ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నిర్మాత రిక్వెస్ట్: మాకు అది సెంటిమెంట్.. త్వరలోనే బిగ్ సర్ప్రైజ్!
యంగ్ టైగర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 30వ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ‘అరవింద సమేత’ సినిమాను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లోనే ఈ సినిమాను కూడా చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. పొలిటికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతోన్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఏదైనా ఇవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా నిర్మాతలను కోరుతున్నారు. దీనికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఫ్యాన్స్ కోసం అదిరియే అప్డేట్ సిద్ధమవుతోందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. Also Read: ‘‘మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరికీ చెప్పేదేంటంటే.. ఒక అప్డేట్ ఇవ్వాలంటూ మీరు పంపుతోన్న మెసేజ్లను మేం అందుకున్నాం. మేం షూటింగ్ ప్రారంభించిన తరవాత మాత్రమే ఏ విషయాన్నైనా రివీల్ చేస్తాం. షూటింగ్ ప్రారంభించకుండా ఏ విషయాన్ని రివీల్ చేయకూడదు అనేది మా సెంటిమెంట్. మా మీద నమ్మకం ఉంచండి, చాలా చాలా పెద్ద అప్డేట్ సిద్ధమవుతోంది’’ అని నాగవంశీ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ లాక్డౌన్ సమయాన్ని స్క్రిప్ట్కు మెరుగులు దిద్దడానికి వాడినట్టు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘అరవింద సమేత’ వంటి హిట్ సినిమా రావడం, ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో త్రివిక్రమ్ ఇండస్ట్రీ హిట్ అందుకోవడం, RRR తరవాత ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే, త్రివిక్రమ్ ఈ లాక్డౌన్ సమయంలో స్క్రిప్ట్కు మరింత సానపట్టారని అంటున్నారు.
Comments
Post a Comment