట్టిస్తున్న పిక్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రకృతి, అందులోని జీవాలంటే ఎంతో ప్రేమ చూపే మెగా కోడలు సందర్భంగా ఇలా చేసింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం (జులై 29) సందర్భంగా పులులపై ప్రేమను చాటుకుంటూ పులికి పాలు పట్టించింది ఉపాసన. ''పులి పిల్లకు పాలు పట్టడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. కానీ మళ్ళీ ఇలాంటి పని ఎప్పుడూ చేయను. అడవుల్లో కంటే జూ ల్లోనే పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా ఉంటోంది. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు వాటికి రక్షణ కల్పించాలి'' అని పేర్కొంటూ సందేశమిచ్చింది. Also Read: ఉపాసన షేర్ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ఇక రామ్ చరణ్ వారసత్వం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా అభిమానలోకం.. ‘ఆ పులిలా మీ చేతిలో మెగా వారసుడు ఎ

Pawan Kalyan: పవన్ 3 పెళ్లిళ్లే చేసుకుంటా.. రేప్‌లు చేయలేదు, మీలా ఏడుగుర్ని మార్చలేదు: ఆమె ఫైర్ అయ్యింది!

Image
‘‘ఎందుకో తెలీదు.. నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను? ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?’’.. పవన్‌పై రాసిన ఈ ప్రేమ కవిత చూస్తే ఆయనంటే ఎంత ప్రేమో.. ఆరాధనో.. పిచ్చో.. ఇట్టే అర్థమైపోతుంది ఆమె ఫాలోవర్స్‌కి. సందర్భం వచ్చిన ప్రతిసారి అనలేం కాని.. సందర్భం వచ్చినా రాకపోయినా.. పవన్‌పై ఉన్న భక్తిని చాటుకుంటూనే ఉంది ఈ ‘నచ్చావులే’ నటి. నిజానికి జనసేనలో ఉండాల్సిన ఆమె మొదట్లో ఆపార్టీ తరుపున ర్యాలీలు కూడా చేసింది. అయితే ఏమైందో ఏమోకాని బీజేపీ కండువా కప్పుకుంది. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో దోస్తీ కట్టడంతో ఫుల్ ఖుషీలో ఉంది మాధవీలత. ‘మీరు వస్తారని నాకు ముందే తెలుసు పవన్ కళ్యాణ్ గారూ.. ఐ లవ్డ్ ఇట్’ అంటూ పవన్ బీజేపీతో దోస్తీ కట్టిన తరుణంలో ఘనంగా స్వాగతం పలికిన మాధవీలత.. ఈ మధ్య కాలంలో ఆయనపై ఈగవాలినా తట్టుకోవడం లేదు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ పవన్‌ని కించపరిచేలా ‘పవర్ స్టార్’ సినిమా తీసినందుకు వర్మను ఓ రేంజ్‌లో ఏకిపారేసింది మాధవీలత. ఫర్ ఎవర్ పీకే లవ్స్ అంటూ.. వర్మా.. ఏంటి నీకీ కర్మ?? పీకేని ఏం పీకలేక పనికిమాలిన సినిమాలు. నీకు ప

Thriller Trailer: ఆయనతో ఒంటరిగా బంగ్లాలో ఆమె.. అప్సరా రాణి అందాలపై కెమెరా కన్ను! రొమాంటిక్ డోస్..

Image
సినీ ఇండస్ట్రీ మొత్తం లాక్‌డౌన్ కారణంగా విలవిల్లాడిపోతున్న సమయంలో పోర్న్ భామ మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' సినిమా అనౌన్స్ చేసి సంచలనాలకు తెరలేపిన వర్మ.. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వరుసపెట్టి అడల్ట్ సినిమాలు రిలీజ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే 'నగ్నం' సినిమాతో శ్రీ రాపాక అందాలను కెమెరాలో బంధించిన ఆయన, ఈ సారి గ్లామర్‌పై కన్నేశారు. అప్సరా రాణి ప్రధాన పాత్రలో థ్రిల్లర్ మూవీ రూపొందిస్తూ వరుస అప్‌డేట్స్‌తో కిక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'థ్రిల్లర్' ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు . 2 నిమిషాల 36 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ థ్రిల్లర్ ట్రైలర్‌లో రొమాంటిక్ డోస్ దట్టించారు వర్మ. అప్సరా రాణి హాట్ అందాలను ఫోకస్ చేస్తూ మరోసారి కెమెరా ఎక్కడెక్కడో పెట్టేశారు. ఇది దెయ్యమా? లేక కిల్లరా? అని ప్రశ్నిస్తూ రామా.. కృష్ణా.. శివ శివ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో హోరెత్తించారు. చివరగా ఇది థ్రిల్లర్ అని తెలుపుతూ అంతా సిద్ధంగా ఉండండని పేర్కొన్నారు వర్మ. మొత్తానికి రొమాంటిక్ డోస్ పుష్కలంగా పెట్టేసి 'థ్రిల్లర్' సినిమాతో కాస్త వెరైటీగా థ్రిల్లింగ

Rgv: రాజమౌళికి కరోనా పాజిటివ్.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ రియాక్షన్..! బాహుబలిని పిలవండి

Image
వివాదాస్పద దర్శకుడు మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ముఖం ముందే తన అభిప్రాయం చెప్పేసే వర్మ.. తాజాగా దర్శకధీరుడు అని తెలిసి ఎవ్వరూ ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. రాజమౌళికి కరోనా పాజిటివ్ అని తెలియగానే సినీ ప్రముఖులంతా ఆయన కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ పెడుతుండగా.. వర్మ మాత్రం తనదైన స్టైల్‌లో స్పందిస్తూ బాగోగులు కోరుకున్నారు. బుధవారం (జులై 29) రాత్రి తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలినట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తాము.. జ్వరం తగ్గిన తరువాత ఎలాంటి లక్షణాలు లేకపోయినా కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు రాజమౌళి తెలిపారు. దీంతో ఉలిక్కిపడ్డ టాలీవుడ్ సినీ లోకం ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్‌ని హోరెత్తించేసింది. ఇక రామ్ గోపాల్ వర్మ పెట్టిన వెరైటీ ట్వీట్ మాత్రం వైరల్ అయి వార్తల్లో నిలిచింది. Also Read: ''సర్.. మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ పక్కన పెడితే.. మీరు, మీ కుటుంబ సభ్యులు అతి త్వరలోనే కరోనా బారి నుంచి కోలుకుంటారు''

Bandla Ganesh: కోడి గుడ్లు తినండి సార్.. రాజమౌళికి బండ్ల గణేష్ భరోసా! నెటిజన్ల రియాక్షన్ చూస్తే..

Image
దేశంలో మహమ్మారి వీర విజృంభణ చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ కరోనా బారిన పడుతుండటం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలామందికి సోకుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే నిన్న (బుధవారం) దర్శకధీరుడు తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయినట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేయడంతో టాలీవుడ్ లోకం ఉలిక్కిపడింది. దాంతో పలువురు సినీ ప్రముఖులు రాజమౌళి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కాగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన రాజమౌళి.. ‘‘నా కుటుంబ సభ్యులకు, నాకు కొన్ని రోజులు క్రితం కాస్త జ్వరం వచ్చింది. దానికదే తగ్గిపోయింది. కానీ, మేం పరీక్ష చేయించుకున్నాం. ఈ రోజు వచ్చిన ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. డాక్టర్ల సూచన మేరకు మేమంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాం. ప్రస్తుతం మాకు ఎలాంటి లక్షణాలు లేవు. అంతా బాగానే ఉన్నాం. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ల సూచనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వల్ల మేం ప్లాస్మా దానం చేయగలుగుతాం’’ అని పేర్కొన్నారు. Also Read: ఈ నేపథ్యంలో గ

సోనూ సూద్‌కు దర్శకుడు శ్రీను వైట్ల ఛాలెంజ్

Image
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రకృతి ప్రేమికులను కదిలస్తుంది. ఒక్కొక్కరుగా మొక్కలు నాటుతూ తమ సన్నిహితులను నామినేట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను గుండెల్లో పెట్టుకుంటోంది. ఈ మంచి కార్యక్రమంలో భాగంగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన దర్శకుడు శ్రీను వైట్ల బుధవారం హైదరాబాద్, జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో మొక్కలు నాటారు. Also Read: అనంతరం శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ‘‘గత మూడు దశాబ్దాల్లో రాజకీయ నాయకుల నుంచి సమాజానికి ఉపయోగపడే ఇంతమంచి మానవీయ కార్యక్రమాన్ని చూడలేదు. మొదటిసారిగా జోగినిపల్లి సంతోష్ గారు తన గొప్ప మనసుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి రూపకల్పన చేసి నిరంతరం ముందుకు తీసుకుపోతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తనవంతు బాధ్యతగా టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్, నటుడు - సమాజ సేవకుడు

అక్షర హాసన్ మేకప్ ఆర్టిస్ట్ కరోనాతో మృతి.. భావోద్వేగానికి గురైన కమల్ కూతురు

Image
కమల్ హాసన్ కుమార్తె, నటి అక్షర హాసన్‌ మేకప్ ఆర్టిస్ట్ సచిన్ దాదా కరోనా వైరస్‌తో ఇటీవల మృతిచెందారు. తనకెంతో ఇష్టమైన మేకప్ ఆర్టిస్ట్ అకాల మరణాన్ని అక్షర జీర్ణించుకోలేకపోతున్నారు. సచిన్‌ను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అక్షర. సచిన్‌ను తన సోదరుడిగా అభివర్ణించారు. బాలీవుడ్‌లో తన తొలి చిత్రం ‘షమితాబ్’ నుంచి సచిన్ దాదా తనకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన రాకతో తన జీవితంలో పాజిటివిటీ ఎలా పెరిగింది, ఆయనతో సరదాగా చేసిన ప్రాంక్స్ గురించి తన పోస్ట్‌లో అక్షర వివరించారు. Also Read: ‘‘ఈ మహమ్మారి వల్ల మనం చాలా మంది మంచి వ్యక్తులను కోల్పోయాం. ఈ బాధతో నా గుండె బరువెక్కింది. ఈరోజు బరువెక్కిన గుండెతో నేను ఈ పోస్ట్‌ను రాస్తున్నాను. ‘షమితాబ్’ నుంచి నాకు మేకప్ ఆర్టిస్ట్‌గా ఉన్న నా సోదరుడు సచిన్ దాదా కొవిడ్‌తో చనిపోయాడు. ఆయన ఎంతో సంతోషంగా, ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు. నేను ఎవరితో అయినా ప్రాంక్స్ చేశానంటే అది ఆయనే. ప్రతిభావంతుడు. వీటన్నింటి కన్నా ఆయన నాకు, ఆయన సహచరులకు గొప్ప స్నేహితుడు. ఇద్దరు కొడుకులకు అద్భుతమైన తండ్రి. ఒక భార్యకు గొప్ప భర్త. ఆయన కుటుంబం ఆ

దర్శకధీరుడు రాజమౌళికి కరోనా పాజిటివ్

Image
సినిమా ఇండస్ట్రీలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. అలాగే, సమంత స్నేహితురాలు.. నటుడు సామ్రాట్ సోదరి శిల్పారెడ్డి కూడా కరోనా నుంచి కోలుకున్నారు. పలువురు టీవీ తారలకు కరోనా సోకింది. తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ‘బాహుబలి’ దర్శకుడు స్వయంగా వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. Also Read: ‘‘నా కుటుంబ సభ్యులకు, నాకు కొన్ని రోజులు క్రితం కాస్త జ్వరం వచ్చింది. దానికదే తగ్గిపోయింది. కానీ, మేం పరీక్ష చేయించుకున్నాం. ఫలితాలు ఈరోజు వచ్చాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు మేమంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాం. మాకు ఎలాంటి లక్షణాలు లేవు. అంతా బాగానే ఉన్నాం. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ల సూచనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వల్ల మేం ప్లాస్మా దానం చేయగలుగుతాం’’ అని రాజమౌళి పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి ‘RRR’ సినిమాతో బిజీగా ఉన్నారు. పాన్ ఇం

పుట్టినరోజు నాడు మరో మంచి పని చేస్తున్న సోనూ సూద్

Image
నటుడు తన పుట్టినరోజును సేవచేయడానికి మరో అవకాశంగా మార్చుకుంటున్నారు. కరోనా సంక్షోభంలో విశ్రాంతి లేకుండా పనిచేసిన సోనూ సూద్.. తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రేపు (జులై 30న) తన పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు సోనూ సూద్ వెల్లడించారు. ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందించనున్నట్టు చెప్పారు. ఈ వైద్య శిబిరాలను నిర్వహించేందుకు గ్రామ పంచాయతీలు, ముఖియాలతో సోనూ సూద్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ వైద్య శిబిరాలను నిర్వహించబోతున్నట్టు సోనూ సూద్ స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒడియా రాష్ట్రాల్లో ఉచిత మెడికల్ క్యాంప్‌లు నిర్వహించడానికి అక్కడి డాక్టర్లతో మాట్లాడుతున్నట్టు సోనూ సూద్ వెల్లడించారు. జులై 30న సోనూ సూద్ 47 ఏట అడుగుపెడుతున్నారు. ఈ రోజును తన జీవితంలో ఒక ప్రత్యేక రోజుగా మార్చుకోవాలని సోనూ సూద్ చూస్తున్నారు. ఇవి ఎప్పుడూ నిర్వహించే వైద్య శిబిరాల మాదిరిగా ఉండవని.. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి కాబట్టి కాస్త ఇబ్బంది ఉండొచ్చని ఆయన తెలిపారు. Also Read: కరోనా సంక్షోభ సమయంల

శివాజీ రాజా కుమారుడి కొత్త చిత్రం ప్రారంభం

Image
నటుడు శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ‘ఏదైనా జరగొచ్చు’ సినిమా ద్వారా కిందటేడాది విజయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత ‘జెమ్’ అనే సినిమాను అంగీకరించాడు. ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించాడు. జయ దుర్గాదేవి మల్టీమీడియా పతాకంపై విజయ్ రాజా, తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న చిత్రం ఈరోజు హైదరాబాద్‌లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైంది. హీరో ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తం షాట్‌‌కి క్లాప్ కొట్టారు. చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రంలో అయిదు పాటలు ఉంటాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా లాంటి ప్రదేశాల్లో సినిమా చిత్రీకరణ జరుగుతుందన్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో విజయ్ రాజా మాట్లాడుతూ.. ‘‘మా చిత్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన హీరో నాగశౌర్య అన్నకి ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చినందుకు మా దర్శకుడు, నిర్మాతకి ధన్యవాదాలు. కథ చాలా బాగుంది’’ అని తెలిపారు. దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మా

ఐదేళ్ల సహజీవనం.. ప్రముఖ సింగర్‌‌తో గబ్బర్ ‘సింగ్’ విలన్ పెళ్లి

Image
సర్దార్ గబ్బర్ సింగ్, కిక్, జిల్ చిత్రాల్లో ప్రతినాయకుడిగా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన కబీర్ దుహాన్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో విలన్‌గా మెప్పిస్తున్న గత కొన్నేళ్లేగా ప్రముఖ సింగర్ డాలీ సింధూతో సహజీవనం చేస్తున్నారు. స్నేహితురాలి ద్వారా పరిచయం అయిన డాలీ-కబీర్‌ల మధ్య స్నేహం చిగురించి అది ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న వీరు.. గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. జూన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న డాలీ-కబీర్ జంట త్వరలో పెళ్లిపీటలు ఎక్కేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. డిసెంబర్‌లో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించారు కబీర్.. ముంబైలో సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకుని ఢిల్లీలో రిసెప్షన్‌కి ప్లాన్ చేస్తున్నారట. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగానే కొద్దిమంది సమక్షంలో ఈ వివాహం జరగబోతున్నట్టు తెలిపారు. నిజానికి ఈ నవంబర్‌లో గోవాలో డిస్టినేషన్ పద్దతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని.. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో పెళ్లిని మరికొంతకాలం వాయిదా వేసినట్టు చెప్పుకొచ్చారు కబీర్ సింగ్.

మెగాస్టార్‌ కాంప్లిమెంట్‌తో ఆస్కార్‌ వచ్చినంత సంబరపడ్డా: దర్శకుడు శ్రీధర్ సీపాన

Image
‘లౌక్యం’ తెలిసిన రచయిత శ్రీధర్‌ సీపాన. ఏకకాలంలో ఐదారు చిత్రాలకు పని చేయగల సమర్ధుడు. ఆయన మాటల ‘పూలరంగడు’. వినోదంతో పాటు విలువైన విషయాలను చక్కగా చెప్పగలడు. కమర్షియల్‌ కథలకు కత్తిలాంటి మాటలు రాసి, కామెడీతో ప్రేక్షకులను మెప్పించగల రైటర్‌. ‘లౌక్యం’, ‘పూలరంగడు’, ‘ఆహనా పెళ్ళంట’ తదితర విజయవంతమైన చిత్రాలకు ఆయన రచయితగా పని చేశారు. జూలై 29న శ్రీధర్‌ సీపాన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ... బర్త్‌డేను ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారు? స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ ఏమీ లేవు. ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్య ఇంట్లో సెలబ్రేట్‌ చేసుకున్నా. ప్రజెంట్‌ కరోనా వల్ల అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళడం లేదు. ఇల్లు, ఆఫీసు, పని అంతే! రైటర్‌గా ఈ ఇయర్‌ ఎలా ఉంది? నేను అయితే ఎప్పటికీ మరువలేను. మెగాస్టార్‌ గారు, చక్కటి సందేశాత్మక కథలకు కమర్షియల్‌ విలువలు మేళవించి సినిమాలు రూపొందించే దర్శకుడు కొరటాల శివ గారి కాంబినేషన్‌లో ఫస్ట్‌టైమ్‌ వస్తున్న ‘ఆచార్య’ సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నా. వాళ్ళిద్దరితో మంచి రిలేషన్‌ ఏర్పడింది. అలాగే, దర్శకుడిగా నా మొదటి సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ చేశా. చిరంజీవి గారి అల్లుడు కళ

అక్కుపక్షి.. నాగబాబు మళ్లీ గిచ్చారుగా, గూగుల్‌లో అప్పుడు ‘అదిరింది’.. ఇప్పుడు మళ్లీ!

Image
అక్కు పక్షి గురించి తెలియాలంటే.. 2017 జనవరిలోకి వెళ్లాల్సిందే.. ఆ టైంలోనే ఈ పదం గూగుల్‌ని షేక్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను 2017 జనవరి 7న గుంటూరు హాయ్ లాండ్‌లో ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ పేరుతో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన మెగా బ్రదర్ నాగబాబు ఆవేశంగా మాట్లాడుతూ.. వివాదల దర్శకుడు వర్మను ఉద్దేశించి అన్నమాటే.. ఈ అకు పక్షి. ఈ వేడుకలో మాట్లాడిన నాగబాబు.. వర్మ పేరును నేరుగా ప్రస్తావించకుండా ముంబైలో ఉండే ‘అక్కుపక్షి..సన్నాసి’ అంటూ వర్మని ఏకిపారేశారు. ‘పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు మెగాస్టార్‌పైన, మెగా హీరోలపై కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వేస్ట్‌ ఫెలోల్లో ఒకరైన ముంబై డైరెక్టర్‌ ట్విట్టర్‌లో మెగాస్టార్‌పై కామెంట్లు చేస్తున్నాడు. కానీ తన పని అయిపోయిందన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి’ అని నాగబాబు ఆవేశంగా మాట్లాడారు. అయితే నాగబాబు ప్రసంగం తరువాత ఇంతకీ నాగబాబు తిట్టిన అక్కు పక్షి గురించి వివరీతమైన సెర్చ్ జరిగింది. గూగుల్‌లో అక్కు పక్షి బాగా ట్రెండ్ అయ్యింది. అయితే పక్షి మాట పక్కన పెడితే.. నాగబాబు అన్నది తననే అని అ

వైసీపీకి 130 సీట్లు, జనసేన ఓటమి, లోకేష్ గెలవడట: బండ్ల వారి లెక్కలు

Image
నీ బండ బడా.. ఈ ఉన్నాడే.. రాజకీయాల్లో ఇప్పుడు లేడు కాని.. ఉన్నన్నాళ్లూ సినీ, రాజకీయ వర్గాల్లో కామెడీకి కొదువలేకుండా చేశారు. నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ గత ఎన్నికల్లో పొలిటీషియన్ అవతారం ఎత్తాడు. ఎన్నికలు రాకముందే ‘బండ్ల గణేష్ అనే నేను’ అంటూ టీవీ ఇంటర్వ్యూలలో ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. అంతేకాదు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే.. 7 Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా అని ఎన్నికల తరువాత రిపోర్టర్లు బ్లేడ్ పట్టుకుని తిరిగేలా చేశారు బండ్ల. ఆ తరువాత బుద్ది వచ్చింది బాబోయ్.. ఇక జన్మలో రాజకీయాలు జోలికి పోను.. ఇక సినిమాలే చేసుకుంటా అంటూ లెంపలు వేసుకున్నారు. ఇటీవల కరోనాను జయించిన బండ్ల గణేష్.. పాలిటిక్స్‌లో లేను అంటూ ఏపీ పాలిటిక్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన దేవుడు జనసేన అధినేత గురించి మాట్లాడుతూ.. పవన్ సినిమాలపై మాట్లాడగలను కాని.. ఆయన రాజకీయ ప్రస్థానం ఆయన ఇష్టం. జనసేన పార్టీకి ఒక్క సీటే రావడం.. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోవడం బాధగానే అనిపించింది. ఆయన గెలిస్తే బాగుండేదని అనుకున్నా.. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పటికీ కూడా.. ఆ పార్టీ ఓడిపోతుందని నాకు ముందే తెలుసు. Also Read: అక

వర్మ ‘థ్రిల్లర్’ ట్రైలర్: 9 భాషల్లో విడుదల.. డేట్, టైమ్ ఫిక్స్

Image
సెన్సేషనల్ డైరెక్టర్ వరుస సినిమాలతో ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం సంక్షోభంలో ఉంటే.. వర్మ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తక్కువ నిడివి గల సినిమాలు తీస్తూ వాటిని ఆన్‌లైన్‌లో విడుదల చేస్తూ డబ్బులు చేసుకుంటున్నారు. ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’, ‘పవర్ స్టార్’ సినిమాలను వర్మ విడుదల చేశారు. ఇంకా చాలా సినిమాలు వర్మ దగ్గర ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. అదే ‘థ్రిల్లర్’. Also Read: అప్సర రాణి, రాక్ కచ్చి జంటగా నటించిన ఈ రొమాంటిక్ మూవీకి ఇప్పటికే కావాల్సినంత ప్రచారం చేసేశారు వర్మ. హీరోహీరోయిన్లతో నగ్నంగా ఫొటోషూట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను రేపు (జులై 30న) ఉదయం 11 గంటలకు వర్మ విడుదల చేస్తున్నారు. మొత్తం 9 భాషల్లో ఈ ట్రైలర్ విడుదలవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, భోజ్‌పురి, గుజరాతి, ఒడియా భాషల్లో విడుదల చేస్తున్నారు. త్వరలోనే సినిమాను కూడా విడుదల చేయనున్నట్టు వర్మ ట్వీట్ చేశారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ఈటీ ప్లాట్‌ఫాంలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు

చిరంజీవిపై తప్పుడు ప్రచారం.. అసలు నిజం చెప్పిన వర్మ.. మెగా ఫ్యాన్స్ నమ్మాల్సిందే

Image
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మెగా ఫ్యామిలీతో ఉన్న వివాదం ఏంటి?? అసలు ఆయన పదే పదే మెగా ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేస్తారు.. ఈయన తిట్టడమే కాకుండా శ్రీరెడ్డి లాంటి వివాదాస్పద నటితో తిట్టించేటంత కసి ఈయనలో ఎందుకు?? ఈయనతో సినిమా చేయలేదనే కారణంగా ఆ ఫ్యామిలీపై కసి పెంచుకున్నారా?? , పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఏ హీరో కూడా వర్మతో పనిచేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది.. వర్మతో మెగా ఫ్యామిలీకి నిజంగానే విభేధాలు ఉన్నాయా?.. ఈ ప్రశ్నలు మెగా అభిమానుల్లోనే కాదు.. సగటు ప్రేక్షకుడి మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే వీటిపై ఎట్టకేలక క్లారిటీ ఇచ్చారు . అంతేకాదు గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో సినిమా ఎందుకు వదులు కోవాల్సి వచ్చిందో కూడా వివరించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇది పాతికేళ్ల నాటి విషయం.. అప్పటికి పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలేదు.. అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పట్లో నేను ఆయనకు ఒక కథ వినిపించా.. ఆ కథలో ఆయన హీరో కాదు.. కీలకమైన రోల్. అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పాత్ర చేయనన్నారు. అది ఆయన ఇష్టం.. నిజానికి పవన్ తీసుకున్న నిర్ణయం మంచి

‘బిగ్ బాస్ 4’లో విష్ణుప్రియ: రిలాక్స్‌గా ఉండండి.. క్లారిటీ ఇచ్చిన యాంకర్

Image
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి రంగం సిద్ధమైంది. ఆగస్టు ఆఖరి వారంలో షో ప్రారంభమవుతుందని సమాచారం. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సెట్ సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 4లో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు జాబితాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జాబితాల్లో టీవీ వ్యాఖ్యాత, యాంకర్ పేరు కూడా ఉంది. ఈ జాబితాల్లో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే ఈ రూమర్లను కొట్టిపారేశారు. ఇప్పుడు విష్ణుప్రియ అదే పని చేశారు. రాబోయే బిగ్ బాస్ షోలో తాను పాల్గొనడం లేదని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విష్ణుప్రియ స్పష్టత ఇచ్చారు. ఈ ప్రకటనతో రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఈ మేరకు తన రీసెంట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ‘‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు.. ముఖ్యంగా బిగ్ బాస్‌కి. ఇప్పుడే కాదు ఎప్పుడూ వెళ్లను. ఈ విషయంలో నన్ను నమ్మండి. కాబట్టి, నన్ను ఇష్టపడేవాళ్లు అందరూ రిలాక్స్‌గా ఉండండి. అందరూ సంతోషంగా ఉండండి’’ అని తన ఇన్‌స్టా స్టోరీలో విష్ణుప్రియ పేర్కొన్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ తరుణ్, శ్రద్ధా దాస్, సునయన ఇలా చాలా మంది పేర్లు

అఖిల్‌‌కు పూజా రొమాంటిక్ కిక్.. అదిరిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పోస్టర్

Image
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో… అక్కినేని హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిసమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పూజ తన కాళ్లతో అఖిల్ చెవుల్ని టచ్ చేస్తూ ఉంటుంది. అఖిల్ సోఫాలో కూర్చోని కాఫీ తాగుతూ ల్యాప్‌టప్‌లో ఏదో వర్క్ చేస్తుండగా.. అతని వెనకాలే చైర్ పై కూర్చున్న పూజ తన కాళ్లతో అఖిల్ చెవుల్ని తాకుతూ డిస్టర్బ్ చేస్తుూ ఉంటుంది. మా బ్యాచిలర్ & బ్యాచిలరెట్ క్వారంటైన్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అంటూ ఒక రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ పోస్టర్ విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Read More: ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్ర యూనిట్ భావిస్తో

కరోనాకి వాడాల్సిన ముఖ్యమైన మాత్ర ఇదే.. ఆయుర్వేదంతో గో కరోనా: విశాల్

Image
ఇటీవ‌ల వారి తండ్రి జి.కె.రెడ్డి క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే..ఈ సంద‌ర్భంగా తాను తన కుటుంబం కరోనాను ఎలా జయించారో తెలియజేస్తూ ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ మహమ్మారిని ఎలా జయించాననే విషయాన్ని తెలియజేస్తున్నాను తప్పితే.. ఏ విధమైన ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్‌ను తాను ప్రమోట్ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు విశాల్. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మా నాన్నగారికి పోయిన నెలలో కరోనా పాజిటివ్ వచ్చింది.. అయితే ఆయన్ని హాస్పటల్‌లో జాయిన్ చేయాలని అనుకోలేదు. నేను హాస్పటల్, డాక్టర్స్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు.. ఈ విషయంలో క్షమించాలి. మా నాన్న గారిని ఇంట్లోనే ఉంచి దగ్గర ఉండి చూసుకోవాలని నా కోరిక. నేను దగ్గర ఉండి మా నాన్నగారిని చూసుకున్నా.. సో నాకు కూడా కరోనా సోకింది. దగ్గు, జ్వరం, జలుబు ఇవన్నీ వచ్చాయి. నాతో పాటు నా మేనేజర్‌కి కూడా వచ్చింది. మా అంకుల్ డాక్టర్ హరిశంకర్‌కి చాలా థాంక్స్ చెప్పాలి.. ఆయన సమక్షంలో మేం ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్ తీసుకుని కరోనా నుంచి కోలుకున్నాము. ఇది చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టే చెప్తున్నా.. అంతేకాని ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్‌ని ప్ర

నిహారిక కొణిదెల నిశ్చితార్థం ఫిక్స్.. వచ్చేనెలలోనే ముహుర్తం

Image
మొదలయ్యింది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిశ్చితార్థం త్వరలో కానుంది. ఇప్పటికే తనకు కాబోయే వరుడు గురించి మెగా డాటర్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయినట్టు తెలుస్తోంది. Read More: అయితే వీరి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని నాగబాబు సైతం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ .. తన సోదరి నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్‌ను తెలిపారు నాగబాబు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతన్య, నిహారిక ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీని ఒకే వేదికపై చూడవచ్చని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు నిహారిక పెళ్లి ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పెళ్లికి ముందే ఓ వెబ్ సిరీస్‌లో నటించేంద

KGF Chapter 2: వామ్మో ‘అధీరా’.. క్రూరమైన లుక్‌తో సంజయ్ దత్ బర్త్ డే ట్రీట్

Image
బాలీవుడ్ స్టార్ హీరో బర్త్ డే సందర్భంగా ‘కె.జి.య‌ఫ్ చాప్టర్2’ చిత్రం నుంచి అదిరిపోయే లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ అధీరా పాత్రలో కనిపించబోతున్నారు. హాలీవుడ్ తరహా వేషధారణలో అధీరా భయంకరంగా కనిపిస్తున్నాడు. విచిత్రమైన విషధారణలో సర్ ప్రైజ్ చేశాడు సంజయ్ దత్. ముఖంపై పచ్చబొట్లు, చేతిలో కత్తి, మెరిసిన గడ్డం, మెలితిప్పిన మీసంతో దీర్ఘంగా ఆలోచిస్తూ.. వహ్ వా అనిపించాడు. అధీరా క్రూరత్వం ఎలా ఉంటుందో ఈనెల 29న మీరే చూస్తారని ముందు ప్రకటించిన కెజీఎఫ్ చిత్ర యూనిట్ అన్నట్టుగానే ‘అధీరా’ లుక్‌లో క్రూరత్వాన్ని చూపించారు. రక్తపాతం లాంటివి లేకుండానే కేవలం ‘అధీరా’ వేషధారణంలో క్రూరత్వాన్ని చూపించగలిగారు దర్శకుడు ప్ర‌శాంత్ నీల్. ఈ సందర్భంగా అధీరా లుక్‌ని విడుదల చేస్తూ సంజయ్ దత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ప్ర‌శాంత్ నీల్. ‘హ్యాపీ బర్త్ డే సంజూ బాబా. మా ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’లో భాగమైనందుకు ధన్యవాదాలు. తదుపరి ష

పవన్‌కి కథ చెప్పిన మాట వాస్తవమే కాని.. ఆరోజు ఏమైందంటే: వర్మ ఓపెన్ సీక్రెట్స్

Image
రామ్ గోపాల్ వర్మ.. పదే పదే మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తారు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు వర్మ సినిమాలను రిజెక్ట్ చేసినందుకే ఆ ఫ్యామిలీని వర్మ టార్గెట్ చేస్తున్నారనేది చాలా మంది మెగా అభిమానుల వాదన. అయితే నిజంగానే వర్మ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను కలిశారా?? వారికి కథ చెప్పారా?? వాళ్లు నో చెప్పారా?? అసలేమైందో వివరించారు ఆర్జీవీ. అందరూ అనుకున్నట్టు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేనూ.. మేం ముగ్గురం ఎప్పుడూ కలిసి స్టోరీ డిస్కస్ చేసింది లేదు. పవన్ కళ్యాణ్‌ను వేరేగా.. చిరంజీవిని వేరేగా కలిశాను. పవన్ కళ్యాణ్‌కి ఒక కథ చెప్పిన మాట నిజమే. కాని అప్పటికి పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. ఇది జరిగి 25 ఏళ్లు పైనే అవుతుంది. నేను తీసే సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్‌ని కలిశా. కథ చెప్పా.. కాని ఆయన లేచి సీరియస్‌గా వెళ్లిపోయారు. నేను చేయను అన్నారు. పవన్ చేసింది కరెక్టే.. ఎందుకంటే ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు.. ఆ సందర్భంలో నేను వేరే రోల్ కోసం అడిగా.. ఆయనకు నచ్చలేదు.. చేయను అన్నారు.. అది ఆయన ఇష్టం. ఆ సినిమా పెద్ద ప్లాఫ్ అయిన తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్‌ని కలిసి నీ జడ్జి

శ్యామ్ కె నాయుడుపై లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్.. ఎస్ఐకి భారీ లంచం, నటి శ్రీ సుధ కీలక ఆధారాలు

Image
ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్.కె.నాయుడు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి.. త‌న‌ను శారీర‌కంగా వాడుకుని మోసం చేశాడంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేష‌న్‌లో సినీ నటి సాయి సుధ () ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన శ్యాం కె నాయుడిని రిమాండ్‌కి తరలించగా.. బెయిల్‌పై విడుదలయ్యారు. నటితో కాంప్రమైజ్ అయినట్టు కోర్టుకు తెలిపిన అరెస్ట్ అయిన రెండు రోజుల్లోనే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే తాను కాంప్రమైజ్ అయినట్టుగా తప్పుడు పత్రాలను సృష్టించి.. తన సంతకాన్ని మార్ఫింగ్ చేశారని బెయిల్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ కోర్టుకెక్కింది సాయి సుధ. దీంతో శ్యామ్ కె నాయుడు బెయిల్‌ని రద్దు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఎస్ ఆర్ నగర్ ఎస్ ఐకి ఐదు లక్షల లంచం ఇచ్చానంటూ బాంబ్ పేల్చింది సాయి సుధ. ఎస్.ఆర్.నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ తన దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకొని తగిన విధంగా న్యాయం చేయలేదని ఏసీబీ అధికారులను ఆశ్రయించింది సాయి సుధ. తాను ఎస్.ఆర్.నగర్ ఇన్స్పెక్టర్ మురళికి ఐదు లక్షల వరక

సోనూ సూద్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే.. ప్రకాష్ రాజ్ కామెంట్స్

Image
మొన్నటి వరకూ దేశ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపించిన సోనూసూద్ పేరు. తెలుగు రాష్ట్రాల్లో మారు మోగుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి రైతు నాగేశ్వరరావు.. తన ఇద్దరు కూతుళ్లతో పొలం దున్నుతూ కష్టపడుతున్న వీడియో సోషల్ మీడియో చూసి చలించిపోయిన సోనూసూద్ గంటల వ్యవధిలోనే ఆ ఇంటికి ట్రాక్టర్ పంపి తన ఉదారతను చాటుకున్నారు. దీంతో రీల్ లైఫ్ విలన్ సోనూసూద్‌ని రియల్ లైఫ్ హీరోగా అభివర్ణిస్తూ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇదే సందర్భంలో సోనూసూద్ స్థాయిలోనూ అనేకమంది వలస కార్మికులకు కరోనా కష్టం నుంచి ఆదుకున్న ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సోనూ సూద్‌ సాయం పట్ల ప్రశంసలు కురిపించారు. ‘సోనూసూద్ నిజమైన హీరో.. అతను రీల్ లైఫ్‌లో విలన్ కాని.. రియల్ లైఫ్‌లో హీరో.. ఆయనది ఎంతో అద్భుతమైన వ్యక్తిత్వం. ఎంతోమందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. నీ.. నా అనేభేదం లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్నారు. వలస కార్మికుల్ని ఇంటికి పంపించడం కాని.. సొంత ఖర్చుల్ని భరిస్తూ వాళ్లు సొంత ఊర్లకు వెళ్లి సొంత వ్యాపారాలు పెట్టుకోవడం కాని.. చిత్తూరు జిల్లా మదనపల్లి రైతు ఉపాది కోల్పోయి కూతుళ్లతో పొలం దున్

రావి కొండలరావు బహుముఖ ప్రజ్ఞాశాలి.. సీఎం జగన్, చంద్రబాబు సంతాపం

Image
ప్రముఖ సినీ నటుడు రావికొండలరావు మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేయగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘బహుముఖ ప్రజ్ఞాశాలి మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడుగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.’’ అని సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. అలాగే ‘‘సీనియర్ నటులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కళాప్రపూర్ణ రావి కొండలరావు గారి మరణం విచారకరం. తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో, హాస్యాన్ని జోడించి ఆయన ప్రదర్శించే నటన ఆహ్లాదకరంగా ఉండేది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు రావి కొండలరావు (88) మంగళవారం (జూలై 28) హైదరాబాద్‌లోని వివేకానంద ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. సినీ, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశేష అనుభవం సంపాదించి నిరాడంబరం

RGV: పవన్‌పై వర్మ సినిమా తీస్తే తప్పేంటి? వర్మ గ్రేట్: ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

Image
టాలీవుడ్‌లో వరుస వివాదాలను రాజేస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ప్రముఖ యాంకర్ రోజాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా దృష్టిలో అద్భుతమైన వ్యక్తి. ఆయన ఏదో పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ‘పవర్ స్టార్’ సినిమా తీశాడని అంటున్నారు.. చాలా మంది అయితే ఆ సినిమా క్లైమాక్స్‌లో పవన్ గురించి బాగా చెప్పారని అంటున్నారు. ఆయన ఆలోచన ఆయనది. వర్మకి చెప్పే హక్కు ఉంది. ఆయన్ని జడ్జిమెంట్ చేయలేం. ఆయన అలా.. మనం ఇలా అంతే. అంతకీ వర్మ నచ్చకపోతే ఆయన తీసిన సినిమాలు చూడకండి సింపుల్ అంతే.. ఆయన ఏదో తీశాడనే అనుకుందాం.. మీరు ఎందుకు అందులోకి తొంగి చూస్తున్నారు. నిజం చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మకి ఉన్నంత తెలివి.. రామ్ గోపాల్ వర్మకి ఉన్నంత జ్ఞానం.. అతని దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరా చూడలేదు. అతను గ్రేట్.. నేను ఆయనతో సినిమాలు చేయలేదు కాని.. అతని గురించి నాకు తెలుసు. అతని క్యారెక్టర్, పర్శనల్ విషయాల గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు. ఆయన దగ్గర కూర్చుంటే నాకు తెలుసుకోవడానికి ఎన్ని విషయాలు ఉన్నాయి.. నేను పంచుకోవడానికి ఎన్ని విషయాలు ఉన్నాయి అనేది