బాలకృష్ణ కామెంట్స్‌పై వర్మ రియాక్షన్.. రెండు మూడు రోజులే అరవడం

టాలీవుడ్‌ పెద్దలపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంతో నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ తయారైంది పరిస్థితి. ఫ్యాన్స్ రెండు గ్రూపులుగా విడిపోయి ఒకర్నొకరు దూషించుకుంటున్నారు. ఈ ఇష్యూపై స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాట్లాడుతూ.. ‘లాక్ డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.. నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ పట్టింకోను. నా లైఫ్‌లో ఇప్పటి వరకూ ఎవరికీ ఛారిటీ ఇవ్వలేదు. డైరెక్ట్‌గా నాతో పనిచేస్తున్న వారిని మాత్రమే నేను చూస్తా.. చేయాలనిపిస్తే సాయం చేస్తా.. అంతేతప్ప జనరల్‌గా అందర్నీ చూడను. ఛారిటీ అంటారు అది ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు అనేది ఎవరికీ తెలియదు. అందుకే వాటిపై నాకు నమ్మకం లేదు. చేయాలనిపిస్తే.. నేనే డైరెక్ట్‌గా చేస్తా. బాలయ్య కామెంట్స్‌పై స్పందిస్తూ.. ఆయన ఏదో కామన్‌‌గా మాట్లాడితే.. మీడియా పెద్ద బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసి చూపించింది. బాలయ్య మాటల్లో అంతగా పట్టించుకోవాల్సిన విషయం ఉందని అయితే నేను అనుకోవడం లేదు. ఆయన కామెంట్ చేయడం ద్వారా ఏమైంది?? రెండు మూడు రోజుల అరుస్తారు.. తరువాత మెల్లగా సర్దుకుంటుంది. నాలుగు రోజుల తరువాత అందరూ మరిచిపోతారు. ఆ ముందు రోజుకి తరువాత రోజుకి పెద్దగా తేడా ఉండదు’ అంటూ చెప్పుకొచ్చారు వర్మ.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ