దేశం విలువైన వజ్రాన్ని కోల్పోయింది: ప్రణబ్ మృతికి చిరంజీవి సహా సినీ ప్రముఖుల సంతాపం

మాజీ రాష్ట్రపతి, భారతరత్న సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చేరిన ప్రణబ్.. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 21 రోజులపాటు ప్రాణాలతో పోరాడి చివరికి అస్తమించారు. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసిన విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, ప్రణబ్ ముఖర్జీ మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ , నటి రోజా, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, రవీణాటాండన్, రితేష్ దేశ్‌ముఖ్, సాయి ధరమ్ తేజ్, తాప్సి, మోహన్‌లాల్, సంగీత దర్శకుడు తమన్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితరులు ట్విట్టర్ ద్వారా ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాంప తెలిపారు. Also Read: దేశం ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘‘శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతి నన్నెంతగానో బాధించింది. ఆయనతో మాట్లాడిన మాటలు నాకు ఎల్లప్పుడూ గుర్తుంటాయి. గొప్ప జ్ఞానం కలిగిన నిష్ణాతుడు ఆయన. అద్భుతమైన రాజకీయ జీవితం. మిమ్మల్ని కోల్పోతున్నాం సార్. దేశం ఒక విలువైన వజ్రాన్ని నేడు కోల్పోయింది. ప్రణబ్ దా ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి మాత్రమే కాదు.. ప్రతి ఒక్క సెలబ్రిటీ ప్రణబ్ లేని లోటు తీరనది విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ