Posts

Showing posts from July, 2019

Swetha Reddy: సెక్సువల్ హరాస్మెంట్ చేస్తే తొక్క తీస్తాం.. కొడకల్లారా!: రెడ్డి సిస్టర్స్ రచ్చ

Image
ఆహా.. ఫొటో అదిరింది కదూ!! ఏమన్నా ఉన్నారా ఇద్దరూ. ఒకర్ని మించి మరొకరు.. ఏ రకంగా చూసినా ఇద్దరూ ఇద్దరే. వాళ్లే రెడ్డి సిస్టర్స్. ఒకరు కాంట్రవర్శీ క్వీన్ అయితే.. మరొకరు కేరాఫ్ కాంట్రవర్శీ . ఈ ఇద్దరూ కలిసి సింగిల్ ఫ్రేమ్‌లో దర్శనం ఇచ్చారు. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చి ఇండస్ట్రీ రసికరాజుల కంటిపై కునుకు లేకుండా చేసిన శ్రీరెడ్డి.. తరచూ సెక్సువల్ హరాస్మెంట్‌పై తన వాయిస్‌ని వినిపిస్తూనే ఉంది. ఇక యాంకర్‌గా పలు ఛానల్స్‌లో పనిచేసి యూట్యూబ్ సంచలనంగా మారిన శ్వేతారెడ్డి.. గత ఎన్నికల్లో కేఏ పాల్‌పై సంచలన ఆరోపణలతో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అనంతరం ఇటీవల బిగ్ బాస్‌ నిర్వాహకులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనంగా మారింది. గాయిత్రి గుప్తాతో కలిసి ఢిల్లీ స్థాయిలో షోపై నిరసన తెలిపింది. బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఈ షోను నిలిపివేయాలని నిర్వహకులపై కేసులే వేసే వరకూ వెళ్లింది శ్వేతారెడ్డి. అటు శ్రీరెడ్డి.. ఇటు శ్వేతారెడ్డి మార్గం ఒకటే కావడంతో ఈ ఇద్దరూ జతకలిశారు. ‘లైంగిక వేధింపులకు మేము ఎప్పుడూ మద్దతు ఇవ్వము.. అలా చేస్తే రెడ్డి సిస్టర్స్ తొక్కతీస్తారు కొడుకులది’ అ

YS Jagan: జగన్‌ని అడుక్కోను.. పృథ్వీ తప్పు చేశాడు: పోసాని పరోక్ష విసుర్లు

Image
ఇండస్ట్రీ తరుపున తొలి నుండి జగన్ వెంట నడిచారు పోసాని. ఎలక్షన్స్ సమయంలోనూ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన.. నామినేట్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యం పాలు కావడంతో రకరకాల వార్తలు హల్ చల్ చేశాయి. వాటిపై స్పందిస్తూ బుధవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు పోసాని. ఇండస్ట్రీలోనో.. రాజకీయాల్లోనో నేను చేయాల్సిన పనులు మిగిలి ఉండటం వల్లే తిరిగి బతకగలిగానని లేదంటే చనిపోయి ఉండే వాడినన్నారు ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత . తన ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వరుస కథనాలపై స్పందిస్తూ.. బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు పోసాని. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు నేను క్షేమంగా ఉన్నాను. నాకు జరిగిన తొలి ఆపరేషన్ ఫెయిల్ కావడంతో పొట్టలో ఇన్‌ఫెక్షన్ వచ్చి చావు వరకూ వెళ్లా.. నా చీటీ చినిగిపోద్ది అనుకున్నా. అయితే డాక్టర్ల కృషితో బతికి బట్టకట్టా. అంతే తప్ప ఇతరత్రా రోగాలేం నాకు లేవు. అన్నం లేకుండా చాలా రోజులు బెడ్ మీదే ఉన్నా. యూరిన్‌కి పోవాలన్నా నా భార్య, అక్క ఎత్తుకుని తీసుకువెళ్లేవారు. అయితే రెండో సారి ఆపరేషన్ జరిగిన తరువాత సంపూర్ణ ఆరోగ్యంతో డాక్టర్ ఎమ్.వి రావు నన్ను ఇంటికి పంపించార

‘మగధీర’ జ్ఞాపకాలు.. రెండు సెకెన్ల సీన్ ‘బొమ్మ’ చూపించింది!

Image
తెలుగు సినిమా మార్కెట్‌ను, లెక్కలను మార్చేసిన చిత్రం ‘మగధీర’. అప్పటి వరకు ఉన్న లెక్కలు వేరు.. ‘మగధీర’ వచ్చిన తరవాత లెక్కలు వేరు. చిరంజీవి సినీ వారసుడిగా ‘చిరుత’ చిత్రంలో తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. స్టార్ హీరో హోదాను పొందారు. రాజమౌళి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘మగధీర’ అంటే అతిశయోక్తికాదు. ఎస్.ఎస్.రాజమౌళి తన దర్శక ప్రతిభ ఏపాటిదో ఈ చిత్రంతో మరోసారి నిరూపించారు. ఇలాంటి గొప్ప చిత్రం వచ్చి పదేళ్లు గడిచిపోయింది. ‘మగధీర’ పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ ఒక ఆసక్తికర వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ‘మగధీర’లో ‘పంచదార బొమ్మ’ పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ మెలోడీ ఇప్పటికీ మెగా అభిమానులకు ఫేవరేటే. ఈ పాటలో జలపాతాన్ని చీల్చుకుంటూ రామ్ చరణ్ బయటకు వచ్చే సన్నివేశం ఉంటుంది. వాస్తవానికి ఇది రెండు సెకెన్ల సీన్. ఈ సీన్ కోసం దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సీన్ మేకింగ్ వీడియోను గీతా ఆర్ట్స్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే పర్ఫెక్షన్

నేను అలాంటి వ్యక్తిని కాదు.. చెత్త ప్రశ్నలు ఆపండి: రేణు దేశాయ్

Image
రేణు దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈమె గురించి అందరికీ తెలిసిందే. నటిగా, రచయితగా, దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకున్న మహిళ రేణు దేశాయ్. ప్రస్తుతం మరాఠీలో దర్శకురాలిగా సినిమాలు చేస్తూ.. మరోవైపు తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ చాలా బిజీగా గడుపుతున్నారు రేణు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులకూ దగ్గరగానే ఉంటున్నారు. కామెంట్లతో తనను ఇబ్బంది పెట్టే నెటిజన్లపై కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే రేణు విరుచుకుపడుతుంటారు. ఇలాంటి అనుభవం రేణు దేశాయ్‌కు తాజాగా మరోసారి ఎదురైంది. యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఒక వీడియో ఆధారంగా ఇటీవల రేణు దేశాయ్ సోషల్ మీడియాలో లైవ్ నిర్వహించినట్టు అర్థమవుతోంది. ఈ లైవ్ ఇంటరాక్షన్‌లో చాలా మంది రేణుని రకరకాల ప్రశ్నలు అడిగారు. దీనిలో భాగంగా బిగ్ బాస్ ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘బిగ్ బాస్‌లోకి రావచ్చుగా మేడమ్’’ అని ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు రేణు స్పందిస్తూ.. ‘‘నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ టైపు వ్యక్తిని కాదు. లైవ్ కూడా ఎప్పుడో రెండు నెలలకు ఒకసారి చేస్తుంటాను. నాకు చాలా సిగ్గు ఎక్కువ’’ అని చెప్పారు. వెంటనే రేణు

Bigg Boss Hema: హేమతో ‘స్టార్ మా’ కొత్త స్కెచ్.. తనీష్ బ్యాక్ విత్ బిగ్ బాస్

Image
బిగ్ బాస్ సీజన్ 3ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ప్రసారం చేస్తోంది స్టార్ మా. ఆడిషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌తో ముందే అగ్రిమెంట్ చేసుకున్న స్టార్ మా అందులో పలు కీలక విషయాలను పొందుపరిచారు. వాటికి అనుగుణంగా బిగ్ బాస్ ఇంటా.. బయటా కూడా మార్కెట్ ఫార్ములాను వర్కౌట్ చేస్తుంది. పై ఫొటో చూశాం కదా.. అందులో ఉన్నది , తనీష్. బిగ్ బాస్ సీజన్‌ 3లో తొలి ఎలిమినేట్ కంటెస్టెంట్ హేమను.. బిగ్ బాస్ సీజన్ 2 ఫైనలిస్ట్ తనీష్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే.. గత రెండు సీజన్లలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్.. హౌస్ నుండి బయటకు రాగానే క్షణం తీరిక లేకుండా వరుస ఇంటర్వ్యూలతో టీవీలలో హల్ చల్ చేసేవారు. అసలే రియాలిటీ షో.. లోపల ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండటంతో వాళ్లు ఏం చెప్తారా? అని ఆడియన్స్ ఆసక్తిగా వారి ఇంటర్వ్యూలను చూసేశారు. దీంతో ఆయా ఛానల్స్‌కి టీఆర్పీ రేటింగ్ పెరిగేది. అయితే ఆ వచ్చే రేటింగ్ ఏదో మనమో తెచ్చుకుంటే పోలా.. అనుకుందో ఏమో కాని స్టార్ ఓ కొత్త ఆలోచనతో అడుగులు వేస్తూ.. మిగతా ఛానల్స్‌కి గట్టి షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ ప్రసారానికి ముందు ఈ షోపై యుద్ధం ప్రకటించిన యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్

అమ్మా.. అందరూ చూస్తున్నారు, ఏంటిది: ఇబ్బందిగా ఫీలైన రష్మిక

Image
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈనెల 26న విడుదలైన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. సినిమా విషయం ఎలా ఉన్నా విజయ్, రష్మికల నటన అద్భుతంగా ఉందంటూ అంతా కొనియాడుతున్నారు. ముఖ్యంగా రష్మిక జీవించేసిందని, భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన అద్భుతమని ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్మిక తల్లి సుమన్ మందన కూడా తన కూతురుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ‘డియర్ కామ్రేడ్’ సినిమా చూసిన సుమన్ తన కుమార్తెను పొడుగుతూ ట్వీట్ చేశారు. ‘డియర్ లిల్లీ, నువ్వు నీ తల్లిదండ్రులను గర్వపడేలా చేశావు. నువ్వు ఎంచుకున్న ఫీల్డ్‌లో అద్భుతంగా రాణిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది! ఐ లవ్ యూ బేబీ. విజయ్ దేవరకొండ.. నువ్వు చాలా అద్భుతంగా చేశావు. నీ భవిష్యత్తు ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను. భరత్ - బ్రిల్లియంట్. ఆల్ ది బెస్ట్. మైత్రీ మూవీ మేకర్స్‌కి కృతజ్ఞతలు’ అని సుమన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు రష్మిక స్పందించారు. ‘మమ్మీ థాంక్యూ.. ఐ లవ్ యూ టూ. సినిమాను ఇంకోసారి చూడు. కొత్త వర్షన్ నీకు ఎంతబాగా నచ్చిందో నా

AA19: రావు రమేష్ వదిలేసిన పాత్రలో హర్షవర్థన్.. ఇంతకీ గొడవేంటి?

Image
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది అల్లు అర్జున్‌కు 19వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఒక ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంది. ఇప్పటికే కొంత మేర తన షూటింగ్ పార్ట్‌ను పూర్తిచేశారు. అయితే, కొన్ని కారణాల చేత ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. కాల్షీట్ల విషయంలో దర్శకుడు త్రివిక్రమ్, రావు రమేష్‌కు మధ్య విభేదాలు రావడంతోనే ఆయన తప్పుకున్నారని అంటున్నారు. Also Read: అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోందట. ఈ సినిమాలో పాత్ర కోసం గతంలో రావు రమేష్ నుంచి వరుస తేదీలు దర్శకుడు త్రివిక్రమ్ తీసుకున్నారట. అయితే, ఈ తేదీల లోపల రావు రమేష్ షూటింగ్ పార్ట్‌ను పూర్తిచేయలేదని టాక్. దీంతో మరోసారి ఆయన్ని చిత్ర యూనిట్ తేదీలు అడిగిందని అంటున్నారు. కానీ, రావు రమేష్ మరోవైపు మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. దాని కోసం ఇప్పటికే తేదీలు ఇచ్చేశారట. ఇప్పుడు త్రివిక్రమ్ టీమ్ మరోసారి తేదీలు అడగడంతో రావు రమేష్ అసహనం వ్యక్తం చేశారట. తాను ఈ సినిమాలో చేయలేనని తప

మరోసారి తెరను పంచుకుంటున్న చిరంజీవి, రామ్ చరణ్!

Image
మెగాస్టార్ తన 152వ సినిమాను దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన కొరటాల శివ.. చిరంజీవితో సినిమా చేస్తున్నారనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న లాంఛనంగా ప్రారంభమవుతుందని సినీ వర్గాల ద్వారా తెలిసింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ అతిథి పాత్రలో నటించనున్నారట. ఇది ఒక మంచి సందేశంతో కూడి కమర్షియల్ సినిమా అట. దీనిలో ఒక ముఖ్యమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రను రామ్ చరణ్‌తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు కొరటాల భావించారట. దీనికి రామ్ చరణ్ కూడా అంగీకారం తెలిపారని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. గతంలో ‘మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెం.150’ సినిమాల్లో తండ్రీకొడుకులిద్దరూ కలిసి నటించారు. కాగా, ప్రస్తుతం దర్శకుడు హీరోయిన్ వేటలో ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార లేదంటే శృతిహాసన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, కొరటాల మాత్రం ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాల

'డియర్ కామ్రేడ్' మలయాళంలో మస్త్ ఖుషీ.. మరో సాంగ్‌తో

Image
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కకుడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెరకెక్కిన ఈనెల 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. విడుదలైన అన్ని కేంద్రాలలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సందర్బంగా నిర్మాతలు సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ .. విడుదలైన ఈ మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడు రోజులకు గాను రూ. 21 కోట్లు దక్కింది. గ్రాస్‌లో చూసుకుంటే 30 కోట్లవరకు రాబట్టింది. హీరో విజయ్ కున్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు రావడం నిర్మాతలుగా మాకు ఆనందంగా ఉంది. అటు ఓవర్ సీస్2లో కూడా భారీ కలక్షన్స్ అందుకున్నాయి. అలాగే ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు రావడం .. ఈ రోజు వీకెండ్ తరువాత కూడా అదే కలక్షన్స్ రావడం, బయ్యర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా నిడివి విషయంలో స్లో గా ఉందంటూ కామెంట్స్ రావడమతొ 13 నిమిషాల సినిమాను కట్ చేసాం. అలాగే ఇప్పటికే ఇందులోని క్యాంటీన్ సాంగ్ బాగా పాపులర్ అయింద

‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్!

Image
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాతగా మరోసారి సక్సెస్ అయ్యారు. 13 ఏళ్ల క్రితం ‘పోకిరి’ సినిమాతో కోట్లు ఆర్జించిన పూరి.. మళ్లీ ఇన్నాళ్లకు నిర్మాతగా లాభాలను పొందుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించారు. నభా నటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్లు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. హై ఓల్టేజ్ మాస్ మసాలా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’.. పూరి జగన్నాథ్‌కు గెలుపు దాహాన్ని తీర్చింది. గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో ఢీలా పడిన పూరీకి ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం ఉపశమనాన్ని ఇచ్చింది. తొలి రోజు నుంచి మంచి కలెక్షన్లు రాబడుతోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.29.93 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల షేర్‌ను వసూలు చేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం గ్రాస్ సుమారు రూ.65 కోట్లని అంటున్నారు. 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.26.68 కోట్ల షేర్‌ను ‘ఇస్మార్ట్ శంకర్’ వసూలు చేసిందట. ఇక ఓవర్సీస్‌లో సుమారుగా రూ. 1.15 కోట్లు రాబట్టిందని అంటున్నారు. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను పూరి జగన్నాథ్ రూ.17 కోట్లకు విక్రయించా

నా కన్యత్వం పోయింది అప్పుడే.. అమ్మే దగ్గరుండి మరీ: షకీలా నగ్నసత్యాలు

Image
ఏ తల్లైనా తనకు పుట్టిన పిల్లల్ని ఒకేలా చూస్తుంది.. అమ్మ ప్రేమను సమానంగా పంచుతుంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు అమ్మ ప్రేమకు. అయితే విషయంలో మాత్రం ఆ అమ్మ ప్రేమ నేటికీ ప్రశ్నార్ధకమే. ఒక కూతుర్ని ఏ తల్లైనా ఎలాంటి పరిస్థితుల్లో చూడకూడదని అనుకుంటుందో అలాంటి నీచమైన బతుకుపై ఆశలు కల్పించేలా.. అటువైపు అడుగులు పడేలా చేసి అమ్మతనానికే మచ్చ తెచ్చింది ఆ మహా తల్లి. షకీలా అంటే ఓ శృంగార తారగానే పరిచయం.. కాని ఆమె జీవితంలో ఎన్నో ఆటు పోట్లు.. మరెన్నో వంచనలు.. అక్క, అక్క, తమ్ముడు వీళ్లే కాదు.. ప్రేమించిన వాళ్లు కూడా షకీలాను వాడుకున్నారే తప్ప అండగా నిలవలేకపోయారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది ప్రేమ పేరుతో ఆమెను నయ వంచనకు గురిచేశారు. వీటన్నింటినీ తట్టుకుని నిలిచే సరికి ఆమె పక్కన ఇప్పుడు ఎవరూ లేరు. ఒక్కరుగానే మిగిలింది. కోట్లు సంపాదించినప్పుడు ఆమె పక్కన నిలిచిన నా అనుకునే వాళ్ల నమ్మక ద్రోహానికి బలైపోయి ఇప్పుడు సాదాసీదా జీవితం గడుపుతోంది షకీలా. అయితే ఇంత నమ్మకద్రోహానికి గురైనా.. ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పరిస్థితుల్ని చూసి పారిపోలేదు. తనకు ఎక్కడైతే అవమానం జరిగిందే అక్కడే ఎదురొడ్డి నిల

‘అర్జున్ రెడ్డి’లా మారిపోయిన ‘RX 100’ హీరోయిన్.. ఒకేసారి రెండు సిగరెట్లు!

Image
పాయల్ రాజ్‌పుత్.. ‘RX 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పంజాబీ బ్యూటీ తొలి చిత్రంతోనే చెరగని ముద్ర వేసింది. ప్రేమ పేరుతో అబ్బాయిని మోసం చేసి శారీరకంగా వాడుకునే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా తరవాత పాయల్‌కు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ‘సీత’ సినిమాలో ‘బుల్‌రెడ్డి’ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది. ప్రస్తుతం ‘డిస్కో రాజా’లో రవితేజ సరసన నటిస్తోంది. అలాగే, ‘వెంకీ మామ’లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇంకోవైపు ‘ఆర్డీఎక్స్’ అనే చిన్న సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సినిమాలతో బిజీగా గడుపుతోన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈరోజు పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకేసారి రెండు సిగరెట్లను లాగిపారేస్తోంది పాయల్. కళ్లకు బ్లాక్ కూలింగ్ గ్లాస్‌ పెట్టుకుని చేతిలో రెండు సిగరెట్లతో పొగ వదులుతూ పాయల్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ కిరాక్‌ లుక్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘ఇంకా క

మూడు భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్

Image
సరిగ్గా ఐదేళ్ల క్రితం నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అనతికాలంలోనే ఈ సంస్థ టాలీవుడ్‌లోని టాప్ ప్రొడక్షన్ హౌజుల్లో ఒకటిగా నిలిచింది. వరుసగా సూపర్ హిట్ సినిమాలు తీసిన ఈ ముగ్గురూ మంచి అభిరుచి కలిగిన నిర్మాతలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. ‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్రలహరి, డియర్ కామ్రేడ్’’ ఇలా వరసగా అన్నీ మంచి సినిమాలే. టాలీవుడ్‌లోని టాప్ లిస్టులో ఉన్న హీరోలను ఎంపిక చేసుకుని.. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వచ్చారు. వీళ్లు చేసిన ప్రయోగాలన్నీ ఇప్పటి వరకు మంచి ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతం నానితో తీసిన ‘‘గ్యాంగ్ లీడర్’’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండతో ‘హీరో’ అనే బహుభాషా చిత్రాన్ని కూడా మొదలుపెట్టారు. మాళవికా మోహన్ ఇందులో హీరోయిన్. అలాగే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 20వ సినిమాను తాము నిర్మిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే సూపర్ స్ట

Hema Elimination: జనం చెప్పుతో కొడతారు.. నన్ను ప్రెగ్నెన్సీ టెస్ట్ అడిగారు: బిగ్ బాస్‌పై హేమ ప్రెస్ మీట్

Image
నేను మంచిదాన్నే.. కావాలనే నన్ను కాంట్రవర్శీ చేస్తున్నారన్నారు నటి . సీజన్ 3లో తొలివారమే ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చేసిన హేమ.. మంగళవారం నాడు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఎలిమినేషన్పై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ఇప్పటి వరకూ ఇండస్ట్రీలో రెబల్, నవ్వుల హేమ అనే టైటిల్స్ ఉన్నాయి. నాకు ఆ రెండూ చాలు. కాంట్రవర్శీ అనే టైటిల్ నాకు వద్దు. బిగ్ బాస్‌లో నేను ఎలాంటి తప్పులు చేయకపోయినా ఎలిమినేట్ చేశారు. గూగుల్‌లో ఓట్ల శాతంలో నేనే తొలిస్థానంలో ఉన్నాను. కొన్ని కోట్ల ఓట్లు నాకు పడ్డాయి. అయితే గూగుల్ ఓట్లు తీసేశారు. గత సీజన్‌లో పొరపాట్లు దొర్లడం వల్ల.. హాట్ స్టార్ అనే యాప్ ద్వారా ఓట్లు వేసే అవకాశం ఇచ్చారు. అయితే ఈ యాప్‌ ద్వారా ఓట్లు ఇలా వేయాలో నన్ను అభిమానించే వాళ్లకు తెలియకపోవచ్చు. దాని వల్ల కొన్ని ఓట్లు తక్కువ పడ్డాయి. హాట్ స్టార్ వల్లే నాకు సరిగా ఓట్లు పడలేదు. నా ఫ్యాన్స్ చాలా మంది ఓట్లు వేస్తుంటే.. నాట్ రిసీవ్డ్ అని వచ్చింది. చాలా టెక్నికల్ ఇష్యూస్ వల్ల నాకు ఓట్లు పడలేదు. ఓవరాల్‌గా చూస్తే.. నా మీద కంప్లైంట్ ఏం ఉన్నాయని బయటకు పంపారు. బిగ్ బాస్‌లో నటించి ఉంటే ఇంకా ఉండేదాన

‘సాహో’ రెండో పాట టీజర్.. లవ్ ఆంథమ్ ఆఫ్ దిస్ ఇయరట!!

Image
ఈ ఏడాది మోస్ట్ వాంటెడ్ యాక్షన్ మూవీస్‌లో ‘సాహో’ ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ లోపల ‘సాహో’పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేందుకు చిత్ర ప్రచార కార్యక్రమాలపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే టీజర్, ‘సైయా సైకో’ అనే పాటను విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రంలో రెండో పాటను విడుదల చేస్తున్నారు. ఆగస్టు 2న విడుదల చేసే ఈ పాట టీజర్‌ను మంగళవారం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. Also Read: ‘యే చోట నువ్వున్నా’ అంటూ సాగే ఈ లవ్ ట్రాక్‌ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్‌లో ప్రభాస్, శ్రద్ధా లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ వైట్ సూట్‌లో నడుచుకుంటూ వచ్చే సీన్ ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుంది. మంచు కొండలు, సరస్సు, లొకేషన్స్ చాలా బాగున్నాయి. పిక్చరైజేషన్ అయితే పైస్థాయిలో ఉంది. ఇవన్నీ బాగున్నా.. పాటలోనే అంత ఎట్రాక్షన్ కనిపించడం లేదు. ఏదో హిందీ పాటను అనువాదం చేసినట్టుగా ఉ

దయచేసి హార్దిక్ పాండ్య మాజీ ప్రేయసి అని అనకండి.. నాకూ కుటుంబం ఉంది!

Image
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాకు ముడిపెడుతూ యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఊర్వశిని మాజీ ప్రేయసి అని పేర్కొంటూ ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోను చూసిన ఊర్వశి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. తన ప్రతిష్ఠను దిగజార్చే ఇలాంటి వీడియోలను దయచేసి పోస్ట్ చేయొద్దంటూ యూట్యూబ్ ఛానెళ్లను ఊర్వశి వేడుకుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అలాంటి ఒక వీడియో స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. ఇలాంటి వీడియోల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతారని పేర్కొంది. ఆ వీడియో స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఉంచిన ఊర్వశి.. ‘‘యూట్యూబ్‌లో ఉన్న మీడియా ఛానెల్స్‌కు నేను ఎంతో విధేయతతో విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి చెత్త వీడియోలను అప్‌లోడ్ చేయడం మానేయండి. నాకొక కుటుంబం ఉంది, వాళ్లకు నేను సమాధానం చెప్పుకోవాలి. ఈ వీడియోలు నాకు సమస్యలు తెచ్చిపెడతాయి’’ అని పేర్కొన్నారు. ఒక సహాయం నిమిత్తం తన మాజీ ప్రియుడు, క్రికెటర్ హార్దిక్ పాండ్యాను కలిశారని ఆ వీడియోలో ఉంది. ఇదొక హిందీ మీడియా సంస్థకు చెందిన యూట్యూబ్ ఛానెల్. కాగా, కిందటేడాది ఊర్వశి, హా

ప్రభాస్, శ్రద్ధా కపూర్.. మధ్యలో మహేష్.. ఫ్యాన్స్ అప్సెట్!!

Image
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోసం ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా కపూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా కపూర్‌ను తెలుగులో మీ అభిమాన నటుడు ఎవరని అడిగారు. వెంటనే శ్రద్ధా సూపర్ స్టార్ పేరు చెప్పారు. ప్రభాస్ గురించి అడిగినప్పుడు అతను తనకు మంచి స్నేహితుడని వెల్లడించారు. శ్రద్ధా కపూర్ ఇచ్చిన ఈ సమాధానాలు ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి లోను చేశాయట. వాస్తవానికి ఒక హీరోతో నటిస్తున్నప్పుడు ఆయనే తన అభిమాన నటుడని హీరోయిన్ చెప్పాలని ఆ హీరో అభిమానులు కోరుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. వాటిని మన

వాళ్లకు సెక్స్, హగ్గులు, ముద్దులే కావాలి.. ‘బిగ్ బాస్’ షోపై శ్వేతారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Image
జర్నలిస్ట్, టీవీ యాంకర్ శ్వేతారెడ్డి ‘బిగ్ బాస్’ రియాలిటీ షోపై మరోసారి విరుచుకుపడ్డారు. తీవ్ర ఆరోపణలు చేశారు. అగ్రిమెంట్ల పేరుతో సుమారు 150 మందితో బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరిపారని, వాళ్లందరినీ మోసం చేశారని ఆరోపించారు. బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా పోరాడుతోన్న శ్వేతారెడ్డి సోమవారం విశాఖపట్నంలో మహిళా మండలి సభ్యుల సౌజన్యంలో ధర్నా తలపెట్టారు. అయితే, అక్కడ వాతావరణం సహకరించకపోవడంతో ధర్నాను రద్దుచేసి ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్వేతారెడ్డి మాట్లాడుతూ బిగ్ బాస్ షోపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎంపిక విషయంలో అన్యాయం జరగడం ఒక్కటేకాదు.. వాళ్లు లేవదీసిన ప్రశ్నలు కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. నా విషయానికి వస్తే మీరు మా బాస్‌ను ఎలా సాటిసిఫై చేస్తారు అని అడిగారు. శ్యామ్ అనే ఒక ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ ఇదే ప్రశ్నను పదే పదే లేవనెత్తడం నాకు చికాకు తెప్పించింది. నా శరీరం గురించి, నా శరీర బరువు గురించి ప్రశ్నలు అడగడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అదొక రియాలిటీ షో, టాలెంట్ షో. అక్కడ ఎవరి టెంపర్ ఎలా ఉంటుంది.. మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది.. టాస్క్‌లు ఇచ్చినప్పుడు వాళ్ల

ముదురు వయసులో పెళ్లికూతురుగా రాఖీ సావంత్.. ఆ రూమర్లకు చెక్!

Image
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు కనువిందు చేస్తుంటారు. 40 ఏళ్లు ఒంటిమీదికి వచ్చినా ఇంకా పెళ్లిచేసుకోని ఈ ముదురు భామపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు, గ్యాసిప్పులు. తాజాగా ఆమె పెళ్లిపై ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రాఖీ సావంత్ ఒక ఎన్‌ఐఆర్‌ను రహస్యంగా పెళ్లిచేసుకున్నారని, ఈ వివాహం ఈనెల 28న జరిగిందని ప్రచారం చేశారు. ఈ వివాహానికి రాఖీ ఆప్తమిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. అయితే, ఈ వార్తల్లో నిజంలేదని రాఖీ సావంత్ తేల్చేశారు. షూటింగ్‌లో భాగంగా తాను పెళ్లికూతురులా సిద్ధమయ్యానని పేర్కొన్నారు. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ రూమర్‌పై మీడియాతో మాట్లాడిన రాఖీ సావంత్.. ‘‘జేడబ్ల్యూ మారియట్‌లో నేను పెళ్లి షూట్‌లో పాల్గొన్నాను. ఈ మాత్రం దానికి నాకు పెళ్లైపోయిందని ఈ జనం ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదు. నాకు పెళ్లికాలేదు. నేను ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేను. నేను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాను’’ అని రాఖీ వెల్లడించారు. అలాగే, తా

Bigg Boss 3 Telugu: ‘వెళ్లేటప్పుడు ఇద్దరు వచ్చేటప్పుడు ముగ్గురు’.. వరుణ్, వితికా రియాక్షన్

Image
హౌస్‌కి జంటగా వెళ్లిన , వితకా షెరులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. హౌస్‌లో ఈ రొమాంటిక్ జంట వ్యవహరిస్తున్న తీరుపై కూడా సెటైర్లు పడుతున్నాయి. సందు దొరికితే ఒకరిపై ఒకరు పడటాలు.. హగ్ కావాలని.. ఎత్తుకోవాలని.. కళ్లల్లోకి కళ్లు పెట్టుకుని బాత్‌ టబ్‌లో ముచ్చట్లు అబ్బో వీళ్ల రొమాంటిక్ సెన్స్‌కి ముగ్ధులవ్వడం మాట పక్కనపెడితే.. ఇదేం విడ్డూరం అని టీవీల ముందు కూర్చుని చర్చించుకునే వారే ఎక్కువ. అయితే భార్యాభర్తలన్నాక ఆ మాత్రం చనువు కామన్‌గానే ఉంటుంది.. అయితే వెళ్లింది ఓ రియాలిటీ షోకి కాబట్టి.. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే హౌస్‌కి జంటగా వెళ్ళిన వరుణ్, వితికాలపై వస్తున్న ట్రోలింగ్స్‌కి ధీటుగానే స్పందిస్తున్నారు. హౌస్‌కి వెళ్లడానికి ముందు ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈ జంట. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి మంచిగా.. రెండు ట్రోల్స్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. అయితే మాపై వస్తున్న కొన్ని కామెంట్స్‌కి సమాధానం చెప్పాల్సి ఉంది. Read Also: ‘హౌస్‌కి వెళ్లేటప్పుడు ఇద్దరు.. వచ్చేటప్పుడు ము

‘డియర్ కామ్రేడ్’కు 30 నిమిషాల కోత.. సూటిగా సుత్తిలేకుండా!

Image
సినిమా బాగుంది.. కాకపోతే బాగా సాగదీశారు.. ఇది ‘డియర్ కామ్రేడ్’ సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకుల స్పందన. సినిమాలో అనవసరపు సన్నివేశాలు ఉన్నాయని, అవి ప్రేక్షకుడిని విసిగిస్తాయని ఇప్పటికే విమర్శకులు రివ్యూలు రాశారు. ఈ స్పందనను పరిగణనలోకి తీసుకున్న దర్శక నిర్మాతలు.. చిత్ర నిడివిని 30 నిమిషాలపాటు తగ్గించారు. ఈ మేరకు చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శకుడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 26న తెలుగు, త‌మిళ‌ం, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో విడుదలైంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘‘విడుదలైన మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడు రోజులకు గాను రూ.21 కోట్లు వసూలు చేసింది. గ్రాస్‌లో చూసుకుంటే రూ.30 కోట్ల వరకు రాబట్టింది. హీరో విజయ్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు రావడం ని

‘పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్’ వీడియో సాంగ్.. కాజల్ పర్ఫెక్ట్ గురూ!

Image
శర్వానంద్, అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిన్ హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రణరంగం’. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటి ఈ సినిమాలోని రెండు పాటలను విడుదల చేశారు. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో పాటను విడుదల చేశారు. ‘పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్’ అంటూ సాగే వీడియో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ పాటను నిఖితా గాంధీ ఆలపించారు. సన్నీ ఎం.ఆర్. స్వరపరిచారు. హీరో శర్వానంద్, కాజల్ అగర్వాల్‌లపై ఈ పాటను చిత్రీకరించారు. సాహిత్యానికి తగ్గట్టుగానే కాజల్ పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఉంది. కాజలే కాదు.. లుక్ కూడా అదిరిపోయింది. గుబురు గెడ్డంలో శర్వానంద్ స్టైలిష్‌గా ఉన్నారు. కాగా, ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలోనే సెన్సార్‌కు వెళ్లనుంది. ఈ చిత్రానికి అర్జున్ - కార్తీక్ మాటలు అందించారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం సమకూరుస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు. రామజోగయ్య శాస్త్రి, కృష

Shakeela: షకీలా భర్తగా కత్తి మహేష్.. ఈ అరాచకం చూశారా?

Image
దక్షిణాది శృంగార తారగా ఓ వెలుగు వెలికి.. స్టార్ హీరోలకు సైతం చెమటల పట్టించిన మలయాళ హాట్ బాంబ్ షకీలాకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే.. మమ్ముట్టి, మోహన్‌ లాల్ లాంటి మలయాళ స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారంటే ఆమె క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఎంతో మంది శృంగార ప్రేమికులకు నయనానందం కలిగించిన తరువాత కాలంలో కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితికి వచ్చేసింది. తాజాగా ఆమె తెలుగులో ‘కొబ్బరిమట్ట’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె టాలీవుడ్ కాంట్రివర్శీ కింగ్, మూవీ క్రిటిక్ మహేష్ కత్తితో జోడీ కట్టడం ఆసక్తిగా మారింది. Read Also: Read Also: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మూడో చిత్రం ‘కొబ్బరి మట్ట’. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు స్టీవెన్ శంకర్ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఇందులో 3.27 నిమిషాల భారీ డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు సంపూర్ణేష్ బాబు. స్టార్ హీరోలకు సైతం వరుణుపుట్టేలా.. ప్రపంచ సినీ చరిత్రలోనే

దూసుకెళ్తున్న దేవరకొండ.. ‘డియర్ కామ్రేడ్’కు డీసెంట్ కలెక్షన్స్

Image
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన స్టామినా ఏంటో మరోసారి చూపిస్తున్నారు. విజయ్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఈనెల 26న విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ ఆ ప్రభావం సినిమా వసూళ్లపై పడలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.11 కోట్లు వసూలు చేసింది. యూఎస్‌లో సైతం తొలిరోజు ప్రీమియర్ల ద్వారా సుమారు 3 లక్షల డాలర్లు (సుమారు రూ.2 కోట్లు) రాబట్టింది. అయితే.. శని, ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్లు కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. మూడు రోజుల్లో ‘డియర్ కామ్రేడ్’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.35 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అంటున్నారు. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ.19.28 కోట్లుగా ఉందని సమాచారం. శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు రూ.3 కోట్ల చొప్పున గ్రాస్ వసూలు చేసిందని తెలిసింది. మరోవైపు, యూఎస్‌లో ‘డియర్ కామ్రేడ్’ మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు 7 లక్షల డాలర్లకు పైగా (సుమారు రూ.5 కోట్లు) వసూలు చేసినట్లు యూఎస్‌లో ఈ సినిమాను విడుదల చేసిన ‘సరిగమ సిని

‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో సంజయ్ దత్.. అధీరా ఫస్ట్‌లుక్ అదిరింది

Image
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కిందటేడాది వచ్చిన ఈ శాండిల్‌వుడ్ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోకి అనువాదమైంది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా సుమారు రూ.240 కోట్లు రాబట్టినట్లు లెక్కలున్నాయి. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ వస్తోంది. తొలి భాగానికి మించి ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా స్థాయిని పెంచేందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను రంగంలోకి దించారు. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో నటిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (జూలై 29న) సంజయ్ దత్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అధీరాగా సంజయ్ లుక్ అదిరిపోయింది. తన అధీరా లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంజయ్ దత్ అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో యశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అధీరాగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే వెండితెరపై మహాబలుడిని చూస్తామంటూ హింట్ ఇచ్చారు. ఈ సినిమా మార్చిలో విడు

Bigg Boss 3 Telugu Elimination: ఓటింగ్ చీటింగ్.. బిగ్ బాస్‌పై హేమ సంచలన కామెంట్స్

Image
బాధ ఉండదండీ.. హౌస్‌లో మా అక్క తోపు దమ్ముంటే ఆపు అంటూ అక్కను కంటెస్టెంట్స్ అందరూ అంతెత్తున లేపారు. తీరా అక్క అక్క అన్నవాళ్లే తనను తొక్కేశారంటున్నారు బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఎలిమినేట్ కంటెస్టెంట్ హేమ. మిగతా కంటెస్టెంట్స్‌తో పోల్చుకుంటే కాస్తో కూస్తో పాపులారిటీ ఉన్న హేమ.. ఆదివారం నాడు బిగ్ బాస్ హౌస్‌ను తట్టా బుట్టా సర్దేసింది. బిగ్ బాస్ హౌస్ హౌస్‌కి వెళ్లిన తొలిరోజు నుండే మిగతా కంటెస్టెంట్స్‌పై పెత్తనం సాగిస్తూ.. నా మాటే శాసనం.. నేను వండిందే వంట.. పెట్టిందే తినాలి.. అన్నట్టుగా వ్యవహరించిన హేమను కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌కూడా ఓట్ల ద్వారా సాగనంపేశారు. అయితే తొలివారంలోనే బయటకు వచ్చేయడంతో హేమ ఎమోషన్ అవుతున్నారు. నేను నాలాగే ఉన్నాను బిగ్ బాస్ హౌస్‌లో కూడా. అయితే కిచెన్ దగ్గర వచ్చిన చిన్న గొడవ మిగతాదంతా బాగానే ఉందంటూ సాఫ్ట్‌గా మాట్లాడిన హేమ.. బయటకు వచ్చాక బిగ్ బాస్‌పై ఫైర్ అవుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం కుట్రపూరితంగా నన్ను బయటకు పంపారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది హేమ. ఈ సందర్భంగా.. బిగ్ బాస్ ఓటింగ్‌పైన ఎలిమినేషన్ ప్రక్రియ పైన సంచలన కామెంట్స్ చేశారు. Also Read: గత రెండు సీజన్ల మాదిరే ఎలి

‘డియర్ కామ్రేడ్’ రీమేక్ హక్కులకు రూ.6 కోట్లు.. బాలీవుడ్‌లో ఇదో రికార్డ్!

Image
సెన్సేషనల్ స్టార్ , కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా బాగుందని కొంత మంది అంటే.. బాలేదని మరికొందరు అంటున్నారు. సినిమా టాక్ ఎలా ఉన్నా దీని హిందీ రీమేక్ హక్కులకు పలికిన ధర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాను చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. ‘డియర్ కామ్రేడ్’ చాలా బాగుందంటూ కొనియాడారు. ఈ చిత్రాన్ని హిందీలో తానే రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్ హక్కుల కోసం కరణ్ జోహార్ ఏకంగా రూ.6 కోట్లు చెల్లించారని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే నిజమైతే.. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఏ రీమేక్‌కు చెల్లించనంత ఎక్కువ మొత్తం కరణ్ జోహార్ చెల్లించినట్లవుతుంది. ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమా ‘సింబా’గా రీమేక్ చేశారు. ఇప్పుడు లారెన్స్ ‘కాంచన’ చిత్రాన్ని ‘లక్ష్మీ బాంబ్’గా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాల రీమేక్ హక్కులకు చెల్లించిన మొత్తం ప్రస్తుతం కరణ్ జోహార్ చెల్లించనదాని కన్నా చాలా తక్కువ అని అంటున్నారు. వాస్తవానికి సాజిద్ నడియాద్వాలా, భూషణ్ కుమార్, మురద్ ఖేతాని, విజయ్ గలాని వంటి బడా

‘నా... లోనా’ అంటూ తీయని మెలోడీతో వచ్చిన మన్మథుడు

Image
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు’ సినిమాలో పాటలు ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిందే. దేవీశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇచ్చిన పాటలవి. ఈ సినిమా మ్యూజిక్‌తో దేవీకి కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ‘మన్మథుడు 2’ పాటలతో మరో కొత్త సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్‌కు మంచి గుర్తింపు వస్తుందనిపిస్తుంది. ‘RX 100’ సినిమాతో పరిచయమైన చైతన్ భరద్వాజ్.. ‘పిల్లా రా’ పాటతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టారు. ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ‘మన్మథుడు 2’కు కూడా మంచి మెలోడీలు కంపోజ్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘మన్మథుడు 2’ నుంచి రెండో పాట విడుదలైంది. ‘నా... లోనా’ అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. ఈ తీయని మెలోడీని ఈ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి శ్రీపాద ఆలపించారు. శుభం విశ్వనాథ్ సాహిత్యం అందించారు. ఈ మెలోడీ సాంగ్‌ను విన్న అక్కినేని అభిమానులు తమ మన్మథుడు హిట్టు కొట్టడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇటీవల విడుదలైన ‘హే మెనీనా’ సాంగ్ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ రెండో పాట అద్భుతం

మహేష్‌బాబు కొత్త వ్యాపారం.. ది హంబల్ కంపెనీ!

Image
సూపర్ స్టార్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. ఇటీవల మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన మహేష్.. ఇప్పుడు బట్టల వ్యాపారంలోకి దిగారు. మహేష్‌బాబు సొంతంగా క్లోతింగ్ బ్రాండ్‌ను స్థాపించనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ తన క్లోతింగ్ బ్రాండ్‌ను మహేష్‌బాబు ప్రకటించారు. ‘ది హంబల్ కో.’ పేరుతో గార్మెంట్ బ్రాండ్‌ను మహేష్ స్టాపించారు. ఆగస్టు 7న దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని మహేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మా హంబుల్ ప్రయత్నాన్ని ఈరోజు ప్రకటిస్తున్నాం. అద్భుతంగా స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. ది హంబుల్ కో. కేవలం క్లోతింగ్ మాత్రమే కాదు, ఇదొక జీవన విధానం. ది హంబుల్ కంపెనీ కుటుంబంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఆగస్టు 7న ప్రారంభోత్సవం కోసం వేచి చూస్తూ ఉండండి’ అని మహేష్‌బాబు ట్వీట్ చేశారు. కంపెనీ లోగో, కొత్త దుస్తుల్లో మహేష్‌బాబు లుక్‌ను కూడా విడుదల చేశారు. ‘‘HUMBL’’ అనే లోగోలో ‘‘MB’’ని అండర్‌లైన్ చేశారు. అంటే మహేష్‌బాబు అనే అర్థం వచ్చేలా లోగోను డిజైన్ చేశారు. కాగా, ప్రస్తుతం మహేష్‌బాబు ‘‘సరిలేరు నీకె

‘వైఫ్, ఐ’ మూవీ టీజర్.. రొమాంటిక్‌కు ఎక్కువ, బ్లూ ఫిల్మ్‌కి తక్కువ!

Image
‘ఏడు చేపల కథ’ అనే అడల్ట్ కామెడీ ఫిల్మ్ గుర్తుంది కదా..! కిందటేడాది వచ్చింది. ఆ సినిమాలో టెంప్ట్ రవి.. తాను టెంప్ట్ అయిపోయి, సినిమా చూస్తున్న ప్రేక్షకులను కూడా బాగా టెంప్ట్ చేసేశాడు. శృతిమించిన శృంగారం, డబుల్ మీనింగ్ డైలాగులతో బూతు సినిమా చూపించేశాడు. ఇప్పుడు మరో సినిమాతో బూతు పురాణానికి సిద్ధమైపోయాడు. ఇంతకీ ఈ టెంప్ట్ రవి పాత్రలో నటించిన హీరో అభిషేక్ రెడ్డి. మళ్లీ ఆయనే హీరోగా.. గుంజన్, ఫిదా గిల్, కావ్య హీరోయిన్లుగా ‘వైఫ్, ఐ’ అనే సినిమా వస్తోంది. ఇది కూడా అడల్ట్ సినిమానే. ‘వైఫ్, ఐ’ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలోనూ శృంగారం శృతిమించిపోయింది. బ్లూ ఫిల్మ్‌ను తలపిస్తోంది. మొగుడు కళ్లుగప్పి పెళ్లాం చేసే రాసలీలలు ఈ సినిమాలో చూపించినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. దీనికి తోడు పోస్టర్లపై ‘నైఫ్ ఈజ్ బెటర్ దేన్ వైఫ్’ అని రాశారు. అంటే, పెళ్లాం కంటే కత్తె మేలట. ఇంతలా ఏం చేసిందో ఈయనగారి పెళ్లాం. టీజరే ఇంత ఘాటుగా ఉందంటే, ఇక సినిమాలో అన్నీ చూపించేస్తారనుకుంటా. ఈ చిత్రాన్ని లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై జి.చరితారెడ్డి నిర్మిస్తున్నారు. రచన, కెమెరా, డైరెక్షన్, ఎడ

RRR: రాజమౌళికి నో చెప్పిన మరో హాలీవుడ్ భామ!

Image
‘బాహుబలి’ సిరీస్‌తో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షించారు. ఆయన ప్రతిభ హాలీవుడ్ వరకు వెళ్లింది. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన రాజమౌళి.. ‘‘RRR’’ ప్రాజెక్ట్‌తో మరో సెన్సేషన్‌కు తెరలేపారు. ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో సినిమాను ప్రకటించి మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. తరవాత షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ తమిళనాడు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రను పోషిస్తోన్న ఎన్టీఆర్ సరసన ఒక ఇంగ్లిష్ బ్యూటీ హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. సినిమాను ప్రకటించినప్పుడే ఈ పాత్ర కోసం లండన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ పేరును రాజమౌళి ప్రకటించారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఈమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తరవాత అమెరికన్ నటి, సింగర్ ఎమ్మా రాబర్ట్స్‌ను రాజమౌళి ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఎమ్మా కూడా రాజమౌళికి నో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పాత్ర చేయడం కోసం ఎక్కువ రోజులపాటు షూ

కాకినాడలో ‘రణరంగం’.. అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణ!

Image
శర్వానంద్ హీరోగా నటించిన ‘రణరంగం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా నటించారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే, చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి, సినిమాపై అంచాలను పెంచడానికి ప్రీ రిలీజ్ వేడుకను త్వరలోనే నిర్వహిస్తున్నారు. తాజా ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ‘రణరంగం’ ప్రీ రిలీజ్ వేడుకను ఆగస్టు 4న కాకినాడలో నిర్వహిస్తారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ‘రణరంగం’ సినిమాను అత్యధిక భాగం కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే తెరకెక్కించారు. దీంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను అక్కడే నిర్వహించాలని నిర్ణయించారట. ఈ వేడుకకు చీఫ్ గెస్టులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే కాకినాడలో ఆగస్టు 4న పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. కాగా, ‘కేశవ’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన

‘కొబ్బరి మట్ట’: సంపూ వరల్డ్ రికార్డ్.. సింగిల్ టేక్‌లో అతిపెద్ద డైలాగ్

Image
బర్నింగ్ స్టార్ హీరోగా నటించిన మూడో చిత్రం ‘కొబ్బరి మట్ట’. ఈ సినిమాలో సంపూ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. ఒకటి పాపారాయుడు, మరొకటి పెదరాయుడు కాగా.. ఇంకొకటి ఆండ్రాయిడు. ఇప్పటికే పాపారాయుడు, పెదరాయుడు పాత్రలను పరిచయం చేశారు. మహిళ గొప్పతనాన్ని వివరిస్తూ నిమిషానికి పైగా నిడివితో పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు) టీజర్‌లో చెప్పిన డైలాగ్‌కు ప్రశంసలు అందాయి. ఆ డైలాగులో వెటకారాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ పెదరాయుడికి పోటీగా ఆండ్రాయిడు చాంతాడంత డైలాగుతో వచ్చాడు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. తాజాగా విడుదలైన ఆండ్రాయిడు పరిచయ ట్రైలర్‌లో 3.27 నిమిషాల నిడివితో నాన్ స్టాప్ డైలాగ్ ఉంది. ఈ డైలాగును సంపూర్ణేష్ బాబు సింగిల్ టేక్‌లో చెప్పారట. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ సంపూర్ణేష్‌ను ఆండ్రాయిడ్‌గా పరిచయం చేస్తూ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో ఆండ్రాయిడుగా సంపూ చించేశాడు. తన డైలాగ్ పవర్‌ను చూపించాడు. ‘‘ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్లుగా మారాలో వాడు రాబోతున్నాడు! చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు!

విజయ్ దేవరకొండను చూసి భావోద్వేగం.. హత్తుకుని ఏడ్చేసిన అమ్మాయి!

Image
సెన్సేషనల్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అమ్మాయిల హృదయాలను ఈ యంగ్ హీరో కొల్లగొట్టారు. ఆ తరవాత ‘గీత గోవిందం’తో అమ్మాయిల్లో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’తో విజయ్ క్రేజ్ నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు పాకేసింది. విజయ్ కోసం కేవలం తెలుగు అమ్మాయిలే కాదు తమిళం, కన్నడ, మలయాళం అమ్మాయిలు పడిచచ్చిపోతున్నారు. దీనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోనే సాక్ష్యం. తన అభిమాన హీరో విజయ్ దేవరకొండను అకస్మాత్తుగా చూసిన ఒక అమ్మాయి ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆయన్ని గట్టిగా హత్తుగా ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏడుస్తోన్న తన అభిమానిని దగ్గరకు తీసుకుని విజయ్ ఓదార్చారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది అనే విషయంలో స్పష్టత లేదు. బహుశా ఇటీవల ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్‌లో విజయ్ దేవరకొండ పాల్గొన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుని ఉండొచ్చు. ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రచారంలో భాగంగా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోనూ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించిన సంగతి

నాగార్జున పాలిటిక్స్.. బిగ్ బాస్ గాడు ఒక ఎదవ: శ్రీరెడ్డి హాట్ కామెంట్స్

Image
‘బిగ్ బాస్’ రియాలిటీ షో సీజన్ 3 ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. గత వారం రోజులుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతోన్న ‘బిగ్ బాస్’ షో తొలి ఎలిమినేషన్‌కు సిద్ధమైంది. హోస్ట్ అక్కినేని శనివారం హౌజ్‌లోని కంటెస్టెంట్లను మన టీవీ ద్వారా పలకరించి వారిలో జోష్ నింపారు. అయితే, ఎలిమినేషన్ టైమ్ వచ్చిందని నామినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్ల గుండెల్లో గుబులు పుట్టించారు. మొత్తానికి డేంజర్ జోన్‌లో ఉన్న ఆరుగురిలో ఇద్దరిని సేఫ్ జోన్‌లో వేశారు. ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన ఆరుగురు సభ్యుల్లో హిమజ, పునర్నవి సేఫ్ జోన్‌లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు. ఆనందం పట్టలేక హిమజ ఏడ్చేసింది కూడా. డేంజర్ జోన్‌లో మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు రాహుల్, వితికా, జాఫర్, హేమలలో హౌజ్ నుంచి బయటికి వెళ్లిపోయేది ఎవరో ఆదివారం తెలిసిపోతుంది. ‘బిగ్ బాస్’ అభిమానులు ఎలిమినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సమయంలో సోషల్ మీడియా సెన్సేషన్, వివాదాస్పద నటి హాట్ కామెంట్స్ చేశారు. హోస్ట్ నాగార్జున పాలిటిక్స్ మామూలుగా లేవంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలీవు. డబ్బిస

పంచెకట్టులో ‘వెంకీ మామ’.. లుక్ అదిరింది!

Image
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల నెలరోజులపాటు కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని వచ్చిన చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుతోంది. గత ఫిబ్రవరిలో తూర్పుగోదవారి జిల్లాలో గోదావరి ఒడ్డున ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ముగియనుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్నా ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. ఇలాంటి సమయంలో ఇటు వెంకటేష్ అభిమానులకు, అటు అక్కినేని ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం జరుగుతోన్న షూటింగ్‌లో పాల్గొంటున్న వెంకటేష్, రాశీఖన్నా లుక్స్ లీకయ్యాయి. వెంకటేష్ పంచెకట్టులో అదరగొడుతున్నారు. పంచెలో ఆయన వాకింగ్ స్టైల్ సింప్లీ సూపర్బ్. రాశీఖన్నా పసుపు రంగు లెహెంగాలో చూడముచ్చటగా ఉన్నారు. ఇదిలా ఉంటే, మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తు

‘పెద్దన్న’కు భయపడిన నిఖిల్.. ‘అర్జున్ సురవరం’ ఇప్పట్లో రాదు!

Image
హీరోగా సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. కిందటేడాది ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్.. దాని తరవాత ‘ముద్ర’ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఇదే పేరుతో మరో సినిమా రావడంతో వివాదమైంది. మొత్తం మీద టైటిల్‌ను మార్చి ‘అర్జున్ సురవరం’గా విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ తేదీకి సినిమా విడుదల కాలేదు. అదే టైమ్‌లో ‘అవెంజర్స్’ విడుదలవుతుండటంతో వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ విడుదల తేదీని మాత్రం ఇప్పటికీ ఖరారు చేయలేదు. ఏదో ఒక కారణం చూపుతూ వాయిదా వేస్తూ వస్తున్నారు. మే 9న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ విడుదల కావడంతో ఆ సమయంలో ‘అర్జున్ సురవరం’ను విడుదల చేసే ధైర్యం చేయలేదు. ఇప్పుడు ‘సాహో’కు భయపడుతున్నారు. ఆ సినిమా విడుదలైన తరవాతే ‘అర్జున్ సురవరం’ను విడుదల చేస్తారట. ఈ విషయాన్ని స్వయంగా హీరో నిఖిల్ సిద్ధార్థ వెల్లడించారు. ‘అర్జున్ సురవరం’ కోసం వేచిచూస్తోన్న ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా నిఖిల్‌ను ప్రశ్నించారు. ‘16 నెలలు అవుతుంది అన్న నీ మూవీ కి

దిల్ రాజుతో చిరంజీవి సినిమా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు!

Image
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరు. డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించి అద్భుతమైన సినిమాలు తీశారాయన. దిల్ రాజు సినిమా అంటే హిట్టు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, యువ హీరోలందరితోనూ సినిమాలు చేశారు దిల్ రాజు. అయితే, టాలీవుడ్‌కు నాలుగు పిల్లర్లుగా చెప్పుకునే మెగాస్టార్ , నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లలో ఇద్దరితో మాత్రమే దిల్ రాజు సినిమాలు చేశారు. అక్కినేని నాగార్జునతో ‘గగనం’ వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు.. వెంకటేష్‌తో ‘ఎఫ్2’ లాంటి బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కించారు. చిరంజీవి, బాలకృష్ణతో కూడా సినిమాలు నిర్మించాలని దిల్ రాజు కోరికట. అయితే, వీటిలో ఒక కోరిక తీరబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. దిల్ రాజుతో సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి అంగీకరించారట. ఇటీవల చిరంజీవిని దిల్ రాజు కలిశారని, సినిమా చేయాలని కోరుకుంటున్న విషయాన్ని ఆయనతో చెప్పారని సినీ వర్గాల ద్వారా తెలిసింది. దిల్ రాజు కోరిక పట్ల చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారట. చిరంజ

సినీ నటుడు శివాజీకి షాక్.. దుబాయ్‌ నుంచి వెనక్కి వెళ్లాలన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు

Image
సినీ నటుడు, టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ సన్నిహితుడైన శివాజీకి అధికారులు షాకిచ్చారు. టీవీ9 వాటాల కొనుగోలు వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంతో.. ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో దుబాయ్‌‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోవాలని సూచించారు. దుబాయ్ మీదుగా అమెరికా వెళ్తున్నారని తెలుస్తోంది. గత నెలలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళ్లడానికి శివాజీ ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. టీవీ9 యాజమాన్యం అలంద మీడియా కేసులో శివాజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రవి ప్రకాశ్ టీవీ9 సీఈఓగా ఉన్న సమయంలో సంతకాలు ఫోర్జరీ చేశారని.. ఆ ఛానెల్‌లో మెజార్టీ వాటాలు దక్కించుకున్న అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో శివాజీకి కూడా ప్రమేయం ఉన్నట్టు ఆరోపించింది. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు దేశం దాటి పోవద్దంటూ ఆంక్షలు విధించారు. తర్వాత ఆయనపై ఆంక్షలను తొలగించారు. ఏపీ ఎన్నికలకు చాలా రోజుల ముందే.. ఓ జాతీయ పార్టీ ‘ఆపరేషన్ గరుడ’కు శ్రీకారం చుట్టిందని శివాజీ ఆరోపించారు. ఆ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అ

ఊరికే ఎందుకు ఏడుస్తున్నావ్ అంటున్నారు.. కారణం ఇదే: విజయ్ దేవరకొండ

Image
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు . విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. ‘నిన్న‌, ఈరోజు, రేపు థియేట‌ర్స్ నింపిన అంద‌రూ నా స్వీట్ కామ్రేడ్సే. నిన్న నాకెంతో ఇంపార్టెంట్ అయిన రోజు. నాకు స్పెష‌ల్ మూవీ. ప‌ర్స‌న‌ల్ మూవీ. ఏడాది పాటు నా ఎమోషన్స్ అన్ని ఇందులో పెట్టేసి చేశాను. ఈ సినిమా కంటెంట్‌.. నా పర్శనల్ లైఫ్‌కి దగ్గరగా ఉంది. బాబీ, లిల్లీ జ‌ర్నీ.. వారి డ్రీమ్స్‌.. వారి ప్రేమ‌.. రిలేష‌న్ షిప్స్‌.. వారు ప‌డే క‌ష్టాలు.. క‌ష్టాల దాట‌డానికి ఫైట్ చేసే జ‌ర్నీ నాకు ఎంతో ప‌ర్స‌న‌ల్‌గా నిలిచింది. నేను ఎమోష‌న‌ల్ ప‌ర్స‌న్ అయ

ఒక్క నైట్‌కి 15 లక్షల ఆఫర్.. ఫోర్న్ చేయను కాని..: షకీలా సంచలన కామెంట్స్

Image
అంటే కొవ్వొత్తి అని అర్ధం.. తాను కరిగిపోతూ లోకానికి వెలుగునివ్వడమే కొవ్వొత్తి లక్షణం. తాను కూడా అంతే అంటోంది ఈ దక్షిణాది శృంగార తార. ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన షకీలా.. హీరోయిన్‌గా ఎదగాలని ఆశపడిన ... చివరికి శృంగార తార‌గా ఎలా మారిందో ఇప్పటికే ఆమె పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. తాజాగా ఆమె టీఎన్ఆర్‌ (ఐడ్రీమ్స్)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఆస్తులు అన్నీ పోవడానికి కారణం ఆమెనే.. ఒకప్పుడు హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న నేను ఆస్తులు పోగొట్టుకోవడానికి, సంపాదించకపోవడానికి కారణం అందర్నీ నమ్మడమే. నమ్మకమే నన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. చిన్నప్పటి నుండి నేను మా అక్క లేకుండా ఏదీ చేసేదాన్ని కాదు. నేను డ్రెస్ కొనుక్కోవాలన్నా అక్కదే ఫైనల్ నిర్ణయం. అలాంటిది ఏదైనా ఆస్తులు కొనాలనుకున్నప్పుడు ఏదో ఒక కారణంతో ఆపేసేది. నేను ఏ తప్పు చేయలేదని ఆమెకూ తెలుసు. ఆమె చదువు కోవాలంటే ఉన్న కాస్త ఆస్తిని ఆమెకు ఇచ్చేశా. వాళ్లను గుర్తు చేసుకుని చాలాసార్లు ఏడ్చా. అమ్మని అమ్మా అని పిలిస్తే.. అక్కని మమ్మీ అనేదాన్ని. నేను ఏ తప్పూ చేయలేదని రోజుకైనా వాళ్లు అది

దర్శకుడితో విజయ్ దేవరకొండకు విభేదాలు.. ఆగిపోయిన కొత్త సినిమా!

Image
‘ఇండస్ట్రీలో ఎవరిపని వాళ్లు చేసుకోవాలి.. ఒకరి పనిలో ఒకరు వేలు పెడితే అవుట్ పుట్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అందుకే నా పని నేను చూసుకుంటా.. దర్శకుడి దర్శకుడు, నిర్మాత పని నిర్మాత చూసుకుంటారు’ అంటుంటారు మహేష్ బాబు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. అయితే సెన్సేషన్ స్టార్ ఆ టైపు కాదు. ఆయన అన్నింట్లోనూ ఉంటారు. కథ విన్నామా? ఓకే చేశామా? రెమ్యునరేషన్ తీసుకున్నామా? అన్నట్టుగా కాకుండా.. కథ విన్నది మొదలు ప్రమోషన్స్ మొత్తం భుజాలపై వేసుకుంటారు. ఇక కథ, ప్రొడక్షన్ విషయాల్లో కూడా పర్సనల్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తుంటారు. అయితే ఇది కొన్ని సందర్భాల్లో ఈ వేలుపెట్టే కార్యక్రమం వరం అయితే మరికొన్ని సందర్భాల్లో శాపం అవుతుంది. ఆ ఉపోద్ఘాతం అంతా ఆయన అప్ కమింగ్ మూవీ ‘హీరో’కి సంబంధించినదే. విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ శుక్రవారం నాడు విడుదలై మిక్స్ టాక్‌‌తో రన్ అవుతోంది. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ.. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలైతో ‘హీరో’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మాళవికా మోహన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మేజర్ సీన్స్ చిత్రీకరించారు. అయితే దర్శకుడు ఆనంద్

Dear Comrade Download: డియర్ కామ్రేడ్ మూవీ ఆన్ లైన్‌లో.. దెబ్బకొట్టింది వాళ్లే!

Image
సినిమా ఇండస్ట్రీని ఎన్నాళ్ల నుండో పట్టి పీడిస్తున్న పైరసీ భూతం మరోసారి తన ప్రతాపం చూపించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని పైరసీ భూతం గట్టి దెబ్బకొట్టింది. ఈ సినిమా శుక్రవారం నాడు (జూలై 26)న విడుదల కాగా.. ఈ మూవీ వస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉన్న యూనిట్‌‌కు తమిళ రాకర్స్ షాకిచ్చారు. ‘డియర్ కామ్రేడ్’ థియేటర్లలో షోలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే సినిమా హెచ్‌డీ రిజల్యూషన్‌తో క్వాలిటీ పైరసీ ప్రింట్‌ను తమిళ రాకర్స్ వెబ్‌సైట్‌లో లీక్ చేశారు. ఎలాంటి సినిమానైనా ముందే లీక్ చేస్తామంటూ చెప్పి మరీ పైరసీకి పాల్పడుతున్న తమిళ్ రాకర్స్ మరోసారి తమ వక్రబుద్ధిని చూపించారు. తమిళ రాకర్స్ కొత్త సినిమాలను పైరసీ చేయడం ఇదే తొలిసారి కాదు. విడుదలైన ప్రతి చిత్రాన్ని, విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలను సైతం తమ వెబ్ సైట్‌లో లీక్ చేసి నిర్మాతల్ని కోలుకోలేని దెబ్బకొడుతున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, ఇంగ్లీష్ భాషలకి చెందిన సినిమాలని పైరసీ చేసి ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేస్తున్న ఈ ముఠాను యాంటీ పైరసీ సెల్ చట్టం కింద పలుమార్లు అరెస్ట్ అయినప్పటికీ వాళ్ల పాత అలవాట్లను మార్చుకోవడం లేదు. వీరి

పుల్లేటుకుర్రులో మోక్షజ్ఞతో కలిసి బాలయ్య ప్రత్యేక పూజలు.. కారణం ఇదే!

Image
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని పుల్లేటికుర్రు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులోని చౌడేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో తనయుడు మోక్షజ్ఞతో కలిసి బాలయ్య గురువారం ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో కొత్త సినిమా ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయంలో చండీ హోమం, సుదర్శన హోమం, రామలింగేశ్వరస్వామికి రుద్రాభిషేకం చేయించారు. పుల్లేటికుర్రుకు చెందిన ప్రముఖ వేద పండితులు, బాలకృష్ణ ఆధ్యాత్మిక గురువు కారుపర్తి నాగ మల్లేశ్వరరావు సిద్దాంతి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు,హోమాలు అభిషేకాలు నిర్వహించారు. కారుపర్తి నాగ మల్లేశ్వరరావు సిద్దాంతిగారి జ్యోతిషం అంటే బాలయ్యకు అపార నమ్మకం. తాను ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆయన సలహా తీసుకుంటారు. కుమార్తెల వివాహాల విషయంలో ఆయన సూచనలు, సలహాలను పాటించారని అంటారు. బాలకృష్ణ తన కొత్త చిత్రం ప్రారంభించే ముందు ఇక్కడకు వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. బాలయ్య ఇక్కడికి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. చౌడేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు సిద్ధాంతి ఇంటి వద్దకు కూడా అభిమ

Bigg Boss Telugu: తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు: బిగ్ బాస్ సెక్సువల్ ఫేవర్‌పై నాగ్ రియాక్షన్

Image
సీజన్ 3పై వస్తున్న వరుస వివాదాలు.. క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంపై తొలిసారి స్పందించారు బిగ్ బాస్ హోస్ట్ . ఆయన నటించిన ‘మన్మథుడు 2’ మూవీ ట్రైలర్ లాంఛ్‌లో భాగంగా మీడియా నుండి బిగ్ బాస్ కాంట్రివర్శిపై ప్రశ్నలు రావడంతో వాటిపై సమాధానం ఇచ్చారు నాగార్జున. ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ సూపర్‌గా ఉంది. దీని గురించి ఎప్పుడు అడుగుతారా? అని ఎదురుచూస్తున్నా. మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తున్నప్పుడు ఒకేచోట బిగుసుకుని పోయి కూర్చోవల్సిన పరిస్థితి. ఇక్కడ ఓపెన్‌గా హ్యాపీనెస్‌తో ఏది కావాలంటే అది చేయొచ్చు. స్టేజ్ అంతా అటు ఇటు తిరగొచ్చు. ఇది గొప్ప అనుభూతి. అయినా ఒక్కవారమే కదా.. అయ్యింది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి. ఆ హౌస్‌లో ఏం జరుగుతున్నాయో ఏంటో.. అటు వెళ్లినప్పుడల్లా అనుకుంటా.. పాపం ఏం చేస్తున్నారో లోపల అని. కాంట్రవర్శీలకు దూరంగా ఉండే నేను బిగ్ బాస్‌పై వచ్చే కాంట్రవర్శీలకు కూడా దూరంగానే ఉన్నాను. బిగ్ బాస్ అనే రియాలిటీ షో 15 దేశాల్లో ప్రసారం అవుతుంది. హిందీలో ఏకంగా 12 సీజన్‌లు రన్ అవుతున్నాయి. తమిళ్‌లో మూడు, కన్నడ రెండు, మలయాళం నాలుగు, మరాఠీ రెండు, తెలుగులో ఇప్పుడు మూడో సీజన్ ప్రారంభమైంది. కాంట్రవర్శీ

‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్స్.. బాక్సాఫీసు దుమ్ముదులుపుతోన్న ఉస్తాద్

Image
‘‘శంకర్.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’’ అంటూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ వెండితెరను షేక్ చేస్తున్నారు. పక్కా హైదరాబాద్ స్టైల్లో తొలిసారి ఆయన తెలంగాణ యాసలో మాట్లాడుతూ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బాక్సాఫీసు దుమ్ముదులుపుతోంది. ఇన్నాళ్లూ హిట్టులేక ఢీలా పడిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దాహాన్ని ఈ చిత్రం తీర్చింది. ఈనెల 19న విడుదలైన ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తరవాత కూడా కలెక్షన్ల వేగం తగ్గలేదు. ఆరు రోజుల్లో రూ.56 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. 8 రోజుల్లో రూ.61 కోట్లు రాబట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ ట్వీట్ చేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో రూ.61 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్వీట్‌లో పేర్కొంది. ‘బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్’ అనే క్యాప్షన్ కూడా పెట్టింది. వాస్తవానికి ఈ సినిమాకు తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఊరమాస్ సినిమా అంటూ విశ్లేషకులు సైతం పెదవి విరిచారు. అయితే, ఇవేవీ కలెక్షన్లపై ప్రభావం చూపలేదు. వారం రోజులు గడిచినా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. శుక్రవారం ‘డియర్ కామ్రేడ్’

‘ఇస్మార్ట్ శంకర్’కు రామ్ చరణ్ ప్రశంస.. ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్!

Image
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ మసాలా మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈనెల 19న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. అంతేకాకుండా, చాలా కాలంగా హిట్టుకు దూరమైన పూరీకి ఆ దాహాన్ని తీర్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ కావడంతో పూరి గురువు రాంగోపాల్ వర్మ ఇటీవల చిత్ర యూనిట్‌కు అదిరిపోయే పార్టీ ఇచ్చారు. పూరి అండ్ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా పట్ల పాజిటివ్‌గా స్పందించారు. ఇప్పుడు ఈ కోవలో మెగా పవర్ స్టార్ చేరారు. తాజాగా ఈ సినిమాను చూసిన రామ్ చరణ్.. హీరో రామ్‌తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్ ద్వారా అభినందనలు తెలిపారు. ‘‘రామ్‌తోపాటు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని మిగిలిన నటీనటులంతా చాలా ఎనర్జిటిక్‌గా నటించారు. ఈ విజయానికి కారకులైన పూరి గారికి అభినందనలు’’ అని రామ్ చరణ్ పోస్ట్ చేశారు. రామ్ చరణ్ పోస్ట్‌కు హీరో రామ్ కూడా స్పందించారు. ఫేస్‌బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్ తీసి.. దాన్ని ట్వీట్ చేశారు.

2 గంటల ప్రేమలో రెచ్చిపోయి ముద్దులు.. చివరికి ఏమయ్యారు?

Image
ఒక అమ్మాయి అబ్బాయి కలిసి రెండు గంటల పాటు బస్‌లో జర్నీ చేశారు. ఈ రెండు గంటల్లో ఎలా ప్రేమలో పడ్డారు. వారి మధ్య ఏం జరిగింది? అన్నది కథ. ఇలాంటి కథలో ఇప్పటికే చాలానే వచ్చాయి. కాని.. ఇది అలాంటి కథ కాదు.. ఇది చాలా కొత్తగా ఉంటాది. అదేంటంటే.. ఈ కథలో హీరో హీరోయిన్లు రోజుకి రెండు గంటలు మాత్రమే ప్రేమించుకుంటారు. వినడానికి కొత్తగా ఉన్న ఈ కథ పేరే ‘2 అవర్స్ లవ్’. కాన్సెప్ట్‌‌తో పాటు టైటిల్, ఆ టైటిల్ డిజైన్, క్యారెక్టర్లు, కథ నెరేషన్ ఇలా అన్నీ కొత్తగానే ఉన్నాయి. అంతెందుకు తాజాగా విడుదలైన ‘2 అవర్స్ లవ్’ ట్రైలర్‌ కూడా డిఫరెంట్‌గా కట్ చేశారు. నేను డైలీ 4 PM-6PM మాత్రమే ఖాళీగా ఉంటాను. ఆ టైంలో ప్రేమించు అని కండిషన్ పెట్టే హీరోయిన్‌ని ఇదిగో ఇప్పుడే చూసి ఉంటాము. ఆరు దాటిందంటే లవర్‌తో ఒక్కమాట కూడదు ఈ పెంకుపిల్ల. అంతెందుకు ఇద్దరూ కలిసి ముద్దుపెట్టుకునేప్పుడు కూడా ఆరు దాటిందంటే.. ఇక మరుసటి రోజు కోసం చూడాల్సిందే ఆ అమర ప్రేమికుడు. సుకుమార్ సినిమాలో హీరోల బిహేవ్ చేసే ఈ హీరోయిన్ ‘2 అవర్స్ లవ్’ వెనుక బలమైన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. దాన్ని హీరో తెలుసుకుని రెండు గంటలు మాత్రమే ప్రేమించే ప్రేయసితో 24 గంటలు ప్రేమించేలా

‘తూనీగ’ చిత్రానికి త‌నికెళ్ల భ‌ర‌ణి అభినంద‌న

Image
తూనీగ..ఒక దైవ ర‌హ‌స్యం పేరిట వ‌ర్థ‌మాన ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీం రూపొందిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం. భారీ చిత్రాల‌ను స్ఫురింపజేసేలా అత్యున్న‌త సాంకేతిక అంశాల‌తో రూపొందిన ఓ పురాణేతిహాస ప్ర‌ధాన చిత్రం.భార‌తీయ పురాస్మృతిలో అత్యంత ఆస‌క్తిదాయ‌క క‌థావస్తువుతో రూపొందిన ఈ చిత్ర పోస్ట‌ర్ ను ప్ర‌ముఖ క‌వి, ర‌చ‌యిత, ద‌ర్శ‌కులు త‌నికెళ్ల భ‌ర‌ణి ఆవిష్క‌రించారు. వ‌ర్థ‌మాన ర‌చ‌యిత,ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీం రూపొందించిన తూనీగ (ఒక దైవ‌రహ‌స్యం) చిత్ర పోస్ట‌ర్ ను ప్ర‌ముఖ ర‌చ‌యిత, క‌వి, నటు లు, ద‌ర్శ‌కులు త‌నికెళ్ల భ‌రణి ఆవిష్క‌రించారు.హైద్రాబాద్ లో ఆయ‌న స్వ‌గృహం వ‌ద్ద ఈ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసి, చిత్ర రూప‌క‌ర్త‌నూ, ఇత‌ర బృందా న్నీ అభినందించారు. తాత్విక చింత‌న నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.దేవ‌ర‌హ‌స్యం వెల్ల‌డించే క్ర‌మంలో ఉ త్కంఠ‌త‌ను పెంపొందించే క‌థాంశాన్ని తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంపై అంచ‌నాలు పెంచేలా పోస్ట‌ర్ ను డిజైన్ చేసిన తీరు బాగుంద‌ని అభినందించా రు. భార‌తీయ సంస్కృతిలో అనేకానేక తాత్విక ప‌ర అంశాల‌కు చ‌ర్చ‌కు రాద‌గ్గ అర్హ‌త ఉంద‌ని, ఆ కోవ‌లోనే ఓ ఆస‌క్తిక‌ర అంశాన్ని తీసుకు

వాణి కపూర్ బికినీ ‘వార్’.. స్టన్నింగ్!

Image
బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ ‘వార్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా అనువాదమై వస్తోంది. ఇటీవల విడుదలైన ‘వార్’ టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. హృతిక్, టైగర్ యాక్షన్ స్టంట్లు చూసి ప్రేక్షకులు వహ్వా అన్నారు. టీజరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోయారు. ఈ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘వార్’ను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమాలో హృతిక్ రోషన్‌కు జోడిగా నటిస్తోంది. టీజర్‌లో సముద్రపు ఒడ్డున బికినీలో మెరిసింది కూడా ఈమెనే. ఇప్పుడు ఆ లుక్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేశారు. బికినీలో వాణి స్టన్నింగ్ లుక్‌కు ప్రశంసలు అందుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె అందాన్ని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. తన బికినీ లుక్‌‌కు ఇంత మంచి ఫీడ్ బ్యాక్ రావడంపై వాణి స్పందించారు. ‘‘ప్రేక్షకుల నుంచి ఎప్పుడు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినా ఆనందంగాన