Posts

Showing posts from May, 2020

సర్కారు వారి పాట.. రికార్డుల వేట: పండగ చేసుకుంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్

Image
సూపర్ స్టార్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్న ఆయన ఇప్పుడు ''తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నిన్న (మే 31) సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ మూవీ ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ అధికారికంగా టైటిల్ ప్రకటించింది చిత్రయూనిట్. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి 24 గంటల్లోనే రికార్డుల మోత మోగించింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే ఎక్కువ రీ ట్వీట్స్ చేయబడిన ప్రీ లుక్ పోస్టర్‌గా, అలాగే ఎక్కువ లైక్స్ సంపాదించిన ప్రీ లుక్ పోస్టర్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఎక్కువ మంది నెటిజన్స్ ఉపయోగించిన టైటిల్ ట్యాగ్ పరంగాను సత్తా చాటుతూ రికార్డుల 'వేలం పాట' మొదలైందని గంట కొట్టి చాటి చెప్పింది. ఇది చూసి సూపర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం చిగురించింది. పండగ చేసుకుంటూ సూపర్ స్టార్ సత్తా అంటే ఇదీ మరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Also Read: 'సర్కారు వారి పాట' ప్రీ లుక్ పోస్టర్, ఈ హవా చూస్తుంటే మరో భారీ బ్లాక్ బస్టర్ సినిమా మహేష్ సొంతం

సోషల్ మీడియాలో సినీ నటి ప్రగతి హల్ చల్.. నడుమును తిప్పుతూ..

Image
సినీ నటి ప్రగతి.. ప్రత్యేక పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తల్లిగా, పిన్నిగా, వదినగా, అత్తగా ఇలా అనేక రకాల పాత్రల్లో తనదైన స్టైల్లో నటించి అభిమానుల్ని మెప్పించింది. ఏ క్యారెక్టర్ ఇచ్చిన అందులో ఒదిగిపోతుంది. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. లాక్ డైన్‌తో ఇంటికే పరిమితమైన ప్రగతి ఫిట్ నెస్‌పై ఫోకస్ పెట్టింది. రోజుకు రకరకాల వర్క్ అవుట్స్ చేస్తోంది. తాజాగా ప్రగతి చేసిన ఇనస్టా పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రగతి ఆ మధ్య విజయ్ మాస్టర్ సినిమా సాంగ్ కి లుంగిలో తీన్మార్ స్టెప్పులు వేసి అలరించింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా కూడా మారింది. తాజాగా మరో వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసింది ప్రగతి. మ్యూజిక్‌కి తగ్గట్టు తన నడుముని తిప్పుతూ యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది. బీట్‌కు తగ్గట్టు నడుము తిప్పుతూ.. తనకెంత ఫిట్ నెస్ ఉందో బయటపెట్టింది. ప్రగతి వయసు 44 ఏళ్ళు. అయినా సరే యువ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని ఎనర్జీతో దూకుడుతో ముందుకెళ్తోంది ఈ ఆంటీ. ప్రగతి బాడీలో ఇంత రిథమ్ చూసి ఫాలోవర్స్ సైతం షాక్ అవుతున్నారు. అప్పుడప్పుడు ఫిట్నెస్ కి సంబంధించిన టిప్స్ తో ఆడియ

అఫీషియల్: కరణం మల్లీశ్వరి బయోపిక్ అనౌన్స్.. మరో పాన్ ఇండియా మూవీ!

Image
ప్రస్తుతం వెండితెరపై బయోపిక్స్ హవా నడుస్తోంది. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర, వారి వారి గొప్పతనాన్ని, సాధించిన విజయాలను వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు నేటితరం ప్రేక్షకులు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే బయోపిక్స్ రూపొందించేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ అనౌన్స్ చేశారు కోన వెంకట్. ఈ రోజు (జూన్ 1) క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పుట్టిన‌రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలుపుతూ అఫీషియల్ ప్రకటన చేశారు. ఒలింపిక్స్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. Also Read: అయితే ఈ చిత్రంలో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది మాత్రం ప్రకటించకపోవడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది.ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోయిన్‌ని తీసుకుంటారా? లే

పూరి కథ కోసం ఎదురుచూస్తున్నా.. మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Image
మహేష్ బాబు- క్రేజీ కాంబోలో సినిమా రావాలని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు ''పోకిరి, బిజినెస్‌మేన్'' సూపర్ డూపర్ హిట్స్ సాధించడంతో మళ్ళీ ఇప్పుడు అందరి చూపు ఈ కాంబోపై పడింది. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే మరి కొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల కోరిక నెరవేరుతుందేమో అనిపిస్తోంది. నిన్న విడుదలైన మహేష్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ 'సర్కార్ వారి పాట' చూసి పూరి జగన్నాథ్ అభినందించడం, మరోవైపు కాసేపు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడిన .. పూరితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం సూపర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది. నిన్న (మే 31) సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్‌స్టా వేదికగా అభిమానులతో లైవ్ చాట్ చేశారు మహేష్ బాబు. ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? దానికోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం అని అడగగా మహేష్ ఆసక్తికరంగా స్పందించారు. ఖచ్చితంగా పూరి దర్శకత్వంలో సినిమా చేస్త

నీ ఎనర్జీ సూపర్.. మేనల్లుడిపై మహేష్ ‘జుంబారే’ ప్రశంస

Image
సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శకుడు. అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్య, అర్చనా సౌంద‌ర్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Also Read: ఇప్పటికే ఈ సినిమా నుంచి అశోక్ గల్లా లుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాలోని సాంగ్ టీజర్‌ను వదిలారు. కృష్ణ జ‌న్మదినాన్ని పుర‌స్కరించుకొని ఆదివారం (మే 31) ఈ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. నిజానికి అది ‘య‌మ‌లీల’ చిత్రంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ చేసిన సూప‌ర్ హిట్ సాంగ్ ‘జుంబారే’కు రీమిక్స్‌. లెజండ్ అయిన తన తాత‌య్యను ఈ పాట‌లో అశోక్ గ‌ల్లా ఇమిటేట్ చేసిన విధానం అమితంగా ఆక‌ట్టుకుంటోంది. కాస్ట్యూమ్స్‌, సెట్స్ పాట‌కు స‌రిగ్గా స‌రిపోయాయి. ఆ పాట‌లో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ సైతం మెర‌వ‌డంతో ఈ ప్రత్యేక‌మైన రోజు సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు ప‌ర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన‌ట్లయింది

అప్పటికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాలేదు: ఆసక్తికర విషయాలు చెప్పిన ఆలీ

Image
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన స్నేహితుడు, జనసేన అధినేత పవర్ స్టార్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆదివారం ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడిన ఆలీ.. పవన్ కళ్యాణ్‌తో తన పరిచయం గురించి, ఆయనతో ఏర్పడిన బంధం గురించి చెప్పుకొచ్చారు. తాను చిరంజీవి కోసం ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేవారని.. ఆయనతో అలా పరిచయం ఏర్పడిందని చెప్పారు. అప్పటికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాలేదని అన్నారు. ‘‘నేను అన్నయ్య కోసం వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండేవారు. ఆయన్ను కలిసేవాడిని. అప్పటికి ఆయన ఇండస్ట్రీలోకి ఎంటర్ కాలేదు. ‘అన్నయ్య ఇప్పుడే వచ్చారు.. మీరు కూర్చోండి.. కాఫీ తాగుతారా, టీ తాగుతారా’ అని సరదాగా కబుర్లు మాట్లాడేవారు. అన్నీ సినిమా కబుర్లే. ఏం సినిమాలు చేస్తున్నారు అని అడిగేవారు. ఆ తరవాత ఆయన ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ సినిమా చేశారు. ఆ ఒక్క సినిమా తప్ప ఆ తరవాత ఇంచుమించుగా అన్ని సినిమాల్లో నేను నటించాను. Also Read: ఇటీవల ‘అజ్ఞాతవాసి’లో కూడా నేను నటించలేదు. ఆయన హీరోగా చేసిన 25 సినిమాల్లో 23 సినిమాల్లో నేను నటించాను. మొదట ‘గోకులంలో సీత’, తరవాత ‘సుస్వాగతం’, తరవాత ‘తొలిప్రేమ’ సినిమాలో

గౌతమ్ కాబోయే హీరో.. రాజమౌళితో కచ్చితంగా సినిమా చేస్తా: మహేష్ బాబు చెప్పిన ఆసక్తికర విషయాలు

Image
తన తండ్రి నటశేఖర కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (మే 31న) తన కొత్త సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ‘సర్కారు వారి పాట’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మహేష్. ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరశురామ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జి మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ టైటిల్ పోస్టర్ చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే, ఆదివారం సాయంత్రం మహేష్ బాబు తన అభిమానులను మరోసారి ఫిదా చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సుమారు గంటపాటు ఈ ఛాట్ ప్రోగ్రాం సాగింది. అభిమానులు చాలా ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. వాటికి అంతే ఆసక్తికరంగా మహేష్ బాబు సమాధానాలు చెప్పారు. గౌతమ్ హీరో అవుతాడా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘‘అతను కోరుకుంటున్నాడని నేను భావిస్తున్నాను.

హైదరాబాద్‌లో వర్షం.. ఫాం హౌస్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న ప్రకాష్ రాజ్

Image
హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. ఆదివారం మధ్యాహ్నం నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన నగర ప్రజలకు కాస్త ఉపసమనం లభించింది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ ఏర్పడినప్పటి నుంచీ తన ఫ్యామిలీతో హైదరాబాద్‌లోని ఫాం హౌస్‌లో ఉంటున్నారు. ఎంతో మంది వలస కూలీలకు తన ఫాం హౌస్‌లోనే ఆశ్రయం ఇచ్చారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సాయంతో వలస కూలీలందరినీ వారి స్వస్థలాలకు పంపారు. ఇక అప్పటి నుంచీ తన భార్య పోనీ ప్రకాష్, కుమారుడు వేదాంత్‌తో ఫామ్ హౌస్‌లో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. Also Read: ఫాం హౌస్‌లో తమ సంతోష గడియలకు సంబంధించి ప్రకాష్ రాజ్ భార్య పోనీ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెడుతూనే ఉన్నారు. ఫాం హౌస్‌లోకి నెమళ్లు రావడం, తమ కుమారుడు వేదాంత్ మామిడి కాయల వ్యాన్ ఎక్కడం, తాను మట్టి ప్రమిదలు చేయడం, ఇలా చాలా ఫొటోలను షేర్ చేశారు. తాజాగా ఫాం హౌష్‌లో తన భర్తతో కలిసి కూర్చొని వర్షాన్ని ఆస్వాదిస్తోన్న ఫొటోను పోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వర్షాకాలానికి స్వాగతం అని ఈ ఫొటోకు పోనీ క్యాప్షన్ పెట్టారు. కాగా, పోనీ స్వతహాగా కొరియోగ్రాఫర్. ఆమెను ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి చేసు

సూపర్ కృష్ణపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Image
గత కొన్ని రోజులుగా అనేక విషయాలపై స్పందిస్తూ వస్తున్న మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు తాజాగా కృష్ణ బర్త్ డే సందర్భంగా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన సూపర్ స్టార్ కృష్ణకు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ గురించి నాగబాబు పలు విషయాలు తెలిపారు. 'నా అభిమాన నటుల్లో ఒకరైన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని విషయాలను ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. మెగాస్టార్‌ శకం ప్రారంభం కాకముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాల్లా అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణగారు ఉండేవారు. నా అభిప్రాయం ప్రకారం కృష్ణ గారు ట్రెండ్ సెట్టర్‌' అని అన్నారు నాగబాబు. అంతేకాదు 'మొదటి 70 ఎంఎం, డీటీఎస్, సినిమాస్కోప్, ఈస్ట్‌మన్‌ కలర్, స్పై సినిమాలు ఆయనవే. ఆయన మంచి మనసు ఉన్న వ్యక్తి.. చాలా మందికి సాయం చేశారు' అని నాగబాబు ట్వీట్ చేశారు. ఆయనను ఎప్పుడూ మరిచిపోలేం. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటుూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు నాగబాబు. ఇక పోతే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపిన వ

‘సర్కారు వారి పాట’ నీకు మరో మైలురాయి కావాలి: పూరి జగన్నాథ్

Image
ప్రతి సంవత్సరం తన తండ్రి నటశేఖర కృష్ణ జన్మదినం పురష్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన కచ్చితంగా ఒక అప్‌డేట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈసారి తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ను ప్రకటించారు. టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్ కాస్త పొడవాటి జుట్టు, ఇప్పుడిప్పుడే వచ్చిన గెడ్డం, మెడ మీద రూపాయి బిల్ల టాటూ, చెవికి రింగుతో మునుపెన్నడూ చూడని మాస్ లుక్‌తో కనిపించారు. ఈ పోస్టర్‌లో మహేష్ లుక్‌ను పూర్తిగా చూపించకపోయినా.. ఈ హాఫ్ మాస్ లుక్‌ను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ ఇండస్ట్రీలోని ఒక టాప్ హీరోతో పనిచేయడం ఇదే తొలిసారి. మహేష్‌తో సినిమా తన కల అని.. ఆ కల నెరవేరుతోందని ఆయన అంటున్నారు. అయితే, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. పరశురామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. Also Read: ‘‘నీ చిన్న తనం నుంచి నీ ప్ర

అనసూయ పీరియడ్స్ స్టోరీ: ఫస్ట్ పీరియడ్ సమయంలో! చెబితే గానీ అర్థం కావంటూ ఓపెన్ కామెంట్స్

Image
ప్రతీ అమ్మాయి జీవితంలో పీరియడ్స్ (నెలసరి) సమయం అనేది ఎంతో కీలకమైన అంశం. ఈ సృష్టికి మూలం కూడా అదే. అలాంటి పీరియడ్స్ గురించి మాట్లాడటానికి, బయట చెప్పుకోవడానికి సిగ్గు పడుతూ అదేదో నేరం అన్నట్లుగా గోప్యంగా ఉంచుతుంటారంతా. కానీ జబర్దస్త్ బ్యూటీ మాత్రం.. తాను అందరిలో బిన్నం అని నిరూపిస్తూ పీరియడ్స్ స్టోరీ చెప్పి ఆ విషయాలపై ఓపెన్ అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ధైర్యంగా ఓ వీడియో షేర్ చేసి సంచలనం సృష్టించింది. దాదాపు 7 నిమిషాలున్న ఈ వీడియోలో పీరియడ్స్ గురించి నిర్మొహమాటంగా మాట్లాడింది అనసూయ. ఈ మేరకు తన మొదటి పీరియడ్ అనుభవాలను సైతం పంచుకుంది. మే 28న అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్‌కు సంభందించి ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఈ విషయాలపై స్పందించింది జబర్దస్త్ బ్యూటీ అనసూయ. Also Read: పీరియడ్స్ సమయంలో మహిళలకి సాయం అవసరమని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం సరైందికాదని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ సమాజంలో చాలా చోట్ల పీరియడ్స్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయని, పీరియడ్స్ అనేది తప్పు కాదని.. అమ్మాయిలు వాటి గురించి మాట్లాడటానికి భయపడకూడని అభిప్రాయ

అవసరాలు ఎక్కడికైనా తీసుకెళ్తాయి.. అయినా తప్పు చేయనపుడు భయమెందుకు: రామ్ గోపాల్ వర్మ

Image
ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ తన అభిప్రాయాలు, ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేయడం స్టైల్. తనకేదనిపిస్తే అది మీడియా ముందే నిర్మొహమాటంగా బయటపెట్టే ఆయన.. ఈ కరోనా పరిస్థితుల్లో మరింత హల్చల్ చేశారు. కరోనా వైరస్‌పై తనదైన కోణంలో కామెంట్స్ చేసిన వర్మ.. అదే కరోనా వైరస్‌పై మూవీ కూడా రూపొందించారు. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండగా ఈ మూవీ ఎలా షూట్ చేశారు? ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించారా? అనే దానిపై జనాల్లో నెలకొన్న అనుమానాలను తెరదించేలా తాజా ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు రామ్ గోపాల్ వర్మ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని, రూల్స్ ఫాలో అవుతూనే కరోనావైరస్ సినిమాను రూపొందించడం జరిగిందని అన్నారు వర్మ. తాను తీసుకొన్న నిర్ణయంలో ఎలాంటి లొసుగులు లేవని ఆయన అంటున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ఏ యూనియన్ సభ్యుడిని షూటింగ్ కోసం తీసుకోలేదని, ఎవరినీ సంప్రదించలేదని ఆయన తెలపడం విశేషం. అయితే తమ పరిధిలోనే అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాను షూట్ చేయడం జరిగిందని వర్మ తెలిపారు. Also Read: నిబంధనలకు అనుగుణంగా నడచుకొన్నప్పుడ

తేనెటీగల దాడి.. తృటిలో తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

Image
దోమకొండ సంస్థానం వారసుడు, రిటైర్డ్ ఐఏఎస్ కామినేని ఉమాపతిరావు అత్యక్రియల్లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడి నుంచి చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన సహా ఇతర కుటుంబ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. కామినేని ఉమాపతిరావు అనారోగ్యంతో ఈనెల 27న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన ఉపాసన కొణిదెల తాతయ్య. ఉమాపతిరావు అంత్యక్రియలను ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ మండలం కోటలో నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. అయితే, అంత్యక్రియలకు పార్థివదేహాన్ని తీసుకుళ్తోన్న సమయంలో అక్కడే ఓ చెట్టుపై నుంచి తేనేటీగలు దాడికి దిగాయి. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది కామినేని కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి ఫ్యామిలీని వెంటనే ఇంటిలోకి తీసుకెళ్లారు. తేనెటీగలను అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన సుక్షితంగా తప్పించుకున్నారు. వీరంతా గాయపడ్డారని మొదట వార్తలు వచ్చినా వాటిలో నిజం లేదు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతో చిరంజీవి ఫ్యామిలీ సురక్షితంగా బయటపడింది. కాగా, తేనెటీగలు కుట్టడంతో నలుగురు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. తే

కృష్ణ పాటకు టీడీపీ ఎంపీ కొడుకు స్టెప్పులు... బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్

Image
కృష్ణ 77వ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు కుటుంబసభ్యులు రకరకాలుగా విషెస్ చెబుతున్నారు. తాజాగా అల్లుడు సుధీర్ బాబు కృష్ణ నటించిన అల్లూరి సీత రామరాజు సినిమాలో డైలాగ్స్‌తో అదరగొట్టాడు. తాజాగా 'జుంబారే..జుజుంబ‌రే' పాటకు మ‌హేశ్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ కుమారుడు గ‌ల్లా అశోక్ డ్యాన్స్ చేశాడు. ఈ రోజు సందర్భంగా ఈ పాట ప్రొమోను విడుదల చేశారు. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమాలో ఆయన నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అచ్చం కృష్టలా అశోక్ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించనున్నాడు.ఇందులో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన య‌మ‌లీల సినిమాలో 'జుంబారే' పాటకు ప్రత్యేకంగా కృష్ణ డ్యాన్సుతో అలరిస్తారు. ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం పాడగా, సాహిత్యం జొన్న‌విత్తుల అందించారు. ఆ పాట‌లో కృష్ణ సరసన పూజా డ్యాన్స్ చేస్తుంది. కాగా, నటిస్తోన్న కొత్త సినిమాలో జ‌గ‌ప‌తి బాబు, న‌రేశ్‌, స‌త్యా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చిత్రీకరణ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఈ సందర్బంగా గల్లా అజయ్ ట్వీట్ కూడా చేశారు. తాత నా ఎవర్ గ్రీన్ లెజెండ్.నాతో పాటు వే

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ఆరుబయటే అతనితో రొమాన్స్.. అబ్బో! ఆ హీరోయిన్ వేషాలు చూస్తే..

Image
హీరోయిన్స్ అన్నాక డేటింగ్ వ్యవహారాలు, బ్రేకప్ సంగతులు, ఆ వెంటనే మరో వ్యక్తితో రొమాంటిక్ టూర్స్ అనేవి కామన్. కానీ డేటింగ్ చేసి ఏకంగా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడం, పైగా ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించడం మాత్రం చాలా అరుదైన విషయం. అయితే ఆ పని చేసి చూపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో బ్యూటీ .. మరోసారి ప్రియుడితో ఆరుబయట రొమాన్స్ చేస్తున్న ఫోటో షేర్ చేసి సంచలనం సృష్టించింది. రీసెంట్‌గా ఓ బిడ్డకు తల్లైన అమీ.. బహిరంగంగా ఇలా రొమాన్స్ చేయడం, పైగా ఆ రొమాంటిక్ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాట్ ఇష్యూగా మారింది. హాట్ ఫొటోలు, వీడియోలు, రొమాన్స్‌కు సంబంధించిన పోస్టులు, బోల్డ్ స్టేట్‌మెంట్లు పోస్ట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే అమీ జాక్సన్.. నాలుగు గోడల మధ్యలో చేసుకునే శృంగార సన్నివేశాన్ని ఆరుబయట పెట్టేసింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమాయణం కొనసాగిస్తున్న అమీ, అతనితో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తోంది. పైగా అందుకు సంబంధించిన పిక్స్ పబ్లిక్‌లో పెట్టేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అమీ జాక్సన్ పోస్ట్ చేసిన ఫ

నా అభిమాన సూపర్ స్టార్... కృష్ణ బర్త్ డే పై రోజా స్పెషల్ ట్వీట్

Image
బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సినీ నటి , వైసీపీ ఎమ్మెల్యే రోజా కృష్ణకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. ‘ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా పేరు గాంచి నాలాంటి ఎంతో మంది నటులకు స్ఫూర్తిగా నిలిచిన నా అభిమాన సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు’అంటూ రోజా ట్వీట్ చేశారు. రోజాతో పాటు టాలీవుడ్‌కు చెందిన అనేక ప్రముఖులు కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కుమారుడు మహేష్ బాబుతో పాటు, మెగాస్టార్ చిరంజీవి, బండ్ల గణేష్, టాలీవుడ్ దర్శకులు విషెస్ తెలిపారు. కృష్ణ హీరోగా చేసిన మొట్ట మొదటి సినిమా ‘తేనే మనసులు’. ఆ సినిమా నాటికే ఆయనకు ఇందిరతో పెళ్లి అయ్యింది. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించారు. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్‌బాండ్ తరహా సినిమా. కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. కృష్ణ, ఇందిరలకు ఇ

ఓ సారి కృష్ణ గారు కార్ ఎక్కించుకొని.. ఆ సంఘటన ఎన్నటికీ మరిచిపోలేను: పూరి జగన్నాథ్

Image
ఈ రోజు (మే 31) సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చిత్రసీమలోని ప్రతి ఒక్క దర్శకుడు, నిర్మాత, నటీనటులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ టాలీవుడ్ లెజెండ్‌తో తమ తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డాషింగ్ డైరెక్టర్ ఓ ట్వీట్ చేస్తూ అప్పట్లో కృష్ణ గారితో ఉన్న మధుర జ్ఞాపకాన్ని అందరికీ తెలియజేశారు. కృష్ణ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ''పాతికేళ్ల క్రితం నేను తీసిన ఫోటో ఇది. ఒకసారి కృష్ణ గారు నన్ను కార్ ఎక్కించుకుని తీసుకెళితే సంగీత్‌లో సినిమా కూడా చూసాం. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం క్యూలో నిలుచునే వాడిని, కానీ ఆ రోజు ఆయన పక్కన కూర్చోవడం అస్సలు మరిచిపోలేను. కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ గ్రేట్ లెజెండ్ ఆరోగ్యంగా కలకాలం జీవించాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తూ.. పూరి- మహేష్ కాంబో మరోసారి రిపీట్ కావాలని కోరుతున్నారు. మహేష్ బాబు 28వ సినిమా మీదే కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ చేసిన ఈ ట్వీట్‌ని

సాహసానికి మారు పేరు.. కృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన చిరంజీవి

Image
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ 77వ బర్త్ డే నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మధ్యే సోషల్ మీడియాలోకి వచ్చిన మెగాస్టార్ .. యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతీ సందర్భంపై ఆయన స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి..కృష్ణకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. కృష్ణతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ స్పెషల్ విషెస్ అందించారు. కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్‌. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించారు. కృష్ణ హీరోగా చేసిన మొట్ట మొదటి సినిమా ‘తేనే మనసులు’. ఆ సినిమా నాటికే ఆయనకు ఇందిరతో పెళ్లి అయ్యింది. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుత

కృష్ణ డైలాగులతో సుధీర్ బాబు వీడియో.. మామను దించేశాడు! వందేమాతరం అంటూ ఎమోషనల్ కిక్

Image
నేడు (మే 31) టాలీవుడ్ నటశేఖరుడు, సూపర్ స్టార్ 77వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. ట్విట్టర్‌లో కృష్ణ బర్త్ డే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరపడిపోయిన ఆయన ఇన్నో విజయాలందుకొని అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు. పౌరాణిక, జానపద, సాంఘీక, జేమ్స్‌బాండ్, కౌబాయ్ ఇలా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల ఏకైన నటుడిగా ఫేమస్ అయిన కృష్ణకు ఆయన అల్లుడు హీరో స్పెషల్ విషెష్ పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కిక్ ఇచ్చాడు. డబ్స్ ఫర్ లెజెండరీ సీన్ అంటూ కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' సినిమాలోని ఓ ఎమోషనల్ డైలాగ్ చెబుతూ ఆ వీడియో షేర్ చేశాడు సుధీర్ బాబు. బ్రిటిషు సైన్యం ఎదుట అల్లూరి సీతారామరాజుగా కృష్ణ చెప్పిన భావోద్వేగపూరిత డైలాగులను అచ్చం అలాగే చెప్పి వావ్! అనిపించాడు. 'అక్కడ కాదురా.. ఇక్కడ కాల్చు.. వందేమాతరం వందేమాతరం వందేమాతరం' అంటూ ఆకర్షించాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుధీర్ బాబు ఇటీవలే V సినిమాను పూర్తిచేశాడు. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌

మహేష్ మెడ మీద రూపాయి బిల్ల.. సర్కార్ వారి పాట లుక్ అదుర్స్

Image
మహేష్ బాబు షూరూ అయ్యింది. మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించాడు. తన కొత్త సినిమా సర్కార్ వారి పాట మరో బ్లాక్ బస్టర్ మూవీ హ్యాట్రిక్ కొట్టేందుకు వస్తుందంటూ మహేష్ ట్వీట్ చేశాడు. సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో మహేష్ లుక్ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. చెవి పోగు, మెడపై రూపాయి కాయిన్ టాటూతో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో మహేష్ లుక్ కేక పెట్టాలా కనిపిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం తండ్రి పుట్టిన రోజున మహేష్ తన అభిమానులకు శుభవార్త అందించాడు. తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా అందించాడు. మహేష్ బాబు తన 27వ సినిమా అయిన ‘సర్కార్ వారి పాట’ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ‘గీత గోవిందం’ ఫేం పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ మహేశ్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త చెప్పారు. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియలేదు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ పనిచేస్తున్నారు. అల వైక

అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్.. సూపర్ స్టార్‌ కృష్ణకి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్

Image
తెలుగు సినిమా చరిత్రలో అలుపెరగని సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సూపర్ స్టార్ ఈ రోజు (మే 31) తన 77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికలపై పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పెద్దలు, దర్శకులు, నిర్మాతలు, హీరోలు, నటీనటులు సహా అభిమానులు అందరూ పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు 'హ్యాపీ బర్త్ డే కృష్ణ గారు' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. కాగా సందర్భంగా ఆయనకు స్పెషల్ విషెస్ చెబుతూ విలువైన సందేశాన్ని పోస్ట్ చేశారు మెగాస్టార్ . ''కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు. నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయ భాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు'' అని పేర్కొంటూ ఆయనతో దిగిన ఓ అపురూమైన పిక్ పంచుకున్నారు చిరంజీవి. చిరంజీవి పోస్ట్ చేసిన ఈ ట్వీట్ చూసి మెగా అభిమాన వర్గాలు పెద్ద ఎత్తున స

HappyBirthDay Krishna: సుదీర్ఘ సినీ ప్రస్థానం.. ఎన్నెన్నో మలుపులు.. తెలుగు సినీ చరిత్రలో!!

Image
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు (మే 31) తన 77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన, ఆయన సినీ కెరీర్‌కి సంబంధించిన ముఖ్య విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలుపెరగని సినీ ప్రస్థానం కొనసాగిస్తున్న కృష్ణ జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. చిన్న నటుడిగా ఆరంగేట్రం చేసి సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం అని చెప్పుకోవచ్చు. 1942 సంవత్సరం మే 31న జన్మించారు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1965లో హీరోగా వెండితెరపై మెరిశారు. ఆయన తొలి సినిమా ‘తేనె మనసులు’. తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై 55 ఏళ్లు పూర్తిచేసుకున్న ఆయన తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ళు అధిగమించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. గూఢచారి 116 మూవీ కృష్ణ కెరీర్‌కి గట్టి పునాది వేసింది. సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు దోహదపడింది. అలా పడిన పునాదిపై నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌ కొనసాగిస్తూ 340 పైచిలుకు సినిమాల్లో ప్రధా

వలస కార్మికుల కోసం విమానం.. సోనూ సూద్ ‌పై సీఎం ప్రశంసలు

Image
కరోనా లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు వెతలు పడుతున్న వేళ వారి పాలిట దైవంలా దిగివచ్చాడు... ప్రముఖ స్టార్ సోనూ సూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించిన.. సోనూ నిజ జీవితంలో మాత్రం నిజంగా హీరో అయ్యాడు. ఆయన వలస కార్మికుల కోసం చేసిన సాయం ఏ ఒక్క భారతీయుడు మరిచిపోలేనిది. సొంత రాష్ట్రాలకి వెళ్ళేందుకు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఎందరో వలస కార్మికులు కాలి బాట పట్టారు. వీరిని చూసి చలించిన తన శక్తివంచన మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాడు. వేలాది మంది వలస కార్మికులని సొంత గూటికి చేర్చారు. ఇటీవల కేరళలో చిక్కుకుపోయిన ఒడిశా యువతులను ప్రత్యేక ఫ్లైట్ ద్వారా స్వస్థలానికి చేర్చారు. కేరళలోని ఎర్నాకుళంలో కుట్టుమిషన్ల కంపెనీలో పనిచేస్తున్న 177 మంది మహిళలు తమ సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లాలంటూ సోనూసూద్‌ను సాయం కోరారు. ఆ విషయం తెలిసిన వెంటనే వారి కోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు. తాజాగా సోనూ సూద్ చేసిన ఈ పనిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆపత్కాలంలో సోనూ చేస్తున్న సేవలకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా సోనూ సూద్‌పై ప్రశంసల వర్షం కురిప

మీరే నా సూపర్ స్టార్.. కృష్ణ పుట్టినరోజున మహేష్ బాబు ట్వీట్

Image
టాలీవుడ్ నటశేఖరుడు, ఘట్టమనేని ఇవాళ 77వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అభిమానుల్ని అలరించారు. తెలుగు చలన చిత్ర సీమలో గ్లామరస్‌ నటుడు కృష్ణ. వెండితెరపై మెరిసిన అందగాడు. అలాంటి టాలీవుడ్ స్టార్ కృష్ణకు కళాప్రపూర్ణ పురస్కారం వరించింది. తెలుగు చలన చిత్ర సీమకు ఆయన చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించింది.ఇవాళ కృష్ణ బర్త డే సందర్భంగా ఆయన తనయుడు మహేష్ బాబు, కోడలు నమ్రత, మనవరాలు సితారతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్ డే శుభాకాంక్షలు నాన్న.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఎప్పటికీ నా సూపర్ స్టార్ అంటూ చేశారు. తన తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటోని కూడా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో కృష్ణ ఫోటో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే తాత గారు.. లవ్ యూ వెరీ మచ్.. ఈ రోజు మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని విషెస్ తెలిపింది. ఈ రోజు సందర్భంగా మహేష్ 27వ చిత్రం లాంచ్ కానుంది. ప

Pushpa : యాంకర్ సుమా మరో ప్రయోగం! అల్లు అర్జున్ సిస్టర్ క్యారెక్టర్ గురించి క్లారిటీ..

Image
సుమా అంటే ఎంటర్‌టైన్మెంట్.. ఎంటర్‌టైన్మెంట్ అంటే సుమా. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఆ క్రేజ్‌తో.. తన పేరు మీదే ‘సుమక్క’ యూట్యూబ్ ఛానల్ పెట్టి.. రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ.. లాక్ డౌన్‌లో కూడా.. అభిమానులకి వినోదాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సరికొత్త ఐడియాలతో వీడియోలు చేస్తూ.. ‘వాట్ కెన్ ఐడియా సుమాజీ’ అనిపించుకుంటోంది. మొన్నటికి మొన్న.. ‘లేటెస్ట్ మీమ్స్‌పై రివ్యూ’ అంటూ.. కొన్ని ఫన్నీ మీమ్స్ చదివి వీడియో చేసి కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు తన అభిమానులతో ముచ్చటించిన వీడియో ఒకటి వదిలి మరో ప్రయోగం చేసింది. సుమ్మక్క యూట్యూబ్ ఛానల్‌కి సబ్‌స్ట్రైబ్ చేసిన అభిమానులు కొందర్ని సెలెక్ట్ చేసుకుని, వారితో వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుంది. ‘అబ్బా.. చాలా రోజుల తర్వాత మనుషులతో మాట్లాడబోతున్నాను.. చాలా హ్యాపీగా ఉంది’ అంటూ అందరితో మాట్లాడుతూనే.. ‘ఈ లాక్ డౌన్‌లో ఏం మిస్ అయ్యారు? ఏం నేర్చుకున్నారు? మీరు లాక్ డౌన్‌లో ఎలా ఉన్నారు?’ అంటూ రకరకాల ప్రశ్నలు వేసి కామెడీ చేస్తేనే.. చూసే ఆడియన్స్‌కి ఫుల్ జోష్ క్రియేట్ చేసింది సుమక్క. మధ్య మధ్యలో సుమా ఆంటీ అని పిలిచేవాళ్లు కొందరైతే.. ‘మీ

బాలకృష్ణ కామెంట్స్‌పై వర్మ రియాక్షన్.. రెండు మూడు రోజులే అరవడం

Image
టాలీవుడ్‌ పెద్దలపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంతో నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ తయారైంది పరిస్థితి. ఫ్యాన్స్ రెండు గ్రూపులుగా విడిపోయి ఒకర్నొకరు దూషించుకుంటున్నారు. ఈ ఇష్యూపై స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాట్లాడుతూ.. ‘లాక్ డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.. నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ పట్టింకోను. నా లైఫ్‌లో ఇప్పటి వరకూ ఎవరికీ ఛారిటీ ఇవ్వలేదు. డైరెక్ట్‌గా నాతో పనిచేస్తున్న వారిని మాత్రమే నేను చూస్తా.. చేయాలనిపిస్తే సాయం చేస్తా.. అంతేతప్ప జనరల్‌గా అందర్నీ చూడను. ఛారిటీ అంటారు అది ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు అనేది ఎవరికీ తెలియదు. అందుకే వాటిపై నాకు నమ్మకం లేదు. చేయాలనిపిస్తే.. నేనే డైరెక్ట్‌గా చేస్తా. బాలయ్య కామెంట్స్‌పై స్పందిస్తూ.. ఆయన ఏదో కామన్‌‌గా మాట్లాడితే.. మీడియా పెద్ద బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసి చూపించింది. బాలయ్య మాటల్లో అంతగా పట్టించుకోవాల్సిన విషయం ఉందని అయితే నేను అనుకోవడం లేదు. ఆయన కామెంట్ చేయడం ద్వారా ఏమైంది?? రెండు మూడు రోజుల అ

తాప్సీ ఇంట్లో విషాదం.. శూన్యాన్ని వదిలి వెళ్లిందంటూ భావోద్వేగ పోస్ట్

Image
బాలీవుడ్ సంచలన నటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం నాడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు తాప్సీ. గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఒక ఫోటోను పోస్ట్ చేసిన తాప్సీ.. ‘కుటుంబంలో పాత తరాల వారు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు తాప్సీ. తెలుగులో మంచు మనోజ్ ‘ఝమ్మంది నాదం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన తాప్సీ.. వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ఫెక్ట్, వీరా, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో వంటి చాలా చిత్రాల్లో నటించినప్పుటికీ ఆమెలోని నటికి పనిచెప్పే పాత్ర ఒక్కటీ పడకపోవడంతో బాలీవుడ్‌కి షిప్ట్ అయ్యింది. బాలీవుడ్‌లో పింక్, ఘాజీ, తాపడ్ వంటి చిత్రాల్లో ప్రయోగాత్మక పాత్రలు చేసి సంచలన నటిగా గుర్తింపుతెచ్చుకుంది. తెలుగు, హిందీతో పాటు తమిళ్‌లోనూ పలు చిత్రాలు చేసింది తాప్సీ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన తరువాత తాప్సీ కెరియర్ ఊపందుకుంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది తాప్సీ. ఇక వివాదాల్లోనూ ముందుంటే తాప్సీ.. దర్శకేంద్రుడు కె. రాఘంవేంద్రరావు హీరోయిన్స్ బుడ

Balakrishna: బాలయ్య రూ. 6 కోట్లు ఇచ్చి తన పేరు వద్దన్నారు, చిరంజీవితో వ్యవస్థ నిర్వీర్యం: నిర్మాత సంచలన కామెంట్స్

Image
సినీ పెద్దల మీటింగ్ ఫిల్మ్ ఛాంబర్‌లో కాకుండా కొంతమంది వ్యక్తులతో ఇంట్లో జరపడంపై ఫైర్ అయ్యారు నిర్మాత ప్రసన్న కుమార్. గతంలో మీడియాతో సమస్య వచ్చినప్పుడు చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిల్మ్ ఛాంబర్ వద్దే నిరసన తెలిపారని ఆయన గుర్తు చేస్తూ చిరంజీవి నిర్వహించిన మీటింగ్‌ను తప్పు పట్టారు. ప్రసన్న కుమార్ మాట్టాడుతూ.. ‘ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఫిల్మ్ ఛాంబర్ ఉంది.. కొన్ని తరాలుగా ఇక్కడే మీటింగ్‌లు జరుగుతున్నాయి. ఆరోజు పవన్ కళ్యాణ్‌కి సమస్య వచ్చినప్పుడు మీటింగ్ ఇంట్లో పెట్టుకోలేదు.. ఛాంబర్‌కే వచ్చారు.. ఆయన వెనుకు నాగబాబు ఇతర మెగా హీరోలంతా ఛాంబర్‌కే వచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ ఆరోజు గుర్తుకు వచ్చి ఈరోజు పక్కనపెట్టి మీ ఇంట్లోనే చర్చలు జరుపుకుంటే ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు?? ఈరోజు చిరంజీవి, ఇండస్ట్రీకి రెండు కళ్లు. ఏ కన్నుని పక్కన పెట్టినా తప్పు. ఇండస్ట్రీలో అందర్నీ కలుపుకుని పోవాలి. ఈరోజు ఇండస్ట్రీలో క్రిష్ణ, క్రిష్ణంరాజు, మోహన్ బాబు ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్లందర్నీ కలుపుకుని పోవాలనే బాధ్యతని విస్మరించి ప్రైవేట్‌గా మీటింగ్‌లు పెట్టడం తప్పు. కరోనా క్రైస

Allu Arjun: అల్లు బ్రదర్స్ విడిపోయారా? ఈ సెలబ్రేషన్స్ చూసి ఆ మాట అనగలరా?

Image
ఈరోజు (మే 30) అల్లు వారి చిన్నబ్బాయి పుట్టిన రోజు. దీంతో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు. తన అన్నలు , అల్లు బాబీలతో పాటు తన వదినలు, పిల్లలు, అల్లు అరవింద్ సతీ సమేతంగా ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. స్వయంగా బన్నీ భార్య స్నేహా రెడ్డి మరిది కోసం కేక్ తయారుచేసి తీసుకువచ్చిందని తెలియజేస్తూ.. ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు అల్లు శిరీష్. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు శిరీష్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవలే సొంతంగా సెపరేట్ హౌస్ కొన్న అల్లు శిరీష్ ఆ కొత్త ఇంటికి షిప్ట్ అయ్యాడు. అయితే ఇటీవల అల్లు వారి అబ్బాయిలకు ఆస్తి పంపకాలు జరిగాయని వార్తలు రాగా.. ఆ పంపకాల్లో భాగంగా అల్లు శిరీష్ తన తట్టా బుట్టా చేత పట్టుకుని బయటకు వెళ్లిపోయాడు.. ఒంటరి వాడు అయిపోయాడు.. అయ్యో పాపం.. అంటూ ప్రముఖ వెబ్ సైట్స్‌లో కథనాలు వచ్చాయి. ఇష్టపడి కొనుక్కున్న ఇంటికి వెళ్లిన పాపానికి అల్లు శిరీష్‌కి తన ఫ్యామిలీతో చెడిందంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. నిజానికి అల్లు శిరీష్ హీరోగా రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ నిర్మాణ రంగంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందుకు అనుగుణంగా ఉ

జగన్ సర్కార్‌పై ఆ వ్యాఖ్యలు చేయలేదు, వారిపై కేసు పెడతా.. నటుడు రావు రమేష్ ప్రకటన

Image
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రముఖ సినీ నటుడు పేరుతో చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా రావు రమేష్ చేసిన ట్వీట్లేనని భావించి నెటిజన్లు వేల సంఖ్యలో రీట్వీట్లు చేస్తున్నారు. ‘‘మొదటి విధ్వంసం! చాలా బాధపడ్డా.. మన ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుందో అని. ఇప్పటికైనా మారతారని ఆశిస్తూ - మీ రావు రమేష్’’ అంటూ ప్రజావేదిక కూల్చివేత గురించి రావు రమేష్ పేరు మీదుగా ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అలాగే ‘‘పోలవరం ప్రాజెక్ట్ వైస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక సంవత్సరంలో ఎంత పని చేశారో చెప్పండి?’’ అంటూ చేసిన ట్వీట్ సైతం చక్కర్లు కొడుతోంది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను హైకోర్టు తిరిగి నియమించడంపై కూడా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్న ట్వీట్ సైతం వైరల్ అయింది. ఈ నేపథ్యంలో సదరు ట్విట్టర్ ఖాతాకు అఫీషియల్ గుర్తింపు లేకపోవడంతో పలువురు రావు రమేష్‌ను సంప్రదించగా ఆ ట్వీట్ తాను చేయలేదని, అసలు తనకు సోషల్ మీడియా ఖాతాలేవీ లేవని రావు రమేష్ స్పష్టం చేశారు. ‘‘మీడియా మిత్రులకు, నన్ను, నా నటనను ప్రేమించే ప్రతి ఒక్కరికీ.. నాకు సోషల్‌ మీడియాలో ఎటువంటి ఖాతాలూ లేవు. ఫేస్‌బుక్ గాని, ట్

రఘు కుంచే కూతురు నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

Image
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుతురుకు నిశ్చితార్థం నిర్వహించారు. రీసెంట్‌గా తన కూతురు రాఘ ఎంగేజ్‌మెంట్‌ని ఆశిష్ వర్మ అనే వ్యక్తితో జరిగింది. దీంతో రఘు కూతురు నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రఘుది ప్రేమ వివాహం. కరుణ అనే క్లాసికల్ డాన్సర్‌ను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి రాగ పుష్యమి.. గీతార్థ్ అనే అబ్బాయి ఉన్నారు. తాజాగా అమ్మాయి రాగకే నిశ్చితార్థం నిర్వహించారు రఘు దంపతులు. రఘుది తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గర గాదరాడ అనే ఊరు. బాచి మూవీతో రఘు మ్యూజికల్ జర్నీ మొదలైంది. బాచీ సినిమాలో రఘు పాడిన లచ్చిమి లచ్చిమి పాటకు పేరు రావడంతో ఆయనకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. తరువాత చిరంజీవి తన మృగరాజు సినిమాలో ఒక పాటను పాడే అవకాశం కల్పించాడు. తరువాత దేశముదురు, శివమణి లాంటి చిత్రాల్లో పాడిన పాటలతో కెరీర్ మరింత పుంజుకుంది. మరో పక్క వినీత్, అబ్బాస్, అరవింద్‌ స్వామి, దీపక్‌ లాంటి చాలామందికి డబ్బింగ్‌ కూడా చెప్పాడు. సంపంగి సినిమాకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా నంది పురస్కారాన్నీ అందుకు

బాలయ్య Vs నాగబాబు వివాదంలోకి మెగా ప్రిన్స్ ఎంట్రీ.. వరుణ్ తేజ్ వార్నింగ్ ఎవరికి?

Image
‘మేంమంతా ఒక్కటే.. అనవసరంగా మీరే చించుకుంటారు’ అని మహేష్ బాబు లాంటి స్టార్ హీరో బహిరంగంగానే ఫ్యాన్స్‌ని ఉద్ధేశించి మాట్లాడినా.. హీరోల మధ్య చిన్న చిన్న విభేదాలు మాటలు వచ్చినప్పుడు మాత్రం ఫ్యాన్స్ తమ తమ విశ్వరూపం చూపిస్తున్నారు. చొక్కాలు చింపుకుని మరీ.. ఏయ్.. వేసేస్తాం పొడిచేస్తాం అంటూ పోటుగాళ్లలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి చివరికి ఎవరినైతే వీళ్లు భుజాన వేసుకుని బయలు దేరారో వాళ్లే భూజాలపై చేతులేసుకుని కిస్సులు పెట్టుకుంటుంటే వీళ్ల కోసమేనా మేం కొట్టుకుచచ్చింది అని సిగ్గు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో బాలయ్య-నాగబాబుల మధ్య వైరం నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ వైరంగా మారింది. తాజాగా ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి నేతృత్వంలో ప్రభుత్వంతో చర్చలు జరపడం.. ఆ చర్చలకు నందమూరి ఫ్యామిలీని దూరం పెట్టడంపై ఫైర్ అయ్యారు బాలయ్య. తనకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియదని.. తనని ఆ చర్చలకు పిలవలేదని.. భూములు పంచుకోవడం కోసమే ఈ చర్చలు జరిపినట్టు ఉన్నారంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. అయితే బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. పిలవలేదంటే పిలవలేదని అడగాలి కా

Balakrishna: ‘పిచ్చి కుక్కలతో జాగ్రత్త’.. ఫొటోతో మరింత రచ్చ రేపిన నాగబాబు

Image
మెగా బ్రదర్ వెనక్కి తగ్గేట్టు కనిపించడంలేదు. బాలయ్యతో వైరానికి సై అంటే సై అంటున్నారు. ప్రభుత్వ పెద్దలతో ఇండస్ట్రీ పెద్దల మీటింగ్‌కి తనను పిలవ లేదంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. తక్షణమే క్షమాపణ చెప్పాలి లేదంటూ బాగోదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు నాగబాబు. అయితే బాలయ్య మాట్లాడిన తీరు తప్పు కావొచ్చు కాని ఆయన వాదనలో న్యాయం ఉందని అనేవారు కొందరైతే.. రియల్ ఎస్టేట్ లాంటి పదాలను ఉపయోగించాల్సింది కాదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్నేక్ బాబు, సూసైడ్ స్టార్ అంటూ నాగబాబుని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల ముందు బాలయ్య ఎవరో తెలియదంటూ నోటి కొచ్చినట్టు మాట్టాడిన నాగబాబు.. బాలయ్య ఎవరో తెలియకుండానే క్షమాపణ చెప్పమంటున్నారా? ఇంతకీ నాగబాబు ఏ బాలయ్యకి క్షమాపణ చెప్పమన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే నాగబాబుని పచ్చిబూతులు తిడుతూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ అంతా ఏకమై మెగా బ్రదర్ నాగబాబుని టార్గెట్ చేసి ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ తరుణంలో తనను ట్రోల్ చేస్తున్న వారిని పిచ్చి కుక్కలతో ప

మహేష్ బాబు పాటతో మైండ్ బ్లాక్ చేసిన డేవిడ్ వార్నర్

Image
సంక్రాంతి పండగకి వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సినిమా అనిల్ రావిపూడి కంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’. థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. బ్లాక్ బస్టర్ కా బాప్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సాంగ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. అందులో మైండ్ బ్లాక్ పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఈ పాటలో మహేష్ స్టెప్పులు, రష్మిక చిందుల్ని అందర్నీ కట్టిపడేశాయి. తాజాగా ఈ పాటకు ప్రముఖ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెఫ్టెన్ స్టెప్పులేశాడు. తన భార్యతో కలిసి మైండ్ బ్లాక్ పాటకు డాన్స్ వేసి నెటిజన్స్‌ను ఫిదా చేశాడు. డేవిడ్ వార్నర్‌పై మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తానంటూ నిన్నే సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. కరోనాతో ఇంటికే పరిమితమైన ఈ ఆసీస్ క్రికెటర్ టిక్‌టాక్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానుల ఉర్రూతలూగిస్తున్నాడు. తన వైఫ్ క్యాండిస్‌తో కలిసిఅదరగొడుతున్నాడు. అల్లు అర్జున్ పాటలకు కూడా వార్నర్ చిందులేసిన విషయం తెలిసిందే. అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా'‌తో మొదలెట్టి 'బుట్టబొమ్మ'తో అదరగ

Attack: శృంగార నటి కుమారుడిపై కత్తులతో దాడి

Image
కొడుకుపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చెన్నై విరుగంబాక్కంలో ఉంటున్న మాయ ఇంటికి గురువారం రాత్రి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆమె కొడుకు విక్కీపై కత్తులదో దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ దాడిలో విక్కీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానికులు స్థానికంగా ఉన్న వడపళనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు నుంగంబాక్కం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే విక్కీ మద్యం సేవిస్తూ తరచూ స్థానికులతో గొడవ పడుతుంటాడని, అతని బాధితులు ఆరోపిస్తున్నారు.

Dasari: టాలీవుడ్ లెజెండ్.. దాసరి నారాయణ వర్థంతి నేడు

Image
దర్శకరత్న దాసరి నారాయణ రావు..... తెలుగు సినిమా ప్రపంచంలో ఈయన పేరు తెలియని వారు లేరు. చిత్ర పరిశ్రమలో లెజెండ్స్‌గా చెప్పుకోదగ్గ ప్రముఖుల్లో దాసరి ఒకరు. దర్శకుడిగా తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్రవేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పత్రిక అధిపతిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో అందరి తలలో నాలుకలా మెదిలిన దాసరి చనిపోయి నేటికి మూడేళ్లు. 2017 మే 30న ఆయన ఈ ప్రపంచాన్ని విడిచివెళ్లిపోయారు. ఇవాళ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన్న స్మరించుకుంటున్నారు. 1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో దాసరి జన్మించారు. దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. దాసరి తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. వారిలో దాసరి మూడో వాడు. చిన్నప్పట్నుంచే దాసరికి నాటకాలపైనా, సాహిత్యంపైన

Nirupam Paritala: ‘డైరెక్టర్ తేజా అలా చేసేసరికి చాలా ఏడ్చా’ ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్న డాక్టర్ బాబు!

Image
నటన రంగంలో కళామ్మతల్లిని నమ్మకున్నవారికి నటనే దైవం. నటనే జీవితం. సినిమా అయినా.. సీరియల్ అయినా.. పాత్ర ఏదైనా.. లీనమై జీవిస్తే.. ఆ నటుడ్ని ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉంటారు. ఆధరిస్తూనే ఉంటారు. నిజానికి వెండి తెరకంటే బుల్లితెర మీద సెలబ్రెటీస్‌కే ఎక్కువ ఫాలోవర్స్ పెరుగుతున్న రోజులు ఇవి. అయితే ఆయా రంగాల్లో మాత్రం ఆ వ్యత్యాసం కచ్చితంగా చూపిస్తారని, సీరియల్‌లో ఒక్కసారి కనిపిస్తే.. సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్‌ ఇవ్వరని, కనీసం ఆడిషన్ కూడా చెయ్యరని, తన జీవితంలోని ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నారు మన కార్తీకదీపం డాక్టర్ బాబు(). ‘ఎందుకు సినిమాలకు ట్రై చెయ్యకుండా సీరియల్స్ వైపు వచ్చారు? సినిమా హీరోగా ట్రై చెయ్యలేదా మీరు?’ అని అడిగిన ప్రశ్నకు.. నిరుపమ్ ఇలా చెప్పుకొచ్చారు. ‘నేను చాలా కాలం సినిమాల కోసం వెయిట్ చేశాను. అయితే నేను ఎప్పుడూ నాన్నగారు(ఓంకార్ పరిటాల) ఉన్నారనే ధైర్యంతో ఉండేవాడ్ని, ఏదోటి సెట్ చేస్తారులే అనే నమ్మకం ఉండేది. నిజానికి నేను సీరియల్ చెయ్యాలనుకుంటే.. అప్పటికే నాన్నగారి చేతుల్లో రెండు మూడు సీరియల్స్ ఉండేవి. కానీ నేను సినిమానే చెయ్యాలని నిర్ణయించుకున్న తర్వాత సడన్‌గా నాన్నగారు చనిప

జగన్ ఏడాది పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో.. 90 శాతం హామీలు అమలు!

Image
తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తూ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. 151 సీట్లతో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఘన విజయం సాధించి నవ్యాంధ్ర సీఎం పీఠం ఎక్కారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మే 30కి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ‘యాత్ర’ సినిమా దర్శకుడు మహి వి రాఘవ్.. జగన్ ఏడాది పాలనపై ఒక ప్రత్యేక వీడియోను చేశారు. ఈ వీడియోను జగన్‌కు అంకితం ఇచ్చారు. ‘వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనే నేను’.. అని జగన్ ప్రమాణస్వీకారం చేసిన విజువల్‌తో ఈ వీడియోను మొదలుపెట్టారు మహి. ఈ ఏడాది కాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు, అమల్లోకి వచ్చిన పథకాలను ఈ వీడియోలో చూపించారు. ‘‘ఈ మధ్యకాలంలో నా మతం, నా కులం గురించి కూడా మాట్లాడుతున్నారు. నా మతం మానవత్వం అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా’’ అని బహిరంగ సభలో జగన్ చెప్పిన మాట వీడియోలో హైలైట్‌గా ఉంది. ‘తొలి యేడు - జగనన్న తోడు’ అనే క్యాప్షన్‌తో వీడియోను ముగించారు. అంతేకాదు, ఏడాది పాలనలో మేనిఫెస్టో చెప్పిన 90 శాతం పైగా హామీలు అమలయ్యాయని పేర్కొన్నారు. Also Rea

‘డెలివరీ బోయ్’గా మారిన నోయల్.. సపోర్ట్ చేయమంటోన్న రాహుల్

Image
ఇంట్లో కూర్చొని మొబైల్‌లో చాలా సింపుల్‌గా మనకు ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేస్తే చాలు.. డెలివరీ బోయ్ అటుఇటుగా అరగంటలో పార్సిల్‌ను మన ముందు ఉంచుతాడు. కంపెనీ నుంచి వచ్చే ఒత్తిడి.. కస్టమర్‌కు సమయానికి ఫుడ్ అందజేయాలనే బాధ్యతతో ట్రాఫిక్ బారులు తీరినా ఎలాగోలా కష్టపడి ఆన్ టైమ్‌లో పార్సిల్ మన గుమ్మం ముందు పెడతాడు డెలివరీ బోయ్. లాక్‌డౌన్ సమయంలో అందరూ ఇళ్లలో ఉన్నా ముఖానికి మాస్క్ వేసుకుని మరీ ఫుడ్ డెలివరీ చేశాడు. అందుకే, అలాంటి డెలివరీ బోయ్‌కి ప్రముఖ ర్యాప్ సింగర్ నోయల్ సీన్ ఒక పాటను అంకితం ఇచ్చారు. ‘హే డెలివరీ బోయ్’ అంటూ అదిరిపోయే ర్యాప్ సాంగ్‌ను సంగీత ప్రియులకు అందించారు. Also Read: నోయల్ స్వయంగా రాసిన ఈ పాటను సింగర్ మోహన భోగరాజుతో కలిసి ఆలపించారు. ఎబెనెజర్ పాల్ స్వరపరిచారు. వినయ్ కుమార్ ఫైనల్ మిక్స్ చేశారు. అమీర్ సినిమాటోగ్రఫీ అందించారు. రాజేష్ కొరియోగ్రఫీ చేశారు. బ్లూ ర్యాబిట్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ఈ పాటను నిర్మించింది. పాటలో నోయల్ ర్యాప్ చాలా బాగుంది. చాలా సింపుల్ పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా డెలివరీ బోయ్ మనసులోని మాటలను పాట రూపంలో చెప్పారు. ఈ పాటను మరో సింగర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 వి

వలసకూలీ వ్యధపై హరీష్ శంకర్.. కళ్లు చెమర్చే పోస్ట్

Image
అగమ్యగోచరంగా వలస కూలీల బతుకులు.. కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా వలసకూలీలు బతుకులు కకావికలమవుతున్నాయి.. ఉన్న చోట ఉందాం.. కడుపు నిండా తిందాం అంటే బతుకులు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. పోనీ సొంత ఊర్లకు వెళ్లిపోదాం అంటే రవాణా సౌకర్యాలు లేవు. కాలి నడకే బతుకు బాట అయ్యింది. కరోనా వైరస్ తమని ఎక్కడ కబళిస్తుందోనన్న భయంతో.. ఈ కాలే కడుపుల బాధలు వర్ణానాతీతం. బిడ్డల్ని చంకనెట్టుకున్న తల్లి.. కాళ్లకు చెప్పులు కూడా లేని బిడ్డ.. రక్తమోడుతున్న పని కాళ్లు.. కడుపు తరుక్కుపోయే వలస కూలీ ధీన గాధ.. వందల, వేల కిలోమీటర్లు నడుస్తూ మార్గం మధ్యలోనే చనిపోతున్న ఈ వలస కూలీల బతుకుల్ని కళ్లకు కడుతూ కంటతడిపెట్టించేలా కవిత రాశారు దర్శకుడు . ‘బండరాళ్లని పిండి చేసిన చేతులు ఎడమపక్క డొక్క నొప్పికి లొంగిపోయాయి. పెద్ద పెద్ద ఇనుప చువ్వలని వంచిన వేళ్ళు మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి. మేం వేసిన రోడ్లే మమ్మల్ని వెక్కిరిస్తుంటే బతకడం కోసం ఊరొదిలొచ్చిన మేము చచ్చేలోపు ఊరెళితే చాలనుకుంటూ.. ఆకలి అడుగులతో.. పేగులు అరుపులతో.. కాళ్లు, కడుపు ఒకేసారి కాలుతుంటే .. మమ్మల్ని చూసే లోకులకి బాధేస్తోంది.. జాలేస్తోంది.. కానీ మాకు మాత్రం ‘ఆక

బహుశా నేనే ఫస్ట్ ఆర్టిస్ట్.. సీఎం గారికి థ్యాంక్స్: సీనియర్ నటుడు నరేష్

Image
తెలుగు సినిమా పరిశ్రమకు మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా రెండు నెలలకు పైగా ఆగిపోయిన సినిమా పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ అనుమతితో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగా సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వీకే నరేష్.. ‘జాతిరత్నాలు’ సినిమా కోసం డబ్బింగ్ మొదలుపెట్టారు. శుక్రవారం రామానాయుడు స్టూడియోలోని డబ్బింగ్ థియేటర్‌లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియోను ట్వీట్ చేశారు. ‘‘నిన్న ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు అభయం ఇస్తూ, ధైర్యం ఇస్తూ, ఫ్రీడమ్ కూడా ఇచ్చింది. థాంక్యూ వెరీ మచ్ ముఖ్యమంత్రి గారికి. ఈరోజున మొట్టమొదటి సారిగా డబ్బింగ్ థియేటర్ ఓపెన్ చేసి ‘జాతిరత్నాలు’ సినిమాకి డబ్బింగ్ స్టార్ట్ చేశాం. బహుశా నేనే ఫస్ట్ ఆర్టిస్ట్‌ని అనుకుంటున్నాను. ఇండస్ట్రీ బాగుండాలి. పది మందికి పని జరగాలి. ధైర్యంగా ముందుకు వెళ్దాం. జాగ్రత్తలు తీసుకుందాం. ప్రభుత్వం, పరిశ్రమ ఎటువంటి సలహాలు, సూచనలు ఇచ్చినా పాటించి కచ్చితంగా ప్రభుత్వం మన మీద పెట్టిన నమ్మకా

Actress Sai Sudha: నటి సాయి సుధకు పెళ్లి పేరుతో మోసం.. శ్యామ్ కె నాయుడు అరెస్ట్

Image
నటి సాయి సుధతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించి మోసం చేసిన కేసులో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. చోటా కె నాయుడు తమ్ముడు తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి తనతో సహజీవనం చేసి శారీరకంగా దగ్గరయ్యారని, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంలేదని నటి హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదును స్వీకరించిన తరవాత శ్యామ్‌ కె నాయుడుని ప్రశ్నించిన పోలీసులు.. విచారణ చేపట్టారు. వీరి విచారణలో శ్యామ్ కె నాయుడు.. సాయి సుధతో ఆరు నెలలు సహజీవనం చేశారని.. ఇటీవల వీరి మధ్య దూరం పెరగడంతో ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిచి వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. అయితే ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. శ్యామ్ కె నాయుడుపై ఐపీసీ సెక్షన్ 493 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కి తరలించారు. ఇక సాయి సుధ విషయానికి వస్తే .. గుంటూరుకు చెందిన ఈమె ఫిజియోథెరపీ డాక్టర్. కొన్నాళ్ల పాటు డాక్టర్‌గా పనిచేసిన సాయి సుధ సినిమాలపై ఉన్న ఆసక్తితో డాక్టర్ ఉద్యోగం వదిలేసి యాక్టర్‌గా ట్రై చేశారు. బాడీగార్డ్,

అక్కినేని ఫ్యాన్.. గడుగ్గాయి.. సమంతకే షాక్ ఇచ్చాడు!!

Image
సినిమా స్టార్స్ సాధారణంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అందరికీ కలిపి హాయ్‌లు చెబుతూ ఉంటారు. అభిమానులను ఉద్దేశించి ట్వీట్లు, పోస్టులు పెడుతూ ఉంటారు. తమ క్రియేటివిటీతో బాగా మెప్పించే అభిమానుల ట్వీట్లను లైక్ చేస్తూ ఉంటారు. తమ అభిమాన హీరోతో లేదంటే హీరోయిన్‌తో ట్విట్టర్‌లో లైక్ కొట్టించుకోవాలన్నా, రీట్వీట్ చేయించుకోలన్నా ఆ ఫ్యాన్ చేసే ట్వీట్‌లో మంచి స్టఫ్ ఉండాలి. కానీ, ఓ అక్కినేని అభిమాని సమంతకు అదిరిపోయే షాక్ ఇచ్చాడు. తాను చేసిన ట్వీట్‌ను సమంతతో ఎలా అయినా రీట్వీట్ చేయించుకోవడానికి తన బుర్రకు పనిచెప్పాడు. ‘‘నా కన్నా చైతన్యను మీరు ఎక్కువగా ప్రేమిస్తే రీట్వీట్ చేయండి’’ అని సమంతను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. ఇలాంటి ఆఫర్ ఇచ్చాక సమంత రీట్వీట్ చేయకుండా ఉంటారా? చేశారు. దీంతో మిగిలిన ఫ్యాన్స్ అతడిని ‘ఇంటెలిజెంట్ ఫెలో’ అంటూ సరదాగా ప్రశంసిస్తున్నారు. శుక్రవారం సమంత ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తనకు ఇష్టమైన సినిమాల గురించి, క్వారంటైన్ పీరియడ్‌లో గడిపిన విషయాల గురించి, తన అత్తమ్మ అమల గురించి, ఇలా చాలా విషయాలే పంచుకున్నారు. వాటిలో కొన్ని

16 ఏళ్లకే నాపై కర్చీఫ్ వేశాడాయన, తరువాత నేను టెంప్ట్ అయినా వద్దన్నాడు: అనసూయ

Image
లాక్ డౌన్ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది జబర్దస్త్ భరద్వాజ్. షూటింగ్‌లు లేక ఇంట్లోనే ఉండిపోయిన అనసూయ ఎప్పుడెప్పుడు షూటింగ్‌లు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఇంట్లోనే ఉండి వంటలు బాగా నేర్చుకున్నానని పిల్లలకు రకరకాల వంటకాలను చేసి పెట్టినట్టు తెలిపిన ఆమె తన పర్శనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. తన ఫస్ట్ క్రష్ 16 ఏళ్లకే మొదలైందన్నారు అనసూయ. వేరే వాళ్లపై క్రష్ ఏర్పడేటంత టైం తన భర్త ఇవ్వలేదని 16 ఏళ్లకే తనపై కర్చీఫ్ వేశాడని తన భర్త సుశాంత్ భరద్వాజ్‌‌తోనే ఫస్ట్ క్రష్ అంటూ తన లవ్ స్టోరీ చెప్పారు అనసూయ. తమ వివాహ బంధానికి పదేళ్లు అని గుర్తు చేసుకున్న అనసూయ తన ప్రేమ ఎన్ సీ సీలో అతన్ని చూశాను.. అప్పటికీ ప్రేమ గీమా ఏం అర్థం అయ్యేది కాదు.. ఒకర్నొకరం అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో నన్ను ఎంబీఏ కూడా మా ఆయనే చదివించారు. వాళ్ల అన్నయ్య యూకే నుంచి పంపిన మొబైల్‌ని అమ్మేసి నాకు ఫీజ్‌లు కట్టి చదివించారు. నేను హాస్టల్‌లో ఉంటూ చదువుకునేదాన్ని. మధ్యలో నేను రెండు సార్లు టెంప్ట్ అయ్యా.. హేయ్ పదా పెళ్లి చేసుకుందాం అని.. కాని ఆయన ఒప్పుకున

నన్నే ఎవరూ పిలవలేదు.. నేను బాలయ్యను పిలవాలా: సి.కళ్యాణ్‌కు నరేష్ కౌంటర్

Image
తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చర్చలు జరపడంపై నటుడు నందమూరి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో ఏం చర్చలు జరుగుతున్నాయో తనకు తెలీదని, అసలు ఆ చర్చలకు తనను ఎవరు పిలిచారని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటికే నిర్మాత సి.కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన వ్యాఖ్యలపై బాలయ్య క్షమాపణలు చెప్పాలని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: ఇండస్ట్రీలో ఎవరినీ ఎవరూ ఈ చర్చలకు పిలవలేదని, ఎవరికి వారు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ముందుకు వచ్చారని సి.కళ్యాణ్ అన్నారు. బాలకృష్ణ వస్తే ఎవరూ కాదనరని కూడా అన్నారు. అంతేకాకుండా, చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో జరిగిన సమావేశానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన భేటీకి బాలకృష్ణను పిలుచుకోవాల్సిన బాధ్యత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)దేనని సి.కళ్యాణ్ చెప్పినట్టు ఓ వెబ్‌సైట్ రాసింది. అయితే, సి.కళ్యాణ్ వ్యాఖ్యలపై ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్ స్పందించారు. సి.కళ్యాణ్

Naga Babu: ‘బాలయ్య డబ్బులు కావాలి.. బాలయ్య వద్దా? క్షమాపణ ఏ బాలయ్య చెప్పాలి నాగబాబూ?’

Image
నిజమే.. నందమూరి బాలకృష్ణ మాట్లాడిన దాంట్లోనూ న్యాయం ఉంది. ఇండస్ట్రీ పెద్దలు ఆస్తులు పంచుకునేందుకే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపారనే కామెంట్స్ ఇబ్బందికరమైనవే అయినా ఆయన్ని పిలవకపోవడం అనేది డిబేటబుల్. సర్ సర్ లే.. మమ్మల్ని మాత్రం పిలిచారా?? నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ని అని నరేష్ ఎందుకొచ్చిన గొడవలే అనుకుని సర్దిచెప్పుకున్నా.. మహేష్ బాబు, మోహన్ బాబు లాంటి వాళ్లు సైలెంట్‌గా ఉన్నా.. వారి మాదిరే బాలయ్య కూడా సైలెంట్‌గా ఉండాలని అనుకోలేం. ఎందుకుంటే బాలయ్యకి కాలితే ప్రాణం పెట్టే ఫ్యాన్స్‌నే వీరి ఉతుకుడు ఉతికేస్తారు. అలాంటిది తన ఇగోని హర్ట్ చేస్తే ఈ మాత్రం రియాక్షన్ ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే బాలయ్య తనను పిలవలేదనే బలమైన వాదనతో పాటు.. రియల్ ఎస్టేట్ అదీ ఇదీ అంటూ నోరు జారటం ఆయన వాదనను బలహీన పరిచిందనే చెప్పాలి. ఆవేశంలో ఆ మాట అన్నారో.. ఆ చర్చల వెనుకు నిజంగానే ఏదైనా మర్మం ఉందో తెలియదు కాని.. బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయిన తీరు మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీల మధ్య వైరంగా మారాయి. ఎన్నికల ముందు అంతా నా ఇష్టం అంటూ యూట్యూబ్ ఛానల్‌ ఓపెన్ చేసిన నాగబాబు.. నందమూరి బాలకృష్ణను ఓ రేం

రెచ్చిపోయిన ఈషా రెబ్బా.. గేరు మార్చి అందాల వడ్డన.. పిక్స్ చూస్తే ఆ మాట అనాల్సిందే!

Image
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందాల వడ్డనకు హద్దు అదుపు లేకుండా పోతోంది. వేగంగా విస్తరిస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో అందాలతో మాయ చేస్తున్నారు నేటితరం హీరోయిన్స్. అవకాశాలు అందిపుచ్చుకోవడం లోనూ, ఫాలోయింగ్ పెంచుకోవడంలోనూ ఇదే సరైన మార్గం అని గమనించి సెగలు రేపే ఫోటో షూట్స్‌లో పాల్గొంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ షేర్ చేసిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతూ యువ హృదయాలను కొల్లగొడుతున్నాయి. ఈ ఫొటోల్లో తెల్ల చొక్కా వేసుకొని కనిపిస్తున్న ఈషా.. మత్తెక్కించే కళ్ళలో మాయ చేస్తోంది. ఇక ఈ పిక్స్ చూస్తుంటే ఈషా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా? లేక కావాలనే అందాలతో అలా ఆకర్షించిందా? అనే సందేహం కలుగుతోంది. ఈషాను ఇలా చూసిన ప్రతి వ్యక్తి వావ్! అనక తప్పదేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఆమె గ్లామర్ డోస్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లంతా ఈ పిక్స్ చూసి మైమరచిపోతూ తమదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతున్నారు. ''సెక్సీ స్టార్, సూపర్, బ్యూటిఫుల్, అందానికే అందం ఈషా'' అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ‘అంతకు

రకుల్‌కి ఉక్కబోత.. షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి బయటపెట్టేసిందంతా

Image
వేసవి తాపమో.. ఆరబోయాలన్న ఆరాటమో తెలియదు కాని సమ్మర్‌లో సెగలు రప్పించే ఫొటోను వదిలింది ప్రీత్ సింగ్. అప్పట్లో ఇదో కొత్త రకం ఫ్యాషన్ అంటూ ఒంటి నిండా చిరుగులు ఉన్న జీన్స్‌తో ఒళ్లు మొత్తం కనిపించేట్టుగా ఫొటోలు వదిలి రచ్చ చేసిన తాజాగా బోల్డ్ అవతారంలో మెరిసింది. జీన్స్ షర్ట్ ధరించిన రకుల్ ప్రీత్ సింగ్ బటన్స్ మొత్తం విప్పేసి.. లో వస్త్రాలు లేకుండా ఎదభాగం కనిపించేట్టుగా ఫొటోకు పోజులు ఇచ్చింది. ఇంతకు ముందు వరకూ రకుల్ అందాల ప్రదర్శన ఓ లెక్క.. ఇది ఓ లెక్క అన్న మాదిరిగా మితిమీరి అందాలను ఆరబోసింది. ఎద అందాలతో కవ్విస్తూ.. కైపెక్కించే చూపులతో రకుల్ కాకరేపే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెరటం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌఖ్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, దృవ, స్పైడర్, మన్మథుడు 2 వంటి చిత్రాల్లో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వంటి స్టార్ హీరోలతో జోడీ కట్టిన ఈ భామకు ప్రస్తుతం ఆఫర్లు కొరత ఏర్పడింది. నాలుగు సినిమాలు ఉన్నప్పుడు అన్నీ చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంలో అమ్మడు కెరియర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బిజినెస్ రంగంలో అడుగుపెట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహి

‘మా’ ప్రెసిడెంట్‌ని నాకే ఇన్ఫర్మేషన్ లేదు.. బాలయ్య వ్యాఖ్యలపై నరేష్ కామెంట్స్

Image
ప్రభుత్వాలతో జరిపే చర్చలకు తనను పిలవడం లేదంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యారు. బాలయ్య అలా ఎందుకు మాట్లాడారో తనకు తెలియదన్న నరేష్.. టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వాలతో జరిపిన చర్చలకు తనకూ ఇన్ఫర్మేషన్ లేదన్నారాయన. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన నరేష్ ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘నేను మా ప్రెసిడెంట్‌ని నాకూ ఏం చెప్పలేదు.. కాని ఎక్కడకు పిలుస్తారో అక్కడకు వెళ్లడమే మంచిది. సినిమా పరిశ్రమ అంతా ఒకటే.. చిన్న చిన్న విభేదాలు ఇండస్ట్రీలో ఉండొచ్చు. నిన్న నన్ను ఒక కార్యక్రమానికి పిలిచారు వెళ్లాను.. ఈరోజు పిలిచారు వెళ్లాను.. నాకు తోచిన సూచనలు ఇచ్చాను. పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే.. వాళ్లు ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ పిలవక పోతే ఆగిపోతా. ఏదైనా ఒక సర్వీస్‌గా మాత్రమే నేను భావిస్తున్నా.. బాలయ్య గారు అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు.. నేను టీవీలు కూడా చూడలేదు. పరిశ్రమ క్లిష్టపరిస్థితులో ఉన్నప్పుడు గట్టెక్కించడం అనేది అందరి బాధ్యత’ అంటూ గుర్తు చేశారు నరేష్.

Jabardasth: బలుపు అనుకోండి.. ఓవర్‌కాన్ఫిడెన్స్ అనుకోండి.. నేనంటే ఓ హిస్టరీ: అనసూయ

Image
జబర్దస్త్ నుంచి వెళిపోతుందట.. ఆమె ప్లేస్‌లో హాట్ యాంకర్ మంజూష ఎంట్రీ ఇస్తుందట.. వస్తున్న రూమర్స్‌పై యాంకర్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘జబర్దస్త్ షో హిస్టరీ క్రియేట్ చేసింది.. నేను పోయిన తరువాత కూడా జబర్దస్త్ షో ఉంటుంది. ఆ షోకి అనసూయ అనే యాంకర్ హైప్ తెచ్చిందని చరిత్రలో లిఖించబడింది. అనసూయ అంటే ఓ హిస్టరీ. ప్రస్తుతం జబర్దస్త్‌లో నాగబాబు గారు లేరే అంటే.. అది ఆయన తీసుకున్న నిర్ణయమే. మల్లెమాల అందరికీ ఫ్యామిలీ లాంటిది. లాక్ డౌన్‌లో కూడా జబర్దస్త్ వాళ్లందర్నీ ఫ్యామిలీలా కేర్ చేస్తుంది. లాక్ డౌన్ ముందు.. లాక్ డౌన్ తరువాత మల్లెమాలలో ఏం తేడాలేదు. మా అంతట మేం జబర్దస్త్‌ని వద్దని తప్పుకోవడం తప్పితే.. వాళ్లు మాత్రం వద్దని చెప్పరు. నేనైతే జబర్దస్‌ని వద్దనుకోవడం లేదు.. జబర్దస్త్‌ని వదిలే ప్రసక్తే లేదు. చాలా మంది నేను బబర్దస్త్‌ని వదిలేయాలని కోరుకుంటున్నారేమో వాళ్లకి ఇది బ్యాడ్ న్యూస్. నేను జబర్దస్త్ షోకి క్వీన్‌ని. ఇది నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, బలుపు అనుకోండి.. ఏదేనా అనుకోండి.. నేనంటే పడనివాళ్లు బలుపు అని అనుకోవచ్చు. నేనంటే ఇష్టపడేవాళ్లు హమ్మయ్య.. థాంక్యూ అని అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోన