Posts

Showing posts from October, 2020

తొలిసారి ఆయనను అక్కడే కలిశా..! బ్రేక్ ఇవ్వడానికి కారణమిదే: పూజా హెగ్డే

Image
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇటీవలే అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురములో’ సినిమా చేసి బుట్టబొమ్మగా కీర్తించబడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సరసన చిందేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. 2016 సంవత్సరంలో ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్‌ తెరపై కూడా అడుగుపెట్టారు. ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో బాలీవుడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం తెలుగు తెరపై సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై రియాక్ట్ అవుతూ తన ఫీలింగ్స్ బయటపెట్టారు పూజా. సినీ నటులు అన్నాక తొలి సినిమాను చాలా కీలకంగా భావిస్తుంటారని, తనను బాలీవుడ్ మొదటి సినిమా ‘మొహంజోదారో’ డిజాస్టర్ భాధ పెట్టిందని పూజా హెగ్డే తెలిపారు. ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో తన గుండె పగిలినంత పనైందని ఆమె చెప్పారు. అందుకే కొంతకాలం బాలీవుడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చానని, ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనలతో మూడేళ్ల తర్వాత రెండో సినిమా ‘హౌస్‌ఫుల్‌ 4’తో సక్సెస్ సాధించి తృప్తి చెందానని ఆమె పేర్కొన్నారు. Also Read: టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నా బాలీవుడ్ తెరకు మూడేళ్ల గ్యాప్ ఇచ్చిన పూజా.. తిరిగి 2019 లో ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాలో నట

Mahesh Babu: థాయ్‌లాండ్‌లో మహేష్ బాబు అలా..! కమలాయ ఎఫెక్ట్ అంటున్న నమ్రత

Image
కరోనా మహమ్మారి దాడితో దేశం మొత్తం అతలాకుతలమైంది. అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడింది. దాదాపు నాలుగు నెలల పాటు ఏ ఒక్కరూ గడపదాటి బయటకురాని పరిస్థితి చూశాం. ఆ తర్వాత నెమ్మదిగా లాక్‌డౌన్ సడలింపులు వస్తుండటంతో ప్రజలంతా ఎవరి పనిలో వారు నిమగ్నమవుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ పాత ఫోటో షేర్ చేసి సర్‌ప్రైజ్ చేశారు ఆయన సతీమణి . కరోనాకి ముందు సమ్మర్‌ వెకేషన్‌కి వెళ్లినప్పటి ఫొటో ఇది అని పేర్కొన్నారు. పాత ఫోటోనే అయినా రేర్ పిక్ కావడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అయింది. పైగా ఈ పిక్‌లో టోపీ పెట్టుకుని.. చాలా సంతోషంగా కనిపిస్తున్న మహేష్ డిఫరెంట్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఎప్పుడూ మహేష్‌ని‌ ఇలా కనిపించకపోవడంతో ఈ పిక్ చూసి తెగ మురిసిపోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. థాయ్‌లాండ్‌లోని కమలాయ రిసార్ట్, అందులోని స్పా అంటే మహేష్‌ బాబుకు ఎంతో ఇష్టమని తెలుపుతూ ఈ రేర్ ఫోటో షేర్ చేశారు నమ్రత. ఈ మేరకు ప్రీ కోవిడ్ డైరీస్ అనే హ్యాష్ ట్యాగ్ జతచేశారు. Also Read: ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరూ' మూవీతో సక్సెస్ అందుకున్న ఆయన మరికొద్ది రోజుల్లో 'సర్

Valmiki Jayanti: ఆ రోజు గొడవ చేసినోళ్లకు గుర్తుండే ఉంటుంది.. నాగబాబు సెటైరికల్ కామెంట్స్!

Image
మెగా ప్రిన్స్, తనయుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'గద్దలకొండ గణేష్' సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదట 'వాల్మీకి' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ప్రమోషన్స్ కూడా చేసిన దర్శకనిర్మాతలు పలు వివాదాలు తలెత్తడంతో చివరి క్షణంలో ఆ టైటిల్‌ని 'గద్దలకొండ గణేష్'గా మార్చేసి రిలీజ్ చేశారు. తాజాగా అదే విషయాన్ని గుర్తుచేస్తూ ఓ సెటైరికల్ కామెంట్ వదిలారు మెగా బ్రదర్ నాగబాబు. 'వాల్మీకి' సినిమా అంతా రెడీ అయ్యాక.. తమ సినిమాలో వాల్మీకి మహర్షిని కించపరచలేదని, ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగిందని డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపినా వివాదాలు సద్దుమణగలేదు. దీంతో 'వాల్మీకి'గా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్'గా వెండితెరపై కనిపించాడు. ఫైనల్‌గా చూస్తే ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ఈ రోజు (అక్టోబర్ 31) వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తనదైన స్టైల్‌లో నాగబాబు ట్వీట్ చేశారు. Also Read: ''ఆ రోజు 'వాల్మీకి' అని టైటిల్ పెడితే గొడవ చేశారు కదా. వాళ్ళక

ఓడిపోయాం.. ఇక మన జీవితం ఇంతే! రిప్ హ్యూమానిటీ అంటూ రగిలిపోయిన రష్మీ

Image
మానవుడిగా పుట్టి అన్నీ తెలిసిన మనమే మూగ జీవాల పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే బాధేస్తుందనే అర్థంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది . మూగ జీవాలంటే అమితంగా ఇష్టపడే ఆమె ఓ విషాదకర వీడియో షేర్ చేస్తూ ఇక మన భవిష్యత్తు ఇలాగే ఉంటుందంటూ ఆవేదన చెందింది. ఎంత అవగాహన కల్పించినా జనాల్లో మార్పు రావడం లేదంటూ కోపంతో రగిలిపోయింది రష్మీ. ఈ సృష్టిలోని మూగ జీవాలంటే యాంకర్ రష్మీకి మహా ఇష్టం. జంతు ప్రేమికులరాలిగా జీవులను రక్షించే బాధ్యత మనుషులపై ఉందని ఇప్పటికే పలు సార్లు ఆమె పోస్టులు పెట్టింది. మూగ జీవాలన్నాక చిన్న, పెద్ద తేడా లేదంటూ సృష్టి లోని జీవాలన్నింటినీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అని ఎన్నోసార్లు ట్వీట్స్ చేసింది. లాక్‌డౌన్ సమయంలోనూ వీధి కుక్కలకు స్వయంగా ఆహారం అందించి మానవత్వం చాటుకుంది రష్మీ. సృష్టిలో అన్నీ ముఖ్యమైనవే.. దేన్నీ వదులుకోవద్దు అని ఎప్పుడూ చెప్పే ఆమె.. తాజాగా షేర్ చేసిన వీడియోతో ఏకంగా రిప్ హ్యూమానిటీ అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. Also Read: ఓ పిల్లాడు చిన్న కుక్క (పప్పీ)ని తీసుకొచ్చి వాటర్ ట్యాంక్‌లో వేసి దాని చావుకు కారణమై వెళ్ళిపోతున్న వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస

కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్ పోజ్! లో- దుస్తులను ఫోకస్ చేస్తూ ఇలా!!

Image
'కంచె' భామ హాట్ కిక్కిచ్చింది. లో- దుస్తులను ఫోకస్ చేస్తూ ఫోటో షూట్‌లో పాల్గొని ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు 'ఈ శనివారం వేళ కొన్ని కిరణాలను ఒడిసిపట్టుకుంటున్నా' అంటూ ఆమె పెట్టిన ట్యాగ్ లైన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో ప్రగ్యా అందాల విందు చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. అమ్మడి పదునైన లుక్స్, క్లీవేజ్ ట్రీట్ చూసి వావ్! బ్యూటిఫుల్ అంటూ అందాలను పొగిడేస్తున్నారు. అందంతో పాటు అభినయం పరంగా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్న ప్రగ్యా జైస్వాల్.. అవకాశాలు పట్టడంలో మాత్రం విఫలమైందనే చెప్పుకోవాలి. ఆశించిన మేర అవకాశాలు రాకపోవడంతో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా అందాల విందిస్తూ అటు దర్శక నిర్మాతలకు గ్యాలం వేస్తూనే ఇటు నెటిజన్లను కనువిందు చేస్తోంది. దీంతో ప్రగ్యా పోస్ట్ చేస్తున్న హాట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ క్రమంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ కుర్రకారు కంటిమీద రెప్ప వాలనీయడం లేదు. లో- దుస్తులను ఫోకస్ అయ్యేలా ప్రగ్యా స్టైలిష్ లుక్ చూసి ఫిదా అవుతున్నారంతా. కావాల్సినంత అందం, దానికి తోడు నటనా సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రగ్యాకు అవ

Noel Sean: అవినాష్, మాస్టర్ చిల్లర కామెడీ ఏంటి? జోకర్లా మీరు? ఎలిమినేట్ అవుతూ శివాలెత్తిన నోయల్

Image
నోయల్ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్ ఇస్తూ ప్రోమో విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. తీవ్ర అనారోగ్య కారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన నోయల్.. తిరిగి బిగ్ బాస్ హౌస్‌కి వెళ్తారని భావించారు ఆయన ఫ్యాన్స్. అయితే నోయల్ హాస్పటల్ నుంచి తిగిరి వచ్చాడు కానీ.. బిగ్ బాస్ హౌస్‌కి కాదు.. బిగ్ బాస్ స్టేజ్ మీదికి. శనివారం నాటి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా.. ఇందులో నోయల్ నాగార్జునతో ఒప్పో సెల్ఫీకి రెడీ అయినట్టుగానే ప్రోమో వదిలారు. అయితే అందరి ఎలిమినేషన్ ఓ లెక్క.. నోయల్ ఎలిమినేషన్ ఓ లెక్క అన్నమాదిరిగా నోయల్ వెళ్తూ వెళ్తూ తన మాస్క్ తీసి అసలు సిసలు నోయల్‌ని బయటకు తీశాడు. తాను ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతూ.. కీళ్ల నొప్పులు భరించలేక ఇబ్బందులు పడుతుంటే హేళన చేస్తారా అంటూ హోస్ట్ నాగార్జున ముందే అవినాష్, అమ్మా రాజశేఖర్‌లకు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ ఇచ్చేస్తున్నాడు నోయల్. బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చిన నోయల్.. ‘అమ్మా రాజశేఖర్ గారూ.. అవినాష్ ఇద్దరూ ఒకటే కాలిమీద దయచేసి నాకోసం నిలబడండి’ అని కోరాడు. నోయల్ చెప్పినట్టే ఈ ఇద్దరూ కాసేపు ఒంటి కాలిపై నిలబడగా.. కాలు నొప్పి వస్తుందా మాస్టార్ అని అడిగాడు నోయల్.. చాలా నొప్పి

తెలంగాణ పోలీస్‌పై కీరవాణి స్పెషల్ పాట.. నెవర్ బిఫోర్ సాంగ్.. వీడియో

Image
ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరచి, ఆలపించిన "పోలీస్, పోలీస్.. తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్" అనే పాటను డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి హాజరయ్యారు. సీనియర్ పోలీస్ అధికారులు ఉమేష్ ష్రాఫ్, జితేందర్, సందీప్ శాండిల్య, శివధర్ రెడ్డి, నాగిరెడ్డి, బాల నాగాదేవి, వెంకటేశ్వర్లు, ఈ పాట ఎడిటర్ హైమా రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ నెల 21వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ ఫ్లాడ్ డే కార్యక్రమాల సందర్బంగా ఈ పాటను విడుదల చేయడం సందర్భోచితంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. విధినిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కస్టాలు, ఇబ్బందులను వివరిస్తూనే పోలీసులు అందించే సేవలను స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారని మహేందర్ రెడ్డి ప్రశంసించారు. మనం కష్టపడుతూ సేవలందిస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి నిదర్శనం ఈ అద్భుతమైన పాటే నిదర్శనమని డీజీపీ అన్నారు. ఈ సందర్బంగా సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, మాతృదే

Rajashekar Health: వైద్యుల పర్యవేక్షణలో రాజశేఖర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ రిపోర్ట్

Image
కరోనా సోకడంతో సీనియర్ హీరో ఇటీవలే హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన మెల్లగా కోలుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన ఐసియూలోనే ఉండటంతో రాజశేఖర్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు (శనివారం) ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తాజా రిపోర్ట్‌లో వెల్లడించారు. అనారోగ్యం నుంచి ఆయన కోలుకుంటున్నారని, ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా మెరుగు పడుతున్నాయని తెలిపారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు. Also Read: ఇటీవలే తనతో పాటు తన ఫ్యామిలీ మొత్తం (ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత) కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొనడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే జీవిత, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన పూర్తి ఆరో

విడుదలకు రెడీ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మెరిసే మెరిసే'.. అంతా సిద్ధం!!

Image
ప్రస్తుతం యూత్‌ని అలరించే సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అది చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుందంటే చాలు యూత్ ఆడియన్స్ అంతా ఆదరించి ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసేస్తున్నారు. తాజాగా అదేబాటలో అందరినీ ఆకట్టుకునే కథాంశంతో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది '' మూవీ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఫినిష్ చేసుకొని విడుదలకు రెడీ అయింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు నెలకొల్పింది. హీరోహీరోయిన్ల స్టైలిష్ లుక్స్ యువతను ఆకట్టుకున్నాయి. కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాత వెంకటేష్ కొత్తూరి ఈ 'మెరిసే మెరిసే' మూవీ నిర్మిస్తున్నారు. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన కథాంశానికి పదునుపెట్టి పవన్ కుమార్.కె దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో హుషారు ఫేమ్ హీరోగా నటిస్తుండగా, గతంలో 'మళ్ళీ మళ్ళీ చూశా' సినిమాతో అలరించిన హీరోయిన్‌గా నటిస్తోంది. Also Read: మెరిసే మెరిసే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేశామని, అతి త్వర

బిగ్ బాస్ రేటింగ్.. పాయే నాగ్‌తో సహా అందరి పరువూ పాయే!

Image
దేశంలోనే నెంబర్ వన్ ఛానల్ అని నాగార్జున డబ్బా కొట్టారు కానీ.. 42వ వారానికి సంబంధించిన బార్క్ రేటింగ్ చూస్తే స్టార్ మా ఛానల్ 839523 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. స్టార్ ఉత్సవ్ 1287627 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ రేటింగ్ విషయానికి వస్తే.. స్టార్ మా ఛానల్ సత్తా చూపించింది. 786282 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ రేటింగ్ బిగ్ వల్ల వచ్చింది కాదు.. కార్తీకదీపం, వదినమ్మ, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్స్‌తో వచ్చిందే. తాజా బార్క్ రేటింగ్స్ చూస్తే బిగ్ బాస్ నిర్వాహకులకు దిమ్మ తిరిగిపోద్ది.. ‘బిగ్ బాస్ సీజన్ 4 తోపు.. దమ్ముంటే ఆపు’ బిగ్ బాస్ కంటెస్టెంట్లు తొడలు వాచేలా కొట్టుకుంటున్నా.. హోస్ట్ నాగార్జున.. ఎనిమిది కోట్ల ఓట్లు.. టాప్ రేటింగ్.. నంబర్ వన్ ఛానల్ అని చెప్తున్నా.. ఈ బుధవారం రేటింగ్ చూస్తే అవన్నీ నిజమేనా అనే సందేహాలు రాక మానవు. గత బుధవారం అంటే సెప్టెంబర్ 21న హైదరాబాద్ బార్క్ రేటింగ్ బిగ్ బాస్‌కి వచ్చిన రేటింగ్ కేవలం 3.73. బిగ్ బాస్ హిస్టరీలోనే బహుషా ఇదే తక్కువ రేటింగ్ అయ్యి ఉండొచ్చు. కార్తీకదీపం సీరియల్ అయితే ఏరోజూ కూడా 18.56కి తక్కువ క

ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా... విదేశీయులూ ఫిదా

Image
ఒక భాషలో హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం చూస్తూనే ఉంటాం. కొన్ని సినిమాలను ఒకట్రెండు భాషల్లో తెరకెక్కిస్తే.. మరికొన్నింటిని ఇంకా ఎక్కువ భాషల్లోనూ తీస్తుంటారు. అయితే తెలుగు తెరపై స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన ఓ సినిమా ఏకంగా ఆరు భారతీయ భాషలు, రెండు విదేశీ భాషల్లో రీమేక్ చేశారంటే నమ్మగలమా?. ఆ సినిమానే సిద్ధార్థ, జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ‘’. Also Read: ఈ సినిమాలో సిద్ధార్ధ్, త్రిష నటన ఎప్పటికీ మర్చిపోలేనిది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం, ఎమ్మెస్ రాజు నిర్మాణం ఈ సినిమా విజయాన్ని మరో మెట్టు ఎక్కించాయి. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాను ఆ తర్వాత తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, హిందీ భాషలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లోనూ రీమేక్ చేయగా అక్కడా విజయం సాధించింది. Also Read: దీంతో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు చిత్రంగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి కలెక్షన్లు, ప్రశంసలతో పాటు అవార్డులు కూడా భారీగా వచ్చాయి. తెలుగులో ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు ఐదు నంది అవార్డులు, 9 ఫిలింఫేర్

బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా ఆయన చనిపోయారు.. నాకు చెప్పకుండా దాచారు, ఇంటికి వెళ్లేసరికి: దివి

Image
బిగ్ బాస్ హౌస్‌కి రావడం ద్వారా సెలబ్రిటీగా మారింది ‘మహర్షి’ ఫేమ్ దివి. మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన హీరోయిన్‌గా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అందం, అభినయం, ఆకర్షించే రూపం ఉన్న దివి బిగ్ బాస్ హౌస్‌లో గ్లామర్ బ్యూటీగా సత్తా చాటి ఏడోవారం ఎలిమినేట్ అయ్యింది. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దివి తన ఇంట్లో జరిగిన విషాద సంఘటనను ప్రేక్షకులతో పంచుకుంది. టీచింగ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన దివి.. సినిమాల్లోకి రావడానికి వాళ్ల పేరెంట్స్ ఒప్పుకోలేదట. కానీ వాళ్ల తాతయ్య ఆమెను ప్రోత్సహించి సినిమాల్లోకి రావడానికి కారణ మయ్యారట. అయితే తన మనవరాలి సక్సెస్ కోసం ఎదురుచూసిన తాతయ్య.. తాను బిగ్ బాస్ హౌస్ నుంచి తిరిగి వచ్చేసరికి చనిపోయారని చెప్పింది దివి. ఆమె మాట్లాడుతూ.. ‘నేను చదువుకున్నది ఒకటి.. చేస్తున్నది వేరు.. నేను ఎంటెక్ చేశా.. కానీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నాకు ఈ ఫీల్డ్ అంటే ఎంత ఇష్టం అంటే.. నటించడం అనేది కొన్నాళ్లు మాత్రమే చేయగలం. కానీ ఆ తరువాత కూడా ఈ ఫీల్డ్‌ని వదలాలని అనుకోవడం లేదు. డైరెక్షన్, ప్రొడక్షన్ ఇలా ఏదైనా చేసి సినిమా ఫీల్డ్‌లో ఉండాలని ఫిక్స్ అయ్యా

13ఏళ్లకే రజినీకాంత్‌కు తల్లిగా నటించిన శ్రీదేవి.. ఏ సినిమానో తెలుసా?

Image
అతిలోక సుందరి శ్రీదేవి.. తనదైన అందం, నటనతో తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోనూ ఆమె ఎన్నో సినిమాల్లో నటించి హిట్ పెయిరా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఓ సినిమాలో రజినీకి సవతి తల్లిగా నటించింది. అదీ 13ఏళ్ల వయసులోనే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. Also Read: కె.‌బాల‌చం‌దర్‌ తెర‌కె‌క్కిం‌చిన ‌‘మూండ్రు ముడిచ్చు’‌ సినిమాలో 1976లో విడుదలైంది. ఇందులో కమల్‌హాసన్, స్నేహితులు. ఇద్దరూ శ్రీదేవిని ప్రేమించగా ఆమె మాత్రం కమల్‌ను ఇష్టపడుతుంది. ఈ క్రమంలోనే కమల్ చనిపోగా.. దానికి కారణంగా రజినీయే అని ఆమె భావిస్తుంది. దీంతో అతడిపై పగ తీర్చుకునేందుకు రజినీ తండ్రిని పెళ్లి చేసుకుని సవతి తల్లిగా మారుతుంది. ఆ తర్వాత‌ వచ్చిన అనేక సినిమాల్లో రజినీకాంత్, శ్రీదేవి జంటగా నటించి మెప్పించారు. Also Read:

బ్రతికుండగానే తాను చనిపోయానని చెప్పుకున్న హీరో.. కారణమిదే

Image
అందాల నటుడు భౌతికంగా లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఆంధ్ర సోగ్గాడు చిరస్థాయిగా నిలిచిపోయారు. తనను అందంగా చూసిన ప్రేక్షకులు ముసలితనంగా చూడలేరన్న భావనతో స్వచ్ఛందంగానే సినిమాలకు స్వస్తి పలికారాయన. కాలేజీలో చదువుతున్నప్పుడే శోభన్‌బాబుకు ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలంటే పిచ్చి. కాలేజీకి డుమ్మా కొట్టి మరీ సినిమాలు చూసేవారంట. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘కీలుగుర్రం’ ఆయన చూసిన మొదటి సినిమా. మల్లీశ్వరి సినిమాను ఏకంగా 22సార్లు చూశారంట. డిగ్రీ పూర్తయ్యాక మద్రాసులో లా కోర్సులో జాయిన్ అయిన ఖాళీ సమయాల్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు. Also Read: 1959లో ఎన్టీఆర్‌తో ‘దైవ బలం’ అనే సినిమాలో మొదటగా నటించారు. ఆ తర్వాత భక్త శబరి, భీష్మ, అభిమన్యు, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న, మనుషులు మారాలి, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం, డాక్టర్ బాబు, సోగ్గాడు, గోరింటాకు, శ్రావణ సంధ్య, దేవత, కార్తీకదీపం, ముందడుగు, మహాసంగ్రామం స్వయంవరం, సంపూర్ణ ప్రేమాయణం, సంసారం, సర్పయాగం లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సోగ్గాడిగా నిలిచిపోయారు. కోడె త్రాచు, ఇల్లాలు ప్రియురాలు వంటి చిత్రాలతో కోదండ

మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్... రోజాపై ఆసక్తికర కామెంట్

Image
ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు ఆయనకు మధ్య కొంతకాలం క్రితం టీవీ లైవ్ డిబేట్‌లో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నామన్న సోయి లేకుండా ఇద్దరూ బూతులతో రెచ్చిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరికి మాటలు లేవు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరు హాయిగా నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. Also Read: ఆ ఫోటోను తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ... చాలాకాలం తర్వాత గారినిక కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని, ఆమెకు ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. కొంతకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రోజా వ్యాఖ్యల నేపథ్యంలో వీరిద్దరి మధ్య మాటలయుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. Also Read:

ఒక్క ఎపిసోడ్ కూడా చూడకుండానే చేశా..అంతా మామ వల్లే: సమంత

Image
బిగ్‌బాగ్-4 సీజన్‌లో మెరుపులా దర్శనమిచ్చింది అక్కినేని వారి కోడలు సమంత. దసరా రోజును ఏకంగా మూడు గంటల పాటు హోస్టింగ్‌ చేసి మామను మించిన కోడలు అంటూ బుల్లితెర ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంది. మరికొంతమంది అయితే నాగార్జున కంటే సమంతే బాగా హ్యాండిల్ చేసిందని, ఆమెను వ్యాఖ్యాతగా కొనసాగించాలంటూ డిమాండ్ కూడా చేశారు. లేకపోతే బిగ్‌బాస్-5 సీజన్‌కు ఆమెను పూర్తిస్థాయిలో హోస్ట్‌గా తీసుకోవాలని సూచనలు కూడా చేసేస్తున్నారు. అయితే ఇంత పెద్ద రియాలిటీ షోను అంత బాగా హ్యాండిల్ చేసిందంటే.. ఆమె రోజూ బిస్‌బాస్ షో చూస్తూ హార్డ్‌వర్క్ చేసిందని అందరూ అనుకున్నారు. Also Read: అయితే తాను షో చేసేటప్పటికి బిగ్‌బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని చెప్పింది సమంత. బిస్‌బాస్‌‌కు హోస్టింగ్‌ చేయడంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించింది. ‘ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అనుభవం. ‘బిగ్‌బాస్’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం మామగారి వల్లే హోస్ట్‌గా వచ్చా. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు ముందు నేను ఎన్నో భయాలను అధిగమించాల్సి వచ్చింది. ఇంతకుముందు నేను ఏ కార్యక్రమానికీ హోస్ట్‌గా వ్యవహరించలేదు. తెలుగు పెద

మారేడుమిల్లి ఫారెస్ట్‌కి వెళ్తున్న ‘పుష్ప’... భారీ షెడ్యూల్‌కు ఏర్పాట్లు

Image
సుకుమార్- అల్లు అర్జున్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘’ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికోసం యూనిట్ అడవిలోకి ప్రవేశించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 6 నుంచి షురూ కాబోతోందని తెలుస్తోంది. ఇందుకోసం మారేడుమిల్లి ఫారెస్ట్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ కావడంతో కచ్చితంగా అడవుల్లోనే ఎక్కువ భాగం చిత్రీకరించాల్సి ఉంది. Also Read: ఇందులో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ అనే యువకుడిగా మాస్‌ పాత్రలో కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందానా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఇద్దరూ చిత్తూరు యాసలో ట్రైనింగ్‌ తీసుకున్నారు. మారేడుమిల్లి అడవుల్లో నెల రోజుల పాటు కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా షూట్ చేయనున్నట్లు యూనిట్ చెబుతోంది. Also Read:

Rashmi Gautam: ‘పొట్టిబట్టల వల్లే రేప్‌లు అన్నాడు.. వాడొక్కడే కాదు’.. ప్రియమణి, రష్మి, వర్షిణి కన్నీటి పర్యంతం

Image
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. పురుషాధిక్యత గల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మహిళపై పశువాంఛ తీర్చుకుంటూ దారుణంగా రేప్‌లు చేసి చంపేస్తున్నారు మృగాళ్లు. అయితే మహిళలపై రేప్ జరిగిన ప్రతిసారి వాళ్ల వస్త్రధారణపై విపరీతమైన చర్చ నడుస్తోంది. చాలామంది మహిళలు బయటకు రావడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని.. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని బయటకు రావడం వల్లే రేప్‌లు జరుగుతున్నాయని వాదించే వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇలాంటి అనుభవాన్ని తెలియజేస్తూ కన్నీరు మున్నీరైంది ప్రముఖ హీరోయిన్ ప్రియమణి.ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ ఛాంపియన్స్‌కి జడ్జీగా వ్యవహరిస్తున్న ప్రియమణి ఎమోషనల్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాలోని ఈ ‘మగువా మగువా’ పాటను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయడంతో ఈ పాట మహిళా లోకాన్ని తట్టిలేపింది. ఈ పాటను ఇప్పుడు ఢీ ఛాంపియన్స్‌లో పెర్ఫామ్ చేశారు. అన్నింటా మగువే.. జగమంతా మగువే అంటూ మహిళలు ఏయే రంగాల్లో సత్తా చూపిస్తున్నారో తెలియజేస్తూ డాన్సర్లు థీమ్ సాంగ్‌ను పెర్ఫామ్ చేయడంతో ఢీ ఛాంపియన్స్‌లో ఉన్న మహిళలంతా భావ

8 ఏళ్ల తరవాత తెలుగులోకి సిద్ధార్థ్.. వచ్చే నెల నుంచి ఫుల్ బిజీ

Image
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరో సిద్ధార్థ్.. సుధీర్ఘ విరామం తరవాత మళ్లీ తెలుగు తెర మీద మెరవబోతున్నారు. RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న ‘మహాసముద్రం’ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శర్వానంద్, అదితీరావు హైదరి ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో నటిస్తుండటంపై సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా శుక్రవారం స్పందించారు. 8 ఏళ్ల తరవాత ‘మహాసముద్రం’ సినిమాతో మళ్లీ తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి ‘మహాసముద్రం’ షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపారు. తాను చెప్పినట్టుగానే మళ్లీ తెలుగులో సినిమా చేస్తున్నానని, అద్భుతమైన టీమ్, సహ నటులతో కలిసి పనిచేయబోతున్నానని సిద్ధార్థ్ వెల్లడించారు. చాలా ఆనందంగా ఉందని.. ప్రేక్షకుల దీవెనలు తనకు కావాలని సిద్ధార్థ్ కోరుకున్నారు. కాగా, లాక్‌డౌన్ కారణంగా సుమారు ఎనిమిది నెలలు ఖాళీగా ఉన్న సిద్ధార్థ్..

Kushboo: రజినీకాంత్ ఆరోగ్యంపై కుష్బూ ట్వీట్.. సంతోషం కంటే ఏదీ ముఖ్యమైంది కాదంటూ మెసేజ్

Image
సూపర్ స్టార్ అనారోగ్య కారణాల వల్ల రాజకీయ అరంగేట్రం చేయడంలేదని పేర్కొంటూ ఇటీవల ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రజినీ రాజకీయాల్లోకి వెళ్లకుండానే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లుగా ఆ లేఖలో రాసి ఉండటంతో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ లేఖ విషయమై రియాక్ట్ అయిన రజినీకాంత్ ఆ లేఖ ఫేక్ అని తెలిపారు. అయినప్పటికీ ఆ లేఖలో పేర్కొన్నట్టు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం మాత్రం నిజమేనని వెల్లడించారు. దీంతో అంతా రజినీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా దీస్తున్నారు. Also Read: ఈ క్రమంలో తాజాగా సీనియర్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు సుందర్ స్పందించారు. ''డియర్ రజినీకాంత్ సర్. మీరు వజ్రం లాంటి వారు. మాకు మీ ఆరోగ్యం, సంతోషం కంటే ఏదీ ముఖ్యమైంది కాదు. ఆరోగ్యపరంగా ఏది చేస్తే మీకు మంచి జరుగుతుందో అదే చేయండి. మీరు ఎపుడు ఎక్కడా ఏ పార్టీ పెట్టినా.. మీపై మాకున్న గౌరవంలో ఎలాంటి మార్పు ఉండదు. మా జీవితాంతం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాము'' అంటూ ట్వీట్ చేశారు ఖుష్బూ. కాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ లెటర్‌లో రజినీకాంత్ ఇక రాజకీయాల్లోకి రారని, ఈ మేరకు ఆయన ఈ ఏడాది డిసెంబర్‌లో త

YS Jagan: జగన్ బెస్ట్ సీఎం.. ఆయన చేస్తున్నట్టు ఎవరూ చేయలేదు: బిగ్ బాస్ సొహైల్ వీడియో వైరల్

Image
కథ వేరే ఉంటుంది అంటూ బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యాడు రియాన్. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన సొహైల్.. 8వ వారం వచ్చేసరికి టైటిల్ విన్నర్ రేస్‌లోకి వచ్చేశాడు. మొదట్లో అర్జున్ రెడ్డి మాదిరిగా ఫైర్ అవుతూ.. నిత్యం ఎవరొకరితో గొడవపెట్టుకుంటూ ఫైర్ బ్రాండ్‌గా వ్యవహరించేవాడు. మనోడు మాట్లాడితే పోట్లాడినట్టే ఉంటుంది. కోపం వస్తే మెడపై నరాలు పొంగిపోతాయ్.. తన కోపమే తన శత్రువు అవుతుందని భావించిన సొహైల్ ఆ తరువాత కూల్‌గా మారిపోయాడు. నాగార్జున సలహా మేరకు అరవడం మానేసి కూల్‌గా మాట్లాడటం నేర్చుకుని తన గేమ్ స్ట్రాటజీ మార్చుకున్నాడు. దీంతో రెండు మూడు వారాల్లోనే సొహైల్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. టైటిల్ రేస్‌లోకి వచ్చేయడంతో సొహైల్‌ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. కాగా ఇతనికి సంబంధించిన పాత ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో ఎక్కువ సెర్చ్ అవుతుండగా.. గతంలో గురించి సొహైల్ మాట్లాడిన వీడియో ట్రెండ్ అవుతోంది. తనకు ప్రేరణ వైఎస్ జగన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు సొహైల్. ఇంతకీ సొహైల్ ఏం మాట్లాడారంటే.. ‘జగన్ గ్రేట్ లీడర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఒక యంగ్ లీడర్ త

సినీ రంగంలోకి ‘ఫోర్బ్స్’ యువ వ్యాపారవేత్త.. ఒకేసారి మూడు సినిమాల ప్రకటన

Image
కొవ్వూరి సురేష్‌రెడ్డి.. యానిమేషన్‌ గేమింగ్ రంగంలో ఈ పేరు సుపరిచితమే. అంతే కాదు, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార పత్రిక ఫోర్బ్స్‌ ఇటీవల ప్రకటించిన 30 ఏళ్ళ లోపు వయసు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్‌రెడ్డి. గత 13 ఏళ్ళుగా ‘క్రియేటివ్‌ మెంటార్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ కాలేజీ’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఉన్నారు. ఆ కాలేజీ వ్యవస్థాపకులు ఆయనే. అలాగే, ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ నిర్వహిస్తున్నారు. ఎంతోమంది యానిమేటర్లుగా ఎదగడంలో ఆయన పాత్ర ఉంది. అటువంటి సురేష్‌రెడ్డి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థను స్థాపించిన ఆయన, శుక్రవారం నాడు మూడు చిత్రాలను ప్రకటించారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’లో ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందనున్న చిత్రానికి ‘సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌’, ‘పేపర్‌ బోయ్‌’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ‘ఛోరి’, ‘మరోజన్మ’, ‘ప్యూర్‌ సోల్‌’ వంటి అవార్డ్‌ విన్నింగ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ రూపొందించిన ఆకాష్‌రెడ్డి, ఈ సినిమాతో దర్శకుడిగా పర

కారెడ్డం ఆడమాకు పిలగో.. అసలు నీ కథ ఏంటి? అంటూ ఆదా శర్మ హాట్ కిక్

Image
యంగ్ హీరోయిన్ లేటెస్ట్ మూవీ '?'. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై విప్రా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గౌరీ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్య‌క్ర‌మాలు ఫినిష్ చేసుకున్న ఈ మూవీ విడుద‌ల‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రంలోని `రామ‌స‌క్క‌నోడివిరో` అనే పాట‌ను రిలీజ్ చేశారు మేకర్స్. యమ హుషారెత్తిస్తున్న ఈ పాట‌ను ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌ర‌చ‌గా బండి స‌త్యం సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. మంగ్లీ ఆల‌పించ‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు. ఆదా శర్మ తన స్టెప్పులతో హాట్ కిక్కిచ్చింది. హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ..``ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈసినిమా వ‌స్తోంది. నేను తెలుగులో చేసిన సినిమాల‌న్నీ కూడా ప‌ర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న చిత్రాలే . అదే కోవ‌లో ఈ సినిమాలో కూడా న‌ట‌ను ప్రాధాన్య‌త ఉన్న పాత్ర చేశాను. అలాగే ఇందులో పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు మంచి స్టెప్స్ కూడా నాతో వేయించారు. క‌రోనా టైమ్‌లో స్టార్ట్ చేసి క‌రోనా టైమ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోన్న మొద‌టి సినిమా మాది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డైర‌క్ట‌ర్స్ ఎక్స్ లెంట్‌గా డీల్ చేశారు. అంద‌రికీ న‌చ

శ్రీదేవి సోడా సెంటర్: మనోడు లైటింగ్ ఎడితే..! మెరిపిస్తానంటూ సుధీర్ బాబు ఎంట్రీ..

Image
కెరీర్ ఆరంభం నుంచే జయాపజయాలతో కలిసి ప్రయాణం చేస్తున్న యంగ్ హీరో ఇటీవలే మల్టీస్టారర్ మూవీ 'V'తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అదే స్పీడుతో ప్రస్తుతం '' సినిమా చేస్తున్నారాయన. తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్టర్‌ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. ''మనోడు లైటింగ్ ఎడితే ఊరంతా మెరిసిపోద్ది'' అని పేర్కొంటూ ఈ మోష‌న్ పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు సుధీర్ బాబు. ఇప్పటికే విడుదల చేసిన ప్రీలుక్‌లో గోలీ సోడాల కేస్, జిమ్కీ లైట్లు, వైర్లు, మ‌ల్లెపూలు వంటి ఎలిమెంట్స్‌తో ఆడియెన్స్‌ చూపును తమ వైపుకు తిప్పుకున్న చిత్ర యూనిట్‌.. మళ్ళీ అదే పంధాని కొన‌సాగించారు. 'శ్రీదేవి సోడా సెంట‌ర్' మోష‌న్ పోస్ట‌ర్‌లో సుధీర్ బాబు సోడా ప‌ట్టుకొని ఉన్న స్టైలిష్ స్టిల్ అందరినీ బుట్టలో వేసుకుంటోంది. ఇందులో హీరో సుధీర్ బాబు లైటింగ్ మెన్ పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్‌ నెలలో మొద‌లు పెడుతున్న‌ట్లుగా నిర్మాత‌లు వెల్లడించారు. Also Read: ప‌లాస 1978 సినిమాతో అరంగేట్రంలోనే మంచి పేరు సంపాదించిన క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త

Amma Rajasekhar Elimination: బిగ్ బాస్ పోల్ రిజల్ట్: రాజశేఖరా.. ఇక సాగలేవురా.. ఈవారం ఒప్పో సెల్ఫీకి మాస్టర్ రెడీ!

Image
అమ్మా రాజశేఖర్‌కి టైం వచ్చింది.. నాగార్జునతో ఒప్పో సెల్ఫీ దిగి బిగ్ బాస్ హౌస్‌కి గుడ్ బై చెప్పే టైం వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4లో ఆట కట్ అయ్యేందుకు ఎనిమిది వారాల టైం పట్టింది. బిగ్ బాస్ సీజన్ 4లో టైటిల్ కోసం 19 మంది కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. వీరిలో ఇప్పటికే 8 మంది ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం హౌస్‌లో 11 మంది మాత్రమే మిగిలారు. ఇక ఎనిమిదో వారం నామినేషన్స్‌లో అమ్మా రాజశేఖర్, అఖిల్, మోనాల్, అరియానా గ్లోరి, లాస్య, మెహబూబ్‌లు ఉన్నారు. అయితే ఈ ఆరుగురిలో ఈవారం ఎలిమినేట్ కాబోతున్నది అమ్మా రాజశేఖర్ అని ‘సమయం తెలుగు’ పోల్‌లో స్పష్టం అయ్యింది. ప్రతి వారంలాగే ఈవారం కూడా సమయం తెలుగులో ‘బిగ్ బాస్ సీజన్ 4 ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని భావిస్తున్నారు’? అని ఒపీనియన్ పోల్ నిర్వహించగా.. అమ్మా రాజశేఖర్ అని దాదాపు 40 శాతం మంది ప్రేక్షకులు ఓట్లు వేశారు. ఆ తరువాత స్థానంలో మోనాల్ గజ్జర్ 29 శాతం ఓట్లతో ఉంది. మూడో స్థానంలో మెహబూబ్ 15 శాతం ఓట్లు, నాలుగో స్థానంలో లాస్య 9 శాతం ఓట్లు, ఐదో స్థానంలో అరియానా గ్లోరి 4 శాతం ఓట్లు, ఆరో స్థానంలో అఖిల్ 3 శాతం ఓట్లు పడ్డాయి. ఈ పోల్ లెక్కన అమ్మా రాజశేఖర్‌పై తీవ్

తప్పలేక ఒప్పుకున్నాను.. ఇదీ పునర్నవి మ్యారేజ్ సీక్రెట్

Image
రెండు రోజులుగా అభిమానులను టెన్షన్ పెడుతూ వచ్చిన ఎట్టకేలకు తన మ్యారేజ్ సీక్రెట్‌ను బయటపెట్టింది. ఇదంతా తన వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమేనని స్పష్టం చేసేసింది. కాకపోతే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆటలు ఆడటం ఏంటి అని సోషల్ మీడియాలో పున్ను ఫాలోవర్లు ప్రశ్నిస్తున్నారు. తన కుడిచేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్‌ను చూపిస్తూ తీసుకున్న ఫొటోను ఈనెల 28న పునర్నవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘మొత్తానికి జరిగిపోయింది’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో అంతా పునర్నవికి పెళ్లి కుదిరిందని అనుకున్నారు. ఎంగేజ్‌మెంట్ రింగ్‌నే ఆమె చూపించిందని భావించారు. ఆ తరవాత రోజు తన పార్న్‌నర్‌ను కూడా చూపిస్తూ పున్ను మరో పోస్ట్ చేసింది. దీంతో పున్నుకు కాబోయే భర్త ఇతనే అంటూ ప్రచారం జరిగింది. Also Read: ‘‘రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉంది’’ అని పున్ను బేబీ పేర్కొనడంతో పెళ్లి తేదీ ప్రకటిస్తుందేమోనని చాలా మంది భ్రమపడ్డారు. కానీ, ఊహించినట్టే పున్ను అందరికీ షాక్ ఇచ్చింది. ఈ పెళ్లి గోల అంతా తన వెబ్ సిరీస్ ప్రసారం కోసం స్పష్టం చేసింది. నిజానికి ఈ విషయాన్ని ముందుగానే చాలా మంది ఊహించారు. పునర్నవి, యూట్యూబ్

Kajal Marriage Updates: పెళ్లి మండపానికి పయనమైన కాజల్.. నిషా అగర్వాల్ కంటతడి! ఫొటోలు వైరల్

Image
టాలీవుడ్ చందమామ అగర్వాల్ పెళ్లి పీటలెక్కబోయే సుముహూర్తం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో పీటలపై కూర్చొని తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో మూడు ముళ్ళు వేయించుకోబోతోంది. దీంతో కాజల్ పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ హంగామా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెళ్లి మండపానికి వెళ్తూ దిగిన కొన్ని పిక్స్ వైరల్ అయ్యాయి. అందంగా ముస్తాబైన ఈ పంచదార బొమ్మ అందరికీ హాయ్ చెబుతూ సంతోషంగా పెళ్లి మండపానికి బయల్దేరింది. తన తల్లి సుమన్ ‌అగర్వాల్‌తో కలిసి వివాహం జరగనున్న ‘తాజ్‌ ప్యాలెస్‌’ హోటల్‌కు పయనమైన కాజల్.. ముంబయిలోని తన నివాసం నుంచి బయటకొచ్చి అందరికీ అభివాదం తెలిపింది. విలేకర్లను నవ్వుతూ పలకరించడంతో వేలల్లో కెమెరా క్లిక్స్ ఆమెపై పడ్డాయి. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట షికారు చేస్తున్నాయి. ఇవి చూసి కాజల్‌కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఈ రోజే (అక్టోబర్ 30) వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లాడనుంది కాజల్. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచే కాజల్, గౌతమ్ ఇళ్లలో పెళ్లితంతు సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. బుధవారం మెహందీ, గురువారం హల్దీ వేడుకలు కాజల్‌ నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు

విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్.. ఇచ్చట ఎలక్ట్రిక్ బైక్స్ అద్దెకు ఇవ్వబడును!

Image
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్‌లో ఈ కంపెనీ తమ బిజినెస్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్లు, బైక్‌లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా కానున్నాయి. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని, ఈ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు. అందుకే వాట్స్ అండ్ వోల్ట్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్టు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కాగా, ఈ సదస్సులో మంత్రి కేటీ

Samantha: ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. చాలా భయమేసింది.. ఓపెన్‌ అయిన అక్కినేని కోడలు

Image
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు ఎంత యాక్టివ్ అనేది అందరికీ తెలుసిన విషయమే. వెండితెరపై తన చలాకీతనంలో అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న ఈ బ్యూటీ తొలిసారి బుల్లితెర హోస్ట్ అవతారమెత్తింది. ప్రస్తుతం నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆయన హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ బాధ్యతలను భుజానికెత్తుకుంది. గత వారం `బిగ్‌బాస్` వీకెండ్ ఎపిసోడ్ హోస్ట్ చేసి అందరి చేత వావ్! అనిపించింది. అయితే తాజాగా ఈ రెస్పాన్స్‌పై తన ఫీలింగ్స్ బయటపెడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది సామ్. ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అని అందులో పేర్కొన్న సమంత.. బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తానని అస్సలు ఊహించలేదని తెలిపింది. కేవలం మా మామగారి వల్లే ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వచ్చానని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు మొదట తాను చాలా భయపడ్డానని, ఇంతకుముందు ఏ కార్యక్రమానికీ హోస్ట్‌గా వ్యవహరించలేదు పైగా తెలుగు కూడా అంతగా రాదు కాబట్టి భయమేసిందని పేర్కొంది. అలా ఎన్నో భయాలను అధిగమించి చివరకు మీ ముందుకు రావడం, మీరు ఇంతలా ఆదరించడం ఆనందంగా ఉందని తెలిపింది. Also Read: కాగా ఇంతకుముందు బిగ్‌బాస్‌కు సంబ

సుమంత్ అశ్విన్‌ సినిమాలో భూమిక.. శ్రీకాంత్‌తో కలిసి కీలక పాత్ర

Image
నాలుగు పాత్రల చుట్టూ తిరిగే రోడ్ జ‌ర్నీ కాన్సెప్ట్‌తో గుర‌ప్ప ప‌ర‌మేశ్వర ప్రొడ‌క్షన్స్ పతాకంపై జి. మ‌హేష్ నిర్మిస్తోన్న తొలి చిత్రంలో అభిన‌యానికి అవ‌కాశం ఉన్న ఒక ప్రధాన పాత్రకు భూమిక‌ను ఎంపిక చేశారు. మిగ‌తా మూడు ప్రధాన పాత్రల‌ను సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, తాన్యా హోప్ పోషిస్తున్నారు. లాక్‌డౌన్ త‌ర్వాత గురువారం పునఃప్రారంభ‌మైన షూటింగ్‌లో ఆమె జాయిన్ అయ్యారు. గురుప‌వ‌న్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. లాక్‌డౌన్‌కు ముందే ల‌డ‌ఖ్ షెడ్యూల్‌తో స‌హా 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద‌రాబాద్‌లో కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ జ‌రుగుతోంది. న‌లుగురు ప్రధాన పాత్రధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తుండటంపై మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల త‌ర్వాత నేను సినిమా సెట్స్‌పైకి వ‌చ్చాను. శానిటైజ్ చేసుకుంటూ, మాస్క్‌లు ధ‌రిస్తూ, త‌ర‌చూ చేతులు శుభ్రం చేసుకుంటూ, అన్ని ర‌కాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నాం. మీ అంద‌రి ప్రేమానురాగాల‌ను కోరుకుంటున్నాం. త్వర‌లో మీ అంద‌ర్నీ తెర‌పై క‌లుసుకుంటాం’’ అని చెప్పారు. హీరో సుమంత్ అశ

ఫ్యామిలీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నా.. అవన్నీ అవాస్తవాలే: సమీరా రెడ్డి

Image
హిందీ, తెలుగుతో పాటు పలు సౌత్ ఇండియన్ భాషల్లో సినిమాలు చేసి కుర్రకారును షేక్ చేసిన .. గత కొన్ని రోజులుగా వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లపాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ అమ్మడు పెళ్లి చేసుకొని వెండితెరకు దూరమయ్యారు. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో టచ్‌లో ఉంటూ తన, తన కుటుంబానికి సంబంధించిన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. అయితే సమీరా ఓ కోలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారామె. Also Read: ఆర్య, విశాల్‌ ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్న ‌చిత్రంలో సమీరా రెడ్డి నటిస్తోందనే టాక్ బయటకొచ్చింది. ఆమె రోల్ సినిమాకు కీలకం కానుందని చెప్పుకున్నారు. తాజాగా అట్టి వార్తలపై స్పందించిన సమీరా.. అవన్నీ అవాస్తవాలని, తాను ఏ సినిమాలోనూ నటించడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారని తెలిపారు. దీంతో సమీరా రీ ఎంట్రీ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. 'మైనే దిల్‌ తుజ్కో దియా' అనే హిందీ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన సమీరా రెడ్డ

ఆ రాత్రి జరిగింది ఎప్పటికీ మరవను.. ఆ సమయంలో నా శరీరం! చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ ఆవేదన

Image
ఫేమ్, సినీ నటి గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందింది. తెలుగు, హిందీ టీవీ సీరియల్స్‌లో బొద్దుగా కనిపించి ఆకట్టుకున్న అవిక.. ఇప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టని విధంగా మారిపోయింది. ప్రస్తుతం గ్లామర్ బ్యూటీగా సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. సన్నగా నాజూగ్గా మారి యూత్‌లో మంచి ఫాలోయింగ్ కూడగట్టుకుంటున్న ఈ అమ్మడు.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయింది. గతేడాది ఓ రోజు రాత్రి అనుభవించిన బాధను గుర్తుచేసుకుంటూ తెగ ఫీల్ అయింది. తన లేటెస్ట్ లుక్ పోస్ట్ చేసిన అవికా గోర్.. గతేడాది ఓ రోజు రాత్రి అద్దంలో తనను తాను చూసుకుని ఏడ్చానని చెప్పింది. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ సమయంలో తన శరీరం, శరీర భాగాలు అస్సలు నచ్చకపోవడంతో కృంగి పోయానని.. దాని ఫలితమే తన ఊబకాయం అని పేర్కొంది. తన కాళ్ళు, చేతులు లావుగా ఉన్నాయని అదేవిధంగా శరీరాకృతి విషయంలో చాలాసార్లు బాధపడ్డానని ఆమె వెల్లడించింది. Also Read: ఆ సమయంలో ఎన్నో ఆలోచనలు తనకు మనశ్శాంతి లేకుండా చేయడమే గాక తనపై తనకే అసహ్యం వేసేదని.. అయితే చివరకు ఏదీ రాత్రికి రాత్రే మారిపోదని అర్థం చేసుకొని ఆరోగ్యకరమైన ఆహారం, వర్కవుట్లపై దృష్టి సారించానన

7 నిమిషాల వర్కవుట్స్.. వచ్చిన అవకాశాన్ని వాడుకోండిలా.. పూరి పాఠం వినాల్సిందే!

Image
ఎప్పటిలాగే మరో పోడ్ కాస్ట్ ఆడియోతో మనముందుకొచ్చారు. ఈ ఆడియోలో నీకొచ్చే అవకాశాలను ఎలా పసిగట్టాలో తెలుపుతూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు. పూరి చెప్పిన ఈ మోటివేషనల్ పాఠం వింటే.. ''బుద్ధుడు చెప్పాడు.. వన్ డే కెన్ చేంజ్ లైఫ్.. అవకాశం అనేది ఎక్కడి నుంచి ఎలా వస్తుందనేది తెలియదు. చాలా సార్లు అసలు అవి మనకోసం వచ్చిన సువర్ణావకాశాలు అని మనకే తెలియదు. తెలియాలంటే లైఫ్‌లో చాలా అలర్ట్‌గా ఉండాలి. కొంతమందికి లక్ష్మీదేవి వచ్చి తలుపులు బాదుతూ అరుస్తున్నా వినిపించదు. పందుల్లా నిద్రపోతారు నా కొడుకులు. నాకో స్నేహితుడు ఉన్నాడు. అతడికి చాలా టాలెంట్‌ ఉంది. వచ్చిన అవకాశాలను చేజార్చుకోవటం ఎలా అని అతడో పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని తన దగ్గరే పెట్టుకుని తూచ తప్పకుండా పాటిస్తున్నాడు. అలాంటి వారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. Also Read: నీకేంట్రా నువ్వింకా చిన్నపిల్లోడివి అని ఎవరైనా అంటే నమ్మకండి. ఇక్కడ ఎవరికీ సమయం లేదు. కళ్లు మూసి తెరిచేలోపు అందరికీ 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. మిమ్మల్నేవరూ ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించరు. నీ విలువ అవతలి వాడికి తెలిసినప్పుడే నువ్వు బిజీ అవుతావు. ప్రారంభంలో అందరూ నిన్ను వాడతారు. వ

Punarnavi Marriage: పునర్నవి పెళ్లిపై రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ రియాక్షన్.. ఒక్క పోస్ట్‌తో మళ్లీ హాట్ టాపిక్‌

Image
పునర్నవికి పెళ్లి కాబోతుంటే రాహుల్ సిప్లిగంజ్‌కి ఏం సంబంధం.. అన్నయ్యా!! వదినకు పెళ్లంట అంటూ రాహుల్ సిప్లింగజ్ ఫ్యాన్స్ ఒకటే మెసేజ్‌ల బాదుడు బాదుతున్నారు. దీంతో చెర్రెత్తికొచ్చిన ఓరి బాబోయ్.. ఆ ఆపండ్రోయ్.. ఎవరిదో ఎంగేమ్ మెంట్ అయితే నన్నెందుకు ట్యాగ్ చేస్తుర్రూ రా భై.. ఉన్న పోరీలతోనే సరిపోతలేదు నాకు.. ఇంక ఎక్స్ ట్రా ఫిట్టింగ్‌లు నాకెందుకు నాయనా’ అంటూ దండాలు పెట్టేస్తూ ఫేస్ బుక్‌ స్టోరీలో ఫన్నీ పోస్ట్ పెట్టాడు. అయితే రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు ఎన్ని దండాలు పెట్టినా ఏం ప్రయోజనం.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నన్నాళ్లూ పునర్నవితో గట్టిగానే పులిహోర కలిపాడు. ఇద్దరూ రొమాన్స్‌లు ముద్దులు అబ్బో హౌస్‌లో వీళ్ల బంధం ఫెవికాల్ కంటే బలమైనదే. ఇక రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాక.. తన విజయంలో పునర్నవికి భాగస్వామ్యం కల్పించాడు. బయటకు వచ్చిన తరువాత కూడా ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న వార్తలకు బలం చేకూర్చుతూ ఎక్కడ చూసినా ఈ ఇద్దరే కనిపించేవారు. ఏ టీవీ షోలో చూసినా ఈ ఇద్దరే. దీంతో ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అటు రాహుల్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. రాహుల్ సిప్లి

‘సర్కారు వారి పాట’లు మొదలెట్టేసిన తమన్

Image
ప్రస్తుతం టాలీవుడ్‌లో హవా నడుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నావి, బుట్టబొమ్మా, రాములో రాములో.. పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు యూట్యూబ్‌లో అనేక రికార్డలు క్రియేట్ చేశాయి. దీంతో తమన్‌ కోసం అగ్రహీరోలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే పరశురామ్, మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘’ సినిమాకు సంబంధించి ఛాన్స్ దక్కించుకున్నాడు. Also Read: ఈ క్రమంలోనే ‘సర్కారు వాటి పాట’కు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్టు తమన్ తాజాగా వెల్లడించాడు. ఇప్పటికే కొన్ని పూర్తి చేయగా.. మిగిలిన వాటికి సిట్టింగ్‌ జరుగుతున్నట్లు తెలిపాడు. ‘సర్కారు వారి పాట’కు సంబంధించి అద్భుతమైన మ్యూజిక్ కంపోజింగ్స్ జరిగాయి. మహేష్ గారికి మంచి పాటలు అందించేందుకు వీలుగా అద్భుతమైన సన్నివేశాలను సృష్టించిన డార్లింగ్ డైరెక్టర్ పరశురామ్‌కు ధన్యవాదాలు. నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని తమన్ ట్వీట్ చేశాడు. Also Read:

ఒకే స్రీన్‌పై 20 మంది అగ్రతారలు.. టాలీవుడ్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన సాంగ్

Image
సాధారణంగా ఒక హీరో సినిమాలో మరో హీరో కాసేపు అలా కనిపిస్తేనే భారీగా హైప్ క్రియేట్ అవుతుంది. తమ హీరో మరో సినిమాలో గెస్ట్‌ రోల్ కనిపించాడంటే ఆయన అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటి కాంబినేషన్లు, పాత్రలు అన్ని సమయాల్లోనూ కుదరదు. కానీ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. తెలుగు తెరకు మల్టీస్టారర్లు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్-ఏఎన్నార్ కాలం నుంచి.. ఇప్పుడు రామ్‌చరణ్-తారక్ కాలం వరకు అప్పుడప్పుడూ మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. Also Read: అసలు విషయానికొస్తే.. వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్ర ప్రసాద్‌ కాంబినేషన్లో టి.సుబ్బిరామిరెడ్డి సమర్పణలో దర్శకుడు మురళీ మోహన్‌ రావు తెరకెక్కించిన చిత్రం ‘’. 1981లో వచ్చిన ‘నజీబ్‌’ అనే హిందీ చిత్రానికి రీమేక్‌ ఇది. బప్పీ లహరి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ఓ ఫంక్షన్ నేపథ్యంలో వచ్చే పాటలో ఏకంగా 20మంది నాటి అగ్రతారలు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. శోభన్‌‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, దర్శకుడు కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ, శారద, విజయ నిర్మల, విజయ శాంతి, రాధ, జయమాలిని, పరుచూరి బ్రదర్స్, మురళీ

Khushi: భూమిక నడుమును పవన్ నిజంగా చూడలేదట.. అది సూర్య ట్రిక్

Image
పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లో ‘ఖుషీ’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానముంది. పవన్‌, భూమిక జంటగా నటించిన ఈ చితాన్ని ఎస్‌.జె.సూర్య తెరకెక్కించారు. కొత్తదనం నిండిన సరికొత్త కథతో తీసిన ఈ సినిమా అప్పట్లో ప్రేమకథా చిత్రాల్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలకు, పవన్‌ లవ్‌, యాక్షన్‌ హంగామాకు యూత్ ఊగిపోయింది. ముఖ్యంగా పవన్.. హీరోయిన్ నడుము చూసే సీన్ చాలా హైలెట్ అయింది. ఇన్నేళ్లయినా ఈ సీన్ గురించి ఎక్కడో చోట చర్చ జరుగుతూనే ఉంటుంది. Also Read: ఈ రొమాంటిక్‌ సీన్‌ వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. నిజానికి తెరపై అంత చక్కగా పండిన ఆ సన్నివేశం వెనుకు పవన్‌ కళ్యాన్ అద్భుతమైన నటన దాగి ఉందట. బ్లాక్ శారీలో ఉన్న భూమిక నడుమును చూసే సమయంలో పవన్ ముఖంలో పలికిన హావభావాలు చూస్తే నిజంగా భూమికను ఎదురుగా కూర్చోబెట్టి ఆ సన్నివేశం చిత్రీకరించారేమో అనిపిస్తుంది. Also Read: కానీ అసలు విషయం ఏంటంటే.. పవన్‌ నిజంగా ఆమె నడుమును చూడలేదట. సూర్య పవన్‌ను ఓ బల్లపై కూర్చోబెట్టి ఎదురుగా భూమిక ఉన్నట్లు, ఆమె నడుమును చాటుగా చూస్తున్నట్లు నటించి చూపమన్నారట. అలా షూట్‌ చేసిన సన్నివేశాన్నే తర్వాత భూమిక నడుముతో కలిపి చూప

కీర్తి సురేష్ రిస్క్ చేస్తోందా?.. టెన్షన్‌లో ఫ్యాన్స్

Image
‘మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కీర్తి సురేష్. ఆ క్రేజ్‌తో కెరీర్‌ను చక్కదిద్దుకోకుండా ఆమె తప్పటడుగులు వేస్తోందనిపిస్తోంది. స్టార్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్నా పట్టించుకోకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఎన్నుకున్న కొన్ని కథలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఓటీటీలో విడుదలైన ‘పెంగ్విన్’ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా నిరాశపరిచింది. దీంతో పాటు ఆమె సినిమాలన్నీ కూడా వరుసగా ఓటీటీ వేదికలపైకి వచ్చేస్తున్నాయి. దీంతో కీర్తి సురేష్‌ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. Also Read: ఈ టైమ్‌లోనే ఆమె తీసుకున్న నిర్ణయం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘’ సినిమాను మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీనికి మెహర్ రమేష్ డైరెక్టర్. ఈ సినిమా కథ మొత్తం హీరో చెల్లెలి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఈ పాత్ర కోసం యూనిట్ సాయిపల్లవి, కీర్తిసురేష్‌ పేర్లను పరిశీలించి చివరికి కీర్తిని ఓకే చేశారు. ఈ రోల్‌కు కీర్తి సురేష్‌ కూడా ఓకే చెప్పేయడంతో ఆమె ఫ్యాన్స్ షాకయ్యారు. Also Read: హీరోయిన్‌గా ఎన్నో అవకాశాలు వస్తుండగా ఇప్పుడు చిరంజీవికి చెల

ప్రభాస్‌కు షాకిచ్చిన టీవీ ప్రేక్షకులు.. ‘సాహో’ బుల్లితెరపైనా డిజాస్టరే

Image
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ''. ‘బాహుబలి’ రెండు పార్ట్‌ల తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై భారీ అంచనాతో విడుదలైనా ఆశించినంగా అలరించలేకపోయింది. బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. తెలుగు సహా ఇతర భాషల్లో విజయం సాధించలేదు. చివరికి దసరా సందర్భంగా బుల్లితెరపై ప్రసారం చేయగా అక్కడా భారీ షాకిచ్చింది. Also Read: వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం టీవీలో అయినా రికార్డులు క్రియేట్‌ చేస్తుందని ప్రభాస్‌ అభిమానులు భావించారు. అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ అక్కడా బోల్తా పడింది. ఆదివారం జీటీవీలో వరల్డ్ ప్రీమియర్ షోగా ప్రసారం చేసిన ఈ సినిమా వచ్చిన టీఆర్పీ రేటింగ్ కేవలం 5.8 మాత్రమే. చిన్నహీరోల పాత సినిమాలు మళ్లీ మళ్లీ ప్రసారం చేసినా 3-5 టీఆర్పీ రేటింగులు వస్తుంటాయి. అలాంటిది పాన్ ఇండియ స్టార్‌ ఎదిగిన సినిమా తొలిసారి టీవీలో ప్రసారం చేస్తే పట్టించుకున్న ప్రేక్షకులే లేరు. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూడోసారి ప్రసారం చేస్తే 11కి పైగా రేటింగ్ వచ్చింది. అలాంటిది సాహో తొలి

ఇష్టం లేకపోయినా తప్పడం లేదు.. ఈ సినిమా భిన్నమైన అనుభవం: సూర్య

Image
తమిళ అంటే తెలుగు ప్రేక్షకులు ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. ఆయన చేసే సినిమాలు, ఎంచుకునే పాత్రలే దానికి కారణం. హీరోగా నిలదొక్కుకుంటూనే విలక్షణమైన పాత్రలు చేస్తుంటారాయన. తాజాగా ఆయన నటించిన ‘’ సినిమా నవంబర్ 12న ఓటీటీ ద్వారా విడుదల కాబోతోంది. సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఆన్‌లైన్‌లో విలేకర్లతో ముచ్చటించారు. Also Read: ‘‘ఆకాశం నీ హద్దురా’.. లాక్‌డౌన్‌కి ముందే విడుదల కావాల్సిన సినిమా. అయితే కరోనా పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. ఈ ఆరు నెలల విజువల్‌ ఎఫెక్ట్స్‌తో చిత్రాన్ని మరింత సహజంగా తీర్చిదిద్దింది మా టీమ్. థియేటర్‌ ప్రేక్షకుల కోసమే ఈ సినిమా తీసినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావల్సి వస్తోంది. మా డైరెక్టర్ సుధ ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. కానీ నిర్మాతగా, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరి కోసం ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నా. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమా చేరువ కానుండడం సంతోషంగా ఉంది’ Also Read: ‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఒక సాధారణ మనిషి, అసాధారణమైన కలల

హిమాలయాల్లో ‘వైల్డ్ డాగ్’.. టీమ్‌తో కలిసి పోరాటాలు

Image
అక్కినేని టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘వైల్డ్ డాగ్‌’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మనాలీలోని హిమాలయ పర్వతాల వద్ద జరుగుతోంది. లాక్‌డౌన్ కారణంగా సుమారు ఏడు నెలలు ఆగిపోయిన ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ ఇటీవల మనాలీలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ఓ వీడియో మెసేజ్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు. ఎంత సుందరమైన ప్రదేశంలో తాము షూటింగ్ చేస్తున్నామో చెప్పారు. కాగా, అక్కడ జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించి రెండు స్టిల్స్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఈ స్టిల్స్ చాలా బాగున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని అడ్వాన్స్‌డ్ రైఫిల్స్ పట్టుకుని హిమాలయ అడవుల్లో ఏసీపీ విజయ్ వర్మ తన టీమ్‌తో కలిసి క్రిమినల్స్‌ను వేటాడుతున్నారు. కాగా, ఈ మనాలీ షెడ్యూల్ 21 రోజులపాటు జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరవాత నాగార్జున అండ్ టీమ్ తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అహిషోర్ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ

కాజల్ ప్రీ వెడ్డింగ్ సందడి.. హల్దీ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తూ హీరోయిన్ హంగామా

Image
హీరోయిన్ .. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. వివాహానికి రెండు రోజుల ముందు కాజల్ ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. నిన్న మెహందీ ఫంక్షన్ జరగగా.. నేడు హల్దీ ఫంక్షన్, సంగీత్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాజల్ మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రస్తుతం హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హల్దీ ఫంక్షన్‌లో పసుపు రంగు దుస్తుల్లో కాజల్ మెరిసిపోతున్నారు. అంతేకాకుండా, ఆమె ధరించిన ఆభరణాలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. సప్రదాయబద్ధంగా పువ్వులతో ఈ ఆభరణాలను డిజైన్ చేశారు. అయితే, హల్దీ ఫంక్షన్‌లో కాజల్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఎల్లో కలర్ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేటట్టు ఎల్లో సన్‌గ్లాసెస్ పెట్టుకుని కాజల్ హుషారుగా డ్యాన్స్ చేస్తున్నట్టు వీడియోలో చూడొచ్చు. మరోవైపు, కాజల్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ఆమె సోదరి నిషా అగర్వాల్ కూడా సందడి చేస్తున్నారు. బేబీ పింక్ లెహెంగాలో మెరిసిపోతున్న నిషా.. ఫొటోగ్రాఫర్లకు స్వీట్స్ బాక్సులు పంచుతూ కనిపించారు. ఈ వీడియో సైత

Singer Noel: బిగ్ షాక్.. బిగ్ బాస్ నుంచి నోయల్ ఔట్.. క్షీణించిన ఆరోగ్యం

Image
ఆర్థరైటిస్ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి లోనైన సింగర్ నోయల్ సేన్.. తప్పని సరి పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్ నుంచి నిష్క్రమిస్తున్నాడు. కీళ్ల వ్యాధితో బాధపడుతున్న నోయల్.. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. చేతులు పనిచేయడం లేదని.. కాళ్లు సహకరించ నడవలేని స్థితికి వచ్చేశానని.. భుజాలు కూడా పనిచేయడం లేదని బిగ్ బాస్‌కి మొరపెట్టుకున్నాడు నోయల్. బుధవారం నాడు టాస్క్ నుంచి కూడా తప్పుకుని రెస్ట్‌లో ఉన్నారు నోయల్. అయితే నోయల్‌ని పరీక్షించిన వైద్యులు అతని అత్యవసర వైద్యం తప్పనిసరి అని భావించడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. స్పెషలిస్ట్‌ల సలహా మేరకు.. మెరుగైన వైద్యం చేయాల్సి ఉందని.. ఇందుకోసం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉందని అతని ఆరోగ్య పరిస్థితిని వివరించారు బిగ్ బాస్. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి భారంగా బయటకు వస్తున్నాడు నోయల్. ఇంటి సభ్యులంతా షాక్‌లో ఉండగా.. నడవలేని పరిస్థితిలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారు నోయల్. అయితే వైద్య పరీక్షలు పూర్తిన తరువాత తిరిగి హౌస్‌కి వెళ్లబోతున్నాడు నోయల్. ఆయన రికవరీని బట్టే తిరిగి బిగ్

సుమంత్ ‘కపటధారి’ టీజర్: వేషాలు మార్చే ఆ హంతకుడు ఎవరు?

Image
‘‘ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నిటికీ ఓ కారణం ఉంటుంది’’ అని అంటున్నారు హీరో సుమంత్‌. ఆయన కథానాయకుడిగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్‌ ‘క‌ప‌ట‌ధారి’. ‘సుబ్రహ్మణ్యపురం’, ‘ఇదంజ‌గ‌త్‌’ చిత్రాల‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఇప్పుడు ‘క‌ప‌ట‌ధారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. క‌న్నడలో సూప‌ర్‌ హిట్ అయిన ‘కవలుదారి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. జి.ధనంజయన్ సమర్పణలో క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై లలిత ధనంజయన్ ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తెలుగు టీజర్‌ను నటుడు రానా దగ్గుబాటి గురువారం విడుదల చేశారు. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు. ‘కపటధారి’ టీజర్‌ చూస్తుంటే ప్రపంచంలో జరిగే ప్రతి విషయం వెనుక బలమైన కారణం ఉంటుందనే పాయింట్‌ను బేస్‌ చేసుకుని కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. అలాగే ఓ హత్య కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే పోలీసులతో ట్రాఫిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన సుమంత్‌ జాయిన్‌ అవుతానని అడగటం.. చివరకు కేసును ఇన్వెస్టిగేట్‌ చేస్తున్న పోలీసులు కేసులో ఇన్‌వా

ఆ లెటర్ ఫేక్.. నా ఆరోగ్యం గురించి చెప్పింది మాత్రం నిజమే: రజినీకాంత్

Image
తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల తాను రాజకీయాల్లోకి రాకపోవచ్చని తెలియజేస్తూ సూపర్ స్టార్ స్వయంగా రాసిన లేఖ ఒకటి బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ లేఖ నిన్న పెద్ద దుమారమే రేపింది. దీనిపై రజినీ ఫ్యాన్స్‌తో పాటు విమర్శకులు తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు. అయితే, ఈ లేఖపై గురువారం రజినీకాంత్ స్వయంగా స్పందించారు. ఈ లేఖలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఒక ప్రకటన ఉంచారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేస్తూ విడుదల చేసిన ఆ లేఖ ఫేక్ అయినప్పటికీ ఆ లేఖలో పేర్కొన్నట్టు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం మాత్రం నిజమేనని రజినీ వెల్లడించారు. ‘‘నేను ప్రకటించినట్టు ఒక లేఖ సోషల్ మీడియాలో, ప్రెస్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇది నా ప్రకటన కాదని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను. అయితే, నా ఆరోగ్యం గురించి.. డాక్టర్లు నాకు ఇచ్చిన సలహాల గురించి పేర్కొన్న విషయాలన్నీ నిజమే. నా రాజకీయ ప్రవేశం గురించి ప్రజలకు నేనే స్వయంగా చెబుతాను. నా రజినీ మక్కల్ మండ్రమ్ సభ్యులతో చర్చించిన తరవాత సరైన సమయంలో ఈ ప్రకటన చేస్తాను’’ అని రజినీకాంత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్

కాబోయే భర్తను పరిచయం చేసిన పునర్నవి.. ఎవరితను?

Image
బిగ్ బాస్ బ్యూటీ, నటి భూపాలం తనకు పెళ్లి కుదిరినట్టు నిన్న సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. తనకు నిశ్చితార్థం అయినట్టు తెలియజేస్తూ ఉంగరం వేలును చూపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు పునర్నవి. అంతకు మించి వివరాలేవీ బయటపెట్టలేదు. అయితే, ఈరోజు తన కాబోయే భర్తను పున్ను పరిచయం చేశారు. అతని పేరు ఉద్భవ్ రఘునందన్. ఆయన కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. నటుడు, స్క్రీన్ రైటర్. నిన్నటిలానే ఈరోజు కూడా పునర్నవి తన ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపిస్తూ కాబోయే భర్త ఫొటోను కూడా కాస్త బ్లర్ చేసి చూపించారు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పున్ను.. ‘‘నేను అవును అని చెప్పాల్సి వచ్చింది. ఉద్భత్ రఘునందన్, నేను మా బిగ్ డే గురించి రేపు చెబుతాం’’ అని పేర్కొన్నారు. ఇక రఘునందన్ అయితే పున్నుతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘పునర్నవి యస్ చెప్పింది. చాలా ఆనందంగా ఉంది. ఆ బిగ్ డే గురించి రేపు మీకు చెప్పడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’’ అని రఘునందన్ పేర్కొన్నారు. ఈ ప్రకటనలు చూస్తుంటే ఎవరైనా వీళ్లకు నిజంగా నిశ్చితార్థం అయిపోయిందేమో, రేపు ప్రకటించబోయేది పెళ్లి తేదీనేమో అనే అని

Punarnavi Husband: పునర్నవి నిశ్చితార్థం నిజమైతే.. ఏడేళ్లు తరువాత పెళ్లి? ఆ ఇద్దరు పిల్లల సంగతేంటి? ఇందంతా తూచ్!!

Image
బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం పెళ్లి కబురు చెప్పింది. ‘మొత్తానికి జరిగిపోయింది’ అంటూ తనకు కాబోయే ఫొటోతో పాటు.. వేలుకు ఉంగరం పెట్టుకుని దర్శనం ఇచ్చింది పునర్నవి భూపాలం. ఎంగేజ్ మెంట్ రింగ్‌తో పెళ్లి కబురు చెప్పి షాక్ ఇచ్చింది పున్నూ పాప. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న పున్నూ పాపకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. అసలు పునర్నవికి నిజంగానే పెళ్లి ఫిక్స్ అయ్యిందా?? లేక ఆమె అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌లో భాగమే ఈ ఎంగేజ్ మెంట్ రింగా అన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌-పునర్నవిల మధ్య సంథింగ్ సంథింగ్ నడిచిందంటూ అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. హౌస్‌లో ఉన్నన్నాళ్లు ఈ ఇద్దరూ రొమాంటిక్ జోడీగా బిగ్ బాస్ ఆటను రక్తికట్టించారు. ఈ సీజన్‌లో అఖిల్-మోనాల్ రేంజ్‌లో కాకపోయినా హగ్‌లు, ముద్దులతో రచ్చ చేశారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కొన్నాళ్లు పాటు వీళ్ల ఫ్రెండ్ షిప్ బాగానే నడిచినా ఆ తరువాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికారు చేయడంతో అప్పట్లో పునర్నవి స్పందించి తన పెళ్లి

విడుదలకు సిద్ధమవుతోన్న అల్లరి నరేష్ ‘నాంది’

Image
‘నాంది’ అనే వైవిధ్యమైన సినిమా ద్వారా హీరో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు చిత్ర యూనిట్ షూటింగ్ ముగిసినట్టు తెలియజేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ కిటికీ దగ్గర నిలబడి తన బాధను అరుస్తూ లోకానికి చెబుతున్నట్టు ఉంది. కాగా, ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పుడే టైటిల్‌తో అందరినీ ఆకట్టుకుంది. దీనికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది. పాత్ర కోసం అల్లరి నరేష్ నగ్నంగా నటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు. అల్లరి నరేష్‌తో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవి ప్రసాద్, వ

సోల్‌మేట్‌‌ని పరిచయం చేసిన హీరోయిన్.. బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ

Image
'మొదటి సినిమా'తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన బబ్లీ బ్యూటీ పూనమ్‌ బాజ్వా తక్కువ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పరుగు, బాస్‌ చిత్రాల్లో నటనతో మెప్పించినా ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళం, మలయాళంలో కొన్ని చిత్రాలు చేసి అక్కడా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఛాన్సులిచ్చే వారు లేకపోవడంతో ఈ అమ్మడు త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌‌గానే ఉన్న ఈ అమ్మడు బ్యాచిలర్ లైఫ్‌కి ముగింపు కార్డు వేసే టైమ్ వచ్చేసిందని హింట్ ఇచ్చింది. Also Read: తాజాగా తన బాయ్‌ఫ్రెండ్, సోల్‌ మేట్‌ సునీల్‌రెడ్డిని సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది పూనమ్‌. "సునీల్‌ రెడ్డి, మై రూట్స్‌, గ్రౌండ్‌, హ్యండ్సమ్‌, మంచి మనసున్న నా లైఫ్‌ మేట్‌, సోల్‌మేట్‌కు హ్యాపీ బర్త్‌డే. నీతో ఉండే ప్రతీ క్షణం ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది.. హ్యాపీ బర్త్‌ డే" అంటూ తన ప్రియుడిపై ఉన్న ఆకాశమంత ప్రేమను బయటపెట్టింది పూనమ్. దీంతో పాటు ప్రియుడితో కలిసి బీచ్‌లో దిగిన ఫోటోను షేర్ చేసింది. Also Read:

‘మన బంధం మరింత బలపడాలి’.. తమ్ముడికి విషెస్ చెప్పిన చిరంజీవి

Image
నటుడిగా, నిర్మాతగా సినీరంగంతో పాటు బుల్లితెరపైనా తనముద్ర వేసిన మెగా బ్రదర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో పాటు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్‌మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తన తమ్ముడికి శుభాకాంక్షలు చెబుతూ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. Also Read: ‘విధేయుడు, భావోధ్వేగం కలిగిన వాడు, ద‌యా హృద‌యుడు, స‌ర‌దా వ్యక్తి నా సోద‌రుడు నాగ‌బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాల‌ని ఆశిస్తున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేస్తూ నాగబాబు, పవన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. చిరంజీవి ట్వీట్‌కు నాగబాబు రిప్లయ్ ఇస్తూ... ‘థ్యాంక్స్‌ అన్నయ్య, నేనేప్పుడు నీతోడుగానే ఉంటా’ అంటూ రిప్లై ఇచ్చారు. Also Read: