Posts

Showing posts from August, 2020

దేశం విలువైన వజ్రాన్ని కోల్పోయింది: ప్రణబ్ మృతికి చిరంజీవి సహా సినీ ప్రముఖుల సంతాపం

Image
మాజీ రాష్ట్రపతి, భారతరత్న సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చేరిన ప్రణబ్.. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 21 రోజులపాటు ప్రాణాలతో పోరాడి చివరికి అస్తమించారు. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసిన విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, ప్రణబ్ ముఖర్జీ మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ , నటి రోజా, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, రవీణాటాండన్, రితేష్ దేశ్‌ముఖ్, సాయి ధరమ్ తేజ్, తాప్సి, మోహన్‌లాల్, సంగీత దర్శకుడు తమన్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితరులు ట్విట్టర్ ద్వారా ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాంప తెలిపారు. Also Read: దేశం ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘‘శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతి నన్నెంతగానో బాధించింది. ఆయనతో మాట్లాడిన మాటలు నాకు ఎల్లప్పుడూ గుర్తుంటాయి. గొప్ప జ్ఞానం కలిగిన నిష్ణాతుడు ఆయన. అద్భుతమైన రాజకీయ జీవితం. మిమ్మల్ని కోల్పోతున్నాం సార్. దేశం ఒక విలువైన వజ్రాన్ని నేడు

హరీష్ శంకర్‌తో పవన్ సినిమా.. అప్‌డేట్ ఇచ్చిన నిర్మాతలు

Image
పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలు సోమవారం సాయంత్రం అప్‌డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న సాయంత్రం 4:05 గంటలకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకున్న తరవాత విడుదల తేదీ ప్రకటిస్తారు. Also Read: మరోవైపు, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫె

@139 రేప్ కేసు: ప్రదీప్‌ని నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. బాధగా ఉంది కాని ఆమెకు అండగా ఉంటాం: హీరో కృష్ణుడు

Image
ర్యాలగూడకు చెందిన పాతికేళ్ల మహిళ ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనను 139 మంది 5000 సార్లు రేప్ చేశారని సంచలన ఆరోపణలు చేసింది. ఇందులో యాంకర్ ప్రదీప్‌తో పాటు హీరో కృష్ణుడు పేరు కూడా ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది. అయితే యువతిపై అత్యాచారం చేసిన మాట వాస్తవమే కాని.. డాలర్ బాబు అనే వ్యక్తి కుట్ర చేసి ఈ అమ్మాయిని ఉపయోగించుకుని ఆర్థికపరమైన అబ్ధి పొందడం కోసమే ఈ కుట్ర చేశాడని సోమవారం నాడు ప్రెస్ మీట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది ఆ యువతి. అయితే ఈ కేసుతో కాని తనతో కాని యాంకర్ ప్రదీప్, హీరో కృష్ణుడికి ఎలాంటి సంబంధం లేదని కుట్రలో భాగంగానే ఇదంతా చేశానని వాళ్లకి క్షమాపణ చెప్పింది ఆ దళిత యువతి. అయితే తమపై వచ్చిన ఆరోపణలపై ముందే స్పందించిన ప్రదీప్, హీరో కృష్ణుడు.. తమకేం తెలియదని ఎవరో కుట్ర చేసి తమపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. తాజాగా ఆ దళిత యువతి ప్రెస్ మీట్ తరువాత ఈ ఇష్యూపై హీరో కృష్ణుడు స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ..‘రీసెంట్‌గా మీరు చూసే ఉంటారు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 139 మంది నన్ను రేప్ చేశారని ఓ సంచలన కేసు నమోదైంది. అందులో యాంకర్ ప్రదీప్ పేరుతో

సెట్‌లో హీరోయిన్‌తో రాసలీలలని ఈటీవీ సుమన్ నన్ను తీసేశారు.. ఆయనకు థాంక్స్ చెప్పాల్సిందే: సమీర్

Image
ఈటీవీలో చేస్తున్నప్పుడు నటుడు .. ఆ సంస్థ హెడ్ సుమన్‌కి చాలా క్లోజ్. కాని ఆయన ఉన్నప్పుడే ఈ సంస్థ నుంచి బయటకు నెట్టివేయబడ్డాడు సమీర్. దీని వెనుక పెద్ద కథే నడిచిందంటున్నాడు నటుడు సమీర్. ‘నేను ఈటీవీ నుంచి బయటకు రాలేదు.. కావాలనే నన్ను తీసేశారు. అప్పట్లో నేను ఈటీవీలో చేస్తున్న ‘నా మొగుడు నా సొంతం’ సీరియల్ హీరోయిన్‌తో నాకు ఎఫైర్ నడుస్తోందని దగ్గరకు మోసారు. లొకేషన్‌లో రాసలీలలు.. అంటూ ఆయనకు గట్టిగానే చెప్పారు. అయితే అప్పుడు సుమన్ గారు నన్ను పిలిచి.. ఏంటయ్యా ఇలా జరుగుతుందట.. నిజమేనా?? అని నన్ను అడిగి.. నాలుగు తిట్లు తిట్టినా అద్భుతంగా ఉండేది. కాని ఆయన నన్ను పిలవలేదు.. ఆ విషయం గురించి చర్చించలేదు. డైరెక్ట్‌గా డెసిషన్ తీసేసుకుని నన్ను తీసేశారు. ఆ సీరియల్‌లో వేరే హీరోని పెట్టుకున్నారు. కనీసం ఏం జరిగిందని నన్ను అడగలేదు.. లొకేషన్‌లో ఉన్న వాళ్లని కూడా అడగలేదు.. అయినా నాకు లొకేషన్‌లో రాసలీలలు జరపాల్సిన కక్కుర్తి నాకు ఏంటి? బయట ఎక్కడా లేదా? అక్కడకు పోలేమా?? నిజానికి నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. కాని నేను స్టార్టింగ్ పనిచేసిన సీరియల్ దగ్గర నుంచి.. నేను ఎవరితో వర్క్ చేసినా.. నాతో లింక్ ఉందని అనేవారు. నేన

వీడియో: షూటింగ్ షురూ చేసిన సుప్రీం హీరో.. ఇస్మార్ట్ బ్యూటీతో స్టెప్పులు

Image
కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సుమారు నాలుగు నెలలు ఇంటికే పరిమితమైన సుప్రీం హీరో ఎట్టకేలకు ముఖానికి రంగేసుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సాయి ధరమ్ తేజ్‌తో పాటు హీరోయిన్ నభా నటేష్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ తిరిగి ప్రారంభించిన విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) వీడియోను విడుదల చేసింది. షూటింగ్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఈ వీడియోలో చూపించారు. క్యారవ్యాన్‌లను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి సెట్‌లోకి వస్తున్నారు. ఇక మేకప్‌మ్యాన్‌లు పీపీఈ కిట్‌లు ధరించి నటీనటులకు మేకప్ వేస్తున్నారు. మొత్తం మీద అన్ని జాగ్రత్తల నడుమ ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. షూటింగ్ తిరిగి ప్రారంభంకావడంపై హీరోహీరోయిన్లు సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించారు. Also Read: ‘‘తిరిగి సెట్స్ మీదుకి రావడం చాలా బాగుంది. మేమంతా చాలా ఆ

నాన్న ముస్లిం.. అమ్మ బ్రాహ్మణ.. నేను హిందూ..: తండ్రి చేసిన మోసంపై సమీర్ సంచలన విషయాలు

Image
వైజాగ్ నుంచి 1600 రూపాయిలతో గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కి హైదరాబాద్ వచ్చిన నటుడు సమీర్.. ఆ తరువాత కాలంలో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. పలు సీరియల్స్‌తో పాటు.. సినిమాల్లోనూ నటించి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు మంచి స్నేహితుడు అయ్యాడు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గాను అలరించాడు సమీర్. అయితే సినిమాల్లో తన అప్ అండ్ డౌన్స్ చూసిన రియల్ లైఫ్‌లో కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. మూడునెలలకే తన తల్లిదండ్రులు తనని వదిలేసి వెళ్లిపోయిన విషయాన్ని టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు సమీర్. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకున్నారు సమీర్.. అతను మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి నాకు తండ్రి ప్రేమ అంటే ఏంతో తెలియదు. ‘ఇన్నేళ్లు వచ్చినా నేను తండ్రితో ఉండటం లేదు.. నా తండ్రి మా అమ్మని పెళ్లి చేసుకునేటప్పటికే ఆయనకు ఆల్రెడీ పెళ్లైంది. ఆ విషయం చెప్పకుండానే మా అమ్మని పెళ్లాడారు. నేను పుట్టిన తరువాత కూడా అమ్మకి ఆ విషయం చెప్పలేదు నాన్న. నాకు మూడు నెలల వయసు ఉండగా.. అమ్మమ్మ ఇంట్లో వదిలేశారు. నాన్న బిజినెస్ పనిమీద షార్జా వెళ్లాల్సి వస

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి నిర్మాత రిక్వెస్ట్: మాకు అది సెంటిమెంట్.. త్వరలోనే బిగ్ సర్‌ప్రైజ్!

Image
యంగ్ టైగర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 30వ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ‘అరవింద సమేత’ సినిమాను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లోనే ఈ సినిమాను కూడా చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోన్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఏదైనా ఇవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా నిర్మాతలను కోరుతున్నారు. దీనికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. ఫ్యాన్స్ కోసం అదిరియే అప్‌డేట్ సిద్ధమవుతోందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. Also Read: ‘‘మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరికీ చెప్పేదేంటంటే.. ఒక అప్‌డేట్ ఇవ్వాలంటూ మీరు

సునీల్ హీరోగా ‘వేదాంతం రాఘవయ్య’.. హరీష్ శంకర్‌దే బాధ్యత

Image
హీరో క్యారెక్టర్లకు కాస్త గ్యాప్ ఇచ్చిన మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో సునీల్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘వేదాంతం రాఘవయ్య’ అనే టైటిల్‌ను పెట్టారు. అంతేకాదు, ఈ సినిమాకు హరీష్ శంకర్ కథ అందించారు. అలాగే, ఈ సినిమాను ఆయన సమర్పిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లోనే ‘గద్దలకొండ గణేష్’ వంటి హిట్ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు అదే బ్యానర్‌తో కలిసి సినిమాను నిర్మిస్తుండటం, ఆ సినిమాకు ఆయనే కథ రాయడం విశేషం. ‘వేదాంతం రాఘవయ్య’.. ఈ టైటిల్‌ వింటుంటేనే ఏదో తెలియని ఆసక్తి కలుగుతోంది. టైటిల్ చాలా ప్లెజెంట్‌గా ఉందనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. ఈ సినిమాకు ఇంకా దర్శకుడిని ఖరారు చేయలేదు. త్వరలోనే దర్శకుడి పేరుతో పాటు ఇతర వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించనుంది. ఇదిలా ఉంటే, సునీల్ హీరోగా వచ్చిన ఆఖరి సినిమా ‘2 కంట్రీస్’. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరవాత సునీల్ మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ‘సిల్లీ ఫెలోస్’లో నరేష్ కలిసి నటించారు. ఆ తరవాత ‘అరవింద సమేత’, ‘అమర్ అక

ఆ ఫంక్షన్‌లో వాడు నా నడుము గిల్లేశాడు, హీరో నరేష్ వాడితో ఫైట్ చేశారు: హీరోయిన్ లతా శ్రీ

Image
హీరో నరేష్, సీత హీరో హీరోయిన్లుగా నటించిన ‘పోలీస్ భార్య’ 90లో పెద్ద హిట్ మూవీ. రేలంగి నరసింహరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వందరోజుల సినిమా వేడుకలో జరిగిన ఇన్సి డెంట్‌ను షేర్ చేసుకున్నారు అలనాటి నటి లత శ్రీ. ‘పోలీస్ భార్య’ చిత్రంలో బోల్డ్‌గా కనిపించింది లతా శ్రీ. అప్పట్లో ఆమెకు హాట్ హీరోయిన్‌గా పేరు. అయితే ఆమె నటించిన ‘పోలీస్ భార్య’ చిత్రం వందరోజుల వేడుకలో ఆడియన్స్‌లో ఒకడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో చెంప పగలకొట్టా అని చెప్పు కొచ్చింది ఈ హీరోయిన్. ‘బేసిక్‌గా నాకు కోపం ఎక్కువ.. ‘పోలీస్ భార్య’ మూవీ వంద రోజుల ఫంక్షన్ జరుగుతుంది. అప్పట్లో ఆర్టిస్ట్‌లు బయటకు వచ్చేవారు కాదు.. ఆ వేడుకకు చాలామంది జనం వచ్చారు.. ఆర్టిస్ట్‌లు అందరం వస్తుంటే.. హీరో నరేష్, హీరోయిన్ సీత అందరం కలిసి వెళ్తున్నాం.. ఈలోపు వెనుక నుంచి వచ్చి ఒకడు నడుముని గట్టిగా గిల్లేశాడు. వాడివైపు కోపంగా చూస్తుండగానే మళ్లీ రెండోసారి ఏదో చేయడానికి మీదికి వస్తున్నాడు. నాకు పిచ్చ కోపం వచ్చి వాడి చేయిపట్టుకుని వెనక్కి తిప్పి ఒక్కటి ఇచ్చా. వెంటనే వాడు అక్కడ నుంచి వెళ్లిపోయి గ్యాంగ్‌ని తీసుకుని వచ్చాడు. ఓ పది మందిని తీసుకుని మా మీదికి వ

బిగ్ బాస్ 4 ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన కొరియోగ్రాఫర్ దంపతలు

Image
ప్రముఖ రియాలిటీ షో సీజన్ 4 మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది. అక్కినేని నాగార్జున వరుసగా రెండోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ సీజన్ సెప్టెంబర్ 6 నుంచి ప్రసారం కానుంది. ఈ నాలుగో సీజన్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు టీజర్2లో నాగార్జున కొడుకు, తండ్రి, తాతయ్య.. ఇలా మూడు పాత్రల్లో కనిపించడంతో ఈసారి షో ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి పెరిగింది. అంతేకాదు, ఈసారి హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల విషయంలోనూ రకరకాల జాబితాలు ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ఒక పాపులర్ సెలబ్రిటీ జంట బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లబోతోందని ప్రచారం జరుగుతుందో. ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, ఆయన సతీమణి ప్రణవి జంటగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లబోతున్నారని సోషల్ మీడియాలో వదంతులు పుట్టుకొచ్చాయి. ఇది నిజమేనంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా సమాచారం వచ్చింది. అయితే, ఈ రూమర్స్‌పై తాజాగా రఘు మాస్టర్ స్పందించారు. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ‘‘నాకు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించాను’’ అని ర

యాంకర్ ప్రదీప్‌కి 139 మంది రేప్ కేసులో ఎలాంటి సంబంధం లేదు.. కుట్ర కోణాన్ని బయటపెట్టిన కృష్ణమాదిగ

Image
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మిర్యాల గూడ మహిళ 139 మంది రేపు కేసు ఘటనపై సంచలన విషయాలను బయటపెట్టారు MRPS అధ్యక్షుడు మంద . అసలు ఆ మహిళ వెనుకు ఉన్నది ఎవరు? ఎందుకు ప్రముఖ .. ఇతర సెలబ్రిటీల పేర్లను ప్రస్తావించింది అన్న విషయాలపై మీడియాతో మాట్లాడారు కృష్ణమాదిగ. ఆయన మాట్లాడుతూ.. ఆ మహిళ తనపై 139 మంది రేప్ చేశారని చేస్తున్న ఆరోపణల్లో దాదాపు 40 శాతం మందికి అసలు ఈ కేసులో సంబంధమే లేదు. ఈ 139 మందిపై కేసులు పెట్టించి.. ఆ కేసుల ద్వారా వాళ్లను వేధించి ఆర్థిక లబ్ధి పొందడం కోసం.. రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ అనే వ్యక్తి కుట్ర పన్నారు. అంతేకాదు ఈ అమ్మాయిని తన కంట్రోల్‌లో పెట్టుకుని చాలా సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్పష్టంగా రుజువు అవుతోంది. ఈ కేసులో మొదటి కారకుడు మీసాల సుమన్. ఈ 139 మందిపై కేసుపెట్టడానికి కారణం డాలర్ భాయ్. ఆ మహిళను ఇతను చాలా సార్లు అత్యాచారం చేశాడు. ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దాని ద్వారా ఆర్థిక లబ్ధిపొందడం కోసం కుట్ర పన్నాడు. ఈ అమ్మాయికి సంబంధించిన విషయాలు మొత్తం అతనికి తెలుసు కాబట్టి.. కొన్ని ఫొటోలు వీడియోలు ఇతరులతో ఉన్నవి అతని దగ్గర ఉన్నాయి కాబట్టి.. బ్లాక్ మెయి

139 People Rape Case: అందుకే యాంకర్ ప్రదీప్ పేరు చెప్పా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితురాలు

Image
ఏకంగా 139 మంది ఒక్కసారి కాదు రెండు సార్లు తనపై 5000 సార్లు అత్యాచారం చేశారని 25 ఏళ్ల దళిత యువతి ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆమె గత 10 రోజుల క్రితం ఈ విషయాన్ని బయటపెడుతూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తన ఫిర్యాదు అందించడంతో జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఆమె ఇచ్చిన లిస్టులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు , నటుడు కృష్ణుడు ఉండటం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక్కరే కాకుండా గ్యాంగ్ రేప్‌లు కూడా చేశారని, గర్భం దాల్చితే అబార్షన్స్ చేయించారని.. అలాగే ఫోన్లలో తనను నగ్నంగా చిత్రీకరించి హింసించారని యువతి ఇచ్చిన ఫిర్యాదుపై 113 పేజీలతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ పరిస్థితుల్లో సదరు యువతి మాట మారుస్తూ ఈ కేసుతో యాంకర్ ప్రదీప్‌కి గానీ, నటుడు కృష్ణుడుకి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో బాధితురాలు మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టింది. Also Read: రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ ప్రెషర్ మూలంగానే తాను 139 మంది పేర్లతో ఫిర్యాదు చేశానని బాధితురాలు చెప్పింది. ఇ

Sitara: అప్పుడు తమన్నా ఇప్పుడు రష్మిక.. సితార టార్గెట్ చూడండి గురూ!! పరేషాన్ చేసిందిలే

Image
సూపర్ స్టార్ కూతురు సూపర్ ఫాస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చిన్నతనం నుంచే తన చలాకీతనంతో ఘట్టమనేని ఫ్యాన్స్ అందరికీ దగ్గరైంది సితార. పాటలు పాడటం, డాన్సులేయడం, డైలాగ్స్ చెప్పడం ఇలా ఆల్ రౌండ్ ప్రతిభ చూపిస్తూ వావ్! అనిపించుకుంది. ముఖ్యంగా తన తండ్రి మహేష్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులేస్తూ ఆకర్షిస్తున్న సితార పాప.. తాజాగా 'మైండ్ బ్లాక్' చేసే చిందులేసింది. Also Read: ఈ ఏడాది ఆరంభంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని డ్యాంగ్ డ్యాంగ్ పాటకు స్టెప్పేసి గతంలోనే ఫిదా చేసిన సితార.. ఈ సారి 'మైండ్ బ్లాక్' పాటకు డాన్స్ చేసి మరోసారి పరేషాన్ చేసేసింది. ఈ పాటలో హీరోయిన్ రష్మిక మందన వేసిన డాన్సింగ్ మూవ్‌మెంట్స్ అచ్చుగుద్దినట్లు దించేసింది సితార. ఈ వీడియోను నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. సితార చేసిన ఈ మెస్మరైజ్ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ చూసి.. ''నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్'' అంటూ అదే సినిమాలోని డైలాగ్‌తో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. లాక్‌డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కరోనాతో టాలీవుడ్ నిర్మాత మృతి

Image
దేశంలో విలయతాండవం చేస్తున్న సినీ ఇండస్ట్రీని కూడా కుదిపేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన ఎందరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. ఇంకొందరు కరోనాతో పోరాడి కన్నుమూశారు. ఇదిలా ఉండగానే టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా గత రాత్రి టాలీవుడ్ నిర్మాత కన్ను మూశారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న బొగారి లక్ష్మీనారాయణ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో ‘ఎదురీత’ అనే సినిమాను నిర్మించారు బోగారి లక్ష్మీనారాయణ. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. పలు సినిమాల్లో విలన్ రోల్ పోషించిన శ్రవణ్ రాఘవేంద్ర‌ను ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయం చేశారాయన. Also Read:

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ సెలబ్రిటీల అరాచకాలు.. అమ్మో! భయమేస్తోందంటూ మాధవీలత షాకింగ్ కామెంట్స్

Image
ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేయడం యంగ్ హీరోయిన్ మాధవీలతకు ఓ అలవాటు. ఇష్యూ ఏదైనా సరే తనదైన కోణంలో స్పందిస్తూ ఉంటుంది ఈ హీరోయిన్ కమ్ పొలిటీషియన్. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ వ్యవహారాన్ని టాలీవుడ్‌‌కి కూడా లింక్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ లోనూ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయని, టాలీవుడ్ అంతా డ్రగ్స్ మత్తులో ఊగిపోతోందని పేర్కొంటూ ఓ పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకొని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ డీలర్లతో ఆమె చేసిన వాట్సాప్ చాట్ బయటకురావడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ అయింది. అయితే ఈ ఇష్యూలోకి ఎంటరైన హీరోయిన్ కంగనా రనౌత్.. బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో నోరువిప్పి టాలీవుడ్‌లో కూడా డ్రగ్స్ మాఫియా ఉందని, ఇక్కడ ఏ పార్టీ జరిగినా డ్రగ్స్ తప్పకుండా వాడతారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతటితో ఆగక తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బో

S. Radha Krishna: నిర్మాత చినబాబు బర్త్ డే.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

Image
నేడు (ఆగష్టు 31) టాలీవుడ్ ప్రొడ్యూసర్, మృదుస్వభావి . ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, పీఆర్‌ఓలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరితో కలివిడిగా ఉండే ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ స్వీట్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. చినబాబు అసలు పేరు . హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ స్థాపించి పలు సినిమాలు రూపొందించారు చినబాబు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు చినబాబు. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం 'ఆత్మకథ' సినిమా తీసి నష్టాలు మూటగట్టుకున్న ఆయన.. తిరిగి 'జులాయి' సినిమాతో మరోసారి నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఆ వెంటనే ''సన్నాఫ్ సత్యమూర్తి, అఆ..'' సినిమాలతో లాభాల బాట పట్టారు. ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేసిన చినబాబు నిర్మాతగా ఎదిగిన తీరు, సాధించి తీరాలనే ఆయన మొండితనం ఎందరికో ఆదర్శం అని చెప్పుకోవచ్చు. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెబుతుంటారు చినబాబు. ఆయన పదునైన మాటలు తనను ఎంతగానో ఆకర్షిస్త

Manchu Lakshmi: రియా విషయంలో ఇది సరైన పద్దతి కాదు.. నెట్టింట రచ్చ చేస్తున్న మంచు లక్ష్మి ట్వీట్

Image
బాలీవుడ్ యువ నటుడు బలవన్మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఈ మరణం వెనుక కొందరి హస్తం ఉందని ఆరోపణలు గుప్పుమనడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకొని సీబీఐ రంగంలోకి దిగింది. అయితే సుశాంత్ సూసైడ్ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని కార్నర్ చేస్తూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆమెను లోతుగా విచారిస్తూ కూపీ లాగుతున్నారు సీబీఐ అధికారులు. ఈ పరిస్థితుల్లో చేసిన ఓ ట్వీట్ నెట్టింట రచ్చ చేస్తోంది. ఇటు సుశాంత్‌కి, అటు రియా చక్రవర్తికి న్యాయం జరగాలంటూ మంచు లక్ష్మి పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. తాను ఇటీవల రియా, రాజ్‌దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ మొత్తం చూశాక దీనిపై స్పందించాలా వద్దా అని దీర్ఘంగా ఆలోచించి ఈ పోస్ట్ చేస్తున్నా అంటూ తన భావాలను అందరి ముందుంచింది మంచు లక్ష్మి. ఇందులో ఆమె ప్రస్తావించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో రచ్చకు కారణమయ్యాయి. ఓ అమ్మాయిని ఒంటరి చేసి రాక్షసురాలిగా చిత్రీకరిస్తున్నారని రియాను ఉద్దేశిస్తూ లక్ష్మి పెట్టిన సందేశంపై కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమె పోస్ట్ చేసిన సందేశం

ఒక్కసారి ఆ సుఖం చూస్తే ఇక కదలవు.. అందుకే నేను ఊరొదిలి వెళ్లా.. పూరి వర్షన్‌లో ఓపెన్ అయ్యాడిలా..!!

Image
లాక్‌డౌన్ వేళ వరుస పోడ్ కాస్ట్ ఆడియోలతో రకరకాల విషయాలు చెబుతున్నారు డాషింగ్ డైరెక్టర్ . తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఆడియో సందేశాలతో ఆలోచనలు రెక్కించిన ఆయన తాజాగా ఓ మోటివేషనల్ ఆడియో రిలీజ్ చేశారు. ఆయన వర్షన్ లోనే కష్టపడితే ఎలా పైకి రావొచ్చో వివరించారు. ''నీకేంట్రా పొయ్యికాడ ఆకు మడి అంటారు. దీని అర్థం పొలం మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఇంటిచుట్టూ పొలం ఉంటుంది. హాయిగా వంట చేసుకుంటూ పంట చేసుకోవచ్చు. ఏ టెన్షనూ ఉండదు. దీన్నే అంటాం. చాలా బాగా ఉంటుంది పైగా సుఖంగా కూడా ఉంటుంది. అందుకే అందరం దీన్నే కోరుకుంటాం. ఒక్కసారి ఆ సుఖం చూశాక అందులోంచి కదలం. దాని వల్ల మన గ్రోత్ ఆగిపోద్ది. మన లైఫ్ లిమిటెడ్ అయిపోద్ది. ఎక్కడికో వెళ్లాల్సిన వాడివి అక్కడే ఉంటావు. నేను కూడా కంఫర్ట్ జోన్‌లో చేసిన సినిమాలన్నీ తేడా చేశాను. ఆ జోన్ నుంచి బయటకొస్తే గానీ నిజమైన సక్సెస్ రాదనీ తెలుసుకున్నాను. Also Read: మనం చేసే పని రొటీన్ అని ఫీల్ అయిన ప్రతిసారి కొత్త ఐడియా వేస్తూ డిఫెరెంట్ రూట్‌లో వెళ్ళాలి. అందులో రిస్క్ ఉండాలి. రిస్క్ లేకపోతే అది కొత్త ఐడియానే కాదు. ఇక్కడ

సీఎం జగన్ డైనమిక్ లీడర్.. దేవుడి ఆశీస్సులు ఆయనకే.. ‘కింగ్’ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు

Image
టాలీవుడ్ ‘కింగ్’ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన చిన్నా, పెద్ద ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందినవాళ్లు నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాగార్జునకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘‘తెలుగు సినీ ప్రపంచంలో ఎందరో గొప్ప నటుల్లో ఒకరైనా అక్కినేని నాగార్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. Must Read: సీఎం జగన్ ట్వీట్ చేసిన దాదాపు 19 గంటల తర్వాత నాగార్జున స్పందించారు. సీఎం జగన్ డైనమిక్ లీడర్ అని, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రియమైన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమపూర్వక మాటలకు ధన్యవాదాలు. మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తున్నాను. నాకు తెలుసు.. మీ డైనమిక్ లీడర్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంటుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.’’ అని నాగార్

మగువ ట్రైలర్: బూతు సీన్లతో రచ్చ రచ్చ.. మరీ ఇంత అరాచకమా? సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో..!

Image
ఈ మధ్యకాలంలో బూతు కంటెంట్ సినిమాలు మరీ ఎక్కువయ్యాయి. సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే సినిమా అంతా బూతు సీన్లతో నింపేస్తున్నారు. కొన్ని సినిమాల్లో అయితే మరీ శృతిమించిన అడల్ట్ సీన్స్ పెడుతుండటం చూస్తూనే ఉన్నాం. సెగలు పుట్టించే సీన్స్ పెట్టేసి యువతరానికి గాలం వేస్తూ మార్కెట్ చేసుకుంటున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ఇక ఈ సంగతి అటుంచితే మోడ్రన్ యువతి ''అబల కాదు సబల'' అనే కాన్సెప్ట్ తీసుకొని '' అనే ఓ మూవీ రూపొందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఒక నిమిషం 28 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మగువ ట్రైలర్‌లో బూతు సీన్లు పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఓ సాఫ్ట్‌వేర్ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళుతుండగా కొందరు రేపిస్టులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని బిల్డింగ్‌కు తీసుకెళ్లి రేప్ చేసే ప్రయత్నం చేయడం, అయితే తెల్లారేసరికి ఆ అమ్మాయి ప్రాణాలతో బయట పడటాన్ని మధ్య మధ్యలో అడల్ట్ సీన్స్ పెట్టి ఆకర్షించే ప్లాన్ చేశారు. ''మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలి. ఇది నేటి మాట.. నా మాట'' అనే హీరోయిన్ డైలాగ్‌తో ట్రైలర్ ముగించారు. Also Read: యూనివర

Mahesh Babu: సితారతో మహేష్ సరదా సమయం.. నమ్రత ఇంట్రెస్టింగ్ కామెంట్

Image
ఒకప్పుడు సినిమాల్లో సందడి చేసిన మహేష్ సతీమణి నమ్రత.. ఇప్పుడు సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుకుగా పోస్టులు పెడుతూ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా భర్త సినిమా ప్రాజెక్టులు, , గౌతమ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నమ్రత షేర్ చేసిన పిక్, దానిపై ఆమె చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ కావడంతో గత నాలుగు నెలలకు పైగా భార్యా పిల్లలతో ఇంట్లోనే సరదాగా గడుపుతున్నారు మహేష్ బాబు. సాదారణంగానే షూటింగ్స్ చేస్తూ కూడా ఫ్యామిలీకి సమయం కేటాయించే ఆయన ఈ పూర్తి విరామాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ విశేషాలను ప్రేక్షకుల ముందుంచుతూ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది నమ్రత. ఈ క్రమంలో ఇప్పటికే తన పిల్లలు సితార, గౌతమ్‌లతో మహేష్ చేస్తున్న సరదా తాలూకు ఫోటోలు వైరల్ చేసిన నమ్రత.. తాజాగా మరో ఫోటో పోస్ట్ చేస్తూ 'నాన్న కూతురు సితార' అని ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. ఆమె షేర్ చేసిన ఈ పిక్‌లో తన కూతురు సితారను ఆప్యాయంగా చూస్తూ మురిసిపోతున్నట్లు కనిపిస్తున్నారు మహేష్ బాబు. అయితే ఇందులో మహేష్

ప్రభాస్‌పై అమెరికన్ పాప్ సింగర్ ప్రశంసలు.. బిగ్ థ్యాంక్స్ చెప్పిన రెబల్ స్టార్

Image
పాన్ ఇండియా స్టార్ హీరోగా, బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘’. సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ గతేడాది ఆగస్టు 30న విడుదలైంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బాగానే వసూలు చేసింది. అయితే, తెలుగు సహా ఇతర భాషల్లో రాణించలేకపోయింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల మేర గ్రాస్ వసూలుచేసింది. ఇదిలా ఉంటే, నేటితో ఈ చిత్రం ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే, హీరో ప్రభాస్ తన డైహార్డ్ ఫ్యాన్స్‌కి, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, అమెరికన్ పాప్ సింగర్, మోడల్ మెర్సీకి కూడా ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ఒక కారణం ఉంది. సాహోలో ‘బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ వచ్చే ఇంగ్లిష్ సాంగ్‌ను మెర్సీ ఆలపించారు. ‘సాహో’ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మెర్సీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిగ్ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు, ఆమె పాడిన సాంగ్‌

మా తాతయ్య చనిపోతే అంత్యక్రియలకు డబ్బుల్లేవు.. భాస్కర్ సాయం చేశాడు: ‘జబర్దస్త్’ నరేష్

Image
‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ గురించి పరిచయం అవసరంలేదు. టీనేజ్ కుర్రాడే అయినా జన్యులోపంతో ఐదేళ్ల కుర్రాడిలా ఉంటాడు. అదే అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది. తనలోని లోపాన్ని తనకు అనువుగా మలుచుకొని కమెడియన్‌గా రాణిస్తున్నాడు నరేష్. ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో నటించడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో సైతం ఈవెంట్లు చేస్తూ వినోదాన్ని పంచుతున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో కలిసి తన ‘హోం టూర్’ వీడియో చేశాడు నరేష్. తన ఇంటిలో ఉన్న సామానులు, తనకు వచ్చిన ట్రోపీల గురించి నరేష్ వివరించాడు. ఈ క్రమంలో అమెరికాలో తనకు వచ్చిన తొలి షీల్డ్‌ను నరేష్ చూపించాడు. ఈ షీల్డ్ తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. దీనికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. అమెరికా ఈవెంట్‌కు వెళ్లే సమయంలో తన తాతయ్య చనిపోయారని.. అయితే, ఆ సమయంలో తాతయ్య అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బుల్లేవని నరేష్ వెల్లడించాడు. అప్పుడు భాస్కర్ అన్న దగ్గర అప్పు తీసుకున్నానని తెలిపాడు. Also Read: తాతయ్య కార్యక్రమాలు పూర్తయని తరవాత అమెరికా ఈవెంట్‌కు వెళ్లానని.. అక్కడ ఇచ్చిన డబ్బులతో భాస్కర్ అప్పు తీర్చానని

మూడేళ్ల నుంచీ నేను గర్భవతినే.. బేబీ బయటకు రానంటోంది: సమంత

Image
అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన కొన్ని నెలలకే ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో చర్చలు మొదలైపోయాయి. సమంత గర్భం దాల్చారంటూ ఇప్పటికే చాలా సార్లు వదంతులు వచ్చాయి. సమంత కూడా వాటిని ఖండిస్తూ వచ్చారు. తాజాగా సమంతకు మరోసారి ఈ ప్రశ్న ఎదురైంది. సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చాట్ సెషన్‌ను నిర్వహించారు. తన ఫాలోవర్లు అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. అయితే, ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్న.. దానికి సమంత ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ‘మీరు గర్భం దాల్చారా’ అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమంత చాలా సమయస్ఫూర్తితో, చమత్కారంగా సమాధానం ఇచ్చారు. తాను 2017 నుంచీ గర్భం దాలుస్తూనే ఉన్నాను అని ఇప్పటి వరకు వచ్చిన వదంతులను పరోక్షంగా ప్రస్తావిస్తూ సమంత రిప్లై ఇచ్చారు. ‘‘నేను 2017 నుంచీ గర్భవతినేనని భావిస్తు్న్నాను. ఈ బేబీ నిజంగా బయటికి రావడానికి ఇష్టపడటం లేదని నా భావన’’ అని సమంత వీడియో ద్వారా రిప్లై ఇచ్చారు. నాగచైతన్య, సమంత వివాహం 2017 అక్టోబర్ 6న గోవాలో జరిగింది. ఆ తరవాత ఈ జంట హనీమూన్‌కు విదేశాలకు వెళ్లింది. ఇక ఆ తరవాత సమంత ప్రెగ్నెన్సీ వార్తలు మొదలైపోయాయి. గడిచిన మూడేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తూనే

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కారుణ్య ఇంట విషాదం

Image
టాలీవుడ్ ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య ఇంట విషాదం నెలకొంది. కారుణ్య తల్లి జానకి అనారోగ్యంతో శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌లోని త్రివేణినగర్‌లో ఆమె మృతి చెందారు. జానకి కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుది శ్వాస విడిచారు. కారుణ్య తండ్రి మధు సైతం డిఫెన్స్‌లోనే పనిచేసి రిటైర్‌ అయ్యారు. కారుణ్య తల్లి జానకి మరణవార్త తెలుసుకున్న పలువురు తమ విచారం వ్యక్తం చేశారు. పలువురు సింగర్స్ కారుణ్యకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో కారుణ్య తల్లి అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. సైదాబాద్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కారుణ్య 2006లో సోనీ టీవీ నిర్వహించిన 'ఇండియన్‌ ఐడల్‌' కార్యక్రమంలో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి ప్రముఖ గాయకుల సరసన నిలిచాడు.

ఎస్పీ బాలుకి ఫిజియోథెరపి.. మెల్లమెల్లగా కోలుకుంటోన్న దిగ్గజ గాయకుడు

Image
కరోనా వైరస్‌తో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న దిగ్గజ గాయకుడు మెల్లమెల్లగా కోలుకుంటున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. అలాగే, బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులకు ఆయన స్పందిస్తున్నారని, ఇంకా వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్స కొనసాగుతోందని సమాచారం. బాలు ఆరోగ్యంపై శనివారం ఎంజీఎం హాస్పిటల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, హాస్పిటల్ వర్గాల ద్వారా బాలు ఆరోగ్య పరిస్థితిపై సమాచారం బయటికి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యంకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ కొన్ని రోజులుగా జరుగుతోందని, ఫిజియోథెరపీకి బాలు శరీరం సహకరిస్తోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తులు కూడా మెరుగుపడినట్లు తెలుస్తోంది. మరోవైపు, తన తండ్రి ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన తండ్రి మెల్లమెల్లగా కోలుకుంటున్నారని చెప్పారు. ఇక శనివారం ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘నాన్న నిన్నటి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. నాన్న ఆరోగ్యం గురించి ప్రస్తుతానికి కొత్త అప్‌డేట్ ఏం లేదు’’ అని చరణ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా

ఇండియన్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్.. వాటే ట్రెండ్ గురూ!

Image
టాలీవుడ్‌లోని స్టార్ హీరోల అభిమానులకు ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండ్‌లు ప్రామాణికంగా మారిపోయాయి. ప్రతి స్టార్ హీరో ఫ్యాన్స్ ఒక హ్యాష్‌ట్యాగ్‌తో తమ హీరోని ట్విట్టర్ టాప్ ట్రెండ్‌లో ఉంచుతున్నారు. శనివారం ట్విట్టర్ ట్రెండ్‌లో టాప్‌లో ఉన్నారు. #IndianStyleIconAlluArjun అనే హ్యాష్‌ట్యాగ్‌తో బన్నీ ఫ్యాన్స్ మిలియన్ల కొద్దీ ట్వీట్లు చేస్తూ తమ హీరోను టాప్ ట్రెండ్‌లో ఉంచారు. తమ హీరోకు సంబంధించిన ఏదో ఒక పోస్టు పెడుతూ దానికి ఈ హ్యాష్‌ట్యాగ్‌ను తగిలిస్తున్నారు. ‘ఇండియన్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్’ అంటూ ట్రెండ్ సెట్ చేశారు. అయితే, బన్నీ అభిమానులకు అకస్మాత్తుగా ఈ ట్రెండ్ సెట్టింగ్ ఆలోచన రావడానికి కారణం ఉంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ టీఆర్‌పీ రేటింగ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డు‌ను నెలకొల్పింది. ఇటీవల టీవీలో ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు 29.4 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇంత వరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో టీఆర్‌పీ రేటింగ్ రాలేదు. అంటే, ‘బాహుబలి 2’ రికార్డును కూడా ‘అల’ దాటేసింది. అందుకే, బన్నీ ఫ్యాన్స్ మంచి ఊపు మీద ఉన్నారు. ఇలా ట్వి

సీఎం జగన్ బిగ్ సర్‌ప్రైజ్.. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ‘కింగ్’ నాగార్జునకే!

Image
ప్రముఖ తెలుగు సినీ హీరో నాగార్జునకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ‘కింగ్’ 61వ వసంతంలోకి అడుగు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో నాగార్జునకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ నాగార్జునకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండని .. ముఖ్యమైన విషయాలు, వ్యక్తులపైనే ట్వీట్ చేస్తుంటారు. ముఖ్యంగా బర్త్ డే విషెస్‌లు చెప్పడం వంటివి చాలా అరుదు. కానీ, ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నాగార్జునకు సైతం బర్త్ డే విషెస్ చెప్పారు. ‘‘తెలుగు సినీ ప్రపంచంలో ఎందరో గొప్ప నటుల్లో ఒకరైనా అక్కినేని నాగార్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు, నాగార్జునకు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ప్

సుడిగాలి సుధీర్ హీరోగా మరో సినిమా: మళ్లీ ఆ దర్శకుడే.. ఈసారి రొమాంటిక్ కామెడీ!

Image
‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా సత్తా చాటిన ‘జబర్దస్త్’ కమెడియన్ మరో సినిమాను పట్టాలెక్కించారు. సుధీర్ హీరోగా సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కబోయే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో సుధీర్‌ని హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కాబోతోంది. Also Read: ఈ సినిమా గురించి దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ.. ‘‘హీరో సుధీర్, నా కాంబినేషన్‌లో రాబోతోన్న రెండో సినిమా ఇది. ప్రేక్షకులకు కనువిందు చేసే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. సప్తగిరి ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. చక్కటి సంగీతం, యూత్‌ని ఆకట్టుకునే పాటలు, అదిరిపోయే కామెడీ పంచ్‌లు హైలెట్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అన్ని కమర్షియల్ హంగులతో, సీనియర్ నటీనటులందరి కలయికతో ఈ సినిమా ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కానుంది. మా నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఖర్చుకు వె

జెనీలియాకు కరోనా పాజిటివ్.. 21 రోజులపాటు ఒంటరిగా..!

Image
ప్రముఖ నటి దేశ్‌ముఖ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకినట్టు జెనీలియా ప్రకటించారు. అయితే, ప్రస్తుతం తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని కూడా చెప్పారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ‘‘మూడు వారాల క్రితం నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గడిచిన 21 రోజుల్లో నాలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దేవుడి దయవల్ల ఈరోజు నాకు కరోనా నెగిటివ్ అని వచ్చింది. ఈ వ్యాధిపై పోరాటం నాకు చాలా సులభంగా అనిపించినప్పటికీ గత 21 రోజుల పాటు ఒంటరిగా గడపడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. మరొకరితో గడిపే సమయం ఉండదు. కేవలం డిజిటల్ ప్రపంచంలో మునిగితేలడం వల్ల ఒంటరితనాన్ని పోగొట్టొచ్చు. మళ్లీ తిరిగి నా కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్దకు చేరడం సంతోషంగా ఉంది. మన చుట్టూ ఉన్నవారికి ప్రేమను పంచడమే నిజమైన బలం. అందరికీ ఇది అవసరం. త్వరగా పరీక్ష చేయించుకోండి, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి, ఫిట్‌గా ఉండండి. ఈ మహమ్మారిపై పోరాడటానికి ఇదొక్కటే మార్గం’’ అని జెనీలియా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసిన జెనీలియా.. ఆ తరవాత చాలా సి

ధైర్యం చేస్తోన్న నాగచైతన్య, సాయి పల్లవి.. షూటింగ్ షురూ!

Image
షూటింగ్‌లు తిరిగి మొదలుపెట్టుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా స్టార్ హీరోలు మాత్రం భయపడుతున్నారు. తమ మూలంగా యూనిట్ సభ్యులు రిస్క్‌లో పడకూడదని భావించి ఇంకా ఏ స్టార్ హీరో షూటింగ్ మొదలుపెట్టలేదు. కానీ, అక్కినేని నాగార్జున ధైర్యం చేశారు. బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఆయన మేకప్ వేసుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్న తొలి స్టార్ హీరో నాగార్జునే. అయితే, ఇప్పుడు ఆయన బాటలోనే అక్కినేని నడుస్తున్నట్టు సమాచారం. నాగచైతన్య, తమ ‘లవ్ స్టోరీ’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తుందట. అన్ని జాగ్రత్తలూ చాలా కఠినంగా పాటిస్తూ ఈ షూటింగ్ చేయనున్నారని అంటున్నారు. సెప్టెంబర్ 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. 15 రోజుల షెడ్యూల్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని టాక్. Also Read: ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని రామోజీ ఫిలిం సిటీలోనే తక్కువ మంది సిబ్బందితో పూర్తిచేయాలని శేఖర్ కమ్ముల

ఆ రౌడీని నడిరోడ్డుపై కొట్టింది, టెర్రరిస్ట్‌ని పట్టుకున్నది నా వియ్యంకుడే: నాగబాబు వీడియో

Image
మెగా బ్రదర్ గారాలపట్టి కొణిదెల వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. ఆగష్టు 13 వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే త్వరలో వియ్యంకుడు కాబోతున్న ఐజీ ప్రభాకర్ రావు డేరింగ్ నెస్ గురించి తెలియజేస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో విడుదల చేశారు నాగబాబు. ఈ వీడియోలో కాబోయే వియ్యంకుడిపై ప్రసంసలు కురిపించారు నాగబాబు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈనెల (ఆగష్టు) 31న రిటైర్డ్ కాబోతున్న ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ గారికి.. అభినందనలు తెలియజేస్తున్నా. వారితో త్వరలో వియ్యం అందుకోబోతున్నా. మా ఫ్యామిలీకి పోలీస్ డిపార్ట్ మెంట్‌తో తెలియని అనుబంధం ఉంది. మా నాన్న పోలీస్‌గా పనిచేశారు. మా నాన్నగారి కోరిక ఏంటంటే.. మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరొకర్ని ఐపీఎస్ చేయాలని.. కాని ఎవరం ఆ ఫీట్ సాధించలేకపోయాం. కాని ఇన్నాళ్లకు ప్రభాకర్ గారితో వియ్యం అందుకునే ఛాన్స్ వచ్చింది. ఆ విధంగా ఓ పోలీస్ మా ఫ్యామిలీలో భాగం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన 1990లో సర్వీస్‌లో చేరారు. అంతకు ముందు ప్రైవేట్ జాబ

ఈరోజు నా 31వ పుట్టినరోజు.. అక్కినేని వారి చమత్కారం.. శుభాకాంక్షల వెల్లువ

Image
టాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బాస్ 4 హోస్ట్ అక్కినేని ఈరోజు (ఆగస్ట్ 29న) తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన 60వ పుట్టినరోజును స్పెయిన్‌లో జరుపుకున్న కింగ్ నాగార్జున.. ఈ బర్త్‌డేను మాత్రం హైదరాబాద్‌లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకుంటున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియో మెసేజ్‌ను నాగార్జున ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక ఆసక్తికర అంశం ఉంది. తాను 31వ ఏట అడుగుపెట్టినట్టు చెబుతూ నాగార్జున ఈ వీడియోను మొదలుపెట్టారు. ‘‘ఈవాళ నా 31వ పుట్టినరోజు. నిన్నటి నుంచి ఎంతో మంది విషెస్.. ప్రేమ, అభిమానంతో మెసేజ్‌లు నాకు పంపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకో విషయంపై చాలా హ్యాపీగా ఉన్నాను. ఐదున్నర నెలలు తరవాత మళ్లీ పని చేయబోతున్నాను. షూటింగ్‌కి వెళ్లబోతున్నాను. ఏ షూటింగ్ అంటే.. బిగ్ బాస్ సీజన్ 4’’ అని ఎంతో సంతోషంగా చెప్పారు నాగార్జున. అయితే, తన వయసు 31 అంటూ చెప్పిన అక్కినేని వారి చమత్కారానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కింగ్‌కి పుట్టినరోజు శుభాకా

నాని ‘V’ వెనకున్న సీక్రెట్.. హీరోయిన్ నివేదా థామస్ చెప్పిన కబుర్లు

Image
సెలక్టివ్‌గా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ న‌టిగా ఒక్కో మెట్టు ఎదుగుతున్న హీరోయిన్ నివేదా థామ‌స్‌. ఈ టాలెంటెడ్ హీరోయిన్ లేటెస్ట్‌గా న‌టించిన చిత్రం ‘వి’. నేచుర‌ల్ స్టార్ , సుధీర్ బాబు, అదితిరావు హైద‌రిల‌తో క‌లిసి నివేదా థామ‌స్ న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న్‌కృష్ణ ఇంద్రగంటి ద‌ర్శక‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వెబినార్‌లో మీడియాతో ఆమె సినిమా గురించిన మాట్లాడారు. ✪ ‘వి’ అంటే... ‘వి’ అంటే ఏంట‌ని చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ‘వి’ అంటే విక్టరీ కూడా అనుకోవ‌చ్చు. నిజానికి ఈ సినిమాతో మా ఎంటైర్ టీమ్ విక్టరీ కావాల‌ని బ‌లంగా కోరుకుంటోంది. ఆ స‌క్సెస్ ద‌క్కుతుంద‌నే అనుకుంటున్నాం. అయితే ‘వి’ వెనుకున్న సీక్రెట్ ఏంటి అనే విష‌యం తెలియాలంటే మాత్రం సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. ✪ మీ పాత్ర గురించి... ఇందులో నేను అపూర్వ అనే క్రైమ్ న‌వ‌లా ర‌చ‌యిత పాత్రలో క‌నిపిస్తాను. మోహ‌న్ సార్‌ క‌థ చెప్పగానే బాగా క‌నెక్ట్ అయ్యాను. అపూర్వ పాత్ర ఎంత ఓబీడీయెంట్‌గా ఉంటుందో అంత

అన్నకు ప్రేమతో.. ఆయన లేరంటే మనసు ఒప్పుకోవట్లేదు.. బాలకృష్ణ భావోద్వేగం

Image
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చైతన్య రథసారధి, మాజీ మంత్రి నందమూరి రెండో వర్థంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అకాల మరణం ఎప్పటికీ తీరని లోటంటూ గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హరికృష్ణకు నివాళులు అర్పించారు. అలాగే హరికృష్ణ తమ్ముడు, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి అన్నయ్యకు నివాళులర్పించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో బాలయ్య అన్నయ్యను గుర్తు చేసుకుంటూ భావోద్వేగమైన పోస్టు చేశారు. ‘‘తెలుగుదేశం స్థాపించిన తొలి దినాల్లో నాన్న గారికి చేదోడు వాదోడుగా ఉంటూ చెతన్య రథసారధి అయిన మా అన్న నందమూరి హరికృష్ణ గారు మన మధ్యనుంచి దూరం అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది అంటే నమ్మశక్యం కావటం లేదు మనస్సు అంగీకరించటం లేదు. నాన్నకు తగ్గ తనయుడు, తెలుగుదేశం పార్టీ తొలి శ్రామికుడు అన్నయ్య హరికృష్ణ గారికి నా నివాళులు అర్పిస్తూ... జోహార్ నందమూరి హరికృష్ణ’’ అని బాలకృష్ణ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అలాగే టీడీపీ చీఫ్ చంద్రబాబు సైతం హరికృష్ణకు నివాళులర్పిస్తూ ట్వీట్

నాగ్ బర్త్‌ డేకి చైతూ సర్‌ప్రైజ్.. ‘మనం’ దర్శకుడితో కొత్త మూవీ టైటిల్ ఫిక్స్

Image
టాలీవుడ్ మన్మథుడు బర్త్ డే పురస్కరించుకుని అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు నాగ్ తనయుడు అక్కినేని నాగచైతన్య. ‘మనం’ చిత్రంతో అక్కినేని ఫ్యామిలీకి ఎవర్ గ్రీన్ చిత్రం అందించిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు నాగచైతన్య. ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ నాగార్జునకు బర్త్ డే విషెష్ అందించారు నాగార్జున. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నాగచైతన్యకు ఇది 20వ మూవీ కావడం విశేషం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రంలో చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో చైతూ సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఫిదా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల మరోసారి తన లక్కీ హీరోయిన్ సాయి పల్లవి రిపీట్ చేశారు.

‘వైల్డ్ డాగ్’ లుక్‌తో సర్ ప్రైజ్ చేసిన నాగార్జున.. NIA ఏజెంట్‌గా అలీ రెజా

Image
నేడు టాలీవుడ్ మన్మథుడు బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘వైల్డ్ డాగ్’ సెకండ్‌ లుక్‌ని విడుదల చేశారు. టైటిల్ రోల్‌లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’ చిత్రంలో నాగార్జున.. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించబోతున్నారు. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజా పోస్టర్‌లో నాగార్జున గన్ గురిపెట్టి సీరియల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా ఎన్ ఐ ఏ ఏజెంట్‌గా.. హీరోయిన్ ఆర్య పండిండ్ రా స్పెషల్ ఏజెంట్‌గా కనిపిస్తున్నారు. త్వరలో ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నారు.

Nagarjuna బ‌ర్త్ డే స్పెష‌ల్ : ప్రియ‌మైన మ‌న్మ‌థుడు.. పురుషోత్త‌ముడెలా?‌

Image
"కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కనురెప్పలకే మాటొస్తే" సీతారాముడు రాస్తున్నాడు.. ఆమ‌ని వ‌ర్ణాల‌ను వేటూరి వివ‌రిస్తున్నాడు. ఈ రెంటి న‌డుమా..ఎన్నో సంతోషాలను గుర్తుతెచ్చుకుని త‌న పండుగ పుట్టిన రోజు పండుగ‌కు మ‌రో అర్థం వెతుకుతున్నాడు కింగ్ . నాన్న దిద్దిన ఓన‌మాలు.. రాఘ‌వుడు చేయించిన పాద పూజ‌లు ఏఎన్నార్ కు సెంటిమెంట్లు లేవు.. రాఘ‌వేంద్ర‌రావుకు సెంటిమెంట్ పండాల్సిందే అన్న‌ది ప‌ట్టు.. అలా ఓ స‌‌న్నివేశం.. అల్లాత‌త్వము న అల‌రారే రామ‌క‌థ.. అని రాశారు వేద‌వ్యాస.. సీన్ తీస్తున్నారు.. ఇప్ప‌టివ‌ర‌కూ నాన్న‌కు పాద‌పూజ చేయ‌లేదు ఇప్పుడు నీవు చేయాలి.. ఈ స‌న్నివేశాన చేయాలి.. అంటూ రాఘ‌వేంద్ర‌రావు(రాఘ‌వుడు)..చెప్పారు.. నాగార్జున‌కు (రామ‌దాసు పాత్ర‌ధారికి) అలా శ్రీ‌రామ దా సు చిత్రంలో క‌బీరు పాత్ర‌ధారి ఏఎన్నార్ కాళ్లు క‌డిగి నెత్తిన నీళ్లు చ‌ల్లుతాడు. నాన్నంటే అది.. కృష్ణా తీరాన నాన్న... కృ ష్ణా తీరం నుంచి భాగ్య న‌‌గ‌రి వ‌ర‌కూ నాన్న.. నాన్న.. ర‌మ‌ణుడి దారిలో న‌డి చాడు .. ముళ్ల‌పూడి రమ‌ణుడి దారిలో న‌డిచాడు.. నాన్న చెప్పిన దారిలో నాగార్జున న‌డిచాడు.. నాన్న పురుషోత్త‌ముడ‌య్యాడు.. పురుష

హీరో సుధాకర్ దంపతుల డ్యాన్స్‌కు మెగాస్టార్ ఫిదా.. హారికకు ఎక్కువ మార్కులు వేసిన చిరు

Image
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో పక్కా తెలంగాణ కుర్రాడు నాగరాజుగా కనిపించిన సుధాకర్ కోమాకులను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోరు. తొలి సినిమాతోనే ఆయన అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అయితే, ఆ తరవాత హీరోగా మారినా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సుధాకర్ చివరిగా 2017లో ‘నువ్వు తోపురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన భార్య హారికతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఇదిలా ఉంటే, ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సుధాకర్ దంపతులు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. చిరంజీవి ‘ఛాలెంజ్’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఇందువదన’ను సుధాకర్ దంపతులు రీ-క్రియేట్ చేశారు. ఆ పాటకు ఇద్దరూ స్వయంగా డ్యాన్స్ చేసి ఆ వీడియోతో చిరంజీవికి ట్రిబ్యూట్ ఇచ్చారు. ఈ వీడియోకు మెగా అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. సుధాకర్, హారిక అద్భుతంగా పాటను రీ-క్రియేట్ చేశారని కొనియాడారు. అయితే, మిస్టర్ అండ్ మిసెస్ సుధాకర్ కోమాకుల పెర్ఫార్మె్న్స్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిదా అయిపోయారు. ఆ వీడియోను చూసిన చిరంజీవి ఎంతో సంతోషంగా సుధాకర్ దంపతులకు వాయిస్ మెసేజ్‌ను పంపారు. ఈ వాయిస్ మెసేజ్‌ను సుధాకర్ సోషల్ మీడియా ద్వ

ఏపీలో మరో దళితుడికి శిరోముండనం.. నటుడు నూతన్‌నాయుడు చావుదెబ్బలు కొట్టి గుండు కొట్టించాడన్న బాధితుడు

Image
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఘటన మరువక ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో దళిత యువకుడికి శిరోముండనం జరిగింది. ఈ ఘటన జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతానగర్‌ కాలనీలో ఉంటున్న పర్రి శ్రీకాంత్‌ అనే యువకుడు అదే కాలనీలో నివాసముంటున్న సినీ నిర్మాత, నటుడు ఎన్‌. నూతన్‌నాయుడు ఇంట్లో పని చేస్తున్నాడు. గత 4 నెలలుగా ఆయన వద్ద పని చేస్తున్న శ్రీకాంత్‌.. ఆగస్టుల 1వ తేదీన జీతం తీసుకుని పని మానేశాడు. ఈ నేపథ్యంలో తమ ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని, ఆ విషయంపై మాట్లాడాలని శ్రీకాంత్‌ను ఇంటికి రమ్మన్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాంత్‌ అక్కడికి వెళ్లగా.. నూతన్‌నాయుడు కుటుంబ సభ్యులు మొబైల్ నువ్వే తీశావంటూ ఆరోపించారు. మిగతా సిబ్బంది చూస్తుండగానే నూతన్‌ నాయుడు భార్య శ్రీకాంత్‌కు గుండు గీయించారు. అనంతరం సిబ్బంది యువకుడిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ విషయాన్ని బయటికి చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. తనను రాడ్లతో చావుదెబ్బలు కొట్టారని బాధిత యువకుడు వాపోయారు. పని చేసుకోవడానికి వెళ్తే తన బతుకును ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన మీడియా ద్వారా బయటిక

‘డియర్ కామ్రేడ్’ సెన్సేషన్.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం

Image
టాలీవుడ్‌లో క్రేజీ స్టార్స్ నటించిన సినిమాలను హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. మన తెలుగు సినిమాలను హిందీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలు, నితిన్ సినిమాలు వందల మిలియన్ల వ్యూస్‌ను రాబట్టాయి. ‘డియర్ కామ్రేడ్’ హిందీ అనువాద చిత్రానికి సైతం యూట్యూబ్‌లో భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 160 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అయితే, లైక్స్ విషయంలో ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం సాధించని ఘనతను ‘డియర్ కామ్రేడ్’ సాధించింది. ‘డియర్ కామ్రేడ్’ హిందీ అనువాద చిత్రానికి యూట్యూబ్‌లో 2 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రానికి ఈ స్థాయిలో లైక్స్ రాలేదు. యూట్యూబ్‌లో 2 మిలియన్ లైక్స్ సాధించిన తొలి భారతీయ చిత్రం ‘డియర్ కామ్రేడ్’. గోల్డ్‌మైన్స్ టెలీఫిలింస్ సంస్థ ‘డియర్ కామ్రేడ్’ హిందీ అనువాద హక్కులను కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరి 19న తమ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ సినిమాను విడుదల చేసింది. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే ఈ చిత్రం 12 మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ఇప్పుడు ఏకంగా 2 మిలియన్ లైక్స

‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్.. డేట్ లీక్ చేసిన తమన్!

Image
పవర్ స్టార్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా వస్తోన్న ‘వకీల్ సాబ్’ చిత్రం ఈపాటికే థియేటర్లలోకి రావాల్సింది. కాకపోతే కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, పాట విడుదలయ్యాయి. వీటికి అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రేమికుల నుంచి విశేష స్పందన వచ్చింది. వీటి తరవాత అప్‌డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల ఎదురుచూపులకు తెరపడబోతోందని సమాచారం. Also Read: ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం బుధవారం ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు. ఈరోజు సంగీత దర్శకుడు తమన్ చేసిన ట్వీట్ కూడా ఈ రూమర్‌కు ఊతమిస్తోంది. ‘‘WED - NES - DAY !!’’ అని తమన్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఇది ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ కోసం చేసిన ట్వీటేనని టాక్. ఈ మోషన్ పోస్టర్ ఫ్యాన్స్‌కు ఒక ట్రీట్ కాబోతోందని అంటున్నారు. ఈ విషయం ఫ్యాన్స్‌కు కూడా అర్థమైపోయినట్టుంది. అందుకే తమన్ ట్వీట్ కింద ‘‘అన్న.. బీజీఎం అదిరిపోవాలి’’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంట

క్వశ్చన్ మార్క్ (?).. అదా శర్మ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్

Image
పూరి జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అదా శర్మ.. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. కిందటేడాది రాజశేఖర్ ‘కల్కి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అదా శర్మ.. ఇప్పుడు థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గౌరు ఘనా సమర్పణలో శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీకృష్ణ నిర్మాతగా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ‘క్వశ్చన్ మార్క్ (?)’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు విప్రా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. టైటిల్‌ను ప్రకటించిన సందర్భంగా నిర్మాత గౌరీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అందరి సహకారంతో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. మా సినిమా టైటిల్ ‘క్వశ్చన్ మార్క్ (?)’. టైటిల్ అందరికీ చాలా బాగా నచ్చింది.. విశేష స్పందన లభించింది. షూటింగ్ మొత్తం హైదరాబాద్, మహారాజపురం అడవుల్లో చేసాం. టైటిల్ మాదిరిగానే సినిమా కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది’’ అని తెలిపారు. Also Read: దర్శకుడు విప్రా మాట్లాడుతూ.. ‘‘మా నిర్మాత గౌరీకృష్ణ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మి

139 People Rape Case: నాకూ కూతురు ఉంది.. నేను రేప్ చేయలేదు, ప్రసాద్‌కి సంబంధం లేదు: హీరో కృష్ణుడు

Image
తనను 139 మంది గత ఎనిమిదేళ్లుగా 5000 సార్లుకు పైగా రేప్ చేశారంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువతి హైదరబాబ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అయితే తనను ఎవరెవరు రేప్ చేశారో తెలియజేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున మొత్తం 139 మందిపైన నిర్భయ, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన యువతికి మద్దతుగా వివిధ దళిత సంఘాలు నిలవడంతో పాటు నేరస్థుల్ని కఠినంగా శిక్షించాలంటూ మహిళా నిరసనలు తెలుపుతున్నాయి. అయితే ఈ కేసులో మొత్తం 139 మందిపై రేప్ ఆరోపణలు ఉండగా.. వీరిలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, టీవీ యాంకర్లు, రిపోర్టర్లు, లాయర్లు, డాక్టర్లు, అలాగే ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం నాయకులు ఇలా చాలామంది పేర్లు ఉన్నాయి. అయితే ఇండస్ట్రీకి సంబంధించి యాంకర్ ప్రదీప్ పేరుతో పాటు.. పేరు కూడా ఉండటంతో సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తనను మానసిక మానభంగం చేస్తున్నారని.. ఈ దారుణమైన ఆరోపణలతో నా ఫ్యామిలీ, నేను మనో వేదనకు గురౌతున్నాం అం

సుధీర్ కంటతడి.. తింటానికి తిండిలేక సింక్ నీళ్లు తాగి.. పడిన కష్టం మొత్తం కళ్లకు కట్టారు

Image
సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై ఇతనో సంచలనం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా సుధీర్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే కాదు.. ఇతని పేరుని పచ్చబొట్లు వేసుకోవడం.. ఇతనిపై స్పెషల్ థీంగ్ సాంగ్స్ రూపొందిస్తున్నారు అంటే మనోడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగులో అయితే సుధీర్‌కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతలా అంటే.. పొరపాటున స్కిట్‌లో సుధీర్‌పై ఎవరైనా పంచ్‌లు వేసినా.. తక్కువ చేసినా సుధీర్ ఫ్యాన్స్ ఆ పంచ్ వేసిన వాళ్ల తాట తీసేంతగా. ఇటీవల ఇక ఈవెంట్‌లో బిగ్ బాస్ రాహుల్ సిప్లిగంజ్ స్కిట్‌లో భాగంగా సుధీర్‌ని హౌలే, ఫాల్త్ అన్నందుకు రాహుల్ సిప్లిగంజ్‌ని ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. జబర్దస్త్‌లో చాలా మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ సుధీర్ చేసే కామెడీలో ఇనోసెన్స్‌ ఉండటం వల్ల చాలామంది మహిళా ప్రేక్షకులకు కూడా సుధీర్ అంటే ఇష్టం. విచిత్రం ఏంటంటే.. సుధీర్‌ని చేసే 90 శాతం స్కిట్స్‌లలో అతన్ని అమ్మాయిల పిచ్చోడిగా.. మహా కామ పిశాచిగా చూపిస్తుంటారు. అయినప్పటికీ కూడా జబర్దస్త్‌లోని ఇతర కమెడియన్ల మాదిరిగా సుధీర్ తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకునేలా వ్యాఖ్యలు కాని కామెంట్స్ చేయకుండా వి

సత్యదేవ్, తమన్నా జంటగా ‘గుర్తుందా శీతాకాలం’ ప్రారంభం

Image
యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీబ్యూటీ త‌మన్నా జంటగా న‌టిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగ‌శేఖ‌ర్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం పూజా కార్యక్రమాల‌తో ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో స‌త్యదేవ్, ద‌ర్శకనిర్మాత నాగ‌శేఖ‌ర్, సంగీత ద‌ర్శకుడు కాల‌భైర‌వ‌, సినిమాటోగ్రాఫ‌ర్ స‌త్య హెగ్డే, చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌త్యదేవ్ మాట్లాడుతూ.. ‘‘గుర్తందా శీతాక‌లం చిత్రంలో న‌టించేందుకు నాకు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శక‌నిర్మాత నాగ‌శేఖ‌ర్ గారికి ప్రత్యేక కృత‌జ్ఞత‌లు. ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. ఈ సినిమాలో త‌మ‌న్నా గారితో క‌లిసి న‌టిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. కాల‌భైర‌వ ఈ చిత్రానికి అద్భుత‌మైన ట్యూన్స్, నేప‌థ్య సంగీతాన్ని ఇస్తార‌ని ఆశిస్తున్నాను. ఎప్పటిక‌ప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ నా సినిమాల్ని హిట్ చేస్తున్న సినీ అభిమానుల‌కు నా ప్రత్యేక కృత‌జ్ఞత‌లు. వారంద‌రి అంచ‌నాల‌కి ఏ మాత్రం త‌గ్గకుండా ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ ఉంటుంద‌ని నేను క‌చ్చితంగా చెప్పగ‌ల‌ను. ఈ మూ

రంజిత బాటలో బిగ్ బాస్ భామ.. నేనూ నిత్యానంద సేవకి పోతా అంటూ షాకింగ్ పోస్ట్

Image
వివాదాస్పద స్వామిజీ నిత్యానందంపై మరో నటి మనసు పారేసుకుంది. ఇది భక్తో లేక ఏంటో తెలియదు కాని.. స్వామివారి సేవకు నేను కూడా సిద్దం అంటూ ప్రకటించేసింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందతో నటి రంజిత బంధానికి ఏ పేర్లు పెట్టుకున్నా.. నిత్యానందతో రంజిత రాసలీలలు సాగించిందనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ఈ విషయంలో తనపై వచ్చిన రూమర్స్‌ని ఆమె కొట్టిపారేసినా.. నిత్యానందకు సంబంధించిన బిదాడి ఆశ్రమంలో నటి రంజిత ఏడాదికి పైగా ఉందని.. అప్పుడు స్వామి వారికి కావాల్సిన అన్ని కార్యక్రమాలను సమర్పించిందని నిత్యానందపై పోలీసులు జరిపిన విచారణలో బయటకు వచ్చింది. ఆమెతోనే కాదు.. 15 మందికి పైగా మహిళా భక్తులతో రాసలీలలు సాగించినట్టుగా స్వయంగా నిత్యానందే ఒప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరవాతి కాలంలో నిత్యానందపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత భారత్ నుంచి పరారైన .. ఒక దీవిని కొనుగోలు చేసి దానికి ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస్’ అనే పేరు పెట్టి దాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను ఏర్పాటు చేసి కరెన్సీని ముద్రిస్తున్నారు ఈ స్వా

పర్సనల్ లైఫ్‌ని ఫింగరింగ్ చేయకుండా ఉండటమే ప్రేమ.. పూరీ ప్రేమ పాఠం వినాల్సిందే

Image
వహ్ వా.. ప్రేమ అంటే ఇదా?? ఇలా ప్రేమించాలా?? దీన్ని ప్రేమ అంటారా?? పలానా దాన్ని ప్రేమని అనరా?? ఒకసారి పూరీ చెప్పిన ప్రేమ పాఠం వింటే మనలో ఉన్నది ప్రేమేనా?? మనం ప్రేమిస్తున్నామా లేక ఏదైనా ఆశిస్తున్నామా? అసలు ప్రేమంటే ఏంటి అన్న దానికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. లాక్ డౌన్‌లో రకరకాల అంశాలపై ఆడియో సందేశాలను ఇస్తున్న పూరీ.. తాజాగా లవ్ గురించి మాట్లాడుతూ అసలు లవ్ అంటే ఏంటి? ఎలా ప్రేమించాలి అన్న దానిపై యూట్యూబ్‌లో ఆడియో విడుదల చేశారు. పూరీ మాట్లాడుతూ.. ప్రేమ అంటే ఎప్పుడూ వేరే వ్యక్తి కోసమే అనుకుంటాం.. మన ప్రేమ ఎప్పుడూ మరెవరి కోసమేనా.. మన కోసం కాదా?? మనకు ఉన్న ఎక్స్ పీరియన్స్ వల్ల లవ్ అంటే కన్ ఫ్యూజన్ వచ్చేసింది. నీలో ప్రేమ ఉన్నది ఒకరికి ఐ లవ్యూ చెప్పడం గురించే కాదు.. లవ్ అనేది నీ క్వాలిటీ అయ్యి ఉండాలి. ఎక్కడ ఉన్నా.. ఎవరితో ఉన్నా.. ఒంటరిగా ఉన్నా.. నీలో ఉన్న లవ్ ఫ్లో అవుతూ ఉండాలి. నీ నుండి వచ్చే సువాసన అయ్యి ఉండాలి. అలా ఉంటే.. నీ భార్యతో ఉన్నప్పుడు భార్యను ప్రేమిస్తావ్.. తల్లితో ఉంటే తల్లిని ప్రేమిస్తావ్.. నేచర్‌తో ఉంటే నేచర్‌ని ప్రేమిస్తావ్.. ప్రేమ అనే సముద్రం నీలో ఉండాలి. అప్పుడు నీ ప్రేమ నీ

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్.. 14 మందిలో ఐదుగురు యాంకర్లు!

Image
బిగ్ సీజన్ 4 ఎప్పుడన్నదానిపై క్లారిటీ ఇస్తూ స్టార్ మా అఫీషియల్ ప్రోమో విడుదల చేయడంతో ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6 సాయత్రం 6 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానుంది. తెలుగు టెలివిజన్‌లోఅత్యుత్తమమైన రేటింగ్స్ సాధించి వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అదిపెద్ద నాన్ ఫిక్షన్ షో బిగ్ బాస్‌ను ఈసారి వినూత్న తరహాలో అందించనున్నారు. వంద రోజులకు పైగా బుల్లితెర అభిమానులకు వినోదాన్ని పంచనున్నారు. అయితే ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఇక సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్నదానికి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా నోయల్, టీవీ 9 దేవి నాగవల్లి, రఘు మాస్టర్, దేత్తడి హారిక తదితరులు పేర్లు గట్టిగా వినిస్తుండగా.. రీసెంట్‌గా 14 మందితో కూడి లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. 1. టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి (TV9 News Presenter Devi) 2. యాంకర్ లాస్య మంజునాథ్ (anchor lasya manjunath) 3. జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash) 4. గంగవ్వ (YouTube Gangavva) 5. కొరియోగ్రాఫర్ కమ్ డాన్స్ మాస్టర్ అమ్మా రాజశేఖర్ (Amma Rajasekhar) 6. సింగర్ నో

రిజర్వేషన్లు తీసుకోవడం అంటే అడుక్కుతినడమే: పూరీ కామెంట్స్‌పై దళిత సంఘాల ఆగ్రహం

Image
‘పేదలకు ఓటు హక్కు తీసేయాలి.. నిరక్షరాస్యులకు ఓటు పీకేయాలి.. తెల్ల రేషన్ కార్డులు ఉన్నోడు ఓటుకి అనర్హుడు. పేద పిల్లలకు ఉచిత విద్య ఉండకూడదు.. రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఉండకూడదు.. పుట్టాం కదా ఓటు గుద్దేస్తాం అంటే కుదరదు. లీడర్స్ జీవితాలను తాగుబోతుల చేతుల్లా ఎలా పెడ్తాం’.. ఈ మాటలు ఎవరో తాగుబోతు తాగి వాగుతున్నవి కాదు.. సన్సేషనల్ డైరైక్టర్ నోటి నుంచి వచ్చిన మంటపుట్టించే మాటలు. లాక్‌డౌన్ వేళ సినిమా షూటింగ్స్ లేక ఖాళీగా ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోడ్‌కాస్ట్ ఆడియోలతో తన అభిప్రాయలు తెలియజేస్తున్నారు. తాజాగా దేశంలో ఉన్న పేదలు, రిజర్వేషన్లపై సంచలన కామెంట్స్ చేశారు. అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, అబ్దుల్ కలాం, రజినీకాంత్ వీళ్లందరూ పేద కుటుంబంలోనే పెట్టారు. పేదోడిగా పుట్టడం తప్పు కాదు.. పేదోడిగా చావడం తప్పు. ఈ దేశంలో గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్‌లు తీసుకుని చాలామందికి పేదోడిగా బతకడం అలవాటైపోయింది. గవర్నమెంట్ వాళ్లకి సాయం చేయడం కరెక్ట్ కాదు. అందుకే చిన్న చిన్న మార్పులు రావాలి. వైట్ కార్డ్ ఉన్న వాళ్లకు ఓటు హక్కు రద్దు చేయాలి. నీ జీవితమే నీకు బరువుగా ఉన్నప్పుడు ఒక లీడర్ జీ