హిమాలయాల్లో ‘వైల్డ్ డాగ్’.. టీమ్‌తో కలిసి పోరాటాలు

అక్కినేని టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘వైల్డ్ డాగ్‌’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మనాలీలోని హిమాలయ పర్వతాల వద్ద జరుగుతోంది. లాక్‌డౌన్ కారణంగా సుమారు ఏడు నెలలు ఆగిపోయిన ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ ఇటీవల మనాలీలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ఓ వీడియో మెసేజ్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు. ఎంత సుందరమైన ప్రదేశంలో తాము షూటింగ్ చేస్తున్నామో చెప్పారు. కాగా, అక్కడ జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించి రెండు స్టిల్స్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఈ స్టిల్స్ చాలా బాగున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని అడ్వాన్స్‌డ్ రైఫిల్స్ పట్టుకుని హిమాలయ అడవుల్లో ఏసీపీ విజయ్ వర్మ తన టీమ్‌తో కలిసి క్రిమినల్స్‌ను వేటాడుతున్నారు. కాగా, ఈ మనాలీ షెడ్యూల్ 21 రోజులపాటు జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరవాత నాగార్జున అండ్ టీమ్ తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అహిషోర్ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్రలో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. డేవిడ్ ఇస్మలోన్‌ యాక్షన్ డైరెక్టర్. శ్రావణ్ కటికనేని ఎడిటర్.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ