ఓ సారి కృష్ణ గారు కార్ ఎక్కించుకొని.. ఆ సంఘటన ఎన్నటికీ మరిచిపోలేను: పూరి జగన్నాథ్

ఈ రోజు (మే 31) సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చిత్రసీమలోని ప్రతి ఒక్క దర్శకుడు, నిర్మాత, నటీనటులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ టాలీవుడ్ లెజెండ్‌తో తమ తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డాషింగ్ డైరెక్టర్ ఓ ట్వీట్ చేస్తూ అప్పట్లో కృష్ణ గారితో ఉన్న మధుర జ్ఞాపకాన్ని అందరికీ తెలియజేశారు. కృష్ణ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ''పాతికేళ్ల క్రితం నేను తీసిన ఫోటో ఇది. ఒకసారి కృష్ణ గారు నన్ను కార్ ఎక్కించుకుని తీసుకెళితే సంగీత్‌లో సినిమా కూడా చూసాం. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం క్యూలో నిలుచునే వాడిని, కానీ ఆ రోజు ఆయన పక్కన కూర్చోవడం అస్సలు మరిచిపోలేను. కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ గ్రేట్ లెజెండ్ ఆరోగ్యంగా కలకాలం జీవించాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తూ.. పూరి- మహేష్ కాంబో మరోసారి రిపీట్ కావాలని కోరుతున్నారు. మహేష్ బాబు 28వ సినిమా మీదే కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ చేసిన ఈ ట్వీట్‌ని ఛార్మి లైక్ చేయడం విశేషం. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఇకపోతే ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ మూవీ రూపొందిస్తున్నారు. ముంబై నేపథ్యంలో ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే రొమాన్స్ చేస్తోంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీని మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు పూరి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ