Posts

Showing posts from December, 2020

రవితేజ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. డబుల్ ఇంపాక్ట్ అంటూ రంగంలోకి మాస్ మహారాజ్

Image
2020 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ 2021 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు సర్‌ప్రైజ్ ఉంటుందని ముందుగానే చెప్పిన రవితేజ.. తాజాగా తన లేటెస్ట్ మూవీ ''కి సంబంధించి స్పెషల్ అప్‌డేట్ ఇచ్చారు. న్యూ ఇయర్ కానుకగా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నారు. కళ్లజోడు పెట్టుకొని భయపడుతూ ఓ గెటప్‌లో కనిపించగా, చేతిలో గన్ పట్టుకొని మరో గెటప్‌లో అదరగొట్టేశాడు మాస్ మహారాజ్. రవితేజ డబుల్‌ యాక్షన్‌ చేస్తున్న ఈ సినిమా నుండి డబుల్‌ ఇంపాక్ట్‌ పక్కా అంటూ చిత్ర యూనిట్ ఈ పోస్టర్‌ విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ 'ఖిలాడీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవ

రవితేజ ‘క్రాక్’ ట్రైలర్: ష్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చపేలిపోద్ది!

Image
మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ‘క్రాక్’ అంటూ తన రేంజ్ ఏంటో చూపించబోతున్నారు. ఆ రేంజ్ ఎలా ఉండబోతోందో మచ్చుకు ‘క్రాక్’ ట్రైలర్ ద్వారా ఈరోజు చూపించారు. అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘క్రాక్’ ట్రైలర్ వచ్చేసింది. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా జనవరి 1న ‘క్రాక్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా ఉంది ట్రైలర్. ‘‘చూశారా జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయి. ఇక్కడ కామ్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు’’ అంటూ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలైంది. ‘‘శంకర్.. పోతరాజు వీర శంకర్’’ అని మీసం దువ్వుతూ రవితేజ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి దరువు మొదలైంది. యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్, రొమాన్స్ అన్నీ ఒకే ట్రైలర్‌లో చూపించేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ ట్రైలర్‌లో మరో హైలైట్ సాయిమాధవ్ బుర్రా డైలాగులు. ప్రతి డైలాగ్ వహ్వా అనిపించేలా ఉంది. ‘‘ఒంగోలు నడిరోడ్డు మీద నగ

FCUK Teaser: రసికరాజుగా జగపతిబాబు.. బండి ఇంకా కండిషన్‌లోనే ఉంది!

Image
ప్రధాన పాత్రధారిగా రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్’. టైటిల్‌లోని మ‌రో ప్రధాన పాత్ర చిట్టిగా బేబి స‌హ‌శ్రిత న‌టిస్తోంది. ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. షార్ట్‌క‌ట్‌లో ఈ సినిమా ‘FCUK’గా పాపుల‌ర్ అయ్యింది. ఇప్పటివ‌ర‌కూ నాలుగు ప్రధాన పాత్రల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్స్ విల‌క్షణంగా ఉన్నాయంటూ అన్ని వ‌ర్గాల నుంచీ ప్రశంస‌లు ల‌భించాయి. కాగా, నూత‌న సంవ‌త్సరారంభం సంద‌ర్భంగా శుక్రవారం (జ‌న‌వ‌రి 1న) ఉద‌యం 9 గంట‌ల‌కు పలువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్‌లో సినిమాకు ప్రధానమైన నాలుగు పోస్టర్లను పరిచయం చేశారు. రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జగపతిబాబు పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. రొమాంటిక్ ఫాదర్‌గా ఆయన నటించారు. ‘‘ఈయన పేరు ఫణి భూపాల్. రాముడి బాణం వేగం గాలికి కూడా తెలియదంట. మనోడు అంత ఫాస్ట్‌గా అమ్మాయిల్ని పడేస్తాడు’’ అంటూ జగపతిబాబు పాత్రను పరిచయం చేశారు.

‘వరుడు కావలెను‘ న్యూ ఇయర్ పోస్టర్.. చూడముచ్చటగా నాగశౌర్య, రీతువర్మ జంట

Image
నాగశౌర్య, రీతువర్మ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ అందమైన వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియోలో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తేవటమే కాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కూడా లభించాయి. కాగా, 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రచారచిత్రం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగశౌర్య , రీతువర్మ జంట చూడముచ్చటగా కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో ఇంకా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, ‘రంగస్థలం’ మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీ

‘వకీల్ సాబ్’ స్టన్నింగ్ పోస్టర్.. సంక్రాంతికి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్

Image
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కొత్త ఏడాదిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి వచ్చేస్తున్నారు. మొదటిగా ‘వకీల్ సాబ్’తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల విరామం తరవాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘వకీల్ సాబ్’పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సిద్ధమవుతున్నాడు ‘వకీల్ సాబ్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచాయి. ఇప్పుడు మరో స్టన్నింగ్ పోస్టర్‌ను వదిలారు ‘వకీల్ సాబ్’. తెలుగు ఆడియన్స్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘వకీల్ సాబ్’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్, శ్రుతిహాసన్ జావా బైక్‌పై దూసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ లుక్ అదిరింది. ఆయన వెనుకాల శ్రుతిహాసన్ కూడా చిరునవ్వులు ఒళికిస్తున్నారు. అంతేకాదు, ఈ పోస్టర్‌తో మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. ఈ సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, హిందీ సూపర్ హిట్ ఫిలిం ‘పింక్’కు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. మూడు రోజుల క్రితమే షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రా

రవితేజ ‘క్రాక్’కి వెంకటేష్ వాయిస్

Image
మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్’. రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ గురవారం వెల్లడించింది. అదేంటంటే.. ‘క్రాక్’ మూవీకి విక్టరీ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. ఆయ‌న వాయిస్ ఓవ‌ర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 1న విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ విడుదలైతే ‘క్రాక్’పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. కాగా, తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకొనే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. స‌ర‌స్వతి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఎ

పూరి జగన్నాథ్ రివ్యూ: అన్నీ మూసుకుని కూర్చోవడం నేర్చుకున్నాం.. 2020 బెస్ట్ ఇయర్!

Image
2020 అనగానే చాలా మంది మదిలో మెదిలే మాటలు దరిద్రం, చండాలం. ఇంత ఘోరమైన సంవత్సరాన్ని ఎప్పుడూ చూడలేదని జనాలు తిట్టుకుంటున్నారు. దీనికి కారణం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్. దీని వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా చితికిపోయారు. అందుకే, ఈ ఏడాది వెళ్లిపోతుంటే సంతోషంగా వీడ్కోలు చెప్పడం లేదు. పోనీ దరిద్రపుగొట్టు సంవత్సరం.. వచ్చే ఏడాది అయినా బాగుండాలి అని ఆశ పడుతున్నారు. కానీ, 2020 చెత్త సంవత్సరం కాదని.. ఇది గొప్ప సంవత్సరమని అంటున్నారు ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్. 2020 గొప్పతనాన్ని వివరిస్తూ పూరి జగన్నాథ్ ఒక పాడ్‌కాస్ట్‌ను విడుదల చేశారు. ‘‘అందరూ 2020ని తిట్టుకుంటున్నారు. కానీ మన లైఫ్‌లో బెస్ట్ ఇయర్ 2020’’ అని పాడ్‌కాస్ట్‌ను మొదలుపెట్టారు పూరి. ఈ 2020 మనకు చాలా నేర్పిందని, ఆరోగ్యం ఎంత ముఖ్యమో అర్థమైందని, రోగనిరోధక శక్తి చాలా అవసరమని తెలిసిందని, మంచి ఆహారం విలువ తెలిసిందని పూరి అన్నారు. ఈ ఏడాదే ప్రజలు పరిశుభ్రత నేర్చుకున్నారని అన్నారాయన. పుట్టిన తరవాత ఇన్ని సార్లు ఎప్పుడూ మనం చేతులు కడుక్కోలేదని తెలిపారు. ‘‘పల్లెటూళ్లలో చదవుకోని వాళ్లకు కూడా చాలా విషయాలు తెలిశాయి. వైరస్,

Krack: స్టార్ హీరో సినిమాలో కమెడియన్‌గా.. టిక్‌టాక్ దుర్గారావుకు బంపరాఫర్

Image
సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్‌ ద్వారా ఎంతో మంది తమలోని టాలెంట్‌ను నిరూపించుకున్నారు. సినిమా పాటలకు స్పెప్పులు వేస్తూ, డైలాగులకు పేరడీ చేస్తే చాలామంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. సామాన్యులను సైతం సెలబ్రెటీలను చేసేసింది టిక్‌టాక్. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాకు చెందిన దుర్గారావు తన భార్యతో కలిసి టిక్‌టాక్ చేసిన వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి. ఆ టాలెంట్‌తోనే వారు పలు టీవీ షోల్లో సందడి చేశారు. ముఖ్యంగా ‘పలాస’ సినిమాలోని ‘మీ బావగారు వచ్చేటి వేళ’అనే పాటకు దుర్గారావు వేసిన స్టెప్పులు చాలా పేరు తీసుకొచ్చాయి. Also Read: తాజాగా అందిన సమాచారం ప్రకారం దుర్గారావుకు సినిమాల్లో బంపరాఫర్ దక్కినట్లు తెలుస్తోంది. మాస్ మహరాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘’లో దుర్గారావు కనిపించనున్నాడట. దుర్గారావు టిక్‌టాక్ వీడియోలు చూసి ఇంప్రస్ అయిన గోపీచంద్.. అతడిని ఓ కామెడీ పాత్ర ఇచ్చాడట. తనకు దక్కిన ఈ అవకాశాన్ని దుర్గారావు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ‘క్రాక్’ మూవీ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రానుంది. Also Read:

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

Image
సీనియర్ నటుడు కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో చేరిన నర్సింగ్ యాదవ్.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. నర్సింగ్ యాదవ్ గత ఏడాది కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లోనే డయాలసిస్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న నర్సింగ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ ఆయన కోమాలోనే ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, అప్పటి నుంచీ ఆయనకు యశోద హాస్పిటల్‌లో డయాలసిస్ చేయిస్తున్నారు. కానీ, కిడ్నీ సమస్యను ఆయన జయించలేకపోయారు. ఇదిలా ఉంటే, నర్సింగ్ యాదవ్ అసలు పేరు మైలా నర‌సింహ యాద‌వ్‌. 1963 మే 15న హైద‌రాబాద్‌లో జన్మించారు. ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. నర్సింగ్ యాదవ్ గత 25 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్రవేశారు. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ యాదవ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ‘క్షణం క్షణం’లో ఆయన చేసిన నర్సింగ్ పాత్ర ఆయనకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. నర్సింగ్‌ను చిరంజీవి కూడా బాగా ప్రోత్సహించారు. చిరంజీవిత

టీవీ, సినిమా షూటింగులకు జగన్ సర్కార్ బంపరాఫర్.. ఇకపై అలా చేయక్కర్లేదు

Image
రాష్ట్రంలో టీవీ, సినిమా షూటింగుల అనుమతిని మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతుల కోసం ఇక కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్‌లైన్లోనే ఉచితంగా అనుమతులు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రదేశాల్లో ఇక షూటింగ్ జరుపుకోవాలి అనుకునే వారు www.apsftvtdc.in వెబ్ సైట్లో అనుమతికి అప్లై చేసుకోవచ్చు. అలా చేసుకున్న దరఖాస్తులను నిర్దిష్ట కాలపరిమితిలో అనుమతి ఇచ్చి దరఖాస్తుదారుడికి ఆన్‌లైన్లోనే సమాచారం ఇస్తారు. ఈ అనుమతి కాపీని సంబంధిత శాఖ ఇన్‌ఛార్జికి కూడా పంపిస్తారు. Also Read: సినిమా, టీవీ షూటింగులకు ఆన్‌లైన్లో అనుమతి ఇవ్వడం శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాలు సులభతరంగాను, అందరికి అందుబాటులో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న లొకేషన్లను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే షూటింగ్‌కి అనుమతులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. Also Read: గతంలో షూటింగ్ లొకేషన్లకు అనుమతి

‘మెగాస్టార్’ వివాదం.. అభిమానులకు సారీ చెప్పిన ‘ఆహా’ టీమ్

Image
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ యాప్‌ ‘’ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్ సమంత ‘సామ్ జామ్’ పేరుతో నిర్వహిస్తున్న టాక్‌ షోలో వారానికో సెలబ్రెటీ సందడి చేస్తున్నారు. వారు చెప్పే విశేషాల కోసం ప్రేక్షకులు ఆ షోను చూస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. ఇటీవలే చిరంజీవి ఈ షోకు హాజరై ఎన్నో సంగతులు పంచుకున్నారు. త్వరలోనే అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఈ షోలో సందడి చేయనున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ప్రోమో కూడా విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో అల్లు అర్జున్‌కి ముందు ‘మెగాస్టార్’ అనే బిరుదును చేర్చడం వివాదాస్పదమైంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ అంటే ఒక్కరేనని, అల్లు అర్జున్ పేరు ముందర ఆ బిరుదును ఎందుకు చేర్చారంటూ మెగా అభిమానులు ‘ఆహా’ నిర్వాహకులపై మండిపడ్డారు. ఈ వివాదాన్ని వెంటనే గుర్తించిన ‘ఆహా’ టీమ్ తన తప్పును సరిదిద్దుకుంది. మెగాస్టార్ అభిమానులకు ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పింది. సాంకేతిక తప్పిదం వల్లే అలా జరిగింది తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ‘ఒకే ఒక్క మెగాస్టార్.. మనందరికీ ఇది తెలుసు’ అంటూ వివాదానికి చెక్ పెట్టింది.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రభాస్ సాయం.. మరింత క్రేజ్

Image
‘ఆ!’, ‘కల్కి’ సినిమాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వ‌ర్మ రూపొందిస్తోన్న మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’. ఈ సినిమా ద్వారా తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టించారు. ఇప్పటికే ప్రముఖ నటి సమంత విడుదల చేసిన ‘జాంబీ రెడ్డి’ ఫ‌స్ట్ బైట్‌ (టీజర్)కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ల‌భించింది. జ‌న‌వ‌రి 2న ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ (ట్రైలర్) విడుద‌ల కానుంది. ఈ ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్‌‌గా మారిన రెబ‌ల్ స్టార్ ఆవిష్కరించ‌నున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ గురువారం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసింది. టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వ‌ర్మ ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావ‌డం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా, యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ

రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిది.. అన్నీ తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా: మోహన్ బాబు

Image
సూపర్‌స్టార్ రాజకీయాల్లో యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31వ తేదీన రాజకీయ పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలోనే రజినీ అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జయి చెన్నైలోని ఇంటికి చేరుకున్న ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహా మేరకు రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. రజినీ నిర్ణయంపై అభిమానులు తీవ్ర నిరాశకు గురికాగా.. కొందరేమో ఆయన నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే రజినీకి అత్యంత సన్నిహితుడు, సీనియర్ నటుడు కూడా రజినీకి మద్దతుగా నిలిచారు. రజినీలాంటి ముక్కుసూటి మనిషి రాజకీయాల్లో రాణించలేరని అన్నారు. రాజకీయం లాంటి రొచ్చులోకి వెళ్లి బురద అంటించుకోకూడదని రజినీ సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు మోహన్‌బాబు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. Also Read: ‘రజినీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీకందరికీ తెలుసు. తన ఆరోగ్య రీత్యా పాలిటిక్స్‌లోకి రావట్లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధే అయినప్పటికీ, ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తాను రాజకీయాల్లోకి రాకపోవడం

Naga Babu: నవ దంపతులు నిహారిక, చైతన్యలకు కరోనా.. క్లారిటీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు

Image
కరోనా క్రమంగా తగ్గిపోతుందనుకున్న తరుణంలో మెగా కుటుంబంలో కరోనా కలకలం రేగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. RRR షూటింగ్‌లో పాల్గొంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా సోకిందంటూ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాతి రోజే వరుణ్ తేజ్ కూడా తనకు కరోనా పాజిటివ్ అని పేర్కొనడంతో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పైగా ఉపాస‌న సైతం త‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లో నెగెటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయని తెలపడంతో అందరి కన్ను మెగా ఫ్యామిలీపై పడింది. రీసెంట్‌గా జొన్నలగడ్డ చైతన్యతో మ్యారేజ్ కావడం, అనంతరం నిహారిక బర్త్ డే, ఆ వెంటనే క్రిస్మస్ రావడంతో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి పార్టీలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో వేడుక‌లో ప్ర‌తి ఒక్కరూ చాలా స‌న్నిహితంగా మెలిగినట్లు ఆ ఫొటోలు చూస్తే అర్థమైపోతుంది. దీంతో మరి నవదంతులు నిహారిక, చైతన్యలకు కూడా కరోనా సోకి ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. నిహారికకు కూడా కరోనా సోకి ఉంటుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. హనీమూన్ కోసం మాల్దీవుల‌కు వెళ్లే ముందు డిసెంబ‌ర్ 26వ తేదీన ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం నిహారిక‌,

మహేశ్‌ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చిన వార్నర్.. ఈ వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే

Image
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ తెలుగువారికి సుపరిచితుడే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరపున మెరుపులు మెరిపించడంతో పాటు తెలుగు సినీ పాటలకు డ్యాన్సులు వేస్తూ అలరిస్తుంటాడు. ఆయన టాప్ హీరోల పాటలు, డైలాగులకు తన మేనరిజాన్ని అప్లై చేసి ప్రేక్షకులను తరుచూ అలరిస్తుంటాడు. గతంలో పాటలకు స్పెప్పులు వేసి అదరగొట్టిన వార్నర్ న్యూ ఇయ్ వేళ సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌ మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మహేశ్‌బాబు 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను సెలక్ట్ చేసుకొని రీఫేస్ యాప్ సహాయంతో వార్నర్ ఓ వీడియోను రూపొందించాడు. అందులో మహేశ్ ఫేస్‌కి బదులుగా తన ఫేస్‌ని యాడ్ చేశాడు. కొన్ని డైలాగులకు ఎక్స్‌ప్రెషన్లు కూడా ఇచ్చాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సూపర్‌స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ వీడియో నెటిజన్లతో పాటు మహేశ్‌ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

గోవాలో ఎంజాయ్‌మెంట్ షురూ.. అప్పుడే ఫొటోలు వదిలిన సమంత.. వెరీవెరీ హాట్ గురూ!

Image
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవా టూర్ వేసిన .. ఎప్పటిలాగే తన హవా షురూ చేసేసింది. వెకేషన్ ట్రిప్స్ అంటే తెగ ఇష్టపడే ఈ బ్యూటీ ఎప్పుడు ఏ టూర్ వేసినా తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేయడం కామన్‌గా జరిగేదే. తాజాగా మళ్లీ అదే స్టార్ట్ చేసేసింది. 2021 కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి భర్త నాగ చైతన్యతో గోవా ఫ్లైట్ ఎక్కిన సామ్.. అక్కడి రిసార్ట్స్‌లో ఎంజాయ్‌మెంట్ షురూ చేసింది. తాజాగా అందుకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. చైసామ్ దంపతులకు గోవా అనేది ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. కొన్నేళ్లపాటు ప్రేమ ప్రయాణం సాగించిన ఈ రొమాంటిక్ జోడీ పెళ్లి బంధంతో ఒక్కటైంది కూడా గోవాలోనే. అందుకే ప్రతి ఏడాది న్యూ ఇయ‌ర్ వేడుక‌ల కోసం గోవా వెళ్తుంటారు చైసామ్ దంప‌తులు. ఈ సారి క‌రోనా మహమ్మారి భయం ఉన్నా కూడా గోవా టూర్ వేసి అక్కడి ఆహ్లాద‌క‌ర‌మైన వాతావర‌ణాన్ని ఎంజాయ్ చేస్తూ చిలౌట్ అవుతున్నారు అక్కినేని స్టార్స్. ఈ నేపథ్యంలో స‌మంత తాజాగా షేర్ చేసిన పిక్ చూస్తుంటే.. భ‌ర్త నాగ చైతన్యతో పాటు బెస్ట్ ఫ్రెండ్‌, డిజైన‌ర్ శిల్పారెడ్డితో క‌లిసి ఆమె ఈ టూర్ వేసిందని తెలుస్తోంది. అందరూ కలిసి

2020కి గుడ్ బై చెప్పేసిన ఖిలాడీ.. 2021 సర్‌ప్రైజ్‌తో రెడీగా ఉన్న రవితేజ.. ఇదీ విషయం

Image
ఎన్నో అనుభవాలు.. మరెన్నో జ్ఞాపకాలు మిగిల్చిన 2020 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ తన లేటెస్ట్ మూవీ '' అప్‌డేట్ ఇచ్చారు మాస్ మహారాజ్ . రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి 2021 సర్‌ప్రైజ్ రెడీగా ఉందని తెలిపారు. రేపు అనగా 2021 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు సిద్ధంగా ఉండండని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా రాబోతున్న ఈ 'ఖిలాడీ' మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ మాస్ అభిమానులను యమ అట్రాక్ట్ చేస్తూ విశేష స్పందన తెచ్చుకుంది. Also Read: ప్రస్తుతం ‘ఖిలాడీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్న రవితేజ.. ఇటీవలే సెట్స్ మీద దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి 'ఇన్ యాక్షన్ మోడ్' అంటూ క్రేజీ క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఖిలాడీ వెయిటింగ్ ఇక్కడ అంటూ కామెంట్ల

తిరుమల శ్రీవారి సేవలో సునీత.. పెళ్లి డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించిన ఫేమస్ సింగర్

Image
టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ రెండో వివాహానికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ తన నిశ్చితార్థపు ఫొటోలు షేర్ చేశారు సునీత. డిజిట‌ల్ మీడియా ప‌ర్స‌న్ రామ్ వీర‌ప‌నేనిని త‌ను వివాహం చేసుకోబోతున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. దీంతో సునీత రెండో వివాహం తాలూకు విషయాలు నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి డేట్ కన్ఫర్మ్ చేసిన ఆమె.. పెళ్లికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 10 నెలల అనంతరం స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జ‌న‌వ‌రి 9న త‌మ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని సునీత పేర్కొన్నారు. త‌న‌కు మంచి జీవితాన్ని అందించాల‌ని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికే ఇప్పటికే సునీత నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఘనంగా జరిగాయి. శనివారం (డిసెంబర్ 26) సాయంత్రం జరిగిన సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరై ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. నిజానికి డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకోవాల‌ని ఈ జంట భావించిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి జాత‌కాల ప్ర‌కారం స‌రైన ముహూర్తాలు లేక‌పోవ‌డంతో జ‌న‌వ‌రి 9వ తేదీన ఈ

భర్త నాగ చైతన్యతో సమంత న్యూ ఇయర్ ట్రిప్.. గోవాలో చిల్ కాబోతున్న రొమాంటిక్ జోడీ

Image
ప్రపంచానికే ఎన్నో అనుభవాలను నేర్పుతూ కష్ట సుఖాలంటే ఎలా ఉంటాయో తెలిపిన 2020కి నేటితో ముగింపు పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలకు వీడ్కోలు చెబుతూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు కానీ ఈ 2020కి వీడ్కోలు చెప్పడం ప్రత్యేకం అంటున్నారు జనం. ఇకపోతే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కోలా ప్లాన్ చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలంతా వారి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి 2021 సంవత్సరానికి వెల్కమ్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవాను వేదికగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు భర్త నాగ చైతన్యతో కలిసి గోవా పయనమైంది సామ్. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం చైసామ్ జోడీ కెమెరా కంటికి చిక్కింది. ఇద్దరూ ముఖానికి మాస్కులు ధరించి గోవా బయల్దేరారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ సమయం దొరికినప్పుడల్లా అలా అలా షికార్లు కొట్టే ఈ అక్కినేని జోడీ గోవాలోని ప్లష్‌ రిసార్ట్‌లో న్యూ ఇయర్‌ వేడుకలను

రెండు సార్లు కొవిడ్ టెస్ట్ చేయించుకున్నా: అల్లు శిరీష్

Image
మెగా ఫ్యామిలీని కరోనా వైరస్ ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్‌కు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. మెగా హీరోలంతా డిసెంబర్ 25న జరిగిన క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు. ఇక్కడి నుంచే వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేశారు. ‘‘నేను రెండు సార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నాను. రెండు సార్లూ నెగెటివ్ అని తేలింది. ఈ సమయంలో కొవిడ్-19, ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్నాను. ప్రయాణం చేశాను. అపరిచితులైన 100 మందితో రోజూ షూటింగ్‌లో పాల్గొంటాను. నేను మాస్క్ ధరిస్తాను, శానిటైజర్స్ వాడతాను, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాను. అయినప్పటికీ, కొవిడ్ సోకిన వ్యక్తిని కలవకుండా ఉండటం అనేది ప్రాక్టికల్‌గా కుదరదు. నేను సురక్షితంగా ఉండటానికి కారణం ఆయుర్వేదం, అదృష్టం అని నేను నమ్ముతాను. వందేళ్ల క్రితం వరకు మనిషి తన జీవి

మహేష్ బాబు కూతురికి కరోనా టెస్ట్

Image
కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యాధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ముందస్తు రక్షణా చర్యల్లో భాగంగా సూపర్ స్టార్ కుమార్తె సితార కొవిడ్-19 టెస్ట్ చేయించుకుంది. తన ఇంట్లోనే డాక్టర్‌కు స్వాబ్ శాంపిల్స్ ఇచ్చింది. తాను స్వాబ్ శాంపిల్స్ ఇస్తున్న వీడియోను సితార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కాస్త భయం భయంగానే శాంపిల్స్ ఇస్తున్నట్టు కనిపించింది సితార. అయితే, కొవిడ్ పరీక్ష చేయించుకోవడానికి అస్సలు భయపడవద్దని తన వయసు పిల్లలకు చెబుతోంది సితార పాప. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మెసేజ్ ఇచ్చింది. ‘‘కొవిడ్ టెస్ట్ తొలిసారి చేయించుకున్నాను. దీని గురించి నా తోటి వయసున్న పిల్లలకు కాస్త సమాచారం ఇస్తున్నాను. ఈ పరీక్ష చేసుకోవడానికి ముందు నేను సంకోచించాను. కానీ, అమ్మ పక్కనే ఉండటంతో ధైర్యంగా చేయించుకున్నాను. అమ్మ నా చేయి పట్టుకుని ఉంది. మీరు కనుక స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని కలుస్తున్నట్టయితే కొవిడ్ టెస్ట్ చేయించుకోవడం మరిచిపోకండి. మీరు సురక్షితంగా ఉన్నారో లేదో కచ్చితంగా తెలుసుకోండి. నేను

Chiranjeevi: నీ ప్రయాణం స్ఫూర్తిదాయకం.. సోనూ సూద్‌పై చిరంజీవి ప్రశంసలు

Image
వెండితెరపై తన విలనిజంతో పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు లాక్‌డౌన్ సమయంలో మానవత్వాన్ని చాటుకున్నారు. కొన్ని వేల మంది వలస కార్మికులకు అండగా నిలబడ్డారు. ముంబైలో చిక్కుకుపోయిన వలస కార్మికులను తన సొంత ఖర్చులతో బస్సులు, ట్రైన్లు, విమానాలు ఏర్పాటు స్వస్థలాలకు చేర్చారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో పేద ప్రజలకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్నారు. తన సేవను అక్కడితో ఆపకుండా పేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ఆపదలో ఉన్నాం ఆదుకోండి అని వేడుకుంటోన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్నారు. అందుకే వారంతా సోనూ సూద్‌ను మనిషి రూపంలో ఉన్న దేవుడు అంటున్నారు. మహానుభావుడు అని పిలుస్తున్నారు. అయితే, తాను మహానుభావుడిని కాదని అంటున్నారు సోనూ సూద్. తన శక్తి మేర సాయం మాత్రం చేస్తున్నానని చెబుతున్నారు. అంతేకాదు, ‘’ అనే టైటిల్‌తో ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు. అంటే ‘నేను మహానుభావుడిని కాదు’ అనే అర్థం వస్తుంది. రచయిత మీనా అయ్యర్‌తో కలిసి సోనూ సూద్ రచించిన ఈ పుస్తకాన్ని ఈ నెల మొదట్లో విడుదల చేశారు. ఈ పుస్తకం చదివిన మౌని రాయ్, తుషార్ కపూర్, అపర్‌శక్తి ఖురానా, రాజ్‌కు

‘మెయిల్’ టీజర్: ప్రియదర్శి కంప్యూటర్ ట్రైనింగ్.. నవ్వు ఆపుకోలేరు.. ఆ రోజులు గుర్తొస్తాయి!

Image
తెలుగు ప్రేక్షకుల‌ను ఈ ఏడాది ఎంట‌ర్‌టైన్మెంట్‌తో అల‌రించిన అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’.. రానున్న కొత్త సంవత్సరం 2021కి సరికొత్తగా ఆహ్వానం పలుకుతుంది. అందులో భాగంగా వైజయంతీ మూవీస్ సంస్థలో భాగమైన స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంక ద‌త్, స్వప్న ద‌త్ నిర్మాత‌లుగా ఉద‌య్ గుర్రాల ద‌ర్శక‌త్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘కంబాలపల్లి కథలు’లో మొదటి భాగంగా ‘మెయిల్‌’‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ వెబ్ సిరీస్ ఛాప్టర్ 1 ‘మెయిల్’ను విడుదల చేస్తోంది. ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ప్రజలు దాని వాడకం తెలిసీ తెలియక ఎలా ప్రవర్తించారనే కథాంశంతో దర్శకుడు ఉదయ్ గుర్రాల హాస్య భరితంగా, మనసుకు హత్తుకునేలా ‘మెయిల్‌’ను తెర‌కెక్కించారని నిర్మాత స్వప్న దత్ తెలిపారు. బుధ‌వారం మెయిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రియ‌ద‌ర్శి ప్రధాన పాత్రలో న‌టించారు. ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆ పాత రోజుల్ని గుర్తుచేసుకోవడం ఖాయం. ఎందుకంటే ఇందులో ప్రియదర్శి కంప్యూటర్ ట్రైనర్. కానీ, కంప్యూటర్ భాగాలను సరిగా పలకడం కూడా రాదు. ‘2005.. అప్పుడప్పుడే ఊర్లళ్ళో కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు..’ అని ఈ టీజర్‌ను మొదల

రామ్ ‘రెడ్’ నుంచి ‘డించక్’ సాంగ్: మణిశర్మ మాస్ బీట్.. హెబ్బా హాట్

Image
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తిరుమల కిశోర్ దర్శకత్వంలో రూపొందిన ‘రెడ్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ ఈ చిత్రంలో కథానాయికలు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చేసిన ఈ సినిమా ఇటు క్లాస్‌నీ అటు మాస్‌నీ ఆకట్టుకుంటుందని దర్శకుడు తిరుమల కిషోర్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రం నుంచి మంచి మాస్ సాంగ్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. రామ్, హెబ్బా పటేల్‌పై చిత్రీకరించిన ఈ స్పెషల్ మాస్ సాంగ్ లిరికల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది చిత్ర నిర్మాణ సంస్థ. మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్ అదిరిపోయింది. కాసర్ల శ్యామ్ మంచి క్యాచీ లిరిక్స్ అందించారు. సాకేత్, కీర్తనా శర్మ ఆలపించారు. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. అందుకే, రామ్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇక హెబ్బా అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాటను విడుదల చేసిన సందర్బంగా నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ..

‘షకీలా’ అంటేనే సెన్సార్ ఇవ్వరు.. దీన్ని సినిమాలానే చూడండి: నటి షకీలా

Image
అల‌నాటి శృంగార తార ష‌కీలా జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ష‌కీలా’. ఇంద్రజీత్ లంకేశ్ ర‌చ‌న, ద‌ర్శక‌త్వం వ‌హించ‌గా రీచా చెడ్డ, పంక‌జ్ త్రిపాటి, ఎస్తర్ నోర‌న్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మ‌లా‌ని కీల‌క పాత్రలు పోషించారు. జనవరి 1న యుఎఫ్‌ఓ మూవీస్ ద్వారా ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. చిత్ర ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ.. ‘చాలా రోజుల త‌ర్వాత ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ ముందుకు వ‌స్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసిన ప్రతి ఒక్కరికీ కృత‌జ్ఞతలు. ష‌కీలా గారి లైఫ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను. జ‌న‌వ‌రి 1 సినిమా విడుద‌ల‌వుతుంది. త‌ప్పకుండా చూడండి’ అని అన్నారు. సందీప్ మ‌లా‌ని మాట్లాడుతూ.. ‘నాకు ఏడు సంవ‌త్సరాల వ‌య‌సున్నప్పటి నుండి నేను శ్రీ‌దేవి గారికి వీరాభిమానిని. తెలుగులో చాలా సినిమాల‌కు వ‌ర్క్ చేశాను. ఇప్పుడు ‘ష‌కీలా’ సినిమా ద్వారా మిమ్మల్నంద‌రినీ క‌లుసుకోవ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఒక వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియ‌

2021లో అందరికీ మంచి జరగాలని శ్రీవారిని వేడుకున్నా: రాజేంద్రప్రసాద్

Image
కరోనా వైరస్ మనుషుల్లో ఎంతగానో మార్పులు తీసుకు వచ్చిందని, అద్భుతమైన పాఠాన్ని నేర్పించిందని అన్నారు సినీనటుడు . బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల ఆరోగ్య పద్ధతులు, అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయని, కరోనా సమయంలో టీటీడీ అధికారులు కోవిడ్ నిబంధనలతో భక్తులకు దర్శనం కల్పించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, 2021లో అయినా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి రావాలని శ్రీవారిని వేడుకున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తాను వరుస సినిమాలో బిజీగా ఉన్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. గాలి సంపత్, ఎఫ్3, రౌడీ బేబీ, లవ్ ఎట్ 65 తదితర చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు.

రజినీ సర్.. నిస్వార్థమైన నిర్ణయం తీసుకున్నారు: లారెన్స్

Image
అనారోగ్యం కారణంగా రాజకీయ పార్టీ స్థాపించడం లేదంటూ సూపర్‌స్టార్ చేసిన ప్రకటన ఆయన అభిమానులతో పాటు సెలబ్రెటీలను కూడా నిరాశపరిచింది. అయితే రజినీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజినీకాంత్ సరైన నిర్ణయం తీసుకున్నారని కొందరు అభిప్రాయపడుతుంటే, కొందరు మాత్రం ఆవేదన చెందుతున్నారు. Also Read: అయితే రజనీకాంత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ట్వీట్ చేశారు. ‘గురువా మీరు తీసుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్. మాకు అన్నింటికంటే మీ ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. మిమ్మల్ని న‌మ్ముకుని మీ క్షేమం కోరుకుంటున్న వారి కోసం నిస్వార్ధమైన నిర్ణయం తీసుకున్నారు. ఇత‌రుల ప‌ట్ల తీసుకునే శ్రద్ధే మిమ్మల్ని గొప్పవారిని చేసింది. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని రాఘ‌వేంద్ర స్వామిని ప్రార్థిస్తా’ అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు. Also Read: ఈ నెల 31న రాజకీయ పార్టీ ప్రకటిస్తానంటూ రజినీకాంత్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో ‘అన్నాత్తై’ షూటింగులో ఉండగా ఆయనకు రక్తపోటు పెరిగిపోయి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజుల తర్వాత డాక్టర్లు డిశ్చార్జ్ చేయడంతో

నిర్మాతగా సోనూసూద్.. స్ఫూర్తి నింపే కథల కోసం వేట!

Image
వెండితెరపై హీరోగా వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో ముంబయిలో అడుగుపెట్టారు . అయితే హీరోలతో దెబ్బలు తినే విలన్ వేషాలే ఆయనకు స్వాగతం పలికాయి. అయినా నిరాశ పడకుండా బాలీవుడ్‌లోనే కాకుండా అనేక భాషల్లో విలన్ పాత్రలు వేస్తూ అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే సినిమాల్లో హీరో కాకపోయినా.. లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులు, నిరుపేదలకు ఆదుకుని నేషనల్ హీరో అంటూ అందరికీ ప్రశంసలు అందుకున్నారు. ఇన్నాళ్లూ ఆన్‌ స్క్రీన్‌పై కనిపించిన సోనూసూద్ నిర్మాతగా మారనున్నారట. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నేను నిర్మాతగా మారుతున్నాను. ప్రజల్లో స్ఫూర్తి నింపే కథలు, నేను చేయాలనుకున్న స్క్రిప్ట్స్‌ కోసం అన్వేషిస్తున్నాను. అన్నీ కుదిరితే త్వరలోనే నిర్మాతగా మీ ముందుకొస్తా’ అని సోనూసూద్ అన్నారు. సోనూసూద్‌కి ప్రస్తుతం ప్రజల్లో ఉన్న క్రేజ్‌ని బట్టి ఆయనతో విలన్ వేషాలు వేయించేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లోనూ నెగిటివ్ షేడ్స్ ఉండే ఆయన పాత్రకు కొన్ని మార్పులు చేశారట. చిరంజీవి సూచనల మేరకు దర్శకుడు ఆ మార్పులు చేసినట్లు ఇటీవలే సోనూసూ

పోలీసులపై గౌరవం చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ పనికి అందరూ ఫిదా

Image
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి పోలీస్‌ శాఖ అంటే అపారమైన గౌరవం. ఆ విషయాన్ని ఆయన బహిరంగ వేదికలపైనే ఎప్పుడూ చెబుతుంటారు. ఆ గౌరవాన్ని ఆయన మరోసారి చాటుకుని అందరినీ ఫిదా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ సందర్భంగా యాక్షన్‌ సన్నివేశాలు షూట్ చేశారు. దీనిలో భాగంగా పోలీసులకీ, విద్యార్థులకీ మధ్య ఘర్షణ సన్నివేశాల్ని తెరకెక్కించారు. Also Read: ఈ సందర్భంగా పోలీసులు అల్లర్ల సమయంలో రక్షణగా అడ్డు పెట్టుకునే కవచాల్ని వినియోగించారు. వాటిపై పోలీస్‌ అని రాసి ఉంది. విద్యార్థులు పోలీసులపై దాడి చేసే సన్నివేశంలో ఆ కవచాలను కొట్టాల్సి ఉంది. అయితే పోలీస్ అనే పేరుపై కొట్టడం ఇష్టం లేక పవన్ వాటిపై ఉన్న స్టిక్కర్లను స్వయంగా తొలగించారు. ఆ సమయంలో యూనిట్ సభ్యులు తీసిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన వాళ్లు పవన్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అంటూ పొగిడేస్తున్నారు.

మేం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ‘సోలో’ సక్సెస్ మీట్‌లో సాయి తేజ్

Image
సుప్రీమ్ హీరో , నభా నటేశ్ జంటగా శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థ డిసెంబ‌ర్‌ 25న విడుదల చేసింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు మంగళవారం చిత్ర యూనిట్ థాంక్స్‌ మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్‌.నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సాయి తేజ్‌ మాట్లాడుతూ.. ‘సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలింది. మార్చిలో పాటల చిత్రీకరణ అయిపోయి ఉంటే మేలో మీ ముందుకు వచ్చేసేవాళ్లం. కానీ, ఆ సమయంలో కొవిడ్‌ ప్రభావం మొదలై, లాక్‌డౌన్ స్టార్ అయి అందరం అయోమయ పరిస్థితిలో పడిపోయాం. సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే భయం.. అందరూ టీవీలు, ఓటీటీలకు అలవాటు పడిపోతారేమోనని భయం. చాలా వరకు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మనం కూడా చేయాలా వద్దా? అనే తర్జనభర్జనలో ఉన్నాం. అలాంటి సమయంలో మా నిర్మాతకు జీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. జీ వాళ్లకు

సినిమా టికెట్ ధర పెంచడం కరెక్ట్ కాదు.. కరోనా ప్రభావం ప్రేక్షకుడిపైనా ఉంది: ఆర్.నారాయణమూర్తి

Image
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మధ్య కొన్ని వరాలు కురిపించిన విషయం తెలిసిందే. దీంట్లో ఓ వరం టికెట్ ధరల సవరణ. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలు పెంచుకోవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించారు. దీని వల్ల సామాన్యుడిపై భారం పడుతుందని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. టికెట్ ధరలు పెంచవద్దని సినీ నిర్మాతలను ఆయన విజ్ఞప్తి చేశారు. సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా డిసెంబర్ 25న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలపడానికి చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆర్.నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి తనదైన శైలిలో మాట్లాడారు. ‘‘కరోనా సమయంలో మానవజాతి అల్లకల్లోలమైంది. ముఖ్యంగా సినీ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. వలస కార్మికుల్లాగా సినీ కార్మికుల భవిష్యత్తు కూడా ఏంటి? అని అం

రామ్ చరణ్‌తో క్వారంటైన్‌లో ఉపాసన: నాకూ పాజిటివ్ రావచ్చు.. మెగా కోడలు ఎమోషనల్ పోస్ట్

Image
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం ఉదయం స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో తనను కలిసినవారంతా తక్షణమే కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా కోలుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు. అయితే, రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలియగానే మెగా అభిమానులు కంగారు పడ్డారు. దీనికి తోడు రామ్ చరణ్ సోదరుడు వరుణ్ తేజ్‌కు కూడా పాజిటివ్ రావడం మరింత కంగారు పెట్టింది. అయితే, భయపడాల్సిన అవసరం లేదని వీరిద్దరూ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌ల్లో పాల్గొంటారని మెగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రామ్ చరణ్‌కు కరోనా వైరస్ సోకడంపై ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ సంవత్సరం కూడా వెళ్లిపోతోంది. 2021 అయినా బాగుండాలని ఆశిస్తున్నాను. ఎలాంటి లక్షణాలు లేవు.. ఆయన చాలా దృఢంగా ఉన్నారు. నాకు నెగిటివ్ వచ్చింది. కానీ, నాకు కూడా

Vakeel Saab: పవన్ కళ్యాణ్ షూటింగ్ ఫినిష్.. పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బోణీ కపూర్

Image
రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత 'వకీల్‌ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కంటే ముందే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ నేటితో ఫినిష్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ పవర్ త్వరలోనే చూడబోతున్నారంటూ చిత్ర నిర్మాత బోణీ కపూర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు పవన్‌తో చిత్రయూనిట్ దిగిన ఫొటోలను షేర్ చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ 'వకీల్ సాబ్' మూవీ రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటించారు. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. నిజానికి రాబోయే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ.. అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ రేసులోకి మారి

Kushboo: రజినీ సర్ నిర్ణయం ఎంతోమంది తమిళుల హృదయాలను గాయపర్చింది.. కుష్బూ ఎమోషనల్ ట్వీట్

Image
డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ ప్రకటిస్తానని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన ఊహించని విధంగా యూ టర్న్ తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రజినీ వేసుకున్న ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. రజినీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య కూడా ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని రజినీని కోరారట. ఈ పరిస్థితుల నడుమ రజినీకాంత్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. నా ఆరోగ్య సమస్యల వల్ల సన్ పిక్చర్స్ కళానిధి మారన్ చిత్రం షూటింగ్ క్యాన్సిల్ కావడంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చాలా నష్టం వాటిల్లింది. ఇదంతా కేవలం నా ఆరోగ్యం వల్లే వచ్చింది. ఇది నాకు దేవుడి హెచ్చరికలా అనిపించిందని ఎమోషనల్ అవుతూ రజనీకాంత్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తన వల్ల ఇతరులు సమస్యలు ఎదుర్కోవడం ఇష్టం లేదని, అందుకే పార్టీ పెట్టడం లేదు, రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా రజినీకాంత్ నిర్ణయంపై ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు. ''డియర్ రజనీ సర్.. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది తమిళుల హృదయాలను గాయపరిచింది. కానీ మీ సమస్యను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. మీ స్నేహితురాలిగా, శ్రేయ

అక్కను ప్రభాస్‌తో చూడాలని ఉంది: మనసులో మాట బయటపెట్టిన రకుల్ తమ్ముడు

Image
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసిన తన తమ్ముడు అమన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘తెర వెనుక’ అనే చిత్రం ద్వారా అమన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. నిజానికి ఈ సినిమా కన్నా ముందు ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రాన్ని అమన్ అంగీకరించారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది. ఒక పాట కూడా విడుదల చేశారు. కానీ, ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ‘తెర వెనుక’ చిత్రం మాత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం అమన్ తన ‘తెర వెనుక’ చిత్ర ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి మాట్లాడారు. తన తండ్రి ఆర్మీ రిటైర్డ్ కల్నల్ అని, తల్లి ఇంట్లోనే ఉంటారని చెప్పారు. తాను, అక్క సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తామంటే నాన్న ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అమన్ అన్నారు. ‘‘మీరు చేసే పని కోసం బాగా కష్టపడండి.. 100 శాతం కృషి చేయండి అని నాన్న చెప్పారు. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఇలానే ప్రోత్సహిస్తున్నారు. నాన్న ప్రోత్సహించారు కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను’’ అని అమన్ చెప్పుకొచ్చారు. తన అక్క రకుల్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘

క్రాక్ డబ్బింగ్ చెబుతున్న రవితేజ.. న్యూ ఇయర్ ఫన్ మామూలుగా ఉండదట!

Image
మాస్ మహారాజ్ కొత్త సినిమా 'క్రాక్' ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ థియేటర్‌లో డబ్బింగ్ చెబుతున్నారు హీరో రవితేజ. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. డబ్బింగ్ పనులతో బిజీ అంటూ ట్వీట్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మించారు. చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటించగా.. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం. మాస్ ఆడియన్స్ ఉగిపోయేలా రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. నూత‌న సంవ‌త్సరానికి కానుకగా జ‌న‌వ‌రి 1వ తేదీన క్రాక్ థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మేరకు న్యూ ఇయర్

వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్.. క్రిస్మస్ వేడుకలే కొంపముంచాయా?

Image
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా మంగళవారం ఉదయం తెలియజేశారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే కోలుకొని మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని పేర్కొన్నారు. ఈ రెండు మూడు రోజుల్లో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రామ్ చరణ్‌కు పాజిటివ్ అని తెలిసిన వెంటనే మెగా అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే, ఇప్పుడు చరణ్ తమ్ముడు, నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు కూడా కొవిడ్-19 పాజిటివ్ అని రావడం మెగా ఫ్యాన్స్‌ను కంగారు పెడుతోంది. తనకు కూడా కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఈరోజు ఉదయం కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. స్వల్ప లక్షణాలతో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను’’ అని వరుణ్ తేజ్ పేర్కొ్న్నారు. ఇదిలా ఉంటే, మెగా ఫ్యామిలీలోని రెండో తరం సభ్యులంతా డిసెంబర్ 25న క్రి

Vijay: మాస్ట‌ర్ విడుదల తేదీ ఫిక్స్.. బాక్సాఫీస్ దుమ్ముదులిపేందుకు రెడీ అయిన విజయ్

Image
కరోనా కారణంగా మూతపడిన థియేటర్ గేట్లు ఇటీవలే తెరుచుకున్నాయి. దాదాపు ఎనిమిది నెలల పాటు ప్రేక్షకులు లేక సినిమా హాల్స్ బోసిపోయాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దుమ్ముదులిపేందుకు రెడీ అయ్యారు తమిళ సూపర్ స్టార్, ఇళయదళపతి . తాజాగా ఆయన లేటెస్ట్ మూవీ '' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ 'మాస్టర్' థియేటర్స్‌లో అడుగు పెట్టేస్తున్నారు. మాస్టర్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో జనవరి13న విడుదల చేస్తున్నట్లు తెలిపిన దర్శకనిర్మాతలు.. హిందీలో మాత్రం జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో విజయ్ ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి చిన్నపిల్లల స్కూల్ మాస్టర్‌గా కనిపించనున్నారని టాక్. ఇక మరో తమిళ స్టార్ హీరో విలన్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. 'ఖైదీ' చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'మాస్టర్' మూవీలో విజయ్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించింది. అనిరుద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ

ఐటెమ్ గర్ల్‌గా మారిన మోనాల్.. 3 నిమిషాలకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్

Image
గతంలో రెండు మూడు సినిమాల్లో నటించినా రాని క్రేజ్‌ని బిగ్‌బాస్-4‌తో దక్కించుకుని గుజరాతీ భామ . వీకెండ్‌లో నాగార్జున హోస్ట్ చేసే షోలో హాట్ హాట్ డ్రెస్సులతో యువతను టీవీలకు కట్టిపడేసేది. ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన ఆమెను ఆ హాట్‌నెస్ కోసమే కావాలనే ఫైనల్‌కి ముందు వారం వరకు హౌస్‌లో ఉంచారన్న విమర్శలు వచ్చాయి. అసలు విషయానికొస్తే ఇప్పుడు మోనాల్‌‌కు ఓ క్రేజీ ప్రాజెక్టులో ఐటెమ్‌ గర్ల్‌గా అవకాశం వచ్చిందట. Also Read: హీరోగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఐటెమ్ సాంగ్‌ కోసం మోనాల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే మూడు సినిమాలు ఉండే ఈ సినిమా కోసం మోనాల్ ఏకంగా రూ.15లక్షలు డిమాండ్ చేసిందట. ఇప్పుడు మోనాల్‌కు ఉన్న క్రేజ్‌ను బట్టి నిర్మాతలు ఆ రెమ్యునరేషన్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సాంగ్‌ కోసం మోనాల్ ఈరోజు(మంగళవారం) సెట్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. Also Read:

Chiranjeevi: సమంతతో చిరంజీవి అన్‌సీన్ వీడియో.. మెగాస్టార్ నోట గుండెల్ని పిండేసే గోల్డెన్ వర్డ్స్

Image
అక్కినేని హోస్ట్ చేస్తున్న 'సామ్ జామ్' ప్రోగ్రాంలో మెగాస్టార్ భాగమైన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాంలో మెగాస్టార్ లైఫ్ లోని అనేక విషయాలను రాబట్టి ఎంటర్‌టైన్ చేసింది సమంత. ఈ ఎపిసోడ్ క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న టెలికాస్ట్ అయింది. ఇప్పుడున్న హీరోల్లో త‌న సినిమాలను ఏయే హీరోలు రీమేక్ చేస్తే బాగుంటుందనే దగ్గరనుంచి ఎన్నో విషయాలపై ఓపెన్ అయ్యారు చిరంజీవి. వేట సినిమా ఫ్లాప్ అయిన స‌మ‌యంలో దుప్ప‌టి క‌ప్పుకొని ఏడ్చిన సీక్రెట్స్ కూడా చెప్పేశారు. కాగా తాజాగా సామ్ జామ్ మెగా ఎపిసోడ్ అన్‌సీన్ వీడియో అంటూ మరో వీడియో రిలీజ్ చేసి ఆకట్టుకుంది ఆహా టీమ్. ఈ వీడియోలో మెగాస్టార్ నోట గోల్డెన్ వర్డ్స్ వినిపించాయి. తల్లిదండ్రులు- పిల్లల మధ్య అనుబంధం ఎలా ఉండాలో చెబుతూ గుండెల్ని పిండేశారు చిరంజీవి. అమ్మతో తనకున్న అనుబంధం అంతా ఇంతా కాదని చెప్పిన మెగాస్టార్, అన్ని వేళలా అమ్మకు చేదోడువాదోడుగా ఉండేవాడినని అన్నారు. ''ప్రతి ఒక్కరు కూడా అమ్మ దగ్గర కూర్చొని అమ్మా ఏంటమ్మా ఎలా ఉన్నావు? నాన్న.. నువ్వు నాకోసం ఇంత కష్టపడ్డావు.. తిరిగి నేను నీకేదీ ఇవ్వలేకపోయాను అని చెప్పండి. అప్పుడు వాళ్ళ గుండెలోంచి వచ్చే ఆ వై

కరోనా కోరల్లోంచి బయటపడ్డ రకుల్ ప్రీత్ సింగ్.. హ్యాపీగా ఉన్నానంటూ పోస్ట్

Image
స్టార్ హీరోయిన్ నుంచి కోలుకుంది. వారం రోజుల క్రిందట తనకు కరోనా సోకిందని స్వయంగా ప్రకటించిన ఆమె.. తాజాగా తాను కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని, తాను కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్దించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపింది రకుల్. ''కరోనా నుంచి ఇంత త్వరగా కోలుకున్నానని చెబుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం క్షేమంగా ఉన్నా. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ప్రత్యేకంగా ధ‌న్య‌వాదాలు చెబుతున్నా. 2021ను పాజిటివ్ దృక్ప‌థంతో మొద‌లు పెట్టాల‌ని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ దయచేసి ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌గా ఉంటూ మాస్క్‌లు ధరించండి. అందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను'' అని పేర్కొంది రకుల్. ఇక రకుల్ కెరీర్ చూస్తే.. ప్రస్తుతం ఈ ఢిల్లీ భామ చేతిలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి. క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్ హీరోగా రాబోతున్న సినిమాలో నటిస్తోంది రకుల్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. 'కొండ పొలం' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ మూవీ రిలీజ్ కానుందని టాక్. ద

Enemy: షూటింగ్‌లో ప్రమాదం.. తమిళ హీరో ఆర్యకు గాయాలు

Image
తమిళ స్టార్ హీరో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన నటిస్తున్న ‘ఎనిమీ’ సినిమా షూటింగులో జరిగిన ప్రమాదం కారణంగా ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విశాల్‌తో కలిసి నటిస్తున్న ఆర్య.. యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గాయపడ్డారట. ఈ ఇద్దరు హీరోలు డూప్‌ లేకుండా ఆ సన్నివేశంలో పాల్గొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. Also Read: ‘ఉదయ్‌ వెంటనే స్పందించిన యూనిట్ ఆర్యను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాసేపటి తర్వాత తేరుకున్న తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టి షూటింగులో పాల్గొన్నారట. ‘ఎనిమీ’ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. Also Read: గతంలో బాలా దర్శకత్వంలో వచ్చిన ‘వాడు వీడు’ సినిమాలో విశాల్, ఆర్య కలిసి నటించారు. ఇద్దరూ పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకులను మెప్పించడంతో ఈ చిత్ర కమర్షియల్‌గానూ ఘన విజయం సాధించింది. ఇన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ నటిస్తుండటంతో ‘ఎనిమీ’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

మళ్లీ మేకప్ వేసుకున్న రాజశేఖర్.. యాాదగిరిగుట్టలో కొత్త సినిమా ప్రారంభం

Image
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న హీరో తిరిగి మొహానికి మేకప్‌ వేసుకునేందుకు సిద్ధమయ్యారు. పూలరంగడు, ఆహా నా పెళ్లంట.. చిత్రాల దర్శకుడు దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా యాదగిరిగుట్టలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్‌‌తో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. Also Read: ఈ షెడ్యూల్ ముగిశాక ఫిబ్రవరి నుంచి వికారాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారట. కెరీర్‌ ముగిసిపోయిందనుకున్న సమయంలో గరుడవేగ, కల్కి.. వంటి విభిన్న సినిమాలతో హిట్లు అందుకున్న రాజశేఖర్ తాజా సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వీరభద్రం చౌదరి ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో.. లేదో.. చూడాలి మరి.

‘ఉదయ్‌కిరణ్ బ్రతికుంటే లెక్క వేరే ఉండేది’: డైరెక్టర్ వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు

Image
‘చిత్రం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఉదయ్‌ కిరణ్ చాలా తక్కువ సమయంలోనే లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. వరుస హిట్లతో ఓ సమయంలో అగ్ర హీరోలకు సైతం షాకిచ్చాడు. అయితే అవకాశాలు తగ్గడంతో డిప్రెషన్‌కు గురైన ఆయన ఆత్మహత్య చేసుకుని యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా సక్సెస్ అయిన .. ఇప్పుడు బ్రతికుంటే ఆయన మార్కెట్ విలువ రూ.400కోట్లు ఉండేదని చెబుతున్నారు దర్శకుడు . Also Read: ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే, శ్రీ రామ్ సినిమాలు చేశారు వీఎన్ ఆదిత్య. ఇందులో ‘మనసంతా నువ్వే’ బ్లాక్‌ బస్టర్ హిట్ సాధించగా, శ్రీరామ్.. యావరేజ్‌గా ఆడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆదిత్య.. ఉదయ్‌ కిరణ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. Also Read: ‘హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుసగా మూడు సూపర్ హిట్లు సొంతం చేసుకున్నాడు ఉదయ్. ఇప్పుడు గానీ అలా జరిగుంటే ఆయన మార్కెట్ రూ.400కోట్లకు చేరేది. ‘నువ్వు నేను’ సినిమా కోటిన్నరతో తీస్తే రూ.14 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే ‘మనసంతా నువ్వే’ సినిమాకు రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.16 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అప

‘రాజకీయాలు మనకొద్దు నాన్నా’.. రజినీకాంత్‌‌కు కూతుళ్ల ట్విస్ట్!

Image
‘అన్నాత్తై’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురైన సూపర్‌స్టార్ క్రమంలో కోలుకుంటున్నారు. అపోలో ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జి అయిన నేరుగా చెన్నైలోని ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఆయనతో మాట్లాడారు. రాజకీయాలు, పార్టీ పనులు అంటూ నిత్యం అదే ఆలోచనతో ఉండటం వల్లే మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు రజినీని కోరినట్లు తెలుస్తోంది. Also Read: ‘రాజకీయాలు మనకొద్దు పప్పా.. ఇక ఆ పనులు మానుకోండి’ అని ఇద్దరు కుమార్తెలు రజినీని వేడుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ ప్రకటిస్తానని రజినీకాంత్‌ కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ జెండా, చిహ్నం గురించి అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే రజినీకాంత్ అనారోగ్యానికి గురికావడంతో పార్టీ ప్రకటన ఉంటుందా?.. వాయిదా పడుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. దీనిపై రజినీ మక్కల్ మండ్రం నిర్వాహకుడు తమిళరువి మణియన్ మాట్లాడుతూ.. పార్టీ స్థాపన కార్యక్రమాలు యథావిథిగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ర

నా డైరీలో ఆ పదమే లేదు.. పెళ్లి వార్తలపై హన్సిక ఘాటు రిప్లై

Image
అవకాశాలు వచ్చినంత కాలం వరుస సినిమాలు చేసేయాలి.. కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిలై పోవాలి. ప్రస్తుతం హీరోయిన్లందరూ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇది. అయితే తాను ట్రెండ్ ఫాలో కానని.. సెట్ చేస్తానంటూ గబ్బర్‌సింగ్ డైలాగులు చెబుతోంది హన్సిక. ‘దేశముదురు’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక్కడి నుంచి కోలీవుడ్‌కి వెళ్లాక ఆమె ఫేటే మారిపోయింది. Also Read: వరుస సినిమాలతో అక్కడ స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకుంది. దీంతో కన్నడ, మలయాళ సినిమాల్లోనూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో హన్సిక కెరీర్ నెమ్మదించింది. కొత్త హీరోయిన్ల రాకతో ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. దీంతో హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోనుందంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తలకు హర్ట్ అయిన హన్సిక తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెగేసి చెప్పేసింది. ‘నా డైరీలో పెళ్లి అనే మాటకు ఇప్పట్లో చోటు లేదు. కెరీర్ స్లో అయితే వెంటనే పెళ్లి చేసేసుకోవాలా?’ అని ఎదురు ప్రశ్నిస్తోంది. తాజా వ్యాఖ్యలతో ఈ అమ్మడికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన ల

రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ, ‘ఆచార్య’ యూనిట్‌

Image
దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా మెగా పవర్‌స్టార్ కూడా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం ఆయనే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ‘నాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. కానీ ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను’ అంటూ రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని రామ్‌చరణ్ రిక్వెస్ట్ చేశారు. తన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం వెల్లడిస్తానన్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒకచోట చేరిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆదివారం ఆయన ‘ఆచార్య’ సెట్లో సందడి చేశారు. చెర్రీపై సన్నివేశాలు చిత్రీకరించకపోయినా దర్శకుడు కొరటాల శివ, ఇతర బృందం ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇప్పుడు చెర్రీకి కరోనా పాజిటివ్ రావడంతో మెగా ఫ్యామిలీతో పాటు ‘ఆచార్య’ యూనిట్ టెన్షన్ పడుతోంది. కొద్దిరోజుల క్రితం మెగాస్టార్‌ చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని రోజులైనా తనకు లక్షణాలు కనిపిం

వెంకీ-రానా-చైతూతో మల్టీ స్టారర్.. నెరవేరనున్న డి.రామానాయుడి కల

Image
అక్కినేని కుటుంబంలోని నటులంతా కలిసి నటించిన ‘మనం’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. అలాగే తన కుటుంబంలోని హీరోలంతా కలిసి ఓ సినిమా చేయాలన్నది ప్రముఖ నిర్మాత కలలు కనేవారు. అలాంటి సినిమా కోసం ఎన్నో కథలు విన్నప్పటికీ ఏదీ ఆయనకు నచ్చలేదు. దీంతో తన కల నెరవేర్చుకోకుండానే ఆయన కాలం చేశారు. అయితే 2019లో మామా అల్లుళ్లు వెంకటేష్‌ - నాగచైతన్య కలిసి ‘వెంకీమామ’ చేశారు. కానీ కుటుంబ కథానాయకులంతా కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు. Also Read: తాజాగా రామానాయుడు వారసుడు నిర్మాత డి.సురేష్‌బాబు తన తండ్రి కల నేర్చే పనిలో పడ్డారు. తమ కుటుంబ హీరోలకు తగిన కథ తీసుకొస్తే తాను సినిమా నిర్మిస్తానని చాలాసార్లు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే వెంకటేష్‌, రానా, నాగచైతన్యలను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు వేగేశ్న సతీష్‌ ఓ కుటుంబ కథని సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఆ ముగ్గురు హీరోలు ఇంకా వినలేదట. అయినప్పటికీ ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో అప్పుడే ప్రచారం ఊపందుకుంది. ‘శతమానం భవతి’ లాంటి కుటుంబ కథా చిత్రంతో జాతీయ పురస్కారం సొంతం చేసుకున్న సతీష్ వేగేశ్న ప్రస్తుతం ‘కోతి కొమ్మచ్చి’ అనే చిత్రం చేస్తున్నారు. అది పూర్తయ్యాక దగ్గుబాటి కుటు

‘ఖైదీ’ నటుడు హఠాన్మరణం

Image
చిత్ర సీమలో 2020 సంవత్సరం తీవ్ర విషాదాన్ని నింపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది కరోనా మహమ్మారి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే. ఈ కరోనా వైరస్ కారణంగా మనం చాలా మంది సినీ ప్రముఖులను కోల్పోయాం. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా మహమ్మారికి బలైపోయారు. కేవలం కరోనా వైరస్ వల్లే కాకుండా కొంత మంది నటుల హఠాన్మరణాలు కూడా సినీ ప్రియులను షాక్‌కు గురిచేశాయి. ముఖ్యంగా ప్రముఖ సినీ నటులంతా ఈ ఏడాదే కన్నుమూశారు. టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌లోనూ చాలా మంది ప్రముఖ నటుల్ని మనం కోల్పోయాం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదలుకొని ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, నిషికాంత్ కామత్, సరోజ్ ఖాన్, జగదీప్, రాక్‌లైన్ సుధాకర్, వడివేల్ బాలాజీ, జయప్రకాష్ రెడ్డి, చిరంజీవి సర్జా, సేతురామన్ ఇంకా చాలా మంది సినీ ప్రముఖులను ఈ ఏడాది తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు మరో ప్రముఖ తమిళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ హఠాన్మరణం చెందారు. ‘ఖైదీ’ సినిమాలో మాదక ద్రవ్యాల ముఠాకు సహకరించే పోలీస్ అధికారిగా నటించిన అరుణ్ అలెగ్జాండర్ సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. ఆ

ఆగిన రాజశేఖర్ కుమార్తె సినిమా.. అడివి శేష్‌కు కోర్టు నోటీసులు

Image
హీరో రాజశేఖర్ కుమార్తె శివానీని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ 2018లో ఒక సినిమాను ప్రారంభించారు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ ద్వారా శివానీని వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు. ఈ సినిమాలో హీరో. వెంకట్ రెడ్డి కుంచ దర్శకుడు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ (సత్తిబాబు) ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. హేమాహేమీలందరూ విచ్చేశారు. అయితే, ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కారణాలు ఏమిటో తెలీదు కానీ.. ఈ సినిమాను పక్కన పెట్టేసిన హీరో అడివి శేష్ ఆ తరవాత ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ‘మేజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఈ సినిమా ఆగిపోవడంతో శివానీ రాజశేఖర్ పరిచయం కూడా ఆగిపోయింది. మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యేందుకు శివాని సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే, ‘2 స్టేట్స్’ సినిమా ఆగిపోవడానికి హీరో అడివి శేష్ కారణం అంటున్నారు నిర్మాత సత్తిబాబు. అడివి శేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వల్ల తనకు తీవ