Posts

Showing posts from January, 2020

అలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు: బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రచ్చ

Image
నీళ్లల్లో దిగి ఇంటర్వ్యూలు చేసే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ మీడియా ముందు వచ్చి రచ్చ చేశారు తమిళ నటుడు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దర్శన్. తమిళ నటి , దర్శన్ చాలాకాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ దర్శన్ తనను మోసం చేశాడంటూ సనమ్ నిన్న పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు కాదంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో తన గురించి వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ ఇప్పుడు దర్శన్ మీడియా ముందుకు వచ్చారు. ‘‘నాకు సనమ్‌తో నిశ్చితార్థం అయిన విషయం నిజమే. కానీ మా ఇంట్లో వారికి ఈ విషయం గురించి తెలీదు. ఎక్కడ తెలిస్తే నా చెల్లికి ఎక్కడ పెళ్లి జరగదోనని చెప్పలేదు. ఓసారి సనమ్ అండర్‌వాటర్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అది నాకు నచ్చలేదు. అలా ఎందుకు చేశావని అడిగితే నా కోసమే అని చెప్పింది. నేను బిగ్‌బాస్ షో నుంచి బయటికి రాగానే నాపై అధికారం చెలాయించడం మొదలుపెట్టింది. నా తోటి కంటెస్టెంట్స్‌తో మాట్లాడకూడదని షరతులు పెట్టింది. నేను వెళ్లే ప్రతీ ఈవెంట్‌కు తనను కూడా తీసుకెళ్లాలని పట్టుబట్టింది. నేను సంతకం చేసిన సినిమాలకు సంబంధించిన నిర్మాణ సంస్థలకు వెళ్లి నేన

PSPK28: కన్ఫర్మ్.. మరోసారి ‘గబ్బర్ సింగ్’ కాంబో

Image
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి బ్రేకింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ 28వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. మరోసారి పవన్.. హరీష్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ట్విటర్ ద్వారా ప్రకటించింది. గతంలో పవన్, హరీష్ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లా్క్ బస్టర్ విజయం సాధించింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. READ ALSO: పవన్ సినిమాల గురించి అప్డేట్ రాగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ‘అసలైన న్యూస్ అంటే ఇది కదా.. ’ అంటూ తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు. మరోపక్క పవన్.. ‘పింక్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇందులో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను చెప్పాపెట్టకుండా పూర్తి చేసేశారు. పవన్ సెట్స్‌లో నడుస్తున్న ఫొటోలు కూడా లీకయ్యాయి. దాంతో పవన్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న దిల్ రాజు, బోనీ క

Allu Arjun: నా రికార్డ్ మరోకరు బీట్ చేయాలని కోరుకుంటున్నా

Image
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి జీవితంలో మర్చిపోలేని హిట్ ఇచ్చింది ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించారు. నివేదా పేతురాజ్, సుశాంత్, టబు, మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సాధించింది. ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇటీవల సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సినిమా టీం నిన్న థ్యాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను చాలా చక్కగా అభిమానులతో పంచుకున్నారు. ‘ముందుగా సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు మీడియాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ మీట్ ఎందుకు పెట్టామంటే.. మా దగ్గర ప్రొడక్షన్ కంపెనీ కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసేవాళ్లు ఎప్పుడూ నన్ను ఓ మాట అడుగుతూ ఉంటారు. ఏంటండీ ఎప్పుడు సినిమా హిట్ అయినా మీరు మీ టీం మాత్రమే సక్సెస్ మీట్స్ నిర్వహిస్తుంటారు. మా గురించి పట్టించుకోరా, మాకు షీల్డ్ ఇచ్చి సత్కరించరా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు వారికి ఓ మాట చె

‘అశ్వద్థామ’ కలెక్షన్స్.. నాగ శౌర్య గట్టిగా కొట్టాడు

Image
నటుడిగా, నిర్మాతగా, రచయితగా ఇలా అన్ని రంగాల్లో తానేంటో నిరూపించుకున్న యువ కథానాయకుడు నాగ శౌర్య. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంటారు. అలా నిన్న ‘అశ్వద్థామ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ముంబయిలో తన స్నేహితుడి సోదరికి ఎదురైన అనుభవాన్ని కథలా రాసుకున్నానని చెప్పారు. సమాజంలో ఆడవాళ్లపై ఎంతటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. తొలిరోజే సినిమాకు మంచి రెస్పా్న్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ విషయానికొస్తే.. నాగశౌర్య ఈసారి గట్టిగా కొట్టాడనే చెప్పాలి. సినిమాను పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇక అమెరికాలో రూ.35 లక్షలు రాబట్టిందట. ఓవర్‌సీస్‌లో రూ.75 లక్షలు వసూళ్లు రాబట్టినట్లు చిత్ర వర్గాల సమాచారం. మొత్తానికి సినిమా తొలిరోజు ఐదు కోట్లు రాబట్టేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. READ ALSO: పెట్టిన బడ్జెట్‌కు సగం లాభం వచ్చిందంటే.. సినిమా ఏ స్థాయిలో ఆడిందో ఊహించవచ్చు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ సినిమా అని నాగశౌర్య చెబు

జిమ్‌లో పునర్నవి వర్కౌట్స్.. బిగ్ బాస్ పాప చెమటలు పట్టిస్తోందిగా!

Image
‘ఉయ్యాల జంపాలా’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘ఎందుకో ఏమో’ ఇలాంటి చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు ‘బిగ్ బాస్’ షోతో దక్కించుకుంది భూపాలం. గ్లామర్ డాల్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టి 11 వారాలు పాటు కలర్ ఫుల్ లుక్స్‌తో బిగ్ బాస్ హౌస్‌తో పాటు ఆడియన్స్‌కి హాట్‌నెస్ అందించిన ప్రస్తుతం క్రేజీగా మారింది. బిగ్ బాస్ సీజన్‌ 3లో తనకు టైటిల్ రాలేకపోయినప్పటికీ తనతో లవ్ ట్రాక్ నడిపిన రాహుల్‌కి సపోర్ట్ చేసి తన విజయంలో కీలకం అయ్యింది పునర్నవి భూపాలం. ఈ విషయాన్ని బిగ్ బాస్ విన్నర్ రాహుల్ పలు సందర్భాల్లో చెప్పి.. తన విజయంలో పునర్నవికి భాగం ఇచ్చారు. ఇక ఈ ఇద్దరి మధ్య లవ్ రూమర్స్ సంగతి పక్కనపెట్టేస్తే.. బిగ్ బాస్ తరువాత పునర్నవి భూపాలం తనలోని గ్లామరసానికి పదునుపెట్టింది. చూడ్డానికి బబ్లీగా మంచి ఫిజిక్‌తో ఉండే పునర్నవి భూపాలం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసి సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసిన హాట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా జిమ్‌లో పునర్నవి వర్కౌట్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. కాస్త బొద్దుగా ముద్దుగా ఉండే ఈ బిగ్ బాస్ భామ.. స్లిమ్ అయ్యేందుకు వర్కౌట్స్ చేస్తూ చ

నయనతార అసిస్టెంట్లకు అంత జీతాలా: షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిర్మాత

Image
తమిళ చిత్ర పరిశ్రమలో నయనతార‌కు ఎంతో విలువ, పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. రజినీకాంత్, కమల్ హాసన్‌లకున్న హోదా నయనతారకు కూడా ఉంది. అయితే కోసం సెట్స్‌లో పెట్టే ఖర్చులు అంతా ఇంతా కాదు అంటూ ప్రముఖ తమిళ నిర్మాత రాజన్ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. నయనతార ఏదన్నా సెట్‌కు వెళితే ఆమెతో పాటు ఏడుగురు అసిస్టెంట్స్ కూడా ఉండి తీరాల్సిందేనట. వారికి ఒక్కొక్కరికి రోజుకి ఏడు నుంచి ఎనిమిది వేల రూపాలయ వరకు జీతం సమర్పించుకోవాలట. ‘‘నయనతారతో పాటు మరో ఆరు, ఏడుగురు అసిస్టెంట్స్ కూడా ఉంటారు. వారికి రోజుకు ఏడు నుంచి పన్నెండు వేల వరకు జీతాలు ఇవ్వాలి. నాకు తెలిసిన వారు ఈ విషయాలు చెప్పారు. కాబట్టి వారు చెప్పేది నిజమే అయివుంటుంది. ఈ రకంగా చూసుకుంటే నయన్ అసిస్టెంట్స్‌కు రోజుకు 75 నుంచి 80 వేల రూపాయల వరకు ఇవ్వాలి. ఒకవేళ నయన్ 50 రోజుల పాటు సెట్స్‌కు వస్తే పరిస్థితేంటో ఆలోచించండి. నిర్మాత సినిమా కోసం తెచ్చిన డబ్బును నయనతార అసిస్టెంట్స్ పైనే ఖర్చు అయిపోతుంది. దీనికి తోడు నయనతార డ్రైవర్స్‌కి, డీజిల్ ఖర్చులు ఎంత ఉంటాయో ఆలోచించండి’’ READ ALSO: ‘‘ వీటికి తోడు కారవ్యాన్ల కోసం కూడా నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తారు. ఒక్కో కారవ్యాన్‌ను

Pawan Kalyan: పింక్ రీమేక్‌లో పవన్ మాజీ భార్య.. తల్లిగానా?

Image
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా చూస్తున్నారో.. పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఆయన మూవీపై అమితాసక్తి కనపరుస్తున్నారు. జనసేన పార్టీ స్థాపన తరువాత ఫుల్ టైం పొలిటికల్ లీడర్‌గా ఉండబోతున్నానంటూ సినిమాలకు స్వస్తి చెప్పిన పవన్ కళ్యాణ్.. అదే పార్టీని నడిపేందుకు సినిమాలనే ఆర్ధిక వనరుగా మలుచుకుని మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలాంటి హడావుడి లేకుండా ‘పింక్’ రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీపై రకరకాల వార్తలు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పింక్ మూవీలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలకపాత్ర చేయబోతోందట. బద్రి, జానీ సినిమాలతో జోడీ కట్టిన

Whattey Beauty Promo: వామ్మో రష్మిక డ్యాన్స్‌లు ఇరగదీసిందిగా..

Image
‘ఛలో’ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు రష్మిక మందనలో అల్లరి పిల్లను అందమైన పిల్లను మాత్రమే చూశాం. కానీ ఆమెలో అద్భుతమైన డ్యాన్సర్ ఉందన్న విషయం ‘’ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలిసొచ్చింది. నితిన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తు్న్నారు. ఈ సినిమాలోని ‘వాట్టే బ్యూటీ’ అనే పాట ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ‘వాట్టే వాట్టే వాట్టే బ్యూటీ.. నువ్వు యాడా ఉంటే ఆడే ఊటీ’ అంటూ సాగుతున్న ఈ పాట చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ముఖ్యంగా రష్మిక డ్యాన్స్‌లు ఈ పాటకే హైలైట్ అని చెప్పాలి. కింద కూర్చుని రెండు కాళ్లు బొమ్మలా ఊపే స్టెప్‌ను చాలా బాగా వేసింది. అయితే ఇందులో రష్మిక వేసిన స్టెప్పులు హీరోయిన్‌కు చాలా కష్టంగా ఉంటాయి. హీరోలైతే అవలీలగా వేసేస్తారు. అయినా కూడా ఈ పాటకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన జానీ మాస్టర్ పట్టుబట్టి రష్మిక చేత స్టెప్ వేయించారట. ఈ విషయాన్ని రష్మిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ పాటకు తాను, నితిన్ చాలా కష్టపడ్డామని తెలిపారు. పాటలో రష్మిక వేసిన దుస్తులు చాలా అందంగా ఉన్నాయి. ఆమెను ఓ బార్బీ బొమ్మలా చూపించారు. ముఖ్యంగా గ్రీన్ రంగు చీరకట్టులో అదిరిపోయారు.

చచ్చిపోతాను, నా వల్ల కావడంలేదు: మాధవీలత షాకింగ్ పోస్ట్

Image
నటి, బీజేపీ నేత నిన్న సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఉన్నట్టుండి నాకు చనిపోవాలని ఉంది అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అయితే తాను ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తాజాగా వివరించారు. ‘నేనెప్పుడూ నా ఫ్రెండ్స్‌తో చెప్తూ ఉంటాను.. ఏదో ఒక రోజు ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా అని ఫేస్‌బుక్‌లో పేర్కొంది. అందులోలాగే తాను కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటున్నా అని.. చివరికి ఎలాంటి మెడిసిన్స్ పని చేయవేమో.. అని ఎప్పుడూ ఇదే విషయాన్ని తన ఫ్రెండ్స్‌కి కూడా చెబుతూ ఉంటానని పేర్కొంది. తను మైగ్రేన్, జ్వరం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలతో సఫర్ అవుతున్నానని.. దీంతో రోజూ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుందని’ ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. అయితే ఈ పోస్ట్‌‌ని చూడగానే ఫ్యాన్స్, ఫాలోవర్స్ కంగుతిన్నారు. అసలు మాధవీలత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దీనిపై మాధవిలత క్లారిటీ ఇచ్చారు. ‘ఈ రకంగా క్లారిటీ ఇస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. నాకున్న సమస్యల గురి

HIT Teaser: కళ్లార్పలేనంత థ్రిల్.. నాని ఖాతాలో మరో ‘హిట్’

Image
నేచురల్ స్టార్ నిర్మాతగా తొలి సినిమా ‘అ’తోనే మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘హిట్’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మాస్ హీరో విశ్వక్‌సేన్ ఇందులో కథానాయకుడిగా నటించారు. ‘చిలసౌ’తో హీరోయిన్‌గా పరిచయం అయిన రుహానీ శర్మ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ‘హిట్’ సినిమా టీజర్‌ను నాని ఈరోజు రిలీజ్ చేశారు. ఓ మిస్సింగ్ కేసును విచారణ చేసే అధికారి విక్రమ్ పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. ‘ఈ జాబ్ నిన్ను రిస్క్‌లో పెడుతుంది విక్రమ్. నువ్వు ఈ డిపార్ట్‌మెంట్ వదిలి వెళ్లిపోవాలి’ అని ఓ యువతి విశ్వక్‌సేన్‌తో చెబుతుంది. ‘ఈ డిపార్ట్‌మెంట్‌ని మాత్రం వదిలేది లేదు’ అని విశ్వక్ సేన్ అంటారు. ఈ నేపథ్యంలో విశ్వక్‌సేన్‌కు బాగా కావాల్సిన వారిని కళ్లముందే కత్తితో పొడిచి చంపేస్తారు. ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో టీజర్ రసవత్తరంగా సాగింది. విశ్వక్ సేన్, రుహానీ శర్మ లిప్ కిస్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ టీజర్ రిలీజ్ చేస్తూ.. ‘సీట్లను అతుక్కుని సినిమా చూస్తారు’ అని నాని క్యాప్షన్ ఇచ్చారు. READ ALSO: టీజర్‌తోనే అంచనాలను పెంచేశారు ‘హిట్’ టీం. మరి సినిమా ఎలా ఉ

నాగశౌర్య ‘అశ్వథ్థామ’ ట్విట్టర్ రివ్యూ: సస్పెన్స్ రైడ్

Image
‘ఛలో’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమా తరువాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య.. తన లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ‘అశ్వథ్థామ’గా నేడు (జనవరి 31) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమ్మాయిల మీద జరుగుతున్న ఆరాచకా ఎదురొడ్డే కుర్రాడే కథే ‘అశ్వథ్థామ’. ఓ యూనిక్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి కథ అందించింది నాగశౌర్యనే కావడం విశేషం. యువ దర్శకుడు రమణతేజ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్ నటించింది. టైటిల్, ఫస్ట్ లుక్, ట్రైలర్‌లతో ఈ సినిమా అంచనాలను పెంచేసిన ‘అశ్వథ్థామ’ మూవీ ఇప్పటికే యుఎస్‌లో ప్రీమియర్ షోలు పడటంతో ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు నెటిజన్లు. నాగశౌర్య ఫస్ట్ టైమ్ మాస్ అండ్ రగ్డ్ డ్ లుక్‌లో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడని.. ఆయన ఎంటైర్ కెరియల్‌లో గత చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రంలో మరో ఎత్తు అని శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ .. గిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సిని

జనం ఫిక్స్.. చంద్రబాబే మళ్లీ సీఎం: హీరోగారు మళ్లీ వచ్చారండోయ్

Image
గత ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలల్లో గెలిపించి జగన్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. అయితే ఎన్నికల ముందు ఖచ్చితంగా తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చాలామందే భావించారు. రాసిపెట్టుకోండి అని ఒకరంటే.. తొడకొట్టి చెబుతున్నా బాబే సీఎం అంటూ బుద్దా వెంకన్న లాంటి టీడీపీ వీరవిధేయులు తొడలు వాచిపోయేలే కొట్టుకున్నా.. ఓటర్లు మాత్రం జగన్‌కే జై కొట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం బాబే సీఎం అంటున్నారు ఆపరేషన్ గరుడ శివాజీ. గత ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి శక్తిమేర కష్టపడ్డ ఈ హీరో గారు ఈసారి మాత్రం గురి తప్పుదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. Read Also ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరు ఏంటన్నది ప్రజలు నిర్ణయిస్తారు. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం రాష్ట్రాన్ని ఎవరూ ఏం చేయలేరు. చంద్రబాబు తరువాత వాళ్ల కుటుంబం నుండి ఎవరు వస్తారన్నది వాళ్లకు సంబంధించిన విషయం. ప్రజలు కోరుకున్నవాళ్లే లీడర్ అవుతారు. నేతలు ప్రజల్లో నుండే పుడతారు. జగన్ మోహన్ రెడ్డి లేకపోతే ఆ ప్లేస్‌లో ఇంకొకరు వస్తారు. చంద్రబాబు లేకపోతే ఇంకొకరు వస్తారు. అప్పట్లో ఇందిరా గాంధీ చనిపోతే రాజీవ్ గాంధీ రాలేదా?.. ఆయన చనిపోయిన తరువాత స

Visakhapatnam: విశాఖకే నా మద్దతు.. రంగంలోకి దిగిన యాంకర్ రష్మి

Image
అసలే ఒకవైపు అమరావతి ప్రాంత ప్రజలు రాజధాని ఇక్కడే ఉంచాలని నిరసన సెగలు రాజేస్తుంటే.. మరోవైపు వైజాగ్‌లోనే రాజధాని నిర్మించాలంటూ అక్కడి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే రష్మి పెట్టిన పోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినది కాదు.. కేంద్రం నిర్వహిస్తోన్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో విశాఖపట్టణాన్ని నెంబర్ వన్‌గా నిలిపాలని రంగంలోకి దిగింది యాంకర్ రష్మి. తన సొంత ఊరిపై ఉన్న మమకారాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది యాంకర్ రష్మి. ఈ సందర్భంగా ‘ఒకసారి విశాఖవాసి అయితే.. ఎప్పటికీ విశాఖవాసిగానే ఉంటారు.. ఇందులో ఎలాంటి సందేహంలేదు.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వైజాగే తన సొంత ఇళ్లని తెలియజేస్తూ’ ఓ వీడియోను పోస్ట్ చేసింది యాంకర్ రష్మి. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2020‌లో మన వైజాగ్ కూడా ఉంది. వైజాగ్ నివాసిగా ఈ పోటీల్లో విశాఖపట్టణాన్ని నెంబర్ వన్‌గా నిలపడం మన బాధ్యత. విశాఖపట్నానికే నా ఓటు.. మీరు కూడా విశాఖపట్నానికి మద్దతు తెలపాలని’ కోరింది రష్మి. కాగా ఈ పోటీలో దేశవ్యాప్తంగా 4370 సుందర నగరాలు పోటీ పడుతున్నాయి. ఈ నగరాలకు సంబంధించిన ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనవచ్చ

ఆ బూతు డైలాగంటే ఇష్టం, డిలీట్ చేయొద్దు: హీరోయిన్ ఏడుపు

Image
చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నందు. ఇప్పుడు ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా ‘సవారి’. సాహిత్ మోత్కూరి సినిమాను డైరెక్ట్ చేశారు. కథానాయికగా నటించారు. అయితే ఈ సినిమాలో ఓ బూతు పదం వాడుతూ ప్రియాంక చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ డైలాగ్ చెప్పింది. ‘ఓ గాడ్. ఐ డోన్ట్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ఫకింగ్ వరల్డ్’ అనేది డైలాగ్. అయితే ఈ సినిమాకు ఇంకా సెన్సా్ర్ సర్టిఫికేట్ రాలేదు. ఒకవేళ సినిమా సెన్సార్‌కు వెళ్తే డైలాగ్‌లోని ‘ఫక్’ అనే పదం తీసేస్తారేమోనని ప్రియాంక భయపడుతున్నారు. ‘‘ఈ సినిమాలో ఇదే నా ఫేవరేట్ డైలాగ్. దేవుడా దయచేసి ఈ డైలాగ్‌ను సెన్సార్ బోర్డు వాళ్లు తీసేయకుండా చూడు’ అని వేడుకుంటున్నారు. ఈ సినిమా మొత్తం నందు, గుర్రం చుట్టూ తిరుగుతుందట. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. READ ALSO: టీజర్, ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. పాటలు, టీజర్, ట్రైలర్‌తో కలిపి దాదాపు అరగంట నిడివి ఉన్న సినిమా చూపించా

ఎన్టీఆర్ తండ్రిగా బాలయ్య? అభిమానులకు పండగే..!

Image
ఫ్యాన్స్ కలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెరవేర్చబోతున్నారా? ఇప్పటివరకు ఏ దర్శకుడు సాధించలేకపోయింది.. త్రివిక్రమ్ సాధించగలరా? దేని గురించి అనుకుంటున్నారా. యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి. తారక్ మరోసారి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో బాలయ్యను ఎంపికచేసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఏ సినిమాలో నటించలేదు. అలాంటిది త్రివిక్రమ్ సినిమా కోసం బాలయ్య వస్తారన్న ఆశలు కూడా ఫ్యాన్స్‌లో లేవు. దాంతో కనీసం ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం లేకపోయినా బ్యాక్‌డ్రాప్ సన్నివేశాల్లో బాలయ్య కనిపించినా చాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. అంటే ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారెక్టర్‌కు బాలయ్య తండ్రిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇది నిజం అయితే.. ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. READ ALSO: ఎందుకంటే బాలయ్య, ఎన్టీఆర్‌ను స్క్రీన్‌పై చూడాలని అభిమానుల ఆశ. వాళ్లిద్దరూ కలిసి నటించే సీన్స్ లేనప్పుడు బాలయ్య సినిమాలో నటించడం కూడా వృథా అని పలువురి అభిప్రాయం. అయితే ఈ రూమర్స్‌లో ఎంత

NTR: ఆ హీరోలకూ తారక్ లాంటి ఫ్యాన్స్ ఉంటే.. చలపతిరావు కామెంట్స్

Image
అభిమానుల యందు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఉన్న అభిమానులు వేరనే చెప్పాలి. తారక్ కోసం ఎంత దాకానైనా వెళ్తారు. ఎన్ని మంచి కార్యక్రమాలైనా చేపడతారు. తారక్ పేరుతో ఆయన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ‘తారక్ టీం ట్రస్ట్ ఛారిటీ’ అనే సంస్థను ఏర్పాటుచేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని ఇతర రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఫ్యా్న్స్ అంతా ఏకమై అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, పేదలకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేయడం, వారికి అనారోగ్య సమస్యలు ఉంటే చందాలు వసూలు చేసి చికిత్సలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఈ ట్రస్ట్ పెట్టి నేటికి ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో తారక్ ఫ్యాన్స్ 33 ఈవెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు చలపతిరావు తారక్ ఫ్యాన్స్ చేస్తున్న మంచి పనిని ఉద్దేశిస్తూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ, చదువుకుంటూ మా తారక్ గాడి పేరు మీద ఓ టీంగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటివరకు 33 ఈవెంట్స్ చేశారంటే చాలా ఆనందమేసింది. నా కళ్లు చెమర్చాయి. వృద్ధులు, నడవలేని వారికి భోజనాలు పెట్టడం, దుప్పట్లు పంచడం, అసవరమైన వస్తువులు కల్పించడం.. ఇవన్నీ చూస్తుంటే మా తారక్ గాడి జన్మ ధన్యమైంది. ఆర్టిస్ట్ అవ్వడం

అశ్లీల వీడియోలు పంపుతున్నారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి

Image
అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు, అశ్లీల వీడియోలతో పంపుతూ తనను చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు సినీ నటి . దాంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఉదయాన్నే ఫోన్‌ చూడాలంటేనే భయం వేస్తోందని తెలిపారు. కొద్దిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పనులు చేస్తున్నారని, కొన్ని నంబర్లను బ్లాక్‌ చేసినా వేరే ఫోన్‌ నంబర్ల ద్వారా వీడియోలు పంపుతున్నారని ఆమె వివరించారు. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ప్రవరిస్తున్నారని, కొన్నింటిలో తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారంటూ తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను అభ్యర్థించారు. క్రైస్తవ సంఘాల ప్రతినిధుల పేరుతో కొద్దిరోజుల నుంచి పలువురు హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో కథనాలు, వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారని కరాటే కళ్యాణి పోలీసులకు వివరించారు. READ ALSO: ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులతో కలిసి కొన్ని రోజుల క్రితం కరాటే కళ్యాణి ఓ డిబేట్‌లో పాల్గొన్నారు. హిందువులు పవిత్రంగా భావించే కొన్ని పేర్లను వాడుకుని బూతు చేష్టలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాల

సమంతకు స్టూడెంట్ లవ్ లెటర్, ‘మీ అమ్మ తిడుతుంది’ అంటూ సామ్..

Image
అక్కినేని కోడలు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అన్న విషయం తెలిసిందే. తన సినిమా అప్డేట్స్‌తో పాటు పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. పలు సందర్భాల్లో అభిమానులు అడిగే వివిధ ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలు ఇస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. అభిమానులతో తరచూ ఇంట్రాక్ట్ అయ్యే అక్కినేని కోడలికి లవ్ ప్రపోజ్‌లు చాలానే వస్తుంటాయి. అయితే వాటిని లైట్ తీసుకున్న సమంతకు తాజాగా ఓ స్టూడెంట్‌ నుండి లవ్ ప్రపోజ్ వచ్చింది. అలాంటి ఇలాంటి లవ్ ప్రపోజ్ కాదు.. అదిరిపోయే లవ్ ప్రపోజ్.. కావడంతో సమంత రియాక్ట్ అయ్యింది. తాజాగా సమంత తమిళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘96’ రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సమంతకు జోడీగా శర్వానంద్ నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘జాను’ విపరీతంగా నచ్చేయడంతో ఓ అభిమాని ‘సామ్ ఐ లవ్ యు.. జాను ఐ లవ్ యు’ అంటూ.. ఏకంగా మూడు గంటల పాటు పుస్తకంలో ప్రేమలేఖ రాసేశాడు. దాన్ని వీడియో తీసి సమంతకు చేరేలా ట్యాగ్ చేసి ట్విట్టర్‌లో వదిలిపెట్టాడు. ఆ ప్రేమలేఖ సోషల్ మీడియా పుణ్యాన సమంతక

Chiranjeevi: అమ్మపుట్టినరోజు.. ‘అంజనీ’పుత్రుడు సెల్ఫీ

Image
తల్లి అంజనీదేవి అంటే ఈ అంజనీ పుత్రుడు చిరంజీవికి అమితమైన ప్రేమ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మకుటం లేని మహరాజుని అందించిన ఈ అంజనీదేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన తల్లితో కలిసి బర్త్ డే వేడుకలను నిర్వహించుకున్నారు మెగాస్టార్ . తన తల్లితో కేక్ కట్ చేయించి.. సెల్ఫీ దిగి కుటుంబంతో కలిసి ఆనందగా గడిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఫొటోలను మెగాడాటర్ నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా మెగా అభిమానులకు షేర్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫొటోలలో చిరంజీవి, ఆయన భార్య సురేఖ, పెద్ద కూతురు సుస్మితతో పాటు మెగా సిస్టర్స్ కూడా కనిపించారు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Jaanu: 96 రీమేక్ అంటే భయపడి దిల్ రాజుకి నో చెప్పేశా.. కాని!!: సమంత

Image
శర్వానంద్, హీరో హీరోయిన్లుగా నటించిన ‘జాను’ మూవీ ట్రైలర్‌ను బుధవారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్. తమిళ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన విజయ్ సేతుపతి, త్రిష కాంబో మూవీ ‘96’ను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను లాంఛ్ ఈవెంట్‌ను బుధవారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్‌లో , సమంత, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘దిల్ రాజుగారు 96 సినిమాను రీమేక్ చేస్తున్నారని తెలియక ముందే తమిళ్‌లో చూశాను. అయితే దిల్ రాజు గారు మా మేనేజర్‌ని కలిసినప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. బ్లాక్ బస్టర్ క్లాసిక్‌ని రీమేక్ చేయాలి అంటే.. తమిళ్‌లో త్రిష, విజయ్ సేతుపతిలు అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు.. వాళ్లను దృష్టిలో పెట్టుకుని నేను ఈ సినిమా చేయడానికి చాలా భయపడ్డా. కాని నాకు తెలుసు.. నేను దిల్ రాజు గారిని కలిస్తే ఓకే చెప్పేస్తాను అని.. అందుకే చాలా రోజుల వరకూ ఆయన్ని కలవకుండా నో.. నో అంటూ వచ్చా. దిల్ రాజుతో మాట్లాడితే కాన్ఫిడెంట్ వచ్చేస్తోంది. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో అడుగుపెట్టిందే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆఫీస్‌లో. నా ప్రయాణం అక్కడ నుండే ప్రారంభమ

96 Remeke ‘జాను’ ట్రైలర్ టాక్: రేయ్.. అసలేం జరుగుతోందిరా అక్కడా?

Image
‘‘ఎగిసిపడే కిరటాల్లో ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓర చూపు కోసం.. నీ దోర నవ్వు కోసం.. రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు నీ చూపు అప్పు ఈయలేవా” అంటూ ఎమోషనల్ టచ్‌తో శర్వానంద్, సమంతల ‘జాను’ ట్రైలర్ విడుదలైంది. విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘96’ను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సి. ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. మంచి ఎమోషనల్ ఫీల్తో ఒరిజినల్ ఫ్లేవర్‌కు ఏమాత్రం తగ్గకుండా శర్వానంద్, సమంతలు జీవించేస్తున్నారు. టీనేజ్ లవ్ స్టోరీతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ‘నువ్ వర్జినేనా అని సమంత అడగడం.. ఛీ ఛీ ఏం మాట్లాడుతున్నావ్ జాను’ శర్వానంద్ తెగ సిగ్గుపడిపోవడం యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. “ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా.. ఏదో జరగపోతుందని మనసుకి మాత్రం ముందే తెలుస్తుంది” అంటూ సమంత చెప్పే డైలాగ్.. ‘పదినెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్ సొంతం అయితే.. ఇన్

World Famous Lover: ‘బొగ్గుగనిలో’.. విజయ్, కేథరిన్ ప్రేమపాట

Image
‘’ టీజర్, పోస్టర్స్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయ్‌కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ ఈ చిత్రం నుండి బుధవారం నాడు ‘బొగ్గుగనిలో’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. నిరాంజ్ సురేష్ ఈ పాటను ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. తెల్లతోలురా.. అందగత్తెరా ఏసెయ్ కత్తెరా’ అంటూ బొగ్గుశీను మేడమ్ స్మితను ప్రేమ ముగ్గులోకి దించుతున్నట్టుగా సాంగ్‌లో చూపించారు. నలుగురు లవర్స్ లుక్స్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేసి సినిమాపై హైప్ తీసుకురాగా.. ఈ చిత్రంలో విజయ్‌కి మూడో లవర్‌గా హీరోయిన్ కేథరిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్మిత పాత్రలో బొగ్గుగని శీను(విజయ్)‌కి మేడమ్‌గా నటిస్తోంది కేథరిన్. బొగ్గుగని యూనియన్ లీడర్ శీను పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తోంది. ఈ ఇద్దరి మధ్య ‘బొగ్గుగనిలో రంగుమణిరా’ అంటూ బ్యూటిఫుల్ రొమాంటిక్ బీట్ అందించారు గోపీ సుందర్. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై సీనియర్‌ నిర్మాత కేయస్ రామారావు

Chiranjeevi: ఇప్పుడున్న పరిస్థితిలో చిరు అన్నయ్య టైటిల్ వాడుకుంటున్నా: శ్రీకాంత్

Image
1991లో కెరీర్‌ను ప్రారంభించి ఇప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సినీ నటుడు శ్రీకాంత్. ఇండస్ట్రీలో ఎందరో హీరోలు కాస్త బ్రేక్ తీసుకుని సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు కానీ మాత్రం బ్రేక్ తీసుకోకుండా ఏడాదికో సినిమా చేస్తూ వస్తున్నారు. 2019లో ‘మార్షల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకాంత్ ఇప్పుడు మరో థ్రిల్లింగ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మరణ మృదంగం’ అనే టైటిల్‌నే పెట్టారు. సినిమా త్వరలో విడుదల కాబోతోందని తాజాగా శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. READ ALSO: ‘‘మల్టీ కలర్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై ‘మరణ మృదంగం’ అనే సినిమా చేశాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అన్నయ్య చిరు టైటిల్‌నే వాడుకున్నాను. అన్నయ్య నటించిన ఈ సినిమాను చాలా సార్లు చూశాను. నాకు చాలా ఇష్టమైన టైటిల్. అదీకాక సినిమా కాన్సెప్ట్‌కు ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని దర్శకుడు, నిర్మాత అనుకున్నారు. వెంకటేష్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తీశాడు. అతను చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. నేను కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కథ చేస్తే బాగుంటుందని అని ఆలోచించి ఒకటికి రెండుసార్లు కథ విని

ఆయనతో ఉంటే నేను సేఫ్‌గా ఉంటాను: రేణు దేశాయ్

Image
చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు సినీ నటి రేణూ దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుణెలో స్థిరపడిపోయారు. ఆ తర్వాత పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జ్‌గా వ్యవహరించారు. ఇటీవల రేణు మెగా ఫోన్ పట్టారు. రైతుల నేపథ్యంలో ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి ‘చూసి చూడంగానే’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న ఘనంగా నిర్వహించారు. వేడుకకు రేణు అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ సినిమాలోని ఓ పాటను నా చేత విడుదల చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంతో ఇష్టమైన అనంత్ శ్రీరామ్, చిన్మయి ఈ పాటకు కలిసి పనిచేశారు. రాజ్ కందుకూరి సినిమాను నిర్మించారు. ఇంకా మాట్లాడొచ్చా. బహుశా సుమ గారి అనుమతి తీసుకుని మాట్లాడాలేమో. మున్ముందు అన్ని చిత్ర పరిశ్రమల్లో మహిళా దర్శకులు, టెక్నీషియన్లు రావాలి. వారికి సినిమా పరిశ్రమలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఏ ఫీమేల్ టెక్నీషియన్ అయినా రా

ముళ్లు గుచ్చుకున్నాయంతే.. కంగారేమీలేదు: రజినీకాంత్

Image
సూపర్‌స్టార్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ అనే అడ్వెంచరస్ షూట్‌లో పాల్గొన్నారు. కర్ణాటకలోని బందిపూర్ అడవిలో ప్రముఖ బ్రిటిష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. అయితే షో షూట్ చేస్తుండగా రజినీకాంత్‌కు గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దీనిపై తాజాగా రజినీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్‌ షూటింగ్‌ను పూర్తి చేశాను. నాకు గాయాలేమీ అవ్వలేదు. అడవి కాబట్టి ముళ్లు గుచ్చుకుని గీతలు పడ్డాయంతే. నేను బాగానే ఉన్నాను’ అని చెన్నై విమానాశ్రయం వద్ద మీడియా వర్గాలతో రజినీ మాట్లాడారు. త్వరలో ఈ షో డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. గతేడాది ఈ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్‌ను డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం చేయగానే 6.1 మిలియన్ మంది వీక్షించారు. ఆ ఛానెల్‌లో ప్రసారం అయిన ఏ ఎపిసోడ్‌ను అంతమంది వీక్షించలేదట. అయితే రజినీకాంత్ షూట్ చేసిన ఎపిసోడ్‌లో హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రజినీ తన 168వ సినిమాతో బిజీగా ఉన్నారు. సిరుతాయ్ శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఖుష్బు, మీన కథానాయిక

Balakrishna: బాలయ్యకు విలన్‌గా సునీలా? ఏంది బోయపాటి ఇది?

Image
‘రూలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నట సింహ నందమూరి ఇప్పుడు తన తదుపరి సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ మొదలైపోయింది కూడా. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన టాపిక్ సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. బాలయ్య సినిమాలో విలన్ పాత్ర చాలా కీలకం. బాలయ్యకు సమానంగా ఆ పాత్రను తీర్చిదిద్దుతారు దర్శకులు. అయితే బోయపాటి మాత్రం ఈసారి తప్పులో కాలేస్తున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ కమెడియన్ సునీల్‌ను ఎంపికచేసుకున్నారట. ఇటీవల విడులదైన ‘డిస్కో రాజా’ సినిమాలో సునీల్ ఓరకంగా విలన్ పాత్రనే పోషించారని చెప్పాలి. ఆయనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకుడు వీఐ ఆనంద్. అందుకే విలన్‌గా ఈసారి సునీల్‌ను ఎంపిక చేసుకుంటే ఎలా ఉంటుంది అని బోయపాటి అనుకుంటున్నారట. అదీకాక మొన్న జరిగిన ‘డిస్కోరాజా’ సక్సెస్ మీట్‌లో సునీల్ ఓ మాటన్నారు. ఇకనుంచి తాను కండలుపెంచిన తెలుగు విలన్‌గా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కానీ బాలయ్యకు సునీల్ విలన్‌గా సరిపోతారా అనేది

Sivaji: జగన్ గారికి ఆ ఆలోచనలు ఎలా వస్తున్నాయో అర్థంకావట్లేదు

Image
మరోసారి నటుడు ఆపరేషన్ గరుడ అంటూ మీడియా ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ఆపరేషన్ గరుడ గురించి తాను చెప్పినవన్నీ చెప్పినట్లే జరుగుతున్నాయని, మున్ముందు కూడా అలాగే జరుగుతుందని తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక జగన్ గారికి రాజధానిని మార్చాలన్న ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యలు చేసారు. ‘నాకు గరుడ పురాణం శివాజీ అనే పేరు ఎందుకు వచ్చిందో నాకే తెలీదు. ఆ పేరు పెట్టిన వారిని అడగాలి. ప్రతీ వ్యక్తికి భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. మనకు రాజకీయాలపై మంచి పట్టు ఉంటే మనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. నేను మీడియా ముందుకు వచ్చి సినిమా కథను పంచుకుని ఉంటే అది వేరే విషయం. నాకు వచ్చిన సమాచారాన్నే చెప్పాను. కొమ్మినేని శ్రీనివాస్ నాకు గరుడ పురాణ శివాజీ అని పేరు పెట్టానని నేను అనుకుంటున్నాను. అతనికి ఫోబియా ఉందేమో. ఎవరి అభిప్రాయాలతో ఆయన అంత సులువుగా ఏకీభవించకపోవచ్చు. నేను చెప్పిన గరుడ కథ అంతా చెప్పినట్లుగానే జరుగుతూ ఉంది. ఇప్పుడు సగం జరిగాయి. మిగితా సగం జరిగి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడుగారి పతనం అనేదే లక్ష్యం.’ READ ALSO: ‘చంద్రబాబు నాయుడిని ఈరోజు ఆంధ్

Esha Rebba: మంత్రిగారి బైక్‌పై ఈషా రెబ్బా రై రై.. వైరల్ అవుతున్న ఫొటోలు

Image
తెలంగాణ రవాణా శాఖా మంత్రి , తెలుగు బ్యూటీ బైక్ రైడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు భద్రత వారోత్సవాలు సోమవారం 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం హెచ్ఎమ్‌డీఏ మైదానంలో వారోత్సవాలను ప్రారంభించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు భద్రతా నిబంధనలను పాటించాలని వారిలో అవగాహన కల్పించడంలో భాగంగా స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ హెల్మెట్ పెట్టుకుని బైక్ డ్రైవింగ్ చేశారు.. వెనుక సీట్లో హీరోయిన్ ఈషా రెబ్బా కూర్చోవడం విశేషం. రోడ్డు భద్రత అవగాహన ర్యాలీలో అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘సమాజంలో వాహనాలు, జనాభా సంఖ్య పెరగడంతో విపరీతంగా రోడ్డు యాక్సిడెంట్‌‌లు పెరిగిపోతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహన నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెంట్‌ను ధరించాలి. కారు తదితర భారీ వాహనాలు నడిపేటప్పుడు సీట్‌ బెల్టులు పెట్టుకొని ప్రయాణం చేయాలి.. మద్యం సేవించి వాహనాలు నడిపితే నడిపేవారితో పాటు ఎదుటివారికి సైతం ప్రమా

Man vs Wild: రజినీకాంత్‌కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

Image
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన అడ్వెంచరస్ షో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన అదుపుతప్పి కిందపడటంతో చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో ఈ ప్రోగ్రామ్ షూట్ జరుగుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో షూటింగ్‌ను నిలిపివేశారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి రజినీ ఈ ప్రాజెక్ట్ చేస్తుండగా.. రజినీకాంత్ సోమవారమే కర్ణాటక బందిపూర్‌కి చేరుకుని షూట్‌లో పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే కర్ణాటక అటవీ శాఖ అధికారులనుండి షూటింగ్‌కి పర్మిషన్ ఉండగా.. రజినీకాంత్ ఈలోపే గాయాలపాలయ్యారు. అయితే రజినీకాంత్ చేతికి మాత్రమే గాయమైందని.. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

Actor John Kottoly: టాలీవుడ్ నటుడు జాన్ కొట్టోలీ ఆకస్మిక మరణం

Image
టాలీవుడ్ ఊహించని విషాదం చోటు చేసుకుంది. నటుడు ఆకస్మికంగా కన్నుమూశారు. మను, ఫలక్‌నుమా దాస్ తదితర చిత్రాల్లో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించిన జాన్ కొట్టాలీ తీవ్ర గుండెనొప్పితో మంగళవారం నాడు మరణించారు. ఈ దిగ్బ్రాంతికర విషయాన్ని ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘మిస్టర్ అమాయకుడు’, ‘కళాకారుడు’ వంటి లఘు చిత్రాల్లో మంచి నటుడిగా పేరు సంపాదించి సినిమాల్లో తన సత్తా చాటారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులతో జాన్ కొట్టాలీకి మంచి అనుబంధం ఉంది. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దర్శకుడు సాయి రాజేశ్‌తో పాటు నటుడు సత్యదేవ్, నటి గాయత్రి గుప్తా తదితరులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

నయనతారకు పేరు పెట్టింది నేను: లేడీ సూపర్‌స్టార్ కోసం కొట్టుకుంటున్న దర్శకులు

Image
లేడీ సూపర్‌స్టార్ అసలు పేరు డయానా మరియం కురియన్ అని దాదాపుగా అందరికీ తెలిసిందే. 2003లో ఆమె ‘మనస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకుడు. సినిమా టైటిల్స్ వేసేటప్పుడు నయన్ పేరును డయానా కాకుండా నయనతార అని వేశారట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమె పేరు నయనతార అని ఫిక్స్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ తానేంటో అన్ని భాషల్లో నిరూపించుకుంది. అయితే ఇప్పుడు నయనతారకు ఈ పేరు ఎవరు పెట్టారు అని ఇద్దరు దర్శకులు కొట్టుకుంటున్నారు. ఆ పేరు నేను పెట్టానంటే నేను పెట్టానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటున్నారు. నయనతారకు ఆపేరు పెట్టింది నేనే అంటూ ఇటీవల డిట్టో జాన్ అనే దర్శకుడు అన్నారట. దాంతో సత్యన్‌కు మండింది. సోషల్ మీడియా ద్వారా తన బాధను వెళగక్కారు. ‘నేను, నా స్నేహితుడైన డైరెక్టర్ రంజన్ ప్రమోద్ నయనతారకు ఆ పేరు పెట్టాం. నాకు జాన్ డిట్టో ఎవరో కూడా తెలీదు. అసలు ఈ విషయంపై ఇంత చర్చ జరపాల్సి వస్తుంది నేను అనుకోలేదు. ‘మనస్సినక్కరే’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ రోజు ఉదయం నేను, దర్శకుడు రంజన్ కలిసి నయనతారకు ఏం పేరు పెడితే బాగుంటుంది

పునర్నవి హాట్ పోజు.. అక్కా!! బ్యాక్ పెయినా అంటూ ట్రోల్స్

Image
సోషల్ మీడియాలో కాకరేపుతోంది బిగ్ బాస్ బ్యూటీ భూపాలం. బిగ్ బాస్ సీజన్ 3లో గ్లామర్ డాల్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన తన సెక్సీ అందాలతో హౌస్‌కు గ్లామర్ హంగులు అద్దింది. డిఫరెంట్ క్యాస్ట్యూమ్స్‌తో బిగ్ హౌస్‌లో జిగేల్ అనిపించిన పునర్నవి భూపాలం బిగ్ బాస్ తరువాత సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంది. తన ఇన్ స్టాగ్రామ్‌తో హాట్ హాట్ అందాలను బహిర్గత పరుస్తూ రోజుకో ఫొటోను షేర్ చేసి సెగలు పుట్టిస్తోంది. వైట్ ట్రాన్స్‌పరెంట్ బ్లౌజ్‌లో ఎద అందాలను ఎరగా పరిచి అప్పట్లో హాట్ ఫొటోను షేర్ చేసింది. రీసెంట్‌గా కెల్విన్ క్లెయిన్ ఇన్నర్‌తో యోగా చేస్తూ హాట్ బాంబ్ పేల్చింది. ఈ ఫొటోతో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ లిమిటెడ్‌గా అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది పునర్నవి. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మరో రెండు ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది పునర్నవి. బ్లాక్ టాప్ జీన్స్ కాంబినేషన్‌లో ఉన్న డ్రెస్‌లో మత్తెక్కించే కళ్లతో కిక్ ఎక్కించేలా ఫొటోలకు పోజులు కొట్టింది. అయితే ఆమె నడుముపై చేయిపెట్టుకుని నడుము నొప్పి బాధితురాలిగా ఫొటోలకు పోజు ఇవ్వడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పున్నూ అక్కకి బ్యాక్ పెయిన్ అనుక

Prabhas: బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, రాజమౌళి ఢీ?

Image
ఇద్దరూ కలిసి తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరే బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతున్నారట. వారెవరో కాదు.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాధాక్రిష్ణ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. మరోపక్క జక్కన్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఎంత త్వరగా పూర్తి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. అందుకే ముందుగా అనుకున్న జులై 30న కాకుండా సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలని రాజమౌళి అనుకుంటున్నారట. మరోపక్క ‘జాన్’ సినిమాను కూడా అక్టోబర్‌లో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రవర్గాలు అనుకుంటున్నాయట. అలా ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే నెలలో బాక్సాఫీస్ వద్ద ఢీకొనే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం. పైగ

నాడు మోదీ నేడు రజినీ.. షరతులు వర్తిస్తాయ్ అంటున్న అధికారులు

Image
సూపర్‌స్టార్ అభిమానులకు శుభవార్త. త్వరలో ఆయన్ను అంతర్జాతీయ టీవీ ఛానెల్‌లో చూసే అవకాశం రాబోతోంది. అదెలా అంటారా.. త్వరలో రజినీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన అడ్వెంచరస్ షో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లో కనిపించబోతున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి రజినీ ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో ఈ ప్రోగ్రామ్ షూట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం రజినీకాంత్ సోమవారమే బందిపూర్‌కి చేరుకున్నట్లు టైగర్ రిజర్వ్ డైరెక్టర్ బాలచంద్ర తెలిపారు. మంగళవారం రాత్రిలోగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోతారట. కేవలం అడవిలోకి కెమెరాలు మాత్రమే అనుమతించామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం 2019లోనే కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో బానిజే గ్రూప్, సెవెన్ టారస్ ఎంటర్‌టైన్మెంట్ స్టూడియో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ షో నేపథ్యంలో కర్ణాటక అటవీ శాఖ అధికారులు చాలా రూల్స్ పెట్టారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే ఎలాంటి కార్యక్రమాలైనా షూట్ చేసుకోవచ్చు. READ ALSO: ఈ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు జంతువులకు కానీ చెట్లకు కానీ ఎలాంటి హాని తలపెట్టకూడదు. విద్యుత్తు,

వైరల్: మంచు మనోజ్‌కి రెండో పెళ్లా..? వామ్మో!

Image
మంచు వారి చిన్నబ్బాయి సోలో లైఫ్ సో బెటర్ అని పెళ్లికి బ్రేకప్ చెప్పేసి సింగిల్‌గా కంటిన్యూ అవుతున్నారు. ఇటీవల తన భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు మంచు మనోజ్. ఇక సినిమా పరంగాను మంచు మనోజ్ లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం తరువాత సినిమాలకు దూరమైన మనోజ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు. స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు.. సినిమా రిలీజ్ అప్పుడు ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు షేర్ చేసే మంచు మనోజ్ ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘ఫైర్ బాల్‌గా వెలగడానికి అంతా సెట్ అయ్యిందని.. ఈ వీక్‌లో తన నుండి ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ ఉండబోతుంది.. వేచి చూడండి’ అంటూ పోస్ట్ పెట్టారు. అయితే మంచు మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం ఏంటంటే.. మనోజ్ ట్వీట్‌కి నెటిజన్ల నుండి ఆసక్తికరమైన ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటి అన్నా..? మళ్లీ రెండో పెళ్లి చేసుకోబోతున్నావా? కొత్త వదిన వస్తుందా? మళ్లీ పెళ్లా? కొత్త వదిన కోసం వెయిటింగ్ అన్నా? మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ఆయన పెళ్లిపై ఫన్సీగా స్పందిస్తున్నారు. అయితే నెటిజన్ల కామెంట్స

Hyper Aadi: అనసూయా.. మన ప్రేమకు వారధి సారధి స్టుడియో: హైపర్ ఆది ఆగట్లేదే

Image
బుల్లితెరపై సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో.. ప్రతి స్కిట్‌లోనూ ఈ ఇద్దరి మధ్య ఏదో ఒక లవ్ ట్రాక్ పెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుధీర్-రష్మిల జోడీగా బయట కూడా మంచి క్రేజ్ ఉండటంతో ఇద్దరి మధ్య రొమాన్స్ బాగా పండుతోంది. అయితే వాళ్లేనే మేం రొమాన్స్ పండించలేమా?? అంటూ తెగ తాపత్రాయపడుతున్నారు మరో జబర్దస్త్ జంట , హైపర్ ఆదిలు. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య ‘జబర్దస్త్’ స్కిట్‌లలో రొమాంటిక్ లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆది.. అనసూయ వెంటపడటం, అనసూయ తెగ సిగ్గుపడిపోతూ ఆదిని ఓ రేంజ్‌లో ఎంకరేజ్ చేస్తూ ఉండటం షరా మామూలుగానే కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్‌‌ జబర్దస్త్‌లోనే కాదు.. అనసూయ హోస్ట్ చేస్తున్న ప్రతిరోజు పండగే షోకి కూడా షిప్ట్ చేశారు. సెలబ్రిటీస్‌కి కామన్ ఉమెన్స్‌కి పోటీ అంటూ అనసూయ యాంకరింగ్ చేస్తున్న ‘’ షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. ఇందులోనూ గులాబీ పువ్వు పట్టుకుని మరీ అనసూయ వెంటపడుతున్నాడు . ‘హాయ్.. ఆది!! నువ్ ఏంటి ఇక్కడ అని అనసూయ తెగ సిగ్గుపడిపోతూ అడగ్గా.. ‘నువ్విక్కడుండీ.. నేను అక్కడ ఉంటే ప్రాణం విలవిలా’ అంటూ పువ్వ

‘v’లన్‌గా ‘నాని’ ఫస్ట్ లుక్.. కత్తెరతో గత్తర్లేపిన రాక్షసుడు

Image
ఇన్నాళ్లు చాలా సాఫ్ట్‌గా పక్కింటి కుర్రాడిలా తన నేచురల్ నటనతో ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ‘వి’లన్‌ మారారు. రాక్షసుడి గెటప్‌లో హడలెత్తిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వి' చిత్రంతో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి నాని ఫస్ట్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. గుబురు గెడ్డంతో మీసాలు మెలేసి చేతిలో రక్తంతో అంటిన కత్తెరతో ‘రాక్షసుడు’ అవతారంలో కనిపిస్తున్నారు నాని. హీరోగా నానికి ఇది 25 మూవీ కావడంతో V ఫస్ట్ లుక్‌తో ‘వి’లన్‌గా కత్తెరపట్టి గత్తర్లేపాడు నాని. ఇందులో సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ‘రక్షకుడు’ లుక్ సోమవారం నాడు విడుదల చేయగా.. నేడు రాక్షసుడి లుక్‌ని విడుదల చేశారు. ఈ రెండు పోస్టర్స్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు దర్శకుడు ఇంద్రగంటి. ఈ సినిమాలో నాని, సుధీర్ బాబులకు జోడీగా అదితిరావు హైదరి, నివేదా థామస్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియ

Rajinikanth: ‘‘నాకు మద్యం అలవాటు చేసింది రజినీకాంతే.. తాగకపోతే ఇండస్ట్రీలో ఉండవన్నారు’’

Image
ఒకప్పుడు విలన్ పాత్రల్లో నటించి చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు . ‘యజ్ఞం’ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో తనకున్న స్నేహితుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను రంగరాజు వెల్లడించారు. ‘‘నాకు మద్యం అలవాటు లేదు. ఓసారి నేను, రజినీకాంత్ కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తుంటే.. ఆయన మద్యం బాటిల్ తీశారు. నేను తాగకుండా చూస్తూ కూర్చున్నాను. ఆయన చూసి ఎంటి నువ్వు తాగట్లేదు అన్నారు. నాకు అలవాటు లేదు సర్ అన్నాను. ఆయనకు మండింది. పోనీ పాలు తెచ్చి ఇవ్వనా అంటూ వెటకారంగా అడిగారు. తాగుతావా లేదా అని బలవంతంగా పెగ్ పోశారు. నేను ఒక గ్లాస్ తాగి ఆపేశాను. అదేంటి ఒక్కటే తాగావ్ అని మరో పెగ్ పోశారు. తాగకపోతే తమిళ ఇండస్ట్రీలో నీకు స్థానం ఉండదు అని సరదాగా ఆటపట్టించారు. మనకు కూడు పెట్టేది సినిమానే కదా ఎందుకొచ్చిన గొడవలే అనుకుని తాగడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత భోజనం చేశాను. తీరా ఉదయం లేచి చూస్తే ఇంట్లో ఉన్నాను. మెలకువ రాగానే మా అమ్మ వచ్చి నన్ను చెప్పుతో కొట్టింది" READ ALSO: " ఒక్కగానొక్క కొడుకునని బాగా గారాబంగా పెంచారు. సినిమాల్లోకి వెళ్లి రజినీ

MAA: నేను హాస్పిటల్‌లో ఉంటే ‘మా’ పట్టించుకోలేదు: నటి రాధ ప్రశాంతి సంచలన వ్యాఖ్యలు

Image
ప్రముఖ సినీ నటి రాధ ప్రశాంతి ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్నవారు. సమాజం ఏమనుకుంటుంది, ఇతర నటీనటులు ఏమనుకుంటారు అన్న విషయాలతో సంబంధం లేకుండా తప్పు ఎవరు చేసినా ముఖం మీదే చెప్పేస్తారు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆవిడను ఇప్పుడు పట్టించుకునే నాథుడు కూడా లేడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యురాలు అయినప్పటికీ వారు కూడా ముఖం చాటేశారట. ఈ సంచలన విషయాలన్నీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘మా’కు పదవులే ముఖ్యం ‘‘నేను ‘మా’ అసోసియేషన్ సభ్యురాలినే. మొన్న అనారోగ్యానికి గురైతే మా నుంచి ఒక్కరు కూడా వచ్చి నన్ను పరామర్శించలేదు. ఎందరో ఛానెల్స్ వాళ్లు ఫోన్లు చేసి అడిగారు కానీ మా మాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు అధ్యక్షుడు నరేష్‌ని సినీ అవకాశాలు ఇప్పించాలని అడిగితే ఆయన కూడా చూద్దాంలే అని ఊరుకున్నారు. ‘మా’లో ఉన్నవారికి పదవులపై ఆశలు తప్ప ఆర్టిస్ట్‌లకు సాయం చేయాలన్న ఆలోచన లేదు. నరేష్ ఒక్కరే కాదు మురళీ మోహన్, శివాజీ రాజాలను కూడా సినిమా అవకాశాలు ఇప్పించాలని అడిగాను. గెలిచాక చూద్దాం అన్నారు. అవకాశాలు లేక నా వద్ద మెడికల్ క్లెయిమ్‌కి కూడా డబ్బులు లేవు. దాంతో ఈ ఒక్క ఏడాది కట్టలేను అ

'లోకల్ బాయ్' ధనుష్ రెడీ.. అక్కడ హిట్, ఇక్కడ ఎప్పుడంటే!

Image
వరుస చిత్రాలతో దూకుడు చూపిస్తున్న తమిళ స్టార్ హీరో ధనుష్ విడుదలకు రెడీ అయ్యింది. తమిళ ‘పటాస్’ చిత్రాన్ని తెలుగులో లోకల్ బాయ్ పేరుతో విడుదల చేస్తున్నారు. 'రఘువరన్ బీటెక్'లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ధనుష్. 'మారి'లో లోకల్ డాన్‌గానూ మెప్పించారు. 'ధర్మయోగి'లో రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించి విజయం అందుకున్నారు. సినిమాలో పాత్రకు తగ్గట్టు తనను తాను మలచుకోవడంలో ముందుంటారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో చక్కటి సినిమాతో 'లోకల్ బాయ్'గా వస్తున్నారు. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా 'పటాస్'‌ (లోకల్ బాయ్) చిత్రానికి ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్‌గా నటించింది. స్నేహ మరో హీరోయిన్. 'అరవింద సమేత వీరరాఘవ', 'ఎవరు' సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుత నటన కనబరిచిన నవీన్ చంద్ర విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాను తెలుగులో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ వ

జీవా ‘స్టాలిన్’లో నవదీప్ విలన్.. రిలీజ్ ఎప్పుడంటే!

Image
రంగం ఫేమ్ హీరోగా నటించిన విడుదలకు రెడీ అయ్యింది. వైవిధ్యభరిత చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించిన జీవా నటించిన తాజా చిత్రం స్టాలిన్. అందరివాడు అనేది ఉపశీర్షిక. జీవా సరసన రియా సుమన్ నాయికగా నటించింది. మరో కథానాయకిగా గాయిత్రి కృష్ణ కనిపిస్తుంది. ప్రముఖ తెలుగు హీరో నవదీప్ ఇందులో విలన్ పాత్రలో నటించడం ఓ విశేషం. రతిన శివ దర్శకత్వం వహించారు. తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా.. నిర్మాతలు డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న ఈ చిత్రం భారీగా విడుదలకానుంది. ఇదే చిత్రం తమిళంలో సీరు పేరుతో విడుదలవుతుంది. రంగం చిత్రం తర్వాత ఆ స్థాయిలో తీయబడిన మాస్ చిత్రమిది. జీవా తన పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అందరికీ ఆప్తుడిగా మెలగుతూ చెడుపై పోరాటం చేసే పాత్ర ఆయనిది. ఇక నవదీప్ ప్రతినాయకుడిగా ఎంతగానో ఒదిగిపోయారు. కధానాయి

‘అల..’ ఆల్ టైం రికార్డ్ మా నాన్నతో కలిపి కొట్టడం భలే కిక్: అల్లు అర్జున్

Image
Se‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ కెరియర్‌లోనే బెస్ట్ కలెక్షన్స్ రాబట్టడంతో దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ‘అల..’ ఆల్ టైం రికార్డ్‌పై సాధించడంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘ప్రతి హీరోకి ఏదో టైంలో రికార్డ్స్ బద్దలయ్యే ఫిల్మ్ పడుతూ ఉంటుంది. నాక్కూడా ఇంతకు ముందు పడింది కాని.. ఓవరాల్‌గా అన్ని చోట్లా పడలేదు. కొన్ని జిల్లాల్లో మాత్రమే రికార్డ్స్ వచ్చి మిగతా చోట్ల రెండు మూడు ప్లేస్‌లలో ఉండేవాడ్ని. కాని.. ఎనానిమస్‌‌గా ఆల్ టైం రికార్డ్ ఫిల్మ్ నాకెప్పుడూ పడలేదు. ఇదే తొలిసారి. నేనెప్పుడూ అనుకునేవాడిని.. మా ఫాదర్‌కి గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో దాదాపు 15 సినిమాలు ఉన్నాయి ఆల్ టైం రికార్డ్ ఫిల్మ్స్. మగధీర, గజిని లాంటి సినిమాలతో పాటు చిరంజీవి గారితో ఎన్నో ఆల్ టైం రికార్డ్స్ మూవీస్ చేశారు. అంటే ఆల్ టైం రికార్డ్ అనేది ఆయనకు కొత్త విషయం కాదు. బట్ నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే.. ఈ సినిమాకి మా నాన్న ప్రొడ

Sunil: రవితేజ 200 ఏళ్లు బతుకుతారు... నేను విలన్‌గా చేసుకోవచ్చు

Image
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘డిస్కోరాజా’ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఆదివారం సినిమా సక్సెస్ మీట్ జరిగింది. మీట్‌లో కమెడియన్ హిలేరియస్ స్పీచ్ ఇచ్చారు. ‘‘మీ అందరికీ తెలీని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రక్త ప్రసరణ సరిగ్గాలేక, రోజూ వ్యాయామలు చేయకపోవడం వల్ల ప్రపంచం మొత్తంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది ఉన్నారట. మన చేతి వేళ్ల వరకు రక్తప్రసరణ బాగా జరిగితేనే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు అంటున్నారు. అలా ఉండాలంటే రోజుకు 20 కిలోమీటర్లు నడవాలంట. ఆ 20 కిలోమీటర్లు నడవకపోతే రెండు చేతులతో గట్టిగా చప్పట్లు కొడితే చేతి వేళ్ల వరకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టడండి. నేను తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత జీవితంలో మర్చిపోలేని పాత్రను నాకు ఈ సినిమాలో ఇచ్చారు. నాలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు’’ READ ALSO: ‘‘అందుకు దర్శకుడు వీఐ ఆనంద్‌కు ధన్యవాదాలు చెప్పుకోవాలి. దీని తర్వాత కన్నడ, మలయాళం, తమిళంలోనూ నేను సిక్స్ ప్యాక్

అల్లు అర్జున్, స్నేహ రాయల్ ఫొటో: బన్నీ సర్.. బన్నీ అంతే!

Image
ఇండస్ట్రీలో మోస్ట్ స్టైలిష్ యాక్టర్ ఎవరంటే.. టక్కున గుర్తొచ్చ పేరు అల్లు అర్జున్. బన్నీ తన సినీ కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి వివిధ రకాల స్టైల్స్‌ను ఫ్యాన్స్‌కి రుచిచూపించారు. అందుకే ఫ్యాన్స్ ఆయన్ను స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. అయితే.. ఇటీవల బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ముంబయికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ అబుజాని, సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన బ్లాక్ ఖాదీ కుర్తాలో బన్నీ, గోల్డ్ బ్లాక్ కాంబినేషన్‌లో ఉన్న గౌనులో స్నేహ అదిరిపోయారు. ఇప్పటివరకు తన భార్యతో కలిసి ఎన్నో ఫొటోలు దిగారు కానీ.. ఇలాంటి రాయల్ లుక్‌లో మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. దాంతో ఈ ఫొటోను చూసి అల్లు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ‘బన్నీ సర్.. బన్నీ అంతే’ అంటూ తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు. అయితే ఏ సందర్భంలో బన్నీ, స్నేహ ఈ దుస్తులు వేసుకున్నారన్నది తెలియరాలేదు. బన్నీ స్టైల్ అంటే బాలీవుడ్ వాళ్లకీ ఇష్టమే. అయితే తానెంత స్టైలిష్‌గా కనిపించాలనుకున్నా కూడా.. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌లా మాత్రం అస్సలు దుస్తులు వేసుకోలేనని, ఆ ధైర్యం తనలో లేదని తెలిపారు. స్టైల్ విషయంలో తనకు రణ్వీర్ అ

Naga Shaurya: హీరోయిన్లపై శౌర్య కామెంట్స్... మెగా వారసురాల్ని మాత్రం..

Image
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకున్న టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతున్నాడు యువ హీరో నాగశౌర్య. సొంత బ్యానర్‌పై సినిమాలు తీస్తూ ప్రేక్షకుల ముందుకు మంచి కాన్సెప్ట్స్‌తో వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘అశ్వద్థామ’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రాపిడ్ ఫైర్‌లో భాగంగా హీరో, హీరోయిన్లపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అయితే నిహారిక గురించి అడిగితే మాత్రం ఏమీ స్పందించలేదు నాగశౌర్య. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో నాగశౌర్యకు ఎదురైన ప్రశ్నలేంటంటే... మీ గురించి మీరు విన్న క్రేజీ రూమర్ ఏంటి? నాకు పెళ్లైపోయిందని... ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? అనుష్క ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునేవారు? ఆటోమొబైల్స్ మీరు చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు? పొడవాటి జుట్టు ఉండాలి. మనిషి ఎత్తుగా ఉండాలి. మా అమ్మ తర్వాత నన్ను అమ్మలా చూసుకోవాలి. ఇండస్ట్రీలో స్పెషల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నారా రోహిత్. READ ALSO: ఎలాంటి పాత్రలో నటించాలని ఉంది? ‘జోకర్’ సినిమాలో హీరో పోషించే పాత్రలో నటించాలని

sreekaram Movie First Look: ముగ్గురు స్టార్ హీరోల ఫస్ట్‌లుక్స్.. మీ ఓటు ఎవరికి?

Image
2020లో టాలీవుడ్ మరింత బిజీ అయిపోయింది. ఈ ఏడాది చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈరోజు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్ ఒకేసారి విడుదల కావడం విశేషం. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరంటే.. శర్వానంద్, , సుధీర్ బాబు. వీరి ముగ్గురికీ సంబంధించిన లుక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. ‘శ్రీకారం’ చుట్టిన శర్వ యువ కథానాయకుడు శర్వానంద్ టాలీవుడ్‌కి చెందిన టాలెంటెడ్ హీరోల్లో ఒకరు. ఏడాదికి చేసేది ఒకటి, రెండు సినిమాలే అయినా మంచి కాన్సెప్ట్ ఉండేవే ఎంచుకుంటారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ‘జాను’, మరొకటి ‘శ్రీకారం’. ఈరోజు ‘శ్రీకారం’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. లుక్‌లో శర్వా లుంగీ కట్టుకుని, కండువా వేసుకుని పొలంలో నడుస్తున్నట్లు కనిపించారు. చూడబోతే ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తోంది. ఇందులో ‘గ్యాంగ్ లీడర్’ ఫేం ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించనున్నారు. కిశోర్ సినిమాకును డైరెక్ట్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సినిమాకు సంగీతం అందించనున్నారు. READ ALSO: గోపీచంద్ ‘సీటీమార్’ ఈమధ్యకాలంలో మాస్ హీరో గో

Brahmanandam: నా దగ్గర ఏం నటించార్రా.. సుధీర్‌ టీంపై బ్రహ్మీ హిలేరియస్ పంచ్‌లు

Image
‘జబర్దస్త్’ త్రిమూర్తులు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘త్రీ మంకీస్’. అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆదివారం సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. వేడుకకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మీ ఆ ముగ్గురిపై వేసిన పంచ్‌లు వింటే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు. ఇంతకు బ్రహ్మీ ఏమన్నారంటే... ‘‘పది రోజుల క్రితం సుధీర్, శీను, రాంప్రసాద్ నా వద్దకు వచ్చారు. గురువుగారు అని ఒకరు, గురూజీ అంటూ ఇంకొకరు, బాగా సన్నబడ్డారే అని మరొకరు మొదలెట్టారు. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ‘త్రీ మంకీస్’ ట్రైలర్ లాంచ్‌కు అతిథిగా రమ్మంటున్నారని తెలిసిపోయింది. అందుకే వారు ఏమీ చెప్పకుండానే నేను వస్తాన్రా అని అన్నాను. వీరు ముగ్గురూ నాకు కొడుకుల్లాంటివారే. నా వద్దకు రాగానే తెగ యాక్ట్ చేసేశారు. నాకు వాళ్లంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్లు కమెడియన్స్. నాకు కామెడీ చేసేవారంటే చాలా ఇష్టం. సన్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకంటే పొట్టిగా ఉంటాడు’’ READ ALSO: ‘‘‘త్రీ మంకీస్’ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యాక కూడా నన్నే పిలువండి. మళ్లీ ఇంకొర

`మహా సముద్రం`లోకి యంగ్ హీరో.. ఈ సారైనా పట్టాలెక్కుతుందా!

Image
సినీ ఇండస్ట్రీ సక్సెస్‌ వెంటే పరిగెడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఏ దర్శకుడికైనా ఒక్క హిట్ వస్తే చాలా వెంటనే హీరోలు నిర్మాతలు క్యూ కట్టేస్తారు. కానీ అన్ని సందర్భాల్లో ఇలా జరగదు. ఓ బ్లాక్‌ బస్టర్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఓ డైరెక్టర్‌ రెండో సినిమాను ప్రారంభించడానికి పెద్ద యజ్ఞమే చేస్తున్నాడు. రా బోల్డ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిన ఘన విజయం సాధించిన సినిమా ఆర్‌ఎక్స్‌ 100. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు . రామ్‌ గోపాల్‌ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అజయ్‌ తొలి సినిమాతోనే తన మార్క్‌ చూపించాడు. ఆర్‌ఎక్స్‌ 100 సూపర్‌ హిట్ కావటంతో ఒక్కసారిగా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు అజయ్‌. Also Read: అదే జోరులో రెండో సినిమాకు రెడీ అయ్యాడు. ఇద్దరు యంగ్ హీరోలతో ఓ మల్టీ స్టారర్‌ సినిమాను ప్లాన్ చేశాడు. కానీ కథ వర్క్‌ అవుట్ కాలేదో లేక హీరోల డేట్స్‌ అడ్జస్ట్ కాలేదో తెలియదుగానీ ఇంత వరకు అజయ్‌ రెండో సినిమా పట్టాలెక్కలేదు. అనే టైటిల్‌ను చాలా కాలం కిందటే ఎనౌన్స్‌ చేసినా ఆ సముద్రాన్ని దాటే కథానాయకుడు మాత్రం ఇంత వరకు సెట్ కాలేదు. ముందుగా ఈ కథను ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ చెప్పాడన్

Ravi Teja: `డిస్కో రాజా` బర్త్‌డే స్పెషల్.. `క్రాక్‌` రిలీజ్‌ ఎప్పుడంటే!

Image
ఇటీవల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ హీరో మాస్ మహరాజ్‌ ఈ రోజు (26-01-2020) పుట్టిన రోజుజరుపుకుంటున్నారు ఈ సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన డిస్కో రాజా సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా పరవాలేదనిపిస్తోంది. దీంతో మాస్‌ మహరాజ్‌ అభిమానులు ఆనందంగా ఉన్నారు. Also Read: డిస్కో రాజా సెట్స్‌ మీద ఉండగానే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు రవితేజ. మాస్‌ మహరాజ్‌ ఇమేజ్‌, ఎనర్జీకి తగ్గట్టుగా ఈ సినిమాకు క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. రవితేజ పోలీస్‌ ఆఫీస్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌పై బీ మధు నిర్మిస్తున్నాడు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. Also Read: ప్రస్తుతం చిత్రకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 8

రేస్‌కు రెడీ అంటున్న సీనియర్‌ హీరో.. సమ్మర్‌లో షురూ!

Image
వరుస విజయాలతో దూసుకుపోతున్న సీనియర్‌ హీరో అదే జోరు సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఎఫ్‌ 2, వెంకీ మామ సినిమాలతో సూపర్‌ హిట్‌లు అందుకున్న వెంకీ ప్రస్తుతం తమిళ సూపర్‌ హిట్‌ అసురన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పల్లెటూరి వ్యక్తిగా వెంకీ లుక్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. ఇటీవల రిలీజ్‌ అయిన లుక్‌కు ఆడియన్స్‌ నుంచి కూడా మంచి రెస్సాన్స్‌ వస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా పూర్తయిన తరువాత వెంకీ చేయబోయే సినిమా కూడా ఇప్పటికే ఫిక్స్‌ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. చాలా రోజులుగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు వెంకీ. Also Read: గతంలోనే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో సమ్మర్‌లో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. హార్స్‌ రేసింగ్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎక్కువ భాగం మలక్‌పేట్‌ రేస్‌ కోర్టు చిత్ర