రియల్ ఎస్టేట్ స్కామ్: కోట్లు కోల్పోయిన నయనతార, రమ్యకృష్ణ?
ఒక అక్రమ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతిలో ప్రముఖ నటీమణులు , మోసపోయినట్టు సమాచారం. అలాగే, భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలీ టెండూల్కర్ కూడా అదే కంపెనీ చేతిలో మోసపోయారట. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ చేసిన స్కామ్ వల్ల ఈ ముగ్గురు సెలబ్రిటీలతో పాటు మరికొంత మంది ప్రముఖులు కోట్ల రూపాయలు కోల్పోయినట్టు తెలిసింది. ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ దేశ వ్యాప్తంగా ఉన్న వీవీఐపీలకు కొన్ని ఎకరాల స్థలాన్ని విక్రయించిందని ఆరోపణలు వస్తున్నాయి. మంచి వ్యవసాయ భూములను ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అక్రమంగా సొంతంగా చేసుకుని విక్రయించిందని సమాచారం. Also Read: ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ సేకరించిన భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీస్ నిర్మించడానికి ప్లాన్ చేశారట. అయితే, వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు రావడంతో ఈ నిర్మాణాలను ఆపేశారని సమాచారం. ఈ గొడవల్లో అసలు ఆ కంపెనీ సేకరించిన స్థలం వ్యవసాయ భూమి అని బయటపడింది. ఈ స్థలంలో భవనాలు నిర్మించడానికి ఆ కంపెనీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ భూములను ఎకరం లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన సదరు కంపెనీ సెలబ్రిటీలకు రూ. 10 కోట్లకు విక్రయించిందని ఆరోపణలు వస్తున్నాయి. Also Read: రమ్యకృష్ణ, నయనతార కోట్ల రూపాయలు నష్టపోయారనే వార్త ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రెవెన్యూ అధికారులు ఇప్పటికే సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి లీగల్ నోటీస్ పంపినట్టు తెలిసింది. అయితే, ఈ కంపెనీ చేతిలో తాము మోసపోయినట్టు నయనతార, రమ్యకృష్ణ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. వీళ్ల డబ్బులను ఆ కంపెనీ తిరిగి ఇచ్చిందా అనే విషయంలోనూ క్లారిటీ లేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని సమాచారం.
Comments
Post a Comment