హరీష్ శంకర్‌తో పవన్ సినిమా.. అప్‌డేట్ ఇచ్చిన నిర్మాతలు

పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలు సోమవారం సాయంత్రం అప్‌డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న సాయంత్రం 4:05 గంటలకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకున్న తరవాత విడుదల తేదీ ప్రకటిస్తారు. Also Read: మరోవైపు, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కీలక పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘విరుపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కీరవాణి సంగీతం సమకూరుస్తు్న్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను విలన్‌గా తీసుకున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తయిన వెంటనే క్రిష్, హరీష్ శంకర్ సినిమాలను పవన్ ప్రారంభించనున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ