‘మెగాస్టార్’ వివాదం.. అభిమానులకు సారీ చెప్పిన ‘ఆహా’ టీమ్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు చెందిన ఓటీటీ యాప్ ‘’ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్ సమంత ‘సామ్ జామ్’ పేరుతో నిర్వహిస్తున్న టాక్ షోలో వారానికో సెలబ్రెటీ సందడి చేస్తున్నారు. వారు చెప్పే విశేషాల కోసం ప్రేక్షకులు ఆ షోను చూస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. ఇటీవలే చిరంజీవి ఈ షోకు హాజరై ఎన్నో సంగతులు పంచుకున్నారు. త్వరలోనే అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఈ షోలో సందడి చేయనున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ప్రోమో కూడా విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో అల్లు అర్జున్కి ముందు ‘మెగాస్టార్’ అనే బిరుదును చేర్చడం వివాదాస్పదమైంది. టాలీవుడ్లో మెగాస్టార్ అంటే ఒక్కరేనని, అల్లు అర్జున్ పేరు ముందర ఆ బిరుదును ఎందుకు చేర్చారంటూ మెగా అభిమానులు ‘ఆహా’ నిర్వాహకులపై మండిపడ్డారు. ఈ వివాదాన్ని వెంటనే గుర్తించిన ‘ఆహా’ టీమ్ తన తప్పును సరిదిద్దుకుంది. మెగాస్టార్ అభిమానులకు ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పింది. సాంకేతిక తప్పిదం వల్లే అలా జరిగింది తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ‘ఒకే ఒక్క మెగాస్టార్.. మనందరికీ ఇది తెలుసు’ అంటూ వివాదానికి చెక్ పెట్టింది.
Comments
Post a Comment