రియల్ ఎస్టేట్ స్కామ్: కోట్లు కోల్పోయిన నయనతార, రమ్యకృష్ణ?

ఒక అక్రమ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతిలో ప్రముఖ నటీమణులు , మోసపోయినట్టు సమాచారం. అలాగే, భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలీ టెండూల్కర్ కూడా అదే కంపెనీ చేతిలో మోసపోయారట. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ చేసిన స్కామ్ వల్ల ఈ ముగ్గురు సెలబ్రిటీలతో పాటు మరికొంత మంది ప్రముఖులు కోట్ల రూపాయలు కోల్పోయినట్టు తెలిసింది. ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ దేశ వ్యాప్తంగా ఉన్న వీవీఐపీలకు కొన్ని ఎకరాల స్థలాన్ని విక్రయించిందని ఆరోపణలు వస్తున్నాయి. మంచి వ్యవసాయ భూములను ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అక్రమంగా సొంతంగా చేసుకుని విక్రయించిందని సమాచారం. Also Read: ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ సేకరించిన భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీస్ నిర్మించడానికి ప్లాన్ చేశారట. అయితే, వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు రావడంతో ఈ నిర్మాణాలను ఆపేశారని సమాచారం. ఈ గొడవల్లో అసలు ఆ కంపెనీ సేకరించిన స్థలం వ్యవసాయ భూమి అని బయటపడింది. ఈ స్థలంలో భవనాలు నిర్మించడానికి ఆ కంపెనీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ భూములను ఎకరం లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన సదరు కంపెనీ సెలబ్రిటీలకు రూ. 10 కోట్లకు విక్రయించిందని ఆరోపణలు వస్తున్నాయి. Also Read: రమ్యకృష్ణ, నయనతార కోట్ల రూపాయలు నష్టపోయారనే వార్త ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రెవెన్యూ అధికారులు ఇప్పటికే సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి లీగల్ నోటీస్ పంపినట్టు తెలిసింది. అయితే, ఈ కంపెనీ చేతిలో తాము మోసపోయినట్టు నయనతార, రమ్యకృష్ణ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. వీళ్ల డబ్బులను ఆ కంపెనీ తిరిగి ఇచ్చిందా అనే విషయంలోనూ క్లారిటీ లేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని సమాచారం.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ