రెండు సార్లు కొవిడ్ టెస్ట్ చేయించుకున్నా: అల్లు శిరీష్

మెగా ఫ్యామిలీని కరోనా వైరస్ ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్‌కు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. మెగా హీరోలంతా డిసెంబర్ 25న జరిగిన క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు. ఇక్కడి నుంచే వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేశారు. ‘‘నేను రెండు సార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నాను. రెండు సార్లూ నెగెటివ్ అని తేలింది. ఈ సమయంలో కొవిడ్-19, ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్నాను. ప్రయాణం చేశాను. అపరిచితులైన 100 మందితో రోజూ షూటింగ్‌లో పాల్గొంటాను. నేను మాస్క్ ధరిస్తాను, శానిటైజర్స్ వాడతాను, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాను. అయినప్పటికీ, కొవిడ్ సోకిన వ్యక్తిని కలవకుండా ఉండటం అనేది ప్రాక్టికల్‌గా కుదరదు. నేను సురక్షితంగా ఉండటానికి కారణం ఆయుర్వేదం, అదృష్టం అని నేను నమ్ముతాను. వందేళ్ల క్రితం వరకు మనిషి తన జీవితాన్ని పాములు, గబ్బిలాలు, ఎలుకల మధ్య గడిపాడు. వాటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి మనల్ని రక్షించుకోవడానికి మన పూర్వీకులు ఇప్పటికే ఔషధాలు కనుగొన్నారు. సురక్షితమైన టీకా వచ్చేంత వరకు మనం మాస్క్‌లు ధరించడం మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండటానికి సంప్రదాయబద్ధమైన ఔషధాలు వాడాలి. మన తాతలు వాడిన ఆయుష్ క్వాత్, మృత్యుంజయ రస, చ్యావన్‌ప్రాషా, ఇతర ఆయుర్వేద ఔషధాలు కాలం చెల్లిపోలేదు. సనాతన ధర్మ, ఆయుర్వేదం నుంచి ఈ ప్రపంచానికి అందిన కాలం చెల్లని బహుమతులు. సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. లవ్ యు ఆల్’’ అని అల్లు శిరీష్ పేర్కొన్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ