ఆగిన రాజశేఖర్ కుమార్తె సినిమా.. అడివి శేష్‌కు కోర్టు నోటీసులు

హీరో రాజశేఖర్ కుమార్తె శివానీని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ 2018లో ఒక సినిమాను ప్రారంభించారు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ ద్వారా శివానీని వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు. ఈ సినిమాలో హీరో. వెంకట్ రెడ్డి కుంచ దర్శకుడు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ (సత్తిబాబు) ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. హేమాహేమీలందరూ విచ్చేశారు. అయితే, ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కారణాలు ఏమిటో తెలీదు కానీ.. ఈ సినిమాను పక్కన పెట్టేసిన హీరో అడివి శేష్ ఆ తరవాత ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ‘మేజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఈ సినిమా ఆగిపోవడంతో శివానీ రాజశేఖర్ పరిచయం కూడా ఆగిపోయింది. మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యేందుకు శివాని సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే, ‘2 స్టేట్స్’ సినిమా ఆగిపోవడానికి హీరో అడివి శేష్ కారణం అంటున్నారు నిర్మాత సత్తిబాబు. అడివి శేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వల్ల తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని నిర్మాత సత్తిబాబు కోర్టును ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జనవరి 5 లోగా వివరణ ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని అడివి శేష్‌కు కోర్టు నోటీసులు పంపింది. మొత్తం మీద ఆగిపోయిన సినిమా ఇప్పుడు అడివి శేష్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. మరి ఈ నోటీసులపై అడివి శేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ