దర్శకధీరుడు రాజమౌళికి కరోనా పాజిటివ్

సినిమా ఇండస్ట్రీలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. అలాగే, సమంత స్నేహితురాలు.. నటుడు సామ్రాట్ సోదరి శిల్పారెడ్డి కూడా కరోనా నుంచి కోలుకున్నారు. పలువురు టీవీ తారలకు కరోనా సోకింది. తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ‘బాహుబలి’ దర్శకుడు స్వయంగా వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. Also Read: ‘‘నా కుటుంబ సభ్యులకు, నాకు కొన్ని రోజులు క్రితం కాస్త జ్వరం వచ్చింది. దానికదే తగ్గిపోయింది. కానీ, మేం పరీక్ష చేయించుకున్నాం. ఫలితాలు ఈరోజు వచ్చాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు మేమంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాం. మాకు ఎలాంటి లక్షణాలు లేవు. అంతా బాగానే ఉన్నాం. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ల సూచనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వల్ల మేం ప్లాస్మా దానం చేయగలుగుతాం’’ అని రాజమౌళి పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి ‘RRR’ సినిమాతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ వల్ల తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం షూటింగ్‌కు అనుమతులు ఇచ్చినా రాజమౌళి మాత్రం RRR షూటింగ్‌ను తిరిగి ప్రారంభించలేదు. దీనికి కారణం కరోనా మహమ్మారే. ఈ భయానక పరిస్థితుల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ వంటి స్టార్లతో పనిచేయడం కష్టమని భావించి ప్రస్తుతానికి షూటింగ్‌ను వాయిదా వేసుకున్నారు. ఇలాంటి సమయంలో రాజమౌళితోపాటు ఆయన కుటుంబానికి కరోనా సోకడం బాధాకరం. Also Read:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ