Posts

Showing posts from January, 2022

HBD Brahmanandam: కింగ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ లైఫ్‌ జర్నీ.. దటీజ్ బ్రహ్మానందం!!

Image
సిల్వర్ స్క్రీన్‌పై అనే పేరు పడిందంటే చాలు ప్రేక్షకులు హుషారెత్తిపోతారు. సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్లకు ఉండే ఈ క్రేజ్ అనేది కమెడియన్లలో ఒక్క బ్రహ్మానందంకి మాత్రమే సొంతం అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. దాదాపు మూడు తరాల ప్రేక్షకులను తనదైన హావభావాలతో చక్కిలిగింతలు పెట్టారు ఈ నవ్వుల రారాజు. నేటికీ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుకున్న మెరుస్తూ థియేటర్లను నవ్వులతో ముంచెత్తుతున్న బ్రహ్మి పుట్టినరోజు ఈ రోజు (ఫిబ్రవరి 1). ఈ సందర్భంగా హాస్య బ్రహ్మకి 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఆ నవ్వుల ప్రయాణంపై ఓ లుక్కేద్దామా.. బ్రహ్మి పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. 1956 ఫిబ్రవరి 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, సత్తెనపల్లిలో కన్నెగంటి నాగలింగాచారి- లక్ష్మీనరసమ్మ దంపతులకు ఆయన జన్మించారు. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చిన ఆయన.. భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో MA పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టారు ఈ ఎక్స్‌ప్రెషన్

లావణ్య త్రిపాఠిని చౌకబారు నటి అంటూ కామెంట్... స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన హీరోయిన్ !

Image
సోష‌ల్ మీడియా ప్రభావం పెరిగిన త‌ర్వాత సినీ సెల‌బ్రిటీలు త‌మ భావాల‌ను ఫ్యాన్స్‌, ఫాలోవ‌ర్స్‌తో నేరుగా చెప్పుకునే అవ‌కాశం క‌లిగింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక్కోసారి ఈ సోష‌ల్ మీడియా కార‌ణంగానే సెల‌బ్రిటీలు ఇబ్బందులు ప‌డుతున్నారు. వివాదాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. నెటిజ‌న్స్ సెల‌బ్రిటీల‌ను నేరుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దానికి ప్ర‌తిగా సెల‌బ్రిటీలు సైతం అంతే గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి విష‌యంలోనూ ఓ నెటిజ‌న్ అలాగే నోరు జారాడు. అయితే లావ‌ణ్య త్రిపాఠి సైతం అంతే గ‌ట్టిగా రిటార్ట్ ఇవ్వ‌డం కొస మెరుపు. అస‌లేం జ‌రిగింది అనే వివ‌రాల్లోకి వెళితే, త‌మిళ‌నాడులో క్రైస్త‌వ మ‌తం స్వీక‌రించ‌నందుకు కొంద‌రు లావ‌ణ్య అనే మైన‌ర్ బాలిక‌ను వేధింపుల‌కు గురి చేశారు. స‌ద‌రు బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మ‌త మార్పిళ్ల‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో కొంద‌రు పోస్టులు చేస్తున్నారు. వారిలో కొంద‌రు చనిపోయిన మైన‌ర్ బాలిక‌కు న్యాయం జ‌ర‌గాలంటూ వాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో లావ‌ణ్య పేరుతో హ్యాష్ ట్యాగుల‌ను క్రియేట్ చేసి పోస్టులు చేశారు. అందులో కొంద‌రు తెలిసో తె

మాల్దీవుల్లో మాళవికా మోహనన్ అందాల ఆరబోత.. వైరల్ అవుతున్న ఫొటోలు

Image
మ‌ల‌యాళ బ్యూటీ మాళ‌వికా మోహ‌న‌న్ క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంటుంది. ఎందుక‌నో ఆమె తెలుగులో మాత్రం క‌నిపించ‌డం లేదు. మ‌రి తెలుగులో అవ‌కాశాలు రావ‌డం లేదో, లేక వ‌చ్చినా చేయ‌డం లేదో తెలియ‌డం లేదు. సినిమాల్లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ ఈ అమ్మ‌డు తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గ్లామ‌ర్ షో చేయ‌డంలో ఈమె త‌ర్వాతే ఎవరైనా అనేంత‌గా హాటు అందాల‌తో ఈమె సోష‌ల్ మీడియాలో కుర్ర కారుని రెచ్చగొడుతుంది. ఇప్పుడు మాళ‌వికా మోహ‌నన్ మాల్దీవుల్లో విహార యాత్ర చేస్తూ బిజీగా ఉంది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను ఆమె త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే రీసెంట్‌గా ఆమె స్విమ్ సూట్ వేసుకుని నాభి అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ షేర్ చేసిన కొన్ని ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. 2013లో ప‌ట్టం పోలే అనే మ‌ల‌యాళ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది మాళ‌వికా మోహ‌న‌న్‌. త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీస‌కుని నిర్ణ‌యాకం అనే మ‌రో మ‌లయాళ సినిమాలో యాక్ట్ చేసింది. త‌దుప‌రి నాను మ‌ట్టు వ‌ర‌ల‌క్ష్మి అనే క‌న్న‌డ సినిమాలో సంద‌డి చేసింది. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ హీరోగా చేసిన‌ పేట‌, ద‌ళ‌ప‌తి విజ

Pushpa Bollywood Collections : హిందీలో అల్లు అర్జున్ ‘పుష్ప‌’ రికార్డ్‌.. త‌గ్గేదే లే అంటున్న ఐకాన్ స్టార్‌!

Image
ఐకాన్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో సాధించిన స‌క్సెస్‌తో అల్లు అర్జున్ హీరోగా నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నారు. ఇక పుష్పరాజ్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 300 కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను సాధించింది. ముఖ్యంగా దక్షిణాది కంటే బాలీవుడ్‌లో పుష్ప సినిమా .. క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డంలో స‌క్సెస్ కావ‌డం గొప్ప విష‌యం. ఎందుకంటే విడుద‌లైన రోజు అంటే డిసెంబ‌ర్ 17న బాలీవుడ్‌లో సినిమా మూడు కోట్ల రూపాయ‌ల పైచిలుకు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇది చాలా త‌క్కువ‌. ఇంకేముంది సినిమా పోయిన‌ట్లేన‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే పుష్ప ది రైజ్ రోజు రోజుకీ వ‌సూళ్ల‌ను పెంచుకుంటూ వ‌చ్చింది. ఇప్పుడు రూ. 100 కోట్ల మార్క్‌ను చేరుకోవ‌డం అనేది బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్‌. ఇక ద‌క్షిణాది నుంచి హిందీలోకి డ‌బ్బింగ్ అయ్యి వంద కోట్ల రూపాయ‌ల మార్కును చేరుకున్న చిత్రాల్లో పుష్ప ది రైజ్ ఐదో స్థానాన్ని ద‌క్కించుకుంది. బాలీవుడ్‌లో వంద కోట్ల రూపాయ‌ల సాధించి ద‌క్షిణాది సినిమాల లిస్టు చూస్తే... 1. బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్

గర్భవతిగా అనుపమ.. అవాక్కైన లేడీ కమెడియన్

Image
కేరళ బ్యూటీ () నెట్టింట్లో చేసే అల్లరి మామూలుగా ఉండదు. తెరపై ఎంత సరదాగా ఉంటుందో సోషల్ మీడియాలోనూ అంతే సరదాగా ఉంటుంది. సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా క్రేజ్ మాత్రం తగ్గదు. ఈ బ్యూటీకి శతమానం భవతి తరువాత ఒక్క హిట్ కూడా పడలేదు. కానీ ఆఫర్లు మాత్రం వచ్చేస్తుంటాయి. అదే అనుపమలోని మ్యాజిక్. అనుపమ అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. ఇక చివరగా అనుపమ రౌడీ బాయ్స్ అంటూ అందరినీ పలకరించింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా అనుపమ అందాలు, పెట్టిన ముద్దులు మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక అనుపమలో నటిగానే సింగర్, డైరెక్టర్ ఇలా ఎన్నెన్నో కోణాలున్నాయి. ఈపాటికే అనుపమ పాటలు కూడా పాడేసింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసింది. గత ఏడాది ఓ షార్ట్ ఫిల్మ్‌లోనూ నటించింది. అలా మొత్తానికి అనుపమ తనలోని టాలెంట్ అంతా చూపించేస్తోంది. తాజాగా అనుపమ కొన్ని స్టిల్స్‌ను షేర్ చేసింది. సినిమా కోసం గర్భవతిగా మారింది అనుపమ. ఆ మూవీలోని స్టిల్స్‌ను ఇప్పుడు షేర్ చేసింది. అందులో తన తండ్రి కూడా ఉన్నాడు. అయితే ఈ ఫోటోలను సడెన్‌గా చూసిన లేడీ కమెడియన్ విద్యల్లేఖ రామన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందట. నిజంగానే గర్భవతి అని ఫీలైందట.. కంగ్రాట్స్ అన

బంగార్రాజు 17 డేస్ కలెక్షన్స్.. సోగ్గాడు ఎంత రాబట్టాడంటే!

Image
'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకు సీక్వల్‌గా వచ్చిన 'బంగార్రాజు' మూవీ తెలుగు తెరపై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. , నాగ చైతన్య హీరోలుగా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ టాక్ రావడం, పోటీలో ఏ పెద్ద సినిమా లేకపోవడంతో కలెక్షన్ల ప్రవాహం పారుతోంది. మరి ఈ బంగార్రాజు 17 రోజుల్లో ఏ మేర కలెక్షన్ల రాబట్టాడో చూద్దామా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజు డే వైజ్ కలెక్షన్స్ చూస్తే.. డే 1: 9.06 కోట్లు డే 2: 7.79 కోట్లు డే 3: 6.72 కోట్లు డే 4: 3.55 కోట్లు డే 5: 1.94 కోట్లు డే 6: 91 లక్షలు డే 7: 51 లక్షలు డే 8: 46 లక్షలు డే 9: 64 లక్షలు డే 10: 81 లక్షలు డే 11: 36 లక్షలు డే 12: 26 లక్షలు డే 13: 51 లక్షలు డే 14: 26 లక్షలు డే 15: 14 లక్షలు డే 16: 22 లక్షలు డే 17: 33 లక్షలు మొత్తంగా చూస్తే ఈ 17 రోజుల్లో కలిపి 34.47 కోట్ల నెట్, 56 కోట్ల మేర గ్రాస్ వసూలైంది. 16వ రోజుతో పోల్చితే 17వ రోజు కలెక్షన్స్ పుంజుకున్నాయి. 16వ రోజు ఏరియాల వారిగా రిపోర్ట్ చూస్తే.. నైజాం: 5 లక్షలు సీడెడ్‌: 8 లక్షలు ఉత్తరాంధ్ర: 5 లక్షలు ఈస్ట్ గోదావరి: 4 లక్షలు వెస్ట్ గోదావరి: 3 లక్షలు గుంటూ

ట్విట్టర్‌లో పేరు మార్చిన విజయ్ దేవరకొండ.. లోలోపల జరుగుతోంది?

Image
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమ తమ సామజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాల పేర్లు మార్చడం, తద్వారా ఏదో హింట్ ఇవ్వడం అనేది చూస్తూనే ఉన్నాం. ఇటీవల సమంత తన డివోర్స్‌కి ముందు ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ నుంచి 'అక్కినేని' అనే పదాన్ని తొలగించడంతో మొదలైన అనుమానాలు చివరకు నిజమయ్యాయి. ఇకపోతే రీసెంట్‌గా శ్రీజ కూడా అలాగే ట్విట్టర్‌లో పేరు మార్చేసి పలు చర్చలకు తెరలేపగా.. ఇప్పుడు రౌడీ స్టార్ కూడా అదే పని చేశాడు. విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ పక్కన 'తుఫాన్' అనే పదాన్ని యాడ్ చేశాడు. ఇంకేముంది ఇది చూసి జనాల్లో డౌట్స్ షురూ అయ్యాయి. ఉన్నట్టుండి విజయ్ దేవరకొండ ఇలా పేరు మార్చడం వెనుక రీజన్ ఏంటని ఆరా దీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. లోలోపల అసలేం జరుగుతోంది? అనే కోణంలో అన్వేషణ చేయగా చిన్న హింట్ లభించింది. అదే విజయ్ దేవరకొండ యాడ్ షూట్. ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్ కోసం విజయ్ దేవరకొండ ఇచ్చిన ఓ పోజ్‌కి తుఫాన్ ట్యాగ్ కనిపించింది. దీంతో అసలు విషయం ఇదని అంతా అర్థం చేసుకున్నారు. సినిమాలే కాదు బిజినెస్ పరంగా విజయ్ దేవరకొండ ఐడియాలజీ చాలా మందికి నచ్చుతుంది. కెరీర్ పరంగా డిఫరెంట్ వేస్ ఎంచుకు

Bheemla Nayak : ప‌వ‌న్‌గారూ! ద‌య‌చేసి అది నిరూపించండి.. క‌న్నీటితో రామ్ గోపాల్ వ‌ర్మ రిక్వెస్ట్‌!

Image
వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో ప్రశ్నించ‌డానికి ఎప్పుడూ ముందుంటారు. సోష‌ల్ మీడియాను ఆయ‌న వాడుకున్నంత గొప్ప‌గా మరొక‌రు వాడుకోవ‌డం లేదంటే అందులో అతిశ‌యోక్తి లేదు. మొన్న‌టి వ‌ర‌కు ఏపీలో సినిమా టికెట్ రేట్స్ గురించి ట్విట్టర్‌లో ప్ర‌శ్న‌ల‌డ‌గ‌డం, యూట్యూబ్‌లో వీడియో విడుద‌ల చేయడం, టీవీల్లో ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం వంటి చేసిన వ‌ర్మ కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్ప‌డు మ‌ళ్లీ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న‌దైన పంథాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రిక్వెస్ట్‌లు పెట్టారు. సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను, ఆయ‌న ఫ్యాన్స్‌ని, మెగా ఫ్యాన్స్‌ని గిల్లిన‌ట్లు వ‌ర్మ ట్వీట్స్ చేస్తుంటారు. అదేంటి? అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే నేను మెగా ఫ్యామిలీకి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి పెద్ద అభిమాని అంటూ బ‌దులిస్తారు. ఇప్పుడు కూడా మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్‌లా ఆయ‌న్ని ప్ర‌శ్నిస్తున్నారో లేక రిక్వెస్టులు చేస్తున్నారో తెలియ‌న‌ట్లు కొన్ని ట్వీట్స్ చేశారు. ‘‘పవన్ కళ్యాణ్‌గారు.. ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్‌ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు

Darshanam Mogilaiah : పవన్ కళ్యాణ్‌ని గుర్తించ‌ని మొగిల‌య్య‌.. ప‌వ‌ర్ స్టార్‌ రియాక్ష‌న్ ఏంటంటే?

Image
గ‌ణ తంత్ర వేడుక‌లకు ముందు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన మొగిల‌య్య కూడా ఉన్నారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వం ప‌ద్మ శ్రీ అవార్డును ప్ర‌క‌టించింది. కిన్నెర 12 మెట్ల ఆఖ‌రి త‌రం క‌ళాకారుడైన మొగిల‌య్య‌ను తెలంగాణ ప్ర‌భుత్వం కూడా త‌గు రీతిలో గౌర‌వించుకుంది. ఆయ‌న‌కు ఇంటి స్థ‌లంతో పాటు ఇంటి నిర్మాణానికి, ఇత‌ర ఖ‌ర్చుల‌కు కోటి రూపాయ‌ల‌ను సీఎం కేసీఆర్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే అంత‌కు కొన్నాళ్లు ముందు మొగిల‌య్య‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమా ‘భీమ్లా నాయ‌క్‌’లో టైటిల్ సాంగ్‌ను పాడించుకున్నారు. ఆర్థికంగా స‌పోర్ట్ కూడా చేశారు. ఈ సినిమాలో పాట పాడినందుకు మొగిల‌య్య‌కు చాలా మంచి గుర్తింపు వ‌చ్చింద‌న‌డంలో సందేహం లేదు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో, ‘భీమ్లా నాయ‌క్’ సినిమా గురించి.. అందులో పాట పాడిన సంద‌ర్బం గురించి మొగిల‌య్య ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని తెలియ‌జేశారు.‘‘ పీఏ నాకు ఫోన్ చేసి ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు మీతో మాట్లాడాల‌ని అనుకుంటున్నారు అన్నారు. నేను కూడా స‌రేన‌ని అన్నాను. అప్పుడు ఆయ‌న భీమ్లా నాయ‌క్ షూటింగ్‌లో ఉన్నా

న‌టిస్తున్నందుకు త‌న‌ను తాను ఆస‌హ్యించుకున్న హీరోయిన్‌!

Image
సాధార‌ణంగా బుల్లి తెర‌, వెండి తెర‌పై న‌టిగా మెరిసి పోవాల‌ని కావాల్సినంత గుర్తింపు రావాలని ఎవ‌రైనా కోరుకుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం త‌న‌ను తాను ఆస‌హ్యించుకుంద‌ట‌. ఆ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. ఆమె స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం విశేషం. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. అవికా గోర్‌. ఈమె బాలికా వ‌ధు అనే సీరియ‌ల్ ద్వారా బుల్లి తెర ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది. ఈ సీరియ‌ల్ స‌క్సెస్ కావడంతో దీన్ని చిన్నారి పెళ్లి కూతురు పేరుతో డ‌బ్బింగ్ చేసి తెలుగులోనూ ప్ర‌సారం చేశారు. ఇక్క‌డ కూడా ఆ సీరియ‌ల్ మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోగా అవికా గోర్‌కు మంచి పేరు వ‌చ్చింది. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్ గురించి మాట్లాడుతూ ఆ సీరియ‌ల్ చేసే స‌మ‌యంలో తానంత హ్యాపీగా లేన‌ని, ప‌లు సంద‌ర్భాల్లో త‌న‌ని తాను ఆస‌హ్యించుకున్నా అని తెలియజేసింది. అంతే కాదండోయ్ స్క్రీన్‌పై చ‌క్క‌గా క‌నిపిస్తున్నానా..లేదా? అనే విష‌యాన్ని కూడా ప‌ట్టిచుకునే దాన్ని కాన‌ని ఆమె తెలియ‌జేసింది. త‌ర్వాత ఈమె ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌క‌ల‌రించింది. ఆ సినిమా చాలా పెద్ద హిట్ కావడంత

డిజిట‌ల్ ఎంట్రీకి ర‌కుల్ ప్రీత్ సింగ్ రెడీ.. కానీ కండీష‌న్ ఏంటంటే?

Image
మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఇప్పుడు మ‌న స్టార్స్ డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తున్నారు. హీరోలు, హీరోయిన్సే కాదు.. స్టార్ టెక్నీషియ‌న్స్‌, నిర్మాణ సంస్థ‌లు అన్నీ డిజిటల్ వైపుకు చూస్తున్నారు. ద‌క్షిణాదిన అగ్ర హీరోయిన్స్ సైతం ఓటీటీల‌కు ఓటేస్తున్నారు. ఇప్ప‌టికే స‌మంత‌, త‌మ‌న్నా వంటి వారు ఓటీటీల్లో అడుగు పెట్టేశారు. వెబ్ సిరీస్‌లు, టాక్‌షోలు, వంట‌ల ప్రోగ్రామ్స్ చేసి అంద‌రినీ అల‌రించేశారు. ఇప్పుడు వీరి బాట‌లోకి మ‌రో ముద్దుగుమ్మ కూడా అడుగు పెట్టేయ‌డానికి రెడీ అంటోంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో తెలుసా? ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ‘‘ఇంట్రెస్టింగ్‌గా ఉండే కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఓటీటీల‌కు ప్ర‌జ‌ల్లో ప్రాధాన్య‌త పెరుగుతుంది. ముఖ్యంగా ఓటీటీల కార‌ణంగా రీజ‌న‌ల్ సినిమాలు, కంటెంట్ అనేది ఎక్కువ మందికి చేరువ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. బాహుబ‌లి సినిమా వ‌ల్ల పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర సినిమాల ప‌రంగా భాషా ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉండ‌టం లేదు. కంటెంట్ బావుంటే చాలు. అంద‌రూ చూస్తున్నారు. డిజిట‌ల్ కంటెంట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. నేను కూడా డిజిట‌ల్ మాధ్య‌మంలో

బంగార్రాజు 16 డేస్ కలెక్షన్స్.. వసూళ్ల ఊగిసలాట!!

Image
నాగార్జున, కాంబోలో సంక్రాంతి కానుకగా వచ్చిన 'బంగార్రాజు' మూవీ విజయవంతంగా మూడో వారంలోకి ఎంటర్ అయింది. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ తెచ్చుకుంది కానీ తొలి వారం తర్వాత కలెక్షన్స్ విషయంలో ఊగిసలాట నడుస్తోంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా 16 రోజుల్లో ఏ మేర వసూళ్లు రాబట్టిందో చూద్దామా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజు డే వైజ్ కలెక్షన్స్ చూస్తే.. డే 1: 9.06 కోట్లు డే 2: 7.79 కోట్లు డే 3: 6.72 కోట్లు డే 4: 3.55 కోట్లు డే 5: 1.94 కోట్లు డే 6: 91 లక్షలు డే 7: 51 లక్షలు డే 8: 46 లక్షలు డే 9: 64 లక్షలు డే 10: 81 లక్షలు డే 11: 36 లక్షలు డే 12: 26 లక్షలు డే 13: 51 లక్షలు డే 14: 26 లక్షలు డే 15: 14 లక్షలు డే 16: 22 లక్షలు మొత్తంగా చూస్తే ఈ 16 రోజుల్లో కలిపి 34.14 కోట్ల నెట్, 55.40 కోట్ల మేర గ్రాస్ వసూలైంది. 15వ రోజుతో పోల్చితే కలెక్షన్స్ 16వ రోజు కలెక్షన్స్ పుంజుకున్నాయి. 16వ రోజు ఏరియాల వారిగా రిపోర్ట్ చూస్తే.. నైజాం: 4 లక్షలు సీడెడ్‌: 5 లక్షలు ఉత్తరాంధ్ర: 4 లక్షలు ఈస్ట్ గోదావరి: 3 లక్షలు వెస్ట్ గోదావరి: 2 లక్షలు

నాగ చైతన్య డిఫరెంట్ కథాంశం.. వర్కవుట్ అవుతుందా?

Image
తండ్రి అక్కినేని నాగార్జున బాట‌లోనే త‌న‌యుడు నాగ చైత‌న్య ప్రయాణిస్తున్నారు. ఎప్పుడు యంగ్ టాలెంట్‌ను, కొత్త త‌ర‌హా క‌థ‌ల‌ను ఎంక‌రేజ్ చేయ‌డంలో నాగార్జున ముందుంటార‌నే సంగ‌తి చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు అదే రూట్‌లో నాగ చైత‌న్య ఇప్పుడు కొత్త త‌ర‌హా కాన్సెప్టుల‌కు ఓకే చెబుతున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే, కొన్ని రోజుల ముందు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా చైత‌న్య వెబ్ సిరీస్‌లో న‌టించడానికి ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. చైతుతో మ‌నం, థాంక్యూ చిత్రాలను డైరెక్ట్ చేసిన విక్ర‌మ్ కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించ‌నున్నారు. త్వ‌ర‌లోనే నాగ చైత‌న్య‌, విక్ర‌మ్ కుమార్ వెబ్ సిరీస్ ట్రాక్ ఎక్క‌నుంది. ఈ వెబ్ సిరీస్‌లో రొటీన్‌కు భిన్నంగా చైత‌న్య ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నార‌ట‌. ఆయ‌న పాత్ర నెగ‌టివ్ ట‌చ్‌లో సాగుతుంది. అలాగే టైమ్ ట్రావెల్‌లో సాగే సినిమా అని కూడా వార్త‌లు వినిపిస్తాయి. అంతే కాకుండా ఈ సినిమాలో నాగ చైత‌న్య జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం. చైత‌న్య డిఫ‌రెంట్ మేకోవ‌ర్‌తో క‌నిపించ‌నున్నారు. మూడు సీజ‌న్స్‌లో సిరీస్‌ను రూపొందించ‌నున్నారు. ఒక్కొక్క సీజ‌న్‌లో 8 నుంచి 10 ఎపిసోడ్స్ ఉం

బాలకృష్ణ రెండో కూతురు వల్లే ఇదంతా! అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్

Image
నందమూరి నటసింహం విశ్వరూపాన్ని వెండితెరపై ఎన్నో సార్లు చూశాం. ఆయన నటనలోని వేరియేషన్స్ టాలీవుడ్‌లో బాలయ్య స్థానాన్ని అందలమెక్కించాయి. నందమూరి వారసుడిగా, సీనియర్ స్టార్ హీరోగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న బాలయ్య బాబు.. ఓటీటీ వేదికపై అంతకుమించి అనేలా ఫేమ్ కొట్టేశారు. '' షోకి హోస్ట్ బాధ్యతలు తీసుకొని విమర్శకుల ప్రశంసలందుకున్నారు. బాలయ్య హోస్ట్‌గా చేయడమేంటి అని వెక్కిరించిన వారి చేతనే చప్పట్లు కొట్టించారు. ఆహా ఓటీటీ వేదికపై ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్' షో ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. టాలీవుడ్ సెలబ్రిటీలను బాలయ్య ఆటపట్టిస్తున్న తీరు, ఆయన మ్యానరిజం, స్టైల్ అన్నీ కూడా ఈ షోకి మేజర్ అట్రాక్షన్ అయ్యాయి. తెలుగు చిత్రసీమలోని సీనియర్ హీరోగా ఎన్నో కీలక విషయాలపై సెలబ్రిటీలతో చర్చిస్తూ ఆయా సమాచారం మొత్తాన్ని ప్రేక్షకుల ముందుంచుతున్నారు బాలకృష్ణ. అయితే ఈ షో స్టార్ట్ కావడం, సక్సెస్‌ఫుల్‌గా రన్ కావడం వెనుక ఎవరెవరి హస్తం ఉందనే దానిపై తాజాగా 'అన్‌స్టాపబుల్' రైటర్ ఓపెన్ అయ్యారు. ఎక్స్‌పెక్టేషన్స్ అమ్మా మొగుడు బాలకృష్ణుడు అంటూ బాలయ్య బాబుపై ప్రశంసలు గుప్పి

అదంతా తూచ్.. ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖా వాణి కుమార్తె సుప్రిత‌..!

Image
సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ క్రేజ్ పెంచుకుంటున్న వారిలో న‌టి ఒక‌రు. ఆమెతో పాటు ఆమె త‌న‌య కూడా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. గ్లామ‌ర‌స్ ఫొటోలు, వీడియోల‌తో ఇద్ద‌రూ హ‌ల్ చ‌ల్ చేస్తుంటారు. వీరు చేసే ప‌నికి కొంద‌రు ట్రోల్ చేసినా, వీరివురూ త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేసుకుంటూ పోతున్నారు. లేటెస్ట్‌గా సుప్రితతో రాఖీ జోర్డాన్, సుప్రిత క‌లిసి ఓ ప్రైవేట్ వీడియో ఆల్బ‌మ్‌లో న‌టించారు. త‌న‌తో ప్రేమ‌కు ఎస్ చెప్పానంటూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు. దాని తర్వాత విడుదలైన వీడియో ఆల్బమ్ చూసిన వాళ్లు సుప్రిత పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా సుప్రిత మాట్లాడుతూ ‘‘నా పెళ్లి గురించి విషయాన్ని ఏదైనా మా అమ్మగారే అధికారికంగా చెబుతారు. సాంగ్ ప్రమోషన్స్‌లో భాగంగానే నేను యాక్ట్ చేశాను. అంద‌రూ నాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటున్నావా? అని అడుగుతున్నారు. నేనేం పెళ్లి చేసుకోవ‌డం లేదు. నా పెళ్లి వార్త ఇంత వైర‌ల్ అవుతుంద‌ని అనుకోలేదు. అంద‌రూ నాకు ఫోన్స్ చేశారు. నేను ప్రేమ‌లో కూడా లేను. సోష‌ల్ మీడియాలో, ఎల‌క్ట్రానిక్ మీడియాలో నా పెళ్లి వార్త వైర‌ల్ అయ్యింది.

నాపై అలాంటి ప్రచారం జరిగింది.. చాలా బాధపడ్డా: కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

Image
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వరి కెరీర్ ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు. కొందరికి తొలి సినిమాతోనే దక్కే క్రేజ్ ఇంకొందరికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ దరిచేరదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నాక అప్పుడు విజయం వరిస్తుంది. ఇది చాలామంది తారల కెరీర్‌లో అప్లై అయింది. అదే లిస్టులో ఉంది సౌత్ ఇండియన్ బ్యూటిఫుల్ హీరోయిన్ . 'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరపై కాలుమోపి ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది కీర్తి. దీంతో దెబ్బకు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలతో అలరిస్తున్న ఆమె.. రీసెంట్‌గా గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొని తన కెరీర్ విషయాలను, కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. కెరీర్‌ ఆరంభంలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నాని తెలుపుతూ ఆ విషయాలను ప్రస్తావించింది. హీరోయిన్‌గా మలయాళ చిత్ర పరిశ్రమతో తన కెరీర్ మొదలైందని, అయితే ఫస్ట్‌ మూవీ సెట్స్‌ మీదకి వెళ్లిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం.. అలాగే రెండో సినిమా విషయంలోనూ అదే జరగ

రామ్ చరణ్ వెంట ముంబైకి శ్రీజ.. క్లిష్ట పరిస్థితుల్లో అన్నయ్య సాయం?

Image
గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. చిరు కూతురు మరోసారి విడాకుల బాట పట్టిందని వార్తలు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ పరిస్థితుల నడుమ తాజాగా చెల్లెలు శ్రీజను వెంట బెట్టుకొని ముంబై విమానాశ్రయంలో కనిపించడంతో మెగా శిభిరంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చం సమంత లాగే శ్రీజ కూడా తన సోషల్ మీడియా ఖాతా నుంచి భర్త పేరును తొలగించి తనపై వస్తున్న రూమర్లకు రెక్కలు కట్టింది. విడాకుల రూమర్స్ షికారు చేస్తుండగానే శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించిన పేరును మార్చడంతో అందరిలో డౌట్స్ రెట్టింపయ్యాయి. క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా క‌ళ్యాణ్‌గా మార్చుకున్న ఆమె.. రీసెంట్‌గా ఆ పేరును శ్రీజా కొణిదెల‌గా మార్చేసింది. మరోవైపు శ్రీజ- కళ్యాణ్ దేవ్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వచ్చాయని, గతేడాది ఆగస్టు నెలలోనే వాళ్లిద్దరూ విడిపోయారనే టాక్ ముదిరింది. పైగా కళ్యణ్ దేవ్ హీరోగా రూపొందిన 'సూపర్ మచ్చి' సినిమాను ప్రమోషన్స్‌లో మెగా ఫ్యామిలీ కనిపించకపోవడం, అలాగే రీసెంట్‌గా జర

Devika : సాయం చేయాలంటూ రాజమౌళి ట్వీట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Image
ప్రముఖ దర్శకుడు ట్విట్టర్ వేదికగా సాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఇంత‌కీ రాజ‌మౌళి ఎవ‌రి కోసం..ఎందు కోసం..ఎలాంటి సాయం కావాల‌ని రిక్వెస్ట్ చేశార‌నే వివ‌రాల్లోకి వెళితే, ‘‘ఇంతకు ముందు దేవికగారితో బాహుబలి సినిమాకు పని చేశాను. ఆమె ప‌లు చిత్రాల‌కు కో ఆర్టినేట‌ర్‌గావ‌ర్క్ చేశారు. సినిమాపై ఆమె ప్యాష‌న్ గురించి చెప్ప‌డం సుల‌భం కాదు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆమె ఇప్పుడు బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతుంది. ఆమెకు స‌పోర్ట్ చేస్తున్న కేటో ఫండ్ రైజింగ్‌కు త‌మ వంతు సాయం చేయండి’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. అయితే రాజమౌళి అలా ట్వీట్ చేయడంపై పలువురు నెటిజన్స్ మండి పడుతున్నారు. ఆయ‌న ట్వీట్‌ను ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. సినిమాకు రూ.100కోట్లు తీసుకునే మీకు రూ.3 కోట్లు ఓ లెక్క‌నా.. మీరెందుకు సాయం చేయ‌డం లేదంటూ ఒక‌రు ప్ర‌శ్నిస్తే.. మ‌రొక‌రు అంత పెద్ద డైరెక్ట‌ర్‌గా ఉన్న మీరు ఆమెకు సాయం చేయడానికి దాత‌ల కోసం ఎదురుచూడాల్సిన ప‌ని లేదు. మీ ఇన్ఫూయెన్స్ ఉప‌యోగించి ఆమెకు స‌పోర్ట్ చేయండ‌ని ఒక‌ర‌న్నారు. నీతో క‌లిసి ప‌ని చేసిన వారికైనా సాయం చెయ్‌.. అంటూ ఇంకొక‌రు అన్నారు. ఇలా ఏదో చేయ‌డానికి రాజ‌మౌళి చేసిన ట్వీట్ వ‌ల్ల ట్ర

Sivakama Sundari: గొల్లపూడి సతీమణి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

Image
దివంగత సినీ నటుడు, రచయిత సతీమణి శుక్రవారం కన్నుమూశారు. 81 ఏళ్ల శివకామ సుందరి చెన్నైలోని టి.నగర్‌లోని శారదాంబాళ్‌ వీధిలో ఉన్న తన స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయానికి కన్నమ్మపేట శ్మశానవాటికలో అదే రోజు అంత్యక్రియలను నిర్వహించారు. శివకామసుందరి మరణం గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. వరంగల్‌లోని హన్మకొండలో జన్మించారు శివకామసుందరి. 1961లో గొల్లపూడి మారుతీ రావు()తో ఆమెకు వివాహం జరిగింది. అప్పటి నుంచి చెన్నైలోనే స్థిరపడ్డారు. రామభక్తురాలైన శివకామ సుందరి.. మూడున్నర కోట్ల ‘రామకోటి’ రాసినట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా 2019 డిసెంబరులో మారుతీరావు అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటినుంచి శివకామసుందరి తన కుమారుడు సుబ్బారావు నివాసంలోనే ఉంటున్నారు. గొల్లపూడి మారుతీ రావు, శివకామసుందరి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. ఐదుగురు మనవళ్లు ఉన్నారు. ఒక కుమారుడు వైజాగ్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న స్టార్ డైరెక్టర్ శంకర్ తనయుడు

Image
జెంటిల్ మేన్‌, అప‌రిచితుడు, ఒకే ఒక్కడు, రోబో, 2.0 .. వంటి ప‌లు చిత్రాల‌తో ద‌క్షిణాది సినిమాకు గొప్పదనాన్ని తీసుకొచ్చిన స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. భారీ చిత్రాల‌కు, మేకింగ్‌కి ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు. ఇప్పుడు ఆయ‌న ఫ్యామిలీ నుంచి మ‌రో వ్య‌క్తి సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. శంక‌ర్ త‌న‌యుడు అర్జిత్‌. శంక‌ర్ త‌న కొడుకుని హీరోగా ప‌రిచ‌యం చేయ‌డానికి రంగం సిద్ధం చేశార‌ట‌. అర్జిత్‌కు ఇప్ప‌టికే న‌ట‌న‌, యాక్ష‌న్‌, డాన్సులు వంట వాటిలో ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ ఇప్పించార‌ట శంక‌ర్‌. అన్నీ పూర్తి కావ‌డంతో ఇప్పుడు త‌న‌యుడిని హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేయ‌డానికి ఆయ‌నే నిర్మాత‌గా మారారు. స్టార్ డైరెక్ట‌ర్ అయిన శంక‌ర్ రొటీన్‌కు భిన్న‌మైన సినిమాల‌ను నిర్మాత‌గా చేస్తూ వ‌చ్చారు. ఇప్పుడు త‌నే నిర్మాత‌గా కొడుకుని ఇంట్ర‌డ్యూస్ చేయ‌డానికి ఆయ‌న స‌మాయ‌త్త‌మ‌య్యార‌ట‌. ఇంత‌కు ముందుకు శంర్ నిర్మాణంలో కాద‌ల్ (తెలుగులో ప్రేమిస్తే) సినిమా రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు కాద‌ల్‌కు సీక్వెల్ చేయాల‌నేది శంక‌ర్ ఆలోచ‌న

అమ్మ‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్‌!

Image
శ‌నివారం టాలీవుడ్ సీనియర్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ అమ్మ‌గారు అంజ‌నా దేవి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా అమ్మ‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు. ‘‘అమ్మా ! జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ..అభినందనలతో .... శంకరబాబు’’ అని అన్నారు. ఈ ట్వీట్‌తో పాటు అంజనాదేవితో పాటు తాను, త‌న శ్రీమ‌తి సురేఖ ఉన్న ఫొటోను షేర్ చేశారు చిరంజీవి. ఇటీవ‌ల చిరంజీవికి క‌రోనా పాజివ్ సోకింది. దీంతో ఆయ‌న ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉన్నాన‌ని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న హీరోగా న‌టించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 1న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఇది కాకుండా గాడ్‌ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌, బాబీ డైరెక్ష‌న్‌లో సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. త‌ర్వాత వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి కూడా చిరంజీవి సిద్ధ‌మ‌య్యారు. వెంకీ కుడుముల సినిమా మిన‌హాయిస్తే.. సెట్స్ పై ఉన్న మిగిలిన సినిమాల‌న్నీ కాస్త హోల్డ్‌లో ప‌డ్డాయి.

ఎన్టీఆర్ సినిమాకు థియేట‌ర్ ఇస్తే.. బాల‌కృష్ణ ఫోన్ చేసి చంపేస్తాన‌ని బూతులు తిట్టారు!.. గుట్టు బయట పెట్టిన నిర్మాత

Image
‘‘’ సినిమా విడుదలకు ముందు నేను ఓసారి డైరెక్ట‌ర్ బి.గోపాల్‌గారిని క‌లిశాను. ఆయ‌న న‌ర‌సింహ నాయుడు సినిమాలోని టెంపుల్ ఫైట్ సీన్ చెప్ప‌గానే సినిమా బావుంటుంద‌నిపించింది. అప్పుడు నిర్మాత ముర‌ళీగారిని వెళ్లి క‌లిసి సినిమా కొన్నాం’’ అని అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అవుల గిరి. రీసెంట్ టైమ్‌లో నిర్మాత గిరి త‌న సినీ ప్ర‌స్తానం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. అందులో భాగంగా న‌ర‌సింహ నాయుడు సినిమా గురించి ఆయ‌న మాట్లాడుతూ ఆ సినిమా నైజాం హ‌క్కుల‌ను మ‌హ‌ల‌క్ష్మి ఫిలింస్‌, మ‌ల్లారెడ్డి అనే వ్య‌క్తితో క‌లిసి తాను కొనుగోలు చేశాన‌ని అన్నారాయ‌న‌. అయితే ‘నరసింహ నాయుడు’ సినిమా విషయంలో హీరో బాల‌కృష్ణ‌తో త‌ను బండ బూతులు వినాల్సి వ‌చ్చిందని ఆయ‌న చెప్పారు. ఇంత‌కీ గిరి ఏమ‌న్నారంటే.. ‘‘ఎన్టీఆర్ తొలి సినిమా ‘’ విడుదలైంది. వాళ్లు దేవి థియేటర్ కావాలని రిక్వెస్ట్ చేశారు. సరేనని నరసింహనాయుడు సినిమాను తీసేసి, సినిమాకు ఇవ్వాల‌ని అనుకున్నాం. నేను, దిల్‌రాజుగారి ఫంక్ష‌న్ కోసం నిర్మల్‌కు వెళ్లాను. అప్పుడు బాల‌కృష్ణ‌గారు ఫోన్ చేసి బూతులు తిట్టారు. పిచ్చి వేషాలు వేస్తే..చంపేస్తాను అని అన్నారు. స‌రేన‌

‘అఖండ’ ఎఫెక్ట్... NBK 107 కోసం ప్లానింగ్ మార్చిన బాలకృష్ణ!

Image
నంద‌మూరి బాల‌కృష్ణ లేటెస్ట్ మూవీ ‘అఖండ‌’. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. రూ.200 కోట్ల క్ల‌బ్‌లో జాయిన్ అయ్యింది. కేవ‌లం మాస్ ప్రేక్ష‌కుల‌కే బాల‌య్య సినిమాలు న‌చ్చుతాయ‌నే ఓ భావ‌న‌ను అఖండ చేరిపేసింది. థియేట‌ర్స్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన ఈ చిత్రం రీసెంట్‌గా ఓటీటీలో విడుద‌లై కూడా హ‌య్య‌స్ట్ వ్యూస్‌ను సాధించి అందులోనూ రికార్డ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అంద‌రి దృష్టి బాల‌కృష్ణ చేయ‌బోతున్న 107వ సినిమాపై ప‌డింది. అఖండ వంటి భారీ విజ‌యం త‌ర్వాత బాల‌కృష్ణ‌.. క్రాక్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతుండ‌టంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌గానే ఉన్నాయి. అయితే తెలుగు మార్కెట్ పెర‌గ‌డం.. బాల‌య్య అఖండ‌కు ద‌క్కిన ఆద‌ర‌ణ‌ను దృష్టిలో పెట్టుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌రికొత్త ప్లానింగ్ చేసింద‌ట‌. ఏదో ఆషామాషీగా కాకుండా NBK 107ను నాలుగు భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి ఈ నాలుగు భాష‌ల్లో హిందీ వెర్ష‌న్ ఉంటుందా? లేక త‌ర్వాత ఏమైనా అనువాదం చేసి రిలీజ్ చేస్తారా? అ

The Ghost : యాక్ష‌న్‌లోకి దిగుతున్న నాగార్జున‌.. దుబాయ్ వెళుతున్న అక్కినేని హీరో!

Image
టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర క‌థ‌నాయ‌కుడు త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోక‌స్ పెట్ట‌డానికి రెడీ అయిపోయారు. ఇంత‌కీ నాగార్జున చేస్తున్న నెక్ట్స్ మూవీ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు..‘’. ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. గ‌రుడ‌వేగ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. ఇందులో నాగార్జున రిటైర్డ్‌ రా ఏజెంట్‌గా క‌నిపించనున్నారు. ఆయ‌న లుక్ కూడా ఇది వ‌ర‌కటి చిత్రాల కంటే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. గుబురు గ‌డ్డం, మెలితిప్పిన మీసాల‌తో నాగార్జున ఇందులో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న త‌ర్వాత కాస్త గ్యాప్ రావ‌డం ఆ గ్యాప్‌లో నాగార్జున బంగార్రాజు సినిమాను పూర్తిచేసి విడుద‌ల చేయ‌డం. సంక్రాంతికి విడుద‌లైన బంగార్రాజు సెన్సేష‌న‌ల్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు నాగ్‌.. ‘ది ఘోస్ట్’పై ఫోక‌స్ పెట్టారు. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను దుబాయ్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 3 నుంచి టీమ్ దుబాయ్ చేరుకుంటుంది. అక్క‌డ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ నుంగ్ అండ్ టీమ్ నేతృత్వంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. నాగార్జున‌తో పాటు సోనాల్‌చౌహాన్ ఇందులో పాల్గొన‌బోతున్నారు

పెళ్లి, విడాకుల వార్తలపై హిమజ రియాక్షన్

Image
సోషల్ మీడియాలో రూమర్స్ రావడం అనేది కామన్. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తుంటాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ఆధారంగా వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బ్యూటీ, సినీ నటి హిమజపై గత రెండు రోజులుగా వస్తున్న వార్తలు వైరల్ అయ్యాయి. తీసుకోనుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇట్టి వార్తపై స్వయంగా రియాక్ట్ అయింది హిమజ. హిమజ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి భర్తను అన్‌ఫాలో చేసిందని, త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నట్లు ఇలా హింటిచ్చిందనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో ఒకింత అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చిన హిమజ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వీడియో పోస్ట్ చేస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ''నేనేదో నా పని నేను చేసుకుంటూ పోతుంటే నా పెళ్లి గురించి, నా డివోర్స్ గురించి చాలామంది లింక్స్ షేర్ చేస్తున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నా పెళ్ళికి నన్ను పిలవండి ప్లీజ్. నా డివోర్స్‌కి కూడా నన్ను పిలవండి. అదేంటో ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా నేనైతే ఇలాంటివి పట్టించు

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

Image
బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ తెరపై '' సినిమా కలెక్షన్స్, అల్లు అర్జున్ సత్తాను హైలైట్ చేస్తూ బాలీవుడ్ యాక్టర్స్‌పై తనదైన కోణంలో కామెంట్స్ చేశారు కమల్‌ ఆర్‌ ఖాన్‌. దీంతో ఆయన చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప' సినిమా పలు రికార్డులు తిరగరాసింది. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన నటనకు తోడు సమంత చేసిన ఐటెం సాంగ్ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సౌత్ ఇండియన్ తెరపై సత్తా చాటి ఓటీటీ వేదికపై బన్నీ అభిమానులను అలరిస్తున్న ఈ సినిమా బీటౌన్‌లో మాత్రం ఇంకా థియేటర్ రన్ కొనసాగిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' హిందీ వెర్షన్ 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిందని తెలుపుతూ బాలీవ

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

Image
కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన .. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ పట్టేసింది. త‌న‌కంటూ స్పెష‌ల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ క్రియేట్ చేసుకొని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. నేడు (జ‌నవ‌రి 28) ఆమె పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్ ఇచ్చారు '' దర్శకుడు ప్రశాంత్ నీల్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'సలార్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఈ 'సలార్' సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గతేడాది శృతి పుట్టినరోజున ఆమెను సలార్ సెట్స్ మీదకు స్వాగతించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. తాజాగా ఈ చిత్రంలో శృతి క్యారెక్టర్ రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆధ్య రోల్‌లో శృతి నటిస్తోందని పేర్కొన్నారు. ఈ మూవీలో భారీ కాస్టింగ్ ఉండేలా నటీనటుల విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టితో ఓ స్ప

కనీసం బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో ఉన్నా.. సింగర్ కౌసల్య పోస్ట్ వైరల్

Image
సినీ ఇండస్ట్రీని కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఫస్ట్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ వరకు పలువురు సినీ నటులు కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి వైరస్ కొంత మంది సినీ ప్రముఖులను మనకు దూరం చేసింది కూడా. ప్రస్తుతం కొనసాగుతున్న థర్డ్ వేవ్‌లో ఇటీవలే చిరంజీవి, శ్రీకాంత్ సహా పలువురు సినీ నటులకు కరోనా సోకి చికిత్స పొందుతుండగా.. తాజాగా ప్రముఖ కరోనా బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన తాజా పరిస్థితిని తెలిపారు. ''కరోనా పరీక్షల్లో నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. నాలో ఈ వైరస్ ల‌క్ష‌ణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ప్రస్తుతం క‌నీసం బెడ్‌పై నుంచి కూడా లేవ‌లేక‌పోతున్నాను. గొంతు నొప్పి మరింత ఇబ్బంది పెడుతోంది. నిన్న‌టి నుంచి మందులు తీసుకోవడం మొద‌లు పెట్టాను. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను. ద‌య‌చేసి అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి'' అని పేర్కొంది కౌసల్య. ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూసి మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. థర్డ్ వేవ్‌లో కరోనా వైరస్ వీరవిహారం చేప్తోంది. ప్

ATM దొంగతనం పక్కా.. హరీష్ శంకర్‌తో దిల్ రాజు పర్ఫెక్ట్ ప్లాన్

Image
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటంతో క్రమంగా వెబ్ సిరీస్‌‌లకు ఆదరణ పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ థియేటర్లపై పడటం వెబ్ సిరీస్‌‌లకు, ఓటీటీ వేదికలకు వరంగా మారింది. దీంతో బడా దర్శకనిర్మాతలు సైతం వెబ్ సిరీస్‌‌లు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ దర్శకనిర్మాతలు హరీష్ శంకర్- ఓ పర్ఫెక్ట్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నారు. ATM అనే పేరుతో క్రైమ్ వెబ్ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు హరీష్ శంకర్- దిల్ రాజు. దీన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో స్ట్రీమ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన ఈ కాంబో ఈ సారి ATM అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వేదికపై మ్యాజిక్ చేసేందుకు స్కెచ్చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇస్తూ కొత్త పోస్టర్ వదిలారు. ‘రాబరీ బిగిన్స్ సూన్’ (దోపిడీ త్వరలో మొదలు కాబోతుంది) అంటూ ఆ పోస్టర్‌పై రాసిన లైన్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ విషయమై ఇప్పటినుంచే కేర్ తీసుకుంటున్న .. 'దొంగతనం పక్కా' అంటూ చాలా డి

పబ్‌లో హీరోయిన్‌తో ఆర్జీవీ! ఆ వీడియోలతో మరోసారి చర్చల్లో నిలిచిన కాంట్రవర్సీ కింగ్

Image
అనుకున్నది చేస్తా.. అనిపించింది మాట్లాడతా అనే నైజం రామ్ గోపాల్ వర్మది అని ఇప్పటికే పలుసార్లు ప్రూవ్ అయింది. అందుకే ప్రతి క్షణం ఆయన పేరు జనం నోళ్ళలో నానుతూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలతో మెదిలే తీరు నిత్యం చర్చల్లో నిలుస్తుంది. లేడీ యాంకర్‌తో ఇంటర్వ్యూ అంటే వర్మ ఎలాంటి బోల్డ్ కామెంట్స్ చేస్తారా? అని పనికట్టుకు చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అరియానా, అషు రెడ్డి ఇంటర్వ్యూలు ఎంతలా వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఇక వర్మ లోని మరో కోణం హీరోయిన్లతో కలిసి చిందులేస్తూ ఎంజాయ్ చేయడం. గతంలో చాలాసార్లు ఇలాంటి వీడియోలు బయటకొచ్చి హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. పబ్‌లో అమ్మాయిలతో చిందులేస్తున్న వీడియోని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు . ఈ వీడియోలో హీరోయిన్ ఇనయా సుల్తానాతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆర్జీవీ. ఇద్దరూ సిగరెట్ తాగుతూ సన్నిహితంగా కనిపించడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకున్న వర్మ.. మరో చేతితో అమ్మాయిని ఘాడంగా హత్తుకుని ముద్దు పెట్టుకోవడం కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు మిశ్రమ

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

Image
'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్‌తో సినిమా చేసేందుకు వందల కోట్లయినా ఖర్చు చేస్తాం అనే నిర్మాతల లిస్ట్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ '' గురించి బయటకొచ్చిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఆయన అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా 'ఆదిపురుష్' సినిమాను రూపొందించారు. పౌరాణిక గాథ రామాయణంను ఈ 'ఆదిపురుష్' రూపంలో చూపించనున్నారు. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్న యూనిట్.. అన్ని హంగులతో కేవలం 103 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి రికార్డు చేశారు. మొత్తంగా ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ 'ఆదిపురుష్' చిత్రాన్ని ప్యాన్ వరల్డ్ సినిమాగా మలిచే ప్రయత్న

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

Image
'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్, టైటిల్ సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక తర్జన భర్జనల నడుమ ఎట్టకేలకు ఈ రోజు (జనవరి 28) ప్రేక్షకుల ముందుకొచ్చింది. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రానికి నటేష్ కుకుమార్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో తెలంగాణ ఊరి ఆడపిల్లగా కీర్తి సురేష్ నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా ఎలా రియాక్ట్ అవుతున్నారు? అనేది చూద్దామా.. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో కీర్తి సురేష్ నటన అబ్బురపరిచిందని ఇప్పటివరకు వచ్చిన ట్వీట్స్ ఆధారంగా తెలుస్తోంది. స్పోర్ట్ డ్రామా చిత్రంగా విడుదలైన ఈ చిత్ర

చై-సామ్ డివోర్స్ ఇష్యూ: సమంతనే విడాకులు కావాలందంటూ నాగార్జున ఓపెన్

Image
సమంత- విడాకుల ఇష్యూ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. గతేడాది అక్టోబర్‌ 2న తమ డివోర్స్ విషయాన్ని అధికారికంగా బయటపెట్టారు చై- సామ్. దీంతో ఈ ఇష్యూపై అప్పుడు మొదలైన చర్చలు నేటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. విడాకులకు కారణం ఏంటనేది ఇప్పటికీ బయటకు రాలేదు కానీ జనాల్లో ఎన్నో రకాలుగా చర్చలు నడిచాయి. నాలుగేళ్ల వివాహ బంధం తెంచుకోవడం వెనుక రీజన్స్ ఏమై ఉంటాయనే కోణంలో ఎన్నో రూమర్స్ బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చైసామ్ డివోర్స్ ఇష్యూపై ఓపెన్ అయ్యారు . ప్రేమించి పెళ్లి చేసుకున్న చై- సామ్‌ జోడీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని నాగార్జున అన్నారు. అయితే నాలుగేళ్ల వివాహ‌ బంధంలో వాళ్లకు విడిపోయేటంత పెద్ద స‌మస్య ఎందుకొచ్చింది అనేది త‌న‌కు ఇప్ప‌టికీ తెలియ‌ద‌ని అన్నారు. గతేడాది (2021) న్యూ ఇయర్ వేడుకలు ఇద్దరూ కలిసి సంతోషంగా నిర్వహించుకున్నారని చెప్పిన నాగ్.. ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చిందని, కాకపోతే కచ్చితంగా ఏంటనేది తనకు మాత్రం తెలియదని తెలిపారు. సమంతనే మొదట విడాకులు కావాలని కోరిందని, ఆమె కోరిక మేరకే చైతూ ఒప్పుకున్నాడని నాగార్జున అన్నారు. అయితే విడాకులు తీసుకునే సమయంలో తాను కంగారు

బంగార్రాజు 13 డేస్ కలెక్షన్స్.. అలా కలిసొచ్చిన సెలవుదినం

Image
'సోగ్గాడే చిన్ననాయనా' సినిమాకు సీక్వల్‌గా వచ్చిన '' సినిమాకు తొలి షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య తెరపంచుకున్న ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా 13 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మరి ఈ 13 రోజుల్లో ఏ మేర వసూళ్లు రాబట్టిందో చూద్దామా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజు డే వైజ్ కలెక్షన్స్ చూస్తే.. డే 1: 9.06 కోట్లు డే 2: 7.79 కోట్లు డే 3: 6.72 కోట్లు డే 4: 3.55 కోట్లు డే 5: 1.94 కోట్లు డే 6: 91 లక్షలు డే 7: 51 లక్షలు డే 8: 46 లక్షలు డే 9: 64 లక్షలు డే 10: 81 లక్షలు డే 11: 36 లక్షలు డే 12: 26 లక్షలు డే 13: 51 లక్షలు మొత్తంగా చూస్తే ఈ 13 రోజుల్లో కలిపి 33.52 కోట్ల నెట్, 54.30 కోట్ల మేర గ్రాస్ వసూలైంది. జనవరి 26 సెలవు దినం కలిసి రావడంతో 12వ రోజుతో పోల్చితే 13వ రోజు కలెక్షన్స్ పుంజుకున్నాయి. 13వ రోజు ఏరియాల వారిగా రిపోర్ట్ చూస్తే.. నైజాం: 9 లక్షలు సీడెడ్‌: 10 లక్షలు ఉత్తరాంధ్ర: 10 లక్షలు ఈస్ట్ గోదావరి: 7 లక్షలు వెస్ట్ గోదావరి: 4 లక్షలు గుంటూరు: 5 లక్షలు కృష్ణా: 4 లక్షలు నెల్లూరు: 2

రామ్ గోపాల్ వర్మ మోసాన్ని బయటపెట్టిన మహేశ్వరి.. అర్ధరాత్రి వేళ ధైర్యం చేశా కానీ!!

Image
దాదాపు 20 ఏళ్ల క్రితం వెండితెరపై కొత్త టేస్ట్ చూపించింది హీరోయిన్ మహేశ్వరి. సిల్వర్ స్క్రీన్ మీద ఆమెను చూసి ఆ నాటి కుర్రకారు ఊగిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయినా నేటికీ మహేశ్వరికి ఉన్న క్రేజే వేరు. శ్రీదేవీ బంధువుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్వరి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసి తన అందం, అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమాలు ''గులాబి, పెళ్లి''. ఈ రెండు సినిమాలు ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచాయి. కాగా తాజాగా మహేశ్వరి తన సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలు చెబుతూ ఆర్జీవీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆలీతో సరదాగా ముచ్చట్లు పెడుతూ పలు కీలక విషయాలపై ఓపెన్ అయింది మహేశ్వరి. అప్పట్లో సినిమాలతో బిజీ బిజీగా గడిపిన తాను ప్రస్తుతం ఏమీ చేయడంలేదని, డాగ్ రిస్క్యూ, యానిమల్ రిస్క్యూ, వీధికుక్కల అడాప్షన్ లాంటివి చేస్తున్నానని చెప్పింది. అమల గారి స్పూర్తితో ఈ కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపింది. ఇకపోతే ఆ నాటి కెరీర్ విషయాలు కూడా చెబుతూ తనను ఎలా మోసం చేశారనే విషయాన్ని బయటపెట్టింది.

Thank You : నాగ చైతన్య ‘థాంక్యూ’ కోసం మైనస్ టెంపరేచ‌ర్‌లో రాశీ ఖన్నా!

Image
అక్కినేని నాగచైతన్య, మైనస్ డిగ్రీల టెంపరేచర్‌లో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇంత‌కీ అంత ఎముక‌లు కొరికే చ‌లిలో నాగ చైత‌న్య‌, రాశీఖ‌న్నా ఏం చేస్తున్నార‌నే సందేహం రాక మాన‌దు. ఏం చేస్తారండి బాబూ.. సినిమా షూటింగ్‌ను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌డానికి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. త‌ప్ప‌దు క‌దా.. మ‌రి సినిమా కోసం. నాగ చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘’. రాశీ ఖన్నా, అవికా గోర్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా రెండు వారాల చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది. ఈ చిత్రీక‌ర‌ణ కోసం నాగ చైత‌న్య, రాశీ ఖ‌న్నా అండ్ టీమ్‌.. ర‌ష్యాలోని మాస్కోకు చేరుకున్నారు. ఇప్పుడు అక్క‌డ టెంప‌రేచ‌ర్ -14 డిగ్రీలు ఉంద‌ట‌. ఈ చ‌లిలో షూటింగ్‌ను జ‌రుపుకుతున్నారు. ఇంత‌కు ముందు షెడ్యూల్‌ చిత్రీక‌ర‌ణ ఇట‌లీలో జ‌రిగింది. ఆ షెడ్యూల్‌కి కొన‌సాగింపుగానే థాంక్యూ ఇప్పుడు ర‌ష్యాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. మైన‌స్ డిగ్రీల టెంప‌రేచ‌ర్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నామ‌ని రాశీఖ‌న్నా ఫొటోను షేర్ చేయ‌డం ద్వారా తెలియ‌జేసింది. బీవీఎస్ ర‌వి అందించిన క‌థ‌తో విక్ర‌మ్ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

Chiranjeevi : ఇండస్ట్రీ పెద్దరికం.. ఏపీలో టికెట్ రేట్స్‌పై దిల్ రాజు వ్యాఖ్యలు...!

Image
చాలా రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో వైర‌ల్ అవుతున్న ప్ర‌శ్న సినీ ఇండ‌స్ట్రీలో దాసరి నారాయ‌ణ‌రావు స్థానాన్ని భ‌ర్తీ చేయ‌బోయే వ్య‌క్తి ఎవ‌రు?. దీనిపై ఇప్ప‌టికే పలు మార్లు ప‌లువురు డిబేట్స్‌లో, ఇంట‌ర్వ్యూస్‌లో త‌మ త‌మ అభిప్రాయాల‌ను తెలిపారు. ఒకానొక సంద‌ర్భంలో ఇటు చిరంజీవి, అటు మోహ‌న్ బాబు ఎవ‌రు ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఉంటారు? అనే దానిపై కూడా తెలియ‌ని యుద్ధ‌మే న‌డిచింద‌నాలి. చివ‌ర‌కు ఓ రోజున తాను ఇండ‌స్ట్రీకి పెద్ద‌గా ఉండ‌న‌ని, కావాల్సి వ‌స్తే.. ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా సినీ పరిశ్ర‌మ‌లో ఏదైనా స‌మ‌స్య ఉంటే త‌న వంతు సాయాన్ని అందించడానికి ఎప్పుడూ ముందు ఉంటాన‌ని చెప్పేశారు. అదే రోజున మోహ‌న్‌బాబు ఇండ‌స్ట్రీ అంటే న‌లుగురు వ్య‌క్తులు కార‌ని.. అంద‌రూ క‌లిసి ముందుకు వెళ్తేనే సినీ ప‌రిశ్ర‌మలోని స‌మ‌స్య‌లు తీరుతాయ‌ని లెటర్‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఇప్పుడు రీసెంట్‌గా తెలుగు చిత్ర సీమ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజుని ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఎవ‌రు ఉంటారు చిరంజీవిగారు ఉండే అవ‌కాశం ఉందా? ఏపీలో టికెట్ రేట్స్ గురించి మీరేమంటారు అంటూ ప్ర‌శ్నిస్తే.. బదులిస్తూ ‘‘ట

Upasana Konidela : ఫొటో షేర్ చేసిన ఉపాస‌న కొణిదెల .. మెగా కోడ‌లిపై ఫైర్ అవుతున్న నెటిజ‌న్స్‌!

Image
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల గురించి తెలుగు వారికి ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. అపోలో హాస్పిట‌ల్స్ బాధ్య‌త‌ల్లో త‌న వంతు బాధ్య‌త‌ల‌ను ఉపాస‌న కొణిదెల నిర్వ‌హిస్తున్నారు. అలాగే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమా రంగంతో ట‌చ్ లేక‌పోయినా సినీ సెల‌బ్రిటీలతో ఉపాస‌న‌కు మంచి అనుబంధ‌మే ఉంది. ఫిట్‌నెస్‌కు సంబంధించిన మ్యాగ‌జైన్‌ను నిర్వ‌హిస్తూ సినీ సెల‌బ్రిటీస్ అయిన స‌మంత‌, ర‌కుల్ వంటి వారితో ప్ర‌త్యేక‌మైన వీడియో ప్రోగ్రామ్స్ కూడా చేయించారు ఉపాస‌న కొణిదెల‌. త‌న‌కు న‌చ్చిన ఫొటోలు, వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఉపాస‌న కొణిదెల గుడి గోపురం పోస్ట్‌ను షేర్ చేశారు. సాధార‌ణంగా గుడి గోపురాల‌పై దేవుళ్ల ఫొటోలు మాత్ర‌మే ఉంటాయి. కానీ ఉపాస‌న షేర్ చేసిన గోపురం పోస్ట్‌లో సినీ తార‌ల బొమ్మ‌లున్నాయి. ఇండియ‌న్ సినిమాకు సంబంధించిన తార‌లంద‌రూ ఆ గుడిగోపురంపై ఉన్నారని, తాను, రామ్ చ‌ర‌ణ్ కూడా అందులో కనిపిస్తామ‌ని, శోభ‌నా కామినేని త‌న‌కు ఈ ఫొటోను ఇచ్చార‌ని, గుడి గోపురం ఫొటోను రూపొందిన వ్య‌క్తిని తాను అభినందిస్తున్నాన‌ని ఉపాస‌న పోస్ట్‌తో పాటు కామెంట్స్ కూడా షేర్ చేశారు. అయి

RRRలో అల్లూరి పాత్ర చేయాల్సి వ‌స్తే.. ఎన్టీఆర్ ఏం చెప్పారో తెలుసా?

Image
ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆతృత‌గా ఎదురుచూస్తోన్న పాన్ ఇండియా మూవీ RRR. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో మార్చి 18న లేదా ఏప్రిల్ 28కి వాయిదా ప‌డింది. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ క‌నిపించున్న సంగ‌తి తెలిసిందే. RRRకు సంబంధించి ఓ ఇంట‌ర్వ్యూలో రామ్ చ‌ర‌ణ్ చేసిన అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ గురించి మాట్లాడుతూ, ‘‘నాకు రామ‌రాజు పాత్రను ట్రైల‌ర్‌లో చూస్తే.. నిప్పుల మ‌ధ్య నుంచి దూకుతూ బాణం సంధించే స‌న్నివేశం బాగా న‌చ్చింది. ఎంత బాగా అంటే ఆ ప‌ర్టికుల‌ర్ స‌న్నివేశంలో నేను న‌టించాల‌నంతేగా. ఆ స‌న్నివేశంలో బ్యాగ్రౌండ్ స్కోర్‌, ట్రైల‌ర్‌లో ఆ స‌న్నివేశాన్ని చూపించిన సంద‌ర్భం కావ‌చ్చు’’ అన్నారు సినిమాలోని ఇన్‌టెన్సిటీని స‌ద‌రు స‌న్నివేశం చెప్పేస్తుందంటూ ఎన్టీఆర్ రామరాజు పాత్ర గురించి మాట్లాడారు. 192

Ram Charan - Keerthy Suresh : రామ్ చ‌ర‌ణ్‌తో కీర్తి సురేష్ నాటు నాటు స్టెప్.. వీడియో వైరల్!

Image
ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన పాన్ ఇండియా మూవీ RRR. కోవిడ్ కార‌ణంగా సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌తి ప్రోమో, టీజ‌ర్‌, ట్రైల‌ర్, సాంగ్స్ ఆడియెన్స్‌కు బాగా న‌చ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి స్టెప్పులేసిన ‘నాటు నాటు.. ’ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో తార‌క్ - చ‌ర‌ణ్ క‌లిసి చేసిన స్టెప్పుల‌ను అంద‌రూ వేసి ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ క‌లిసి దుమ్ము రేపిన నాటు నాటు సాంగ్‌ని రామ్ చ‌ర‌ణ్ - క‌లిసి చేస్తే ఎలా ఉంటుంది! బాగానే ఉంటుంది. హ్యాండ్స‌మ్ హీరో, క్యూట్ హీరోయిన్ క‌లిసి స్టెప్పేస్తే బాగానే ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ బుధ‌వారం గుడ్ ల‌క్ స‌ఖి ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవ‌వి ఈ వేడుక‌కి ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ కావ‌డంతో ఆయ‌న స్థానంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా విచ్చేశారు. అజ్ఞాత‌వాసిలో కీర్తి సురేష్ న‌ట‌న బావుంటుందని, ‘మ‌హా న‌టి’ సినిమా చూసిన త‌ర్వాత కీర్తి సురేష్ న‌ట‌న‌కు ఫిదా అ

హీరో శ్రీకాంత్‌కు కరోనా పాజిటివ్

Image
చిత్రసీమను మరోసారి భయం వెంటాడుతోంది. వరుసపెట్టి చాలా మంది సినీ ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గురవుతుండటం సినీ లోకంలో ఆందోళన నెలకొల్పుతోంది. తగ్గినట్లే తగ్గిన కరోనా తిరిగి థర్డ్ వేవ్‌లో వీరవిహారం చేస్తోంది. కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవికి క‌రోనా సోకిందని అధికారిక ప్రకటన రాగా.. ఆ వెంటనే మరో సీనియర్ హీరో శ్రీకాంత్ కరోనా బారిన పడ్డారని తెలిసింది. తనకు కరోనా సోకినట్లు స్వయంగా పేర్కొన్నారు హీరో శ్రీకాంత్. తాను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనని కరోనా వదిలిపెట్టలేదని.. తాజాగా కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. తనతో గత కొన్నిరోజులుగా సన్నిహితంగా ఉన్నవారందరూ జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు శ్రీకాంత్. ఈ విషయం తెలిసి ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Mahesh Babu: సర్కారు వారి పాట గుడ్ న్యూస్.. అనుకున్నదే చెప్పేశారుగా..!

Image
సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది '' టీమ్. గత కొన్ని రోజులుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇస్తున్న హింట్స్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రిపబ్లిక్ డే కానుకగా కొత్త పోస్టర్‌తో మహేష్ అభిమానుల్లో జోష్ నింపారు. అందరూ ఊహించినట్లుగానే ప్రేమికుల రోజున 'సర్కారు వారి పాట' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని అధికారికంగా పేర్కొన్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన 'సర్కారు వారి పాట' మొదటి పాట విడుదలవుతుందని పేర్కొంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు. మెలోడీ సాంగ్ అఫ్ ది ఇయర్‌తో ప్రేమలో పడండి అని పేర్కొన్నారు. మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రకటన రావడంతో 'సర్కారు వారి పాట మ్యూజిక్' హ్యాష్ టాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఈ మ్యూజిక్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు కడు

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

Image
మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి నుంచి స్టార్ రేంజ్‌కు ఎదిగిన అతి కొద్ది మందిలో ర‌వితేజ ఒక‌రు. షోలో సినిమాతో సినీ రంగంపై ఆస‌క్తి పెంచుకున్న ర‌వితేజ‌కు చిత్ర సీమ రెడ్ కార్పెట్ వేయ‌లేదు. అవ‌కాశాల కోసం ఆయ‌న అనేక ఇబ్బందులు ప‌డ్డారు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. అలా వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న న‌టుడిగా మారారు. హీరో ఫ్రెండ్స్ గ్రూపులో ఒక‌డిగా, విల‌న్ గ్యాంగ్‌లో ఓ స‌భ్యుడిగా క‌నిపించ‌టం ఇలా చిన్నా చిత‌కా వేషాలు వేసుకుంటూ వ‌చ్చారు. అయితే ఆయ‌న లైఫ్‌ని ట‌ర్న్ చేసిన సినిమా ‘నీకోసం’. ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్పుడు హీరోగా సినిమానా? అని అనుకున్న‌వాళ్లూ లేక‌పోలేదు మ‌రి. కొన్ని ఇబ్బందుల‌ను ప‌డి సినిమా విడుద‌లైంది. సినిమాకు చాలా మంచి పేరు వ‌చ్చింది. శ్రీనువైట్లకే కాదు.. హీరోగా ర‌వితేజ‌కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన చిత్ర‌మిది. అలాంటి త‌రుణంలో ర‌వితేజ‌కు హీరోగా బ్రేక్ ఇచ్చింది మాత్రం పూరీ జ‌గ‌న్నాథ్‌. హీరోయిజాన్ని డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌లో ప్రెజెంట్ చేస్తూ సినిమాలు చేసే పూరీ చేతిలో ర‌వితేజ ప‌డ‌గానే ఎవ‌రూ ఊహించ‌న

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

Image
థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘కరోనా బారిన పడకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాటిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. స్వ‌ల్పంగా ల‌క్ష‌ణాలున్నాయి. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను. ఈ మ‌ధ్య కాలంలో న‌న్ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా టెస్టులు చేయించుకోండి. త్వ‌ర‌లోనే మీ అంద‌రినీ క‌లుస్తాను’’ అని తెలిపారు. ఇంతక ముందు ఓసారి ఇలాగే చిరంజీవికి కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు చిరంజీవి వెంటనే తన సోషల్ మీడియాలో స్పందిస్తూ..తప్పుడు కరోనా కిట్‌తో పరీక్షించుకోవడం వల్ల పాజిటివ్ ఫలితం వచ్చిందని తను బాగానే ఉన్నానంటూ తెలియజేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమైన పనులతో బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన సామాజిక దూరం పాటించేవారు. అయితే ఎలాగో ఆయన ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ఆచార్య

Padma Shri: అలనాటి నటి షావుకారు జానకి కీర్తి కిరీటంలో పద్మ పురస్కారం

Image
రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్ అవార్డులు, 107 మందికి అవార్డులు వరించాయి. దేశంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులు, వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరిస్తుంది. భారత 73వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం సిఫారసు మేరకు అలనాటి విలక్షణ నటి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. 90 ఏళ్ల వయసులో ఆమెకు ఈ అత్యున్నత పురస్కారం దక్కడం విశేషం. ఒకానొక సమయంలో బిజీ ఆర్టిస్ట్‌గా ఉంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు షావుకారు జానకి. 18 ఏళ్ల వయసులో చిత్ర సీమలో అడుగుపెట్టిన షావుకారు జానకి.. సీనియర్‌ ఎన్టీఆర్‌ మొదలుకొని నేటితరం హీరోల తోనూ తెరపంచుకున్నారు. 1931 డిసెంబర్‌ 12న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె.. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసి 500 పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందే ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత

NBK 107: బాలకృష్ణ తదుపరి సినిమా లేటెస్ట్ అప్‌డేట్.. గోపీచంద్ ప్లాన్ ఇదే!!

Image
'అఖండ' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నందమూరి తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా బిజీగా ఉంటూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న బాలయ్య బాబు.. మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కమిటైన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఉంటుందని తెలిసినప్పటి నుంచి నందమూరి అభిమానుల్లో క్యూరియాసిటీ మొదలైంది. పైగా బాలకృష్ణ కోసం గోపీచంద్ పవర్‌ఫుల్ స్టోరీ రెడీ చేసి రంగంలోకి దిగుతున్నారని తెలియడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించిన అప్‌డేట్ తెలిసింది. బాలకృష్ణ- కాంబోలో NBK 107గా రాబోతున్న ఈ సినిమాను బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించి కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసిన గోపీచంద్ మలినేని.. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 11 నుంచే మొదలు పెట్టాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా కొద్దిరోజుల పాటు వాయిదా వేశారు. అయితే లాటెస్ట్ సమాచారం మేరకు ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించాలని ఆయన ఫిక్సయ్యారట. హైదరాబాద్ లోని రామోజ

బంగార్రాజు 11 రోజుల వసూళ్లు.. తీరా బ్రేక్ ఈవెన్ దగ్గరలో తడబాటు!

Image
సంక్రాంతి బరిలో దిగిన బంగార్రాజు ఇన్ని రోజులు సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగించి తీరా బ్రేక్ ఈవెన్ దగ్గరలో తడబాటు గురవుతున్నాడా? అంటే తాజా రిపోర్ట్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రెండో వారంలో అడుగుపెట్టిన బంగార్రాజు కలెక్షన్స్‌లో 11వ రోజు ఊహించని డ్రాప్ కనిపించింది. విడుదలైన తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 11వ రోజుకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 36 లక్షల వసూళ్లతో సరిపెట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజు డే వైజ్ కలెక్షన్స్ చూస్తే.. డే 1: 9.06 కోట్లు డే 2: 7.79 కోట్లు డే 3: 6.72 కోట్లు డే 4: 3.55 కోట్లు డే 5: 1.94 కోట్లు డే 6: 91 లక్షలు డే 7: 51 లక్షలు డే 8: 46 లక్షలు డే 9: 64 లక్షలు డే 10: 81 లక్షలు డే 11: 36 లక్షలు మొత్తంగా చూస్తే ఈ 11 రోజుల్లో కలిపి 32.75 కోట్ల నెట్, 53 కోట్ల మేర గ్రాస్ వసూలైంది. 11వ రోజు ఏరియాల వారిగా రిపోర్ట్ చూస్తే.. నైజాం: 5 లక్షలు సీడెడ్‌: 8 లక్షలు ఉత్తరాంధ్ర: 8 లక్షలు ఈస్ట్ గోదావరి: 5 లక్షలు వెస్ట్ గోదావరి: 3 లక్షలు గుంటూరు: 3 లక్షలు కృష్ణా: 2 లక్షలు నెల్లూరు: 2 లక్షలు మొత్తంగా చూస్తే అన్ని ఏరియాల్లో కలిపి బంగార్రాజుకు 36 ల

మెగా ఫ్యాన్స్ ఆక‌లి తీర్చేయ‌నున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఏడాదిలోపు మూడు బ‌డా ప్రాజెక్స్‌తో ట్రీట్ ఫిక్స్‌!

Image
క‌రోనా ప్ర‌భావంతో ఇబ్బంది ప‌డ్డ ప‌రిశ్ర‌మ‌ల్లో సినీ పరిశ్ర‌మ ఒక‌టి. దాదాపు రెండేళ్లు సినీ రంగం అభివృద్ధి కుంటుప‌డింది. స్టార్స్, భారీ బ‌డ్జెట్ సినిమాలు విడుద‌ల‌లు ఆగిపోయాయి. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత కొన్ని సినిమాలు, సెకండ్ వేవ్ త‌ర్వాత కొన్ని సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇప్ప‌డు మూడో వేవ్ కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీ కాస్త ఆగింది. ఈ వేవ్ త‌గ్గిన త‌ర్వాత భారీ బ‌డ్జెట్ సినిమాలు థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోల్లో అంద‌రూ ఓ స్టైల్లో ఆలోచిస్తే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాత్రం మ‌రోలా ఆలోచించారు. వారి అభిమాన హీరోల సినిమాల కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ త‌రుణంలో వారి సినిమా దాహం తీర్చ‌డానికి రామ్ చ‌ర‌ణ్ రెడీ అయిపోయారు. సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేయ‌డానికి రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌తో క‌లిసి సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది. కానీ కరోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. మ‌రో వైపు చ‌ర‌ణ్ త‌న తండ్రి.. సీనియ‌ర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి చేసిన సినిమా ఏప్రిల్ 1న విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుంది. ఈ రెండు సినిమాలు ఇప్ప‌ట

Ravi Teja: రవితేజని కొట్టిన బాలకృష్ణ.. ఆ హీరోయిన్ కోసం గొడవ నిజమేనా.. అసలేమైంది?

Image
నందమూరి చాలా ముక్కుసూటి మనిషి. చిన్నపిల్లాడి మనస్తత్వం.. ఎలాంటి మాస్క్‌లు లేకుండా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తారు. మంచి అయినా చెడు అయినా ఆన్ ది స్పాట్ రియాక్షన్ ఉంటుంది. అంతేతప్ప కవర్ కోటింగ్‌లు బాలయ్య దగ్గర ఉండవు అనేది ఆయన్ని బాగా దగ్గర నుంచి చూసిన వాళ్లు చెప్పే మాట. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు.. నచ్చకపోతే చెంపలు వాయించేస్తారు. చివరికి ప్రాణం ప్రేమించే అభిమానులైతే హద్దులు దాటితే దవడపగిలిపోవాల్సిందే. ఇదే ఆయన సూత్రం. బాలకృష్ణ కొడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే.. సెట్స్‌లోనూ అలాగే బయట జనం మధ్యకి వచ్చినప్పుడు బాలయ్య కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే బాలయ్య కొట్టిన వాళ్ల లిస్ట్‌లో సామాన్యులే కాదు.. స్టార్ హీరోలు కూడా ఉన్నారా? హీరో రవితేజను కూడా బాలకృష్ణ కొట్టారా? ఓ హీరోయిన్ విషయంలో బాలకృష్ణ.. రవితేజపై చేయి చేసుకున్నారనే రూమర్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది. దానికి సంబంధించిన రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు.. ఫిల్మ్ జర్నలిస్ట్‌లు కూడా నిప్పులేనిదే పొగరాదుగా.. కొట్టే ఉంటారులే అని ఈ రూమర్‌కి పొగ ఊదుతూ వచ్చారు. అయితే ఇటీవల బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల

Rajasekhar : సినిమా నుంచి త‌ప్పించాల‌ని జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ప్లాన్ చేసి ఇబ్బంది పెట్టారు : సముద్ర‌

Image
తెలుగులో సింహరాశి, శివ రామ‌రాజు, సూర్యం, మ‌హా నంది, ఎవ‌డైతే నాకేంటి.. ఇలా ప‌లు చిత్రాల‌ను ఆయ‌న డైరెక్ట్ చేశారు. ఈయ‌న డైరెక్ట్ చేసిన చిత్రాల్లో సింహ‌రాశి, ఎవ‌డైతే నాకేంటి చిత్రాలను రాజ‌శేఖ‌ర్‌తో ఆయ‌న రూపొందించారు. ఈ రెండు సినిమాలు మంచి విజ‌యాన్ని సాధించాయి. డైరెక్ట‌ర్‌గా ఈయ‌న త‌న కెరీర్‌ను ప్రారంభించి రెండు ద‌శాబ్దాలు అయ్యాయి. ఈ సంద‌ర్భ‌లో ఈయ‌న రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్‌లో ఎదుర్కొన్న ఆటు పోట్లు గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. హీరో రాజ శేఖ‌ర్‌, ఆయ‌న స‌తీమ‌ణి, సీనియ‌ర్ న‌టి జీవితలతో జర్నీలో వచ్చిన పొరపచ్చాలు గురించి స‌ముద్ర మాట్లాడుతూ ‘‘నా ప్రయాణంలో పొరపచ్చాలు అంటే రాజశేఖర్‌తో వ‌చ్చింది. నేను ఆయ‌న‌తో ‘ఎవ‌డైతే నాకేంటి’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. అంత‌కు ముందు ఆయ‌న‌తోనే నేను డైరెక్ట్ చేసిన ‘సింహ రాశి’ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత రాజ‌శేఖ‌ర్‌కు స‌రైన హిట్స్ లేవు. మ‌ధ్య‌లో కొన్ని సినిమాల‌ను డైరెక్ట్‌చేయ‌మ‌ని నన్ను అడిగారు. అయితే ఆ క‌థ‌లు నాకు న‌చ్చ‌లేదు. దాంతో నేను వ‌ద్ద‌ని అన్నాను. కానీ రాజ‌శేఖ‌ర్ త‌న‌తో నేను సినిమా చేయ‌డం ఇష్టం లేక వ‌ద్దంట