Valmiki Jayanti: ఆ రోజు గొడవ చేసినోళ్లకు గుర్తుండే ఉంటుంది.. నాగబాబు సెటైరికల్ కామెంట్స్!

మెగా ప్రిన్స్, తనయుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'గద్దలకొండ గణేష్' సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదట 'వాల్మీకి' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ప్రమోషన్స్ కూడా చేసిన దర్శకనిర్మాతలు పలు వివాదాలు తలెత్తడంతో చివరి క్షణంలో ఆ టైటిల్‌ని 'గద్దలకొండ గణేష్'గా మార్చేసి రిలీజ్ చేశారు. తాజాగా అదే విషయాన్ని గుర్తుచేస్తూ ఓ సెటైరికల్ కామెంట్ వదిలారు మెగా బ్రదర్ నాగబాబు. 'వాల్మీకి' సినిమా అంతా రెడీ అయ్యాక.. తమ సినిమాలో వాల్మీకి మహర్షిని కించపరచలేదని, ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగిందని డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపినా వివాదాలు సద్దుమణగలేదు. దీంతో 'వాల్మీకి'గా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్'గా వెండితెరపై కనిపించాడు. ఫైనల్‌గా చూస్తే ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ఈ రోజు (అక్టోబర్ 31) వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తనదైన స్టైల్‌లో నాగబాబు ట్వీట్ చేశారు. Also Read: ''ఆ రోజు 'వాల్మీకి' అని టైటిల్ పెడితే గొడవ చేశారు కదా. వాళ్ళకి మరి ఈ రోజు అని గుర్తుండే ఉంటుంది. ఏదైతేనేం.. హ్యాపీ బర్త్ డే వాల్మీకి గారు. నాకు నచ్చిన మంచి మాస్ కథలు రాసేవాళ్ళలో మీరు ప్రథములు. రాముని జీవితాన్ని బాగా రాసినందుకు ధన్యవాదాలు'' అని నాగబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ