ఏపీలో మరో దళితుడికి శిరోముండనం.. నటుడు నూతన్‌నాయుడు చావుదెబ్బలు కొట్టి గుండు కొట్టించాడన్న బాధితుడు

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఘటన మరువక ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో దళిత యువకుడికి శిరోముండనం జరిగింది. ఈ ఘటన జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతానగర్‌ కాలనీలో ఉంటున్న పర్రి శ్రీకాంత్‌ అనే యువకుడు అదే కాలనీలో నివాసముంటున్న సినీ నిర్మాత, నటుడు ఎన్‌. నూతన్‌నాయుడు ఇంట్లో పని చేస్తున్నాడు. గత 4 నెలలుగా ఆయన వద్ద పని చేస్తున్న శ్రీకాంత్‌.. ఆగస్టుల 1వ తేదీన జీతం తీసుకుని పని మానేశాడు. ఈ నేపథ్యంలో తమ ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని, ఆ విషయంపై మాట్లాడాలని శ్రీకాంత్‌ను ఇంటికి రమ్మన్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాంత్‌ అక్కడికి వెళ్లగా.. నూతన్‌నాయుడు కుటుంబ సభ్యులు మొబైల్ నువ్వే తీశావంటూ ఆరోపించారు. మిగతా సిబ్బంది చూస్తుండగానే నూతన్‌ నాయుడు భార్య శ్రీకాంత్‌కు గుండు గీయించారు. అనంతరం సిబ్బంది యువకుడిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ విషయాన్ని బయటికి చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. తనను రాడ్లతో చావుదెబ్బలు కొట్టారని బాధిత యువకుడు వాపోయారు. పని చేసుకోవడానికి వెళ్తే తన బతుకును ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన మీడియా ద్వారా బయటికి రావడంతో పెందుర్తి పోలీసులు బాధితుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ