Posts

Showing posts from June, 2020

నటి పూర్ణను వేధించిన ముఠా అరెస్ట్.. గ్యాంగ్‌తో ఓ నటుడికి సంబంధాలు

Image
అవును, సీమ టపాకాయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ పూర్ణ. ఆమె అసలు పేరు . స్వస్థలం కేరళ. లాక్ డౌన్‌తో గత కొన్ని రోజులుగా పూర్ణ తన తల్లిదండ్రులతో కలిసి కేరళలోనే ఉంటుంది. ఈ క్రమంలో ఆమెను సోషల్ మీడియా వేదికగా ఓ గ్యాంగ్ వేధింపులకు గురి చేసింది. దీంతో పూర్ణ పోలీసుల్ని ఆశ్రయించింది. ఓ నలుగురు వ్యక్తుల నుంచి ఇటీవల వేదింపులు ఎదురవుతున్నట్టుగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు రాంగ్ కాల్స్‌ చేయడంతో పాటు డబ్బు ఇవ్వాలని ఆ వ్యక్తులు వేదిస్తున్నట్టుగా పోలీసులకు పూర్ణ ఫిర్యాదు చేసింది. కొద్ది రోజులుగా తన సోషల్ మీడియా పేజ్‌లలోనూ వారు ఇబ్బందికరంగా పోస్ట్‌ లు పెడుతున్నారంటూ ఆమె పోలీసులకు తెలిపింది. దీతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్ణను వేధింపులకు గురి చేసిన పలువురిని అరెస్ట్ చేశారు. ఓ హెయిర్‌ స్టైలిస్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్ణను బెదిరించిన ముఠాతో మలయాళ నటుడు ధర్మజన్‌ బోల్‌గట్టికి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీస్‌ కమీషనర్‌ విజయ్‌ సఖారే ఈ వివరాలను వెల్లడించారు. అంతేకాదు పూర్ణను వేధించిన ముఠా మరో 8 మంది మోడల

ఏంది సారూ!! మా కరెంట్ బిల్.. సందీప్ కిషన్ సెటైర్లు

Image
లాక్ డౌన్‌లో కరెంట్ బిల్లుల షాక్.. హీరో సందీప్ కిషన్‌కి తగిలింది. సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉండటంతో కరెంట్ వాడకం బాగా ఎక్కువైంది. ఈ లాక్ డౌన్‌లో విద్యుత్ వినియోగం బాగా ఎక్కువ కావడంతో.. విద్యుత్ బిల్లులు కూడా పేలిపోతున్నాయి. ఇప్పటికే విద్యుత్ బిల్లులు చెల్లించలేక సామాన్యులు గగ్గోలు పెడుతుంటే.. సెలబ్రిటీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికే తాప్సీ, కార్తీక లాంటి సెలబ్రిటీలకు కరెంట్ బిల్లులు షాక్ తగలగా.. ఈ విషయాన్ని షేర్ చేస్తూ పవర్ బిల్లులపై పవర్ ఫుల్ పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా సైతం స్పందిస్తూ.. ‘పవర్ బిల్లులు ఇలాగే వస్తే.. నెక్ట్స్ ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చింది అని ఆన్‌లైన్‌ వార్‌ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ‘మా ఇంట్లోని ఎలక్ట్రిసిటీ బోర్డు మీటర్‌ని చూస్తే చిన్నప్పుడు గిర్రుమంటూ తిరిగే ఆటో రిక్షా మీటర్‌ గుర్తొచ్చింది. ఏంది సర్‌ ఆ బిల్లులు. కొత్తగా రిలీజైన సినిమాల వీకెండ్‌ కలెక్షన్లలా కరెంట్‌ బిల్లులు ఉన్నాయి’ అంటూ సెటైర్లు వేశాడు సందీప్ కిషన్. అయితే సందీప్ కిషన్‌కి ఎంత కరెంట్ బిల్ వచ్చిందన్న విషయాన్ని తెలియజేయకపోవడంతో..

రఘు రామ కృష్ణం రాజుపై వర్మ పోస్ట్.. అతని కులాన్ని ప్రస్తావిస్తూ కామెంట్స్

Image
ఏంటండీ.. రాజుగారూ!! మీకు కాస్త వర్మ గాలి సోకినట్టు ఉంది.. ఆయనలాగే లాజిక్‌గా మాట్లాడుతూ నాకు నచ్చిందే చేస్తా.. నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతా అని షోకాజ్‌లకే తిరిగి షోకాజ్‌లు ఇస్తున్నారు. కొంపతీసి మీపై వర్మ ప్రభావం ఏం లేదు కదా?? అని నరసాపురం వైసీపీ ఎంపీ రాఘు రామ కృష్ణం రాజును అడిగితే ఆయన నుంచి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. భలేవారే.. నాపై వర్మ ప్రభావం లేకపోవడం ఏంటండీ!! ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయన యాటట్యూట్‌ అంటే పిచ్చి. అంతేకాదు.. మా ఇద్దరిలో ఓ కామన్ పాయింట్ కూడా ఉంది. నేను ఆయన చాలా స్లోగా మాట్లాడుతుంటాం. ఇద్దరి వాయిస్‌లు ఇంచు మించు ఒకేలా ఉంటాయి. వాయిస్‌‌ల పరంగా మేం ఇద్దరం వీక్ అయినా ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేస్తాం’ అంటూ ఈ ఎంపీ గారు తనలోని వర్మని బయటపెట్టారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ.. ‘మైండ్ బ్లోయింగ్.. రాజుగారూ!! రాజకీయాల్లో ఇలాంటి పర్సనాలిటీని ఇప్పుడే చూస్తున్నా.. వెరీ ఇంట్రస్టింగ్ అంటూ కామెంట్ చేశారు. ఇక ట్విట్టర్‌లో రాఘు రామ కృష్ణం రాజుని సింహంతో పోల్చుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు రాజు అనే క్యాస్ట్ ఫీలింగ్ లేదు.., కాని నాకు ఖచ్చితంగా రఘు రామ కృష్ణరాజు ఫ

కరోనాను జయించిన బండ్ల గణేష్.. రిపోర్ట్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్

Image
కరోనా మహమ్మారి ప్రభావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కమెడియన్, నిర్మాత, పౌల్ట్రీ యజమాని పూర్తిగా కోలుకున్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు రోజుకు కేసులు పెరుగిపోతున్నాయి. దీంతో మళ్లీ లాక్ డౌన్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నగరంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి వెళ్లిన నిర్మాత బండ్ల గణేష్‌కి కరోనా సోకడం ఇండస్ట్రీలో కలకలం రేగింది. ఒకవైపు షూటింగ్‌లు తిరిగి ప్రారంభమైన తరుణంలో బండ్ల గణేష్‌కి కరోనా సోకడంతో ఈ వైరస్ ఎప్పుడు ఏ సెలబ్రిటీకి వ్యాపిస్తుందా అనే ఆందోళనలో ఉన్నారు. అయితే సుమారు 14 రోజుల చికిత్స అనంతరం నిర్మాత బండ్ల గణేష్ కరోనాను జయించి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తనను ప్రాణాలను కాపాడిన దేవుడికి ధన్యవాదాలు తెలియజేశారు బండ్ల గణేష్. ఈ సందర్భంగా అపోలో డయోగ్నోస్టిక్స్‌లో నిర్వహించిన కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌ని షేర్ చేశారు బండ్ల గణేష్. కాగా ‘మీరు చేసిన మంచి పనులు వల్ల దేవుడు నీయందున ఉండి మీకు మం

శ్రీదేవి తైస్ చూసే ఆమెకు బిగ్ ఫ్యాన్ అయ్యా: రామ్ గోపాల్ వర్మ

Image
పేరు చెబితే చాలు మనకు సంచలనం, వివాదాస్పదం, వెటకారం వంటి పదాలు గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన తీరు ఇలానే ఉంది మరి. ఎవ్వరి మాటా వినడు సీతయ్య అన్నట్టుగా వర్మ కూడా ఎవ్వరినీ పట్టించుకోరు. తనకు నచ్చిన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. వివాదాలను కూడా లెక్కచేయరు. అందుకే గట్స్ ఉన్న ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో దర్శక, నిర్మాతలంతా ఏం చేయాలని ఆలోచిస్తుంటే.. వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నారు. ఓటీటీకి ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత సమయంలో దానిని తలదన్నే ఏటీటీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. చిన్న చిన్న సినిమాలు చేస్తూ వాటిని ఏటీటీలో విడుదల చేస్తూ డబ్బులు చేసుకుంటున్నారు. మియా మాల్కోవా ‘క్లైమాక్స్’తో తన లాక్‌డౌన్ బిజినెస్‌ను మొదలుపెట్టిన వర్మ.. ‘నగ్నం’ (NAKED)తో సంచలనం సృష్టించారు. దేశీ బ్యూటీతో అందాలు ఆరబోయించి ఆ తరహా సినిమాలు చూసే వారిని తనవైపు తిప్పుకున్నారు. ఏడాదికి రూ.350 పెట్టి ఓటీటీ ప్లాట్‌ఫాంను సబ్‌స్క్రైబ్ చేసుకునే ఈ రోజుల్లో ఒక్క సినిమాకు రూ.200 చార్జ్ చేశారు. అయినప్పటికీ జనం ఎగబడ్డారు. 20 గంటల్లోనే రూ.70 లక్షలకు

Ram Gopal Varma: నాపై ఆర్జీవీ ప్రభావం.. షోకాజ్‌కే షోకాజ్ ఎవరి ఐడియా అంటే..: రఘు రామ కృష్ణం రాజు

Image
వైసీపీ పార్టీ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసులు పంపిస్తే లాజిక్‌లు లాగుతూ.. పార్టీకే షోకాజ్ ఇచ్చారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజు మాటలు, ఆయన వ్యవహారశైలి కాస్త వర్మను పోలి ఉండటంతో ‘మైండ్ బ్లోయింగ్’ అంటూ స్పందించారు ఆర్జీవీ. ఈ ఇష్యూపై రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. ఖచ్చితంగా నాపై ప్రభావం ఉంటుంది. వర్మ ఆటిట్యూట్ నాకు చాలా ఇష్టం. మా ఇద్దరికీ ఓ కామన్ పాయింట్ ఉంది. నేను ఆయన చాలా స్లోగా మాట్లాడుతుంటాం. ఇద్దరి వాయిస్‌లు ఇంచు మించు ఒకేలా ఉంటాయి. వాయిస్‌‌ల పరంగా మేం ఇద్దరం వీక్. అయితే ప్రజెంట్ ఇష్యూలో షోకాజ్‌కి తిరిగి షోకాజ్ ఇవ్వడం అనేది నాకు వచ్చిన ఐడియానే. నేను మా పార్టీ పెద్దల్ని గిల్లడం లేదు.. నా చెంప మీద కొడితే.. నేను గిల్లి ఉంటాను బహుశా.. నేనేం గాంధీని కాదు. రెండో చెంప చూపించడానికి’ అంటూ గోదావరి వెటకారంతో వర్మ ప్రస్తావన తీసుకువచ్చారు వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.

బట్టతల, తెలంగాణ యాస.. చాలా కష్టపడ్డాను: నవీన్ చంద్ర

Image
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు . ఆ సినిమా తరవాత న‌టుడిగా త‌న‌ను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వ‌స్తున్నారు. హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా, స‌లోని లూథ్రా హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘భానుమ‌తి రామ‌కృష్ణ’. తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఈ సినిమా ప్రసారం కానుంది. జూలై 3న ‘భానుమతి రామకృష్ణ’ ప్రీమియ‌ర్ ప్రసారం కానుంది. ఈ సంద‌ర్భంగా న‌వీన్ చంద్ర మీడియాతో ముచ్చటించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. రామ‌కృష్ణ ఎలా ఉండ‌బోతున్నాడు? మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. ఉన్నదాంట్లో హ్యాపీగా ఉండాల‌నుకునేవాడు. రేపు రామ‌కృష్ణను తెర‌పై చూస్తే చాలా మంది వారిని చూసుకున్నట్లు ఫీల్ అవుతారు. కామన్ ఆడియన్‌కి అంతగా క‌నెక్ట్ అయ్యే పాత్రే రామ‌కృష్ణ. డైరెక్టర్ శ్రీకాంత్ క‌థ చెప్పిన‌ప్పుడు మీకేమ‌నిపిచింది? ఫ్రెండ్ ద్వారా డైరెక్టర్ శ్రీకాంత్ నాకు ప‌రిచ‌యం అయ్యాడు. త‌ను ముందు రామ‌కృష్ణ పాత్రను కాస్త బొద్దుగా, బ‌ట్టత‌లతో, తెలంగాణ యాస‌తో మాట్లాడేలా ఊహించుకుని రాసుకున్నాడు. త‌ను రాసుకున్న స్క్రిప్ట్ న‌చ్చడంతో త‌న‌ని డైరె

Anchor Pradeep: ప్రదీప్ పెళ్లి నా చావుకొచ్చింది, ‘పెళ్లి చూపులు’ రచ్చపై సుమ మళ్లీ..!

Image
టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ప్రభాస్ ఫస్ట్‌ ప్లేస్‌లో ఎలా ఉంటారో.. బుల్లితెరపై కూడా తొలిస్థానంలోనే ఉంటారు. ప్రదీప్ చేసే ప్రతి ప్రోగ్రామ్‌లోనూ ఇతగాడి పెళ్లి ప్రస్తావన లేకుండా కార్యక్రమం జరగడం రేర్. తాను హోస్ట్ చేసే కార్యక్రమాల్లోనే కాకుండా ఇతర కార్యక్రమాలకు గెస్ట్‌‌గా వెళ్లినా ప్రదీప్ పెళ్లి డిస్కషన్‌పై జోక్‌లు పేలుతూ ఉంటాయి. తాజాగా యాంకర్ సుమతో కలిసి కార్యక్రమానికి గెస్ట్‌గా వెళ్లిన ప్రదీప్‌కి ‘పెళ్లి చూపులు’ రచ్చ వెంటాడింది. లాక్ డౌన్ అనంతరం లాంగ్ గ్యాప్ తరువాత ఈటీవీలో ప్రసారం అయ్యే ‘అలీతో సరదాగా’ ఇంకాస్త సరదాగా ప్రారంభమైంది. వచ్చే వారానికి (జూలై 6) సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. పంచ్‌లతో ఫుల్ ఫన్ జనరేట్ చేస్తున్నారు యాంకర్ ప్రదీప్, అలీ, సుమలు. ఈ ముగ్గురూ ఒక్కొక్కరుగా ఉన్నారంటేనే పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు పటాసుల్లా పేలతాయి. ఇక ముగ్గురూ కలిస్తే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో తాజా ప్రోమోతో హింట్ ఇచ్చారు. యాంకరింగ్ కుటుంబానికి శివగామిగా సుమను పరిచయం చేశారు యాంకర్ ప్రదీప్. ఇక సెట్‌లో ఉన్న వాళ్లకు దోసెలు వేసి పెడుతూ షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు అలీ. సుమ.. మన పెద్దోళ్లు చ

అందుకే నగ్నంగా నటించా.. ‘నాంది’ ప్రయోగం కాదు: అల్లరి నరేష్

Image
అంటే కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు. టాలీవుడ్‌లో అల్లరి నరేష్ మరో రాజేంద్ర ప్రసాద్ అని చెబుతుంటారు. అయితే, కేవలం కామెడీ చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు కూడా చేశారు నరేష్. ‘గమ్యం’, ‘నేను’, ‘శంభో శివ శంభో’ వంటి చిత్రాల్లో నరేష్ చేసిన పాత్రలు విమర్శకుల ప్రసంశలు అందుకున్నాయి. ఇటీవల మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలోనూ ఒక మంచి పాత్రలో నరేష్ నటించారు. అయితే, నరేష్ ఇప్పుడు ‘నాంది’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నరేష్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం (జూన్ 30న) ‘నాంది’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో నరేష్ మేకప్ లేకుండా నటిస్తున్నారు. అంతేకాదు, నగ్నంగా కూడా కనిపించనున్నారు. ఇప్పటికే అల్లరి నరేష్ నగ్నంగా ఉన్న పోస్టర్ విడుదలైంది. టీజర్‌లో సైతం నరేష్ నగ్నంగా ఉన్న విజువల్స్ ఉన్నాయి. అసలు ఈ సన్నివేశం చేయడానికి ఆయన ఎందుకంత సాహసం చేశారు? అంటే సిట్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి అంటున్నారు నరేష్. Also Read: ‘నాంది’ సినిమా గురించి తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూలో మ

Sri Reddy: పూనమ్ కౌర్ మళ్లీ ప్రెగ్నెంట్.. పవన్-పూనమ్‌ రహస్య బంధంపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్

Image
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-పూనమ్ కౌర్ రహస్య బంధంపై గత కొంతకాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్న వివాదాస్పద నటి మరోమారు ఈ ఇద్దర్నీ టార్గెట్ చేసి రెచ్చిపోయింది. ఈసారి ఇంకాస్త ఘాటు పెంచుతూ సంచలన పోస్ట్‌ను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది. ‘ఈ బ్రెయిన్ లేని పూనమ్ అక్క ఒకటి.. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు పీకే ****** పట్టుకుని ఉయ్యాల ఊగుతాంది. మళ్లీ ప్రెగ్నెంట్ ఏమో’ అంటూ రాయడానికి వీలులేని బూతులతో చెలిరేగింది శ్రీరెడ్డి. అయితే ఈసారి పూనమ్‌ని టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఏంటంటే.. రీసెంట్‌గా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సినిమాను ప్రకటిస్తూ.. పవన్ డూప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. డిజిటల్ టెక్నాలజీకి, ఆన్‌లైన్ వేదికలను క్యాష్ చేసుకుంటూ RGVWorld.in/ShreyasET ద్వారా వరుస సినిమాలు విడుదల చేస్తున్న వర్మ తాజాగా క్రితం పవన్ కళ్యాణ్ లైఫ్ ఆధారంగా 'పవర్ స్టార్' సినిమా తీస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రలో నటించేందుకు ఆయన పోలికలతో ఉన్న నరేష్ అనే టిక్ టాక్ స్టార్‌ని పట్టుకున్నారు వర్మ. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

అదిరింది రా.. నీ కొత్త అవతారం!! వెయిటింగ్ ఇక్కడ.. అల్లరోడి‌పై నాని కామెంట్స్

Image
హీరో పుట్టిన రోజు కానుకగా ఆయన లేటెస్ట్ మూవీ 'నాంది' టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే గాక, టీజర్‌లో అల్లరోడి అవతారం, డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా ఈ 'నాంది' టీజర్ చూసిన .. తనదైన స్టైల్ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. `అదిరింది రా.. నీకు, నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు. `నాంది` సినిమా కోసం వెయిట్ చేస్తున్నా` అంటూ నాని ట్వీట్ చేశాడు. ఈ మేరకు తన బర్త్ డే సర్‌ప్రైజ్ అని పేర్కొంటూ అల్లరి నరేష్ చేసిన ట్వీట్ ట్యాగ్ చేశాడు. కేవలం హీరోలుగానే కాక నిజ జీవితంలో కూడా అల్లరి నరేష్, నాని మంచి స్నేహితులు కావడంతో ఈ ట్వీట్ చూసి ఇరువురి అభిమానులు మురిసిపోతున్నారు. Also Read: విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న నాంది సినిమాకు స‌తీష్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. అల్లరి నరేష్ కెరీర్‌లో ఇది 57వ సినిమా. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు 'నాంది' నుంచి విడుదలైన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో అంచనా

‘బంగారు బుల్లోడు’ టీజర్: బొడ్డు కనకమహాలక్ష్మి.. ఇంటిపేరు ఒంట్లోనే పెట్టేసుకుంది!

Image
అల్లరి నరేష్, పూజా ఝవేరి హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పి.వి.గిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది పండుగనాడు విడుదల చేసిన ‘బంగారు బుల్లోడు’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. అంతేకాకుండా, నందమూరి బాలకృష్ణ సూపర్ చిత్రం ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో నరేష్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కాగా, పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ‘బంగారు బుల్లోడు’ టీజర్‌ను‌ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఇది మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నారు. బ్యాంక్ లాకర్‌లో ఉన్న కస్టమర్ల బంగారు ఆభరణాలు, నరేష్ పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ‘‘బొడ్డు కనకమహాలక్ష్మి.. ఇంటిపేరు ఒంట్లోనే పెట్టేసుకుంది’’ అని నరేష్ చెప్పే డైలాగ్ సినిమాలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపిస్తోంది. Also Read: పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నరేష్ పాత్ర ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ చెబు

మహేష్ బాబు కూతురు సితార చిన్ననాటి ఫోటోలు వైరల్

Image
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో సినీ సెలబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితం అయ్యారు. షూటింగులు నిలిపివేయడంతో సరదాగా తమ కుటుంబంతో గడుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ... ఎప్పటికప్పుడు తమ అభిమానుల కోసం అప్ డేట్స్ అందిస్తున్నారు. అండ్ ఫ్యామిలీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ భార్య నమత్ర తమ గారాల పట్టి సితారకు సంబంధించిన చిన్న నాటి ఫోటోల్ని షేర్ చేశారు. షేర్ చేసిన ఫోటోల్లో సితార మరింత ముద్దుగా కనిపిస్తోంది. నుదుటిన పెద్ద బొట్టుతో పాటు.. రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో సితార ఫోటోలు మరింత క్యూట్‌గా ఉన్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ కూడా సరదాగా ఫీల్ అవుతున్నారు. కొద్ది రోజులుగా సితార తన తండ్రి సినిమా పాటలకి డ్యాన్స్ చేస్తూ.. ఫన్ వీడియోలు చేస్తూ నెటిజన్స్‌ని సితార అలరిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇక మహేష్, నమ్రత కూడా సితార, గౌతమ్‌తో కలిసి చేసే సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. ఇటు మహేష్ కూడా సోషల్ మీడియాలో సామాజిక అంశాల పట్ల కూడా స్పందిస్తూ వస్తున్నారు. భారత్ పై చైనా దాడులు, సుశాంత్ ఆత్మహత్య, అమ

Surekha Vani: సురేఖవాణి, హేమ.. కూతుళ్లతో రచ్చ, హీరో బాలేకపోతే డైలాగ్ చెప్పరట ఈ డాటర్స్

Image
సీనియర్ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్‌‌లు హేమ, సురేఖ వాణిలు తమ కూతుళ్లతో సందడి చేస్తున్నారు. యాంకర్ సుమ హోస్ట్ చేసే పాపులర్ ఎంటర్ టైన్మెంట్ షో క్యాష్‌లో కూతుళ్లతో కలిసి బుట్టబొమ్మ బొట్టబొమ్మ అంటూ నడుముల్ని గింగిరాలు తిప్పుతూ క్యాష్ స్టేజ్‌పై స్టెప్పులు వేస్తున్నారు ఈ బ్యూటీ మమ్మీలు. వచ్చే వారానికి (జూలై 20) సంబంధించిన క్యాష్ ప్రోమోను విడుదల చేయగా.. ఇందులో కూతురు సుప్రిత, హేమ కూతురు ఇషాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ సాంగ్‌కి యాంకర్ సుమతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఈ ప్రోమోలో.. ‘ఏ యాంగిల్‌లో చూసుకున్నా.. మీరసలు తల్లీ కూతుళ్లులా ఉన్నారా? అని యాంకర్ సుమ అడగ్గా.. మీ పిల్లల్ని పక్కన పెడితే మీరూ అలాగే ఉంటారు అంటూ పంచ్ వేసింది సురేఖ వాణి. ఇంతకీ మిమ్మల్ని అక్కా అనాలా? ఆంటీ అనాలా? ఫ్రెండ్ అనాలా? అని యాంకర్ సుమని సురేఖ వాణి కూతురు సుప్రిత అమాయకంగా అడగ్గా.. ‘ఏదోటి అనమ్మా’? అంటూ తనదైన శైలిలో చెప్పింది సుమ. మీరు ఈ జనరేషన్‌ని ఆ జనరేషన్‌ని కవర్ చేసేలా ఉన్నారని సురేఖ వాణి.. సుమని ఉద్దేశించి అనగా మీరు ఆ తరువాత జనరేషన్‌ని కూడా కవర్ చేస్తారని పంచ్ పేల్చింది.

నాంది టీజర్: నగ్నంగా నరేష్.. అబ్బో! మనోడు మామూలు డైలాగ్ చెప్పలేదండీ బాబూ

Image
ఇన్నాళ్లు కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించిన .. ఈ సారి ట్రాక్ ఛేంజ్ చేశారు. కామెడీలోనే ఎమోషన్ పండిస్తూ ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయి ఎమోషనల్ కాన్సెప్ట్‌తో '' రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథకు ఎమోషనల్ అంశాలు కలిపి రెడీ చేసిన ఈ కథను డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. కాగా ఈ రోజు (జూన్ 30) అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ 'నాంది' టీజర్ రిలీజ్ చేసి మరింత అట్రాక్ట్ చేశారు మేకర్స్. ఒక నిమిషం 28 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంది. టీజర్‌లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆతృతను పెంచేశాయి. ఇక ఇందులో నరేష్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆలోచింపజేయడమే గాక మూవీపై అంచనాలు పెంచేసింది. Also Read: ''ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్‌ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సర్‌.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది'' అంటూ తీవ్ర ఆవేదన చెందుతూ నరేష్ ఈ డైలాగ్ చెప్పారు. ఈ టీజర్ చూస్తుంటే అల్లరి నర

Ram Gopal Varma: 'పవర్ స్టార్' ఎవరో తెలిసిపోయింది.. ఇవిగో పూర్తి వివరాలు!! వాళ్ళిద్దరి మధ్య డీల్..

Image
సమయం, సందర్భం ఏదైనా సరే.. రామ్ గోపాల్ వర్మకు తెలిసిన ఒకే ఒక మంత్రం సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వార్తల్లో నిలవడం. ఆయన మాట, దూసుకుపోయే విధానం, తీసే సినిమాలు దేనికవి ప్రత్యేకమే. అది సినిమా అయినా, ఇంటర్వ్యూ అయినా తాను చెప్పాలనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టేయడం వర్మ నైజం. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా మోల్డ్ అవుతూ సినిమాలు రూపొందించడం ఆయన లోని స్పెషల్ క్వాలిటీ. ఈ క్రమంలోనే డిజిటల్ టెక్నాలజీకి, ఆన్‌లైన్ వేదికలకు డిమాండ్ పెరుగుతుండటం క్యాచ్ చేసుకుంటూ RGVWorld.in/ShreyasET ద్వారా వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నారు వర్మ. ఇప్పటికే ''క్లైమాక్స్, నగ్నం'' సినిమాలతో సంచలనం సృష్టించిన ఆయన గత రెండు రోజుల క్రితం లైఫ్ ఆధారంగా 'పవర్ స్టార్' సినిమా తీస్తున్నట్లు ప్రకటించి మరో ఆటం బాంబ్ వేశారు. అంతేకాదు ఇందులో నటించబోయే నటుడు, ఇతనే అంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. Also Read: వర్మ విడుదల చేసిన ఆ వీడియోలోని నటుడు అచ్చం పవన్ కళ్యాణ్‌ని పోలి ఉండటంతో.. అతను ఎవరు? ఆ నటుణ్ని వర్మ ఎలా పట్టాడు? అనే అన్వేషణ మొదలైంది. ఈ నేపథ్యంలో ‘తెలుగు సమయం’కు ప

అల్లుడు అదుర్స్: రంగంలోకి దూకేందుకు రెడీ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Image
దేశంలో కరోనా కాటుకు సెట్స్‌పై ఉన్న ప్రతిఒక్క సినిమా బలైపోయింది. ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ అన్నీ తలక్రిందులయ్యాయి. లాక్‌డౌన్ రావడంతో దాదాపు మూడు నెలలుగా కెమెరా స్విచ్చాన్ చేయకపోవడంతో షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయి.. విడుదల వాయిదా వేసుకున్నాయి. అయితే ఇటీవల షూటింగ్స్‌కి అనుమతులు రావడంతో తిరిగి ఒక్కొక్కరుగా సెట్స్ మీదకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యారని తెలిసింది. 'రాక్షసుడు' మూవీ తర్వాత తన తర్వాతి సినిమాను సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు బెల్లకొండ శ్రీనివాస్. లాక్‌డౌన్‌కి ముందే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేస్తుకున్న ఈ మూవీకి 'అల్లుడు అదుర్స్' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్.. లాక్‌డౌన్ అమలులోకి రావడంతో చివరి షెడ్యూల్ షూటింగ్ కూడా జరపలేకపోయింది. దీంతో సినిమా రిలీజ్ కూడా వాయిదాపడింది. Also Read: ఈ నేపథ్యంలో తాజాగా 'అల్లుడు అదుర్స్' తదుపరి షెడ్యూల్ కోసం డేట్స్ ఫిక్స్ చేశారట దర్శకనిర్మాతలు. ఈ షూటింగ్ వచ్చే నెల నుంచి హైదరాబాదులో జరిపేల

టెన్త్ పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలంటున్న టాలీవుడ్ ప్రముఖ హీరో

Image
కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని రకాలు పరీక్షలు రద్దు అయ్యాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. లాక్ డౌన్ లో కొంచెం సడలింపులు ఇచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గకపోవడం వలన కొన్ని రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసారు. అందులో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో టెన్త్ పరీక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు. పదవ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలనీ అన్నారు విష్ణు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి?’అంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక పలువురు నెటిజన్లు విష్ణు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం విష్ణు ఆలోచన సరికాదంటున్నారు. . ఎందు

NAKED Movie: షాకింగ్.. ‘వర్మ’ నగ్నం బడ్జెట్ లక్ష కాదు.. జస్ట్ 2 వేలు, 12 గంటల్లో 70 లక్షల రెవెన్యూ, లెక్కలివిగో

Image
నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది ‘నగ్న’ సత్యం అంటున్నారు ‘నగ్నం’ దర్శకుడు . వెస్ట్ గోదావరి స్వీటీ పాపతో నగ్నం-నేకెడ్ అనే లషు చిత్రాన్ని రూపొందించి జూన్ 27 రాత్రి 9 గంటలకు RGVWorld.in/ShreyasET ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేశారు ఆర్జీవీ. అంతకు పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే మరో బూతు చిత్రాన్ని తీసి ఆన్ లైన్‌లో కాసులు కురిపించుకున్న వర్మ.. ఈ యాపారం ఏదో బాగుందని ఎలాగూ సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి దేవరపల్లి (వెస్ట్ గోదావరి) పెద పాపతో ‘NAKED (నగ్నం) అనే చిత్రాన్ని వదిలిపెట్టారు. స్వీటీ నగ్న చిత్రం చూడాలంటే.. రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని రేటు ఫిక్స్ చేశారు వర్మ. అసలే లాక్ డౌన్ కరువులో ఉన్నారో ఏమో కాని.. స్వీటీ పాప ‘నగ్నం’ చూసేందుకు పోటీ పడ్డారు నెటిజన్లు. ఏకంగా తొలి అరగంటలోనే 23,560 టిక్కెట్లు అమ్ముడు కాగా.. ఈ లఘు చిత్రం మొదటి 12 గంటలలో 70 లక్షల రెవెన్యూ తీసుకొచ్చింది. ఇక తొలి 20 గంటల్లో ఏకంగా 35445 పెయిడ్ వ్యూస్ వచ్చాయి. సోమవారం నాటికి కోటిని క్రాస్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ‘నగ్నం’. అయితే సినిమా ఎగబడి చూసిన వాళ్లు ఇందులో ఏం లేదని తేల్చేసినా.. వర్మ కాన్సెప్ట్

Rgv: అల్లు అర్జున్, రానా పేర్లు తీస్తూ రామ్ గోపాల్ వర్మ కామెంట్స్.. ఆ ఇద్దరి కారణంగా!!

Image
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో నెపోటిజం అనే అంశంపై పలు చర్చలు నడుస్తున్నాయి. నటీనటులు, ప్రేక్షకులు అంతా ఈ బంధుప్రీతి గురించే మాట్లాడుకునే పరిస్థితులు వచ్చేశాయి. సినీ వారసులకే అవకాశాలు, స్టార్ స్టేటస్ తప్ప టాలెంటెడ్ యాక్టర్స్ ఎవ్వరికీ కనిపించరనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ప్రముఖుల వస్తున్న విమర్శలు, ఇండస్ట్రీలో నెపోటిజం లాంటి అంశాలపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ద్వారానే స్టార్ స్టేటస్ కొట్టేయడం ఎవరి తరం కాదని అన్నారు. రియల్ నెపోటిజం అంటే స్టార్ హీరోల కుమారులందరూ స్టార్ హీరోలు కావాలి.. కానీ అలా జరగడం లేదే అంటూ ఆసక్తికరంగా స్పందించారు వర్మ. హిందీలో ఫిరోజ్ ఖాన్, అమితాబ్ లాంటి హీరోలు తమ కుమారులను స్టార్ హీరోలుగా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. Also Read: ఈ సందర్భంగా.. గతంలో జరిగిన ఓ విషయాన్ని వర్మ ప్రస్తావించారు. కొన్నేళ్ల క్రితం తనను ఓ తమిళ నటుడు కలిశాడని... , కోసం అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు తన కెరీర్ నాశనం చేశారని చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ, రానాను ఇండస్

Jr.Ntr: బెదిరింపులు ఆపండి.. తారక్ గతం గురించి తెలిస్తే..! హీరోయిన్ పాయల్ ఘోష్

Image
చిత్రసీమలో నెపోటిజం (బంధు ప్రీతి) అనే అంశంపై గత కొన్నేళ్లుగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే డిప్రెషన్‌తో సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటంతో నెపోటిజంపై ఆగ్రహ జ్వాలలు రగులిపోతున్నాయి. పలువురు నటీనటులు ఈ అంశంపై నోరువిప్పి చిత్రసీమలో జరుగుతున్న వ్యవహారం, సీక్రెట్స్ బయటపెట్టేస్తున్నారు. టాలెంట్ ఉన్న నటీనటులను పక్కన బెట్టి కేవలం కొంతమంది వారసత్వం నుంచి వచ్చిన నటులకు అవకాశాలు ఉస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మద్దతిస్తూ రంగంలోకి దిగిన పాయల్ ఘోష్‌కి‌ సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కూడా నెపోటిజం ప్రొడక్టే అంటూ ఆమెను ట్యాగ్ చేస్తూ మెసేజీలు పెడుతున్నారు నెటిజన్లు. దీంతో అదే సోషల్ మీడియా ద్వారా మరోసారి రియాక్ట్ అయిన పాయల్.. ఎన్టీఆర్‌కి తానెందుకు మద్దతు ఇస్తున్నానన్న విషయాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని పేర్కొంటూ, తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. Also Read: సినిమా కోసం తారక్ పడే కష్టం ఏంటనేది ఎవ్వరికీ తెలియదని పాయల్ తన ట్వీట్‌లో తెలిపింది. తారక్ గతం గురించి తెలుసుకున్నాక తనకు కన్నీళ్లు ఆగలేదని,

శ్యామ్ కె నాయుడు కేసులో కొత్త ట్విస్ట్.. బెయిల్ రద్దు, ఫోర్జరీ కేసు

Image
తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై నటి హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్ కె నాయుడుని అరెస్ట్ చేశారు. అయితే, రిమాండ్‌కు తరలించిన రెండు రోజులకే బెయిల్ మీద బయటకు వచ్చారు. సాయి సుధతో తాను రాజీ కుదుర్చుకున్నట్టు నాంపల్లి కోర్టులో శ్యామ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, శ్యామ్‌కు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సాయి సుధ కోర్టుకెక్కారు. తనతో కాంప్రమైజ్ అయినట్టు శ్యామ్ కె నాయుడు కోర్టుకు సమర్పించిన బెయిల్ పిటిషన్‌లో ఉన్నది తన సంతకం కాదని సుధ వెల్లడించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కోర్టుకు సుధ తెలియజేశారు. నఖిలీ పత్రాలు సృష్టించి బెయిల్ పొందారని చెప్పారు. దీంతో శ్యామ్ కె నాయుడు పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఆయన బెయిల్‌ను కూడా రద్దు చేసింది. అంతేకాకుండా, శ్యామ్ కె నాయుడుపై ఫోర్జరీ కేసును నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. Also Read: శ్యామ్‌తో ఐదేళ్ల పరిచయం, సహజీవనం శ్యామ్‌ కె నాయుడుతో తనకు ఐదేళ

‘శశి’గా వస్తోన్న ఆది సాయికుమార్.. డ‌బ్బింగ్‌ షురూ

Image
ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న ‘శ‌శి’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు మొద‌ల‌య్యాయి. శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆర్‌.పి.వ‌ర్మ, రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ నిర్మిస్తున్నారు. హీరో ఆది సాయికుమార్ డ‌బ్బింగ్ చెప్పడం ద్వారా సోమ‌వారం ‘శ‌శి’ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఆది డ‌బ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేసింది. లాక్‌డౌన్ ముగిసి, సినిమాల‌ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల‌కు ప్రభుత్వం అనుమ‌తులు ఇచ్చిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ డ‌బ్బింగ్ ప‌నులు స్టార్ట్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. Also Read: ఇప్పటివ‌ర‌కూ క‌నిపించ‌ని స‌రికొత్త రూపంలో ఆది ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఆయ‌నకు జోడీగా సుర‌భి న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో నాయిక పాత్రను రాశీ సింగ్ పోషించారు. ఒక పాట మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. ఆ పాట‌ను కూడా మూడు రోజుల్లో పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందు

‘మా గంగానది’ ట్రైలర్: ఆలీ కూతురు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ

Image
ఆలీ, నియా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘మా గంగానది’. ‘అంత ప్రవిత్రమైనది స్త్రీ’ అనేది ఉప‌శీర్షిక‌. ర‌వికుమార్ స‌మ‌ర్పణ‌లో మూకాంబికా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై వి.నాగేశ్వర‌రావు, సూర్యవంత‌రం, ఎం.ఎన్‌.యు.సుధాక‌ర్ నిర్మించారు. వి. బాలనాగేశ్వర‌రావు ద‌ర్శక‌త్వం వహించారు. ఈ చిత్రంలో కుమార్తె బేబీ జువేరియా న‌టించ‌డం విశేషం. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆలీ తాజాగా విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ.. ‘‘సాధార‌ణంగా మ‌నం న‌టించిన సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్‌ను మ‌రొక‌రితో విడుద‌ల చేయిస్తుంటాం. కానీ క‌రోనా వ‌ల్ల అంద‌రూ భౌతిక దూరం పాటించాల్సి వ‌స్తుంది. అందుక‌ని నా సినిమా ట్రైల‌ర్‌ను నేనే గెస్ట్‌గా మారి విడుద‌ల చేస్తున్నాను. సినిమాలో తొలిసారి సీరియస్ పాత్ర చేశాను. ఇందులో నా కుమార్తె పాత్రలో నా కూతురు జువేరియా న‌టించింది. జువేరియాను స్క్రీన్‌పై చూడాల‌నేది వాళ్ల అమ్మ ఆశ. Also Read: చిన్నప్పుడు స్క్రీన్‌పై న‌న్ను చూసుకుని మా అమ్మ ఎలా సంతోష‌ప‌డిందో, నా భార్యకు కూడా మా అమ్మాయిని స్క్రీన్‌పై చూసి ఆనంద‌ప‌డాల‌ని ఎప్పటి నుంచో కోరిక‌. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. కేర‌ళ అమ్మాయి నియా హీరోయిన్‌గా న‌టించింది. ఇం

‘కృష్ణ అండ్ హిజ్ లీల’కు హిందూవాదం సెగ.. బోయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్

Image
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పెరెపు దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాలోని ప్రధాన నటీనటులకు హిందూ దేవతల పేర్లను ఉపయోగించారని రాకేష్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాకు వ్యతిరేకంగా హిందూవాదులు విరుచుకుపడుతున్నారు. సినిమా మాధ్యమం మరోసారి హిందూమతాన్ని అవమానించిందని మండిపడుతున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా గురువారం (జూన్ 25న) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇదొక రొమాంటిక్ డ్రామా. ముగ్గురు అమ్మాయిలతో కృష్ణ రొమాన్స్ చేస్తాడు. సినిమాలో రొమాన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉందనే టాక్ కూడా వచ్చింది. దీంతో సినిమాలోని ప్రధాన పాత్రలకు దేవుళ్ల పేర్లు పెట్టి రొమాన్స్ నడిపించడం వల్ల వివాదం మొదలైంది. ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్న కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ను బోయ్‌కాట్ చేయాలనే ప్రచారం మొదలైంది. ట్విట్టర్‌లో #BoycottNetflix టాప్ ట్రెండింగ్‌లో ఉంది. Also Read: ఒక తెలుగు సినిమాకు సంబంధించి దేశ వ్యాప్తంగా నె

అందరూ బాధ్యతగా ఉండాలి.. కరోనా విజృంభనపై మహేష్ మెసేజ్

Image
కరోనా వైరస్ మన దేశంలోకి ప్రవేశించిన తొలిరోజుల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నప్పుడు సినీ తారలు ధైర్యం చెప్పారు. ఆందోళన చెందవద్దని జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని ప్రజలకు సూచించారు. మెగాస్టార్ చిరంజీవి, , ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు వీడియో మెసేజ్‌ల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. అయితే, లాక్‌డౌన్ సమయంలో వైరస్ వ్యాప్తి పెద్దగా లేకపోయినా.. లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన తరవాత కరోనా విజృంభన మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ప్రతిరోజూ 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో మనమంతా బాధ్యతగా వ్యవహరించాలి అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రజలంతా జాగ్రత్తతో, బాధ్యతతో వ్యవహరించి కరోనాతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. Also Read: ‘‘లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చినప్పటి నుంచీ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. మనల్ని మనం కాపాడుకునే సమయం ఇది. అలాగే, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడాలి. బయటికి వెళ్లే ప్రతిసారి మాస్క్ ధరించండి. మీ చు

ముద్దంటే భయమేస్తోంది.. హగ్స్, కిస్‌లు నా వల్లకాదు: రెజీనా

Image
దక్షిణ భారత సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులైన నటీమణుల్లో ఒకరు. అందం, అభినయం రెండూ సమపాళ్లలో ఉన్న నటి ఆమె. ‘ఎస్ఎంఎస్ - శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా.. ఆ తరవాత ‘కొత్త జంట’, ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘అ!’ సినిమాలో తన రూపం, నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి తాను ఏమీ సిగ్గుపడనని గతంలో రెజీనా చాలా సార్లు చెప్పారు. కొంత మంది హీరోలకు లిప్ లాక్‌లు కూడా పెట్టారు. ‘పవర్’లో రవితేజతో, ‘రారా కృష్ణయ్య’ సినిమాలో సందీప్ కిషన్‌తో హాట్ లిప్ లాక్ సీన్స్‌లో రెజీనా నటించారు. కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి తాను ఇలాంటి సీన్స్‌లో నటించడానికి వెనకడుగు వేయనని రెజీనా చెబుతుంటారు. కానీ. ఇప్పుడు తన నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకున్నారు. రొమాంటిక్ సీన్స్‌లో తాను నటించబోనని అంటున్నారు. Also Read: ఇటీవల మీడియాతో ముచ్చటించిన రెజీనా తన రాబోయే చిత్రాల్లో ఇంటిమేట్ సీన్స్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి

వాళ్లను ఓదార్చడమే సరిపోయింది నాకు.. రూమర్స్‌పై ఎస్.జానకి మండిపాటు

Image
దిగ్గజ గాయని చనిపోయారంటూ ఆదివారం సోషల్ మీడియాలో వదంతులు వచ్చిన విషయం తెలిసిందే. ఎవరో సోషల్ మీడియాలో పుట్టించిన ఈ తప్పుడు వార్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. దీంతో జానకి కుమారుడు మురళీ కృష్ణ స్పందించాల్సి వచ్చింది. తన తల్లి ఆరోగ్యంగా ఉన్నారని, దయచేసి ఇలాంటి రూమర్లు వ్యాప్తి చేయొద్దని ఆదివారం సాయంత్రం మురళీ కృష్ణ వేడుకున్నారు. అలాగే, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనికిమాలిన రూమర్లు ఎందుకు క్రియేట్ చేస్తారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. తాను జానకి అమ్మతో మాట్లాడానని, ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. దయచేసి సోషల్ మీడియాలో పాజిటివిటీని వ్యాప్తి చేయాలని, ఇలాంటి వదంతులతో ఇతరులను బాధపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. Also Read: కాగా, ఈ వదంతులపై ఇప్పుడు స్వయంగా జానకి అమ్మ స్పందించారు. ఇలాంటి వదంతులు పుట్టించేవారిపై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఒక ఆడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ‘‘నాపాటికి నేను ఎక్కడో ఉన్నాను. హైదరాబాద్‌లో కూడా లేను మైసూరులో ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. నాకే సమస్యా లేదు. ఎవరో అనవసరంగా పిచ్చిపిచ్చిగా ఏవేవో పెడుతుంటారు. ఇలాంటివి నమ

RGV: రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' సినిమా.. సీనియర్ రచయిత రియాక్షన్ ఎలా ఉందో చూడండి!

Image
పలు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్త టేస్ట్ చూపించిన .. గత కొంతకాలంగా ట్రాక్ చేంజ్ చేసేశారు. తక్కువ బడ్జెట్ సినిమాలు, అడల్ట్ కిక్కిచ్చే మూవీలు రూపొందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ''క్లైమాక్స్, నగ్నం'' మూవీలు తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. పేరుతో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ మరో సినిమా ప్రకటించడంతో అంతా షాకయ్యారు. పవర్ స్టార్ టైటిల్‌తో సినిమా అనౌన్స్ చేసిన వర్మ.. ఈ సినిమాలో పాత్రలకు సంబంధించిన వివరాలను కూడా చెప్పేశారు. నలుగురు పిల్లలు, ఒక రష్యన్ యువతి, అలాగే 8 బర్రెలు సినిమాలో ఉంటాయని వ్యంగ్యంగా ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆర్జీవీ చేసిన ఈ ప్రకటన చూసి పవన్ ఫ్యాన్స్ కాసింత మండిపడ్డారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రకటనపై సీనియర్ రచయిత రియాక్ట్ కావడం మరింత సెన్సేషన్ అయింది. Also Read: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వర్మ మూవీ ప్రకటించిన వెంటనే.. రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్లో స్పందిస్తూ తాను హర్ట్ అయినట్లు పేర్కొన్నారు. తన కాలేజీ రోజుల్లో శివుడిని ఆరాధించాక మణిరత్నంని, ఆ తర్వాత ఆర్జీవీని అంతగా ఆరాధి

మూడు రోజులుగా ఫోన్ల మీద ఫోన్లు.. ఆ రూమర్ ఎవరు క్రియేట్ చేశారో గానీ: రేణు దేశాయ్

Image
పవన్ మాజీ భర్య, హీరోయిన్ .. మరోసారి ముఖానికి రంగేసుకోబోతోందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. 'జాని' మూవీ తర్వాత తిరిగి వెండితెరపై కనిపించని ఆమె నటన విషయమై కీలక నిర్ణయం తీసుకుందని, మహేష్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న కొత్త సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై రియాక్ట్ అయింది రేణు. ఇప్పటివరకూ ఇదే తాను విన్న అతి పెద్ద రూమర్ అంటూ చమత్కరిస్తూనే అట్టి వార్తలను ఖండించింది. మహేష్ సినిమాలో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి.. గత రెండు మూడు రోజులుగా తనకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని, చాలా మంది ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారని తెలిపింది. కాగా ఇలాంటి వార్తలను తెరపైకి తెచ్చిన వారికి రియల్లీ హ్యాట్సాఫ్ అంటూ తనదైన స్టైల్‌లో స్పందించింది రేణు దేశాయ్. మహేశ్ బాబు సినిమాలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. Also Read: గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో తల్లి పాత్రల గురించి ప్రస్తావన వస్తే.. హీరోల చిన్నప్పటి పాత్రలకు తల్లిగా చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం కారణంగానే ఇలాంటి రూమర్స్ పుట్టించారని రేణు తెలిపింది. అదేవిధంగ

మహేష్ బాబుకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన రష్మిక

Image
సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినీ ప్రముఖుల్లో కూడా అభిమానులు ఉన్నారు. మహేష్‌తో కలిసి నటించే అనేకమంది నటులు ఆయనను ఎంతగానో అభిమానిస్తారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌తో జతకట్టింది కన్నడభామ . తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమాలో మహేష్‌ను వేధిస్తోన్న అల్లరిపిల్లగా నటనకు మంచి మార్కులే కొట్టేసింది. దీంతో రష్మికకు కూడా టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ సందర్భంగా రష్మిక తన ఫ్యామిలీతోనే కలిసి ఉంటుంది. రష్మిక మండన్న కూర్గ్ లోని సుందరమైన హిల్ స్టేషన్‌లో తన తల్లిదండ్రులతో కలిసి లాక్ డౌన్ సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది. కూర్గ్ ప్రకృతి సౌందర్యం, కొండ పొలాల నుండి గొప్ప పంటలకు ప్రసిద్ది చెందింది. ఈ క్రమంలో కూర్గ్‌లో ఉన్న రష్మిక మహేష్‌కు అదరిపోయే గిఫ్ట్ పంపింది. అవకాడో ఫ్రూట్స్‌తో పాటు...ఆవకాయను ప్యాక్ చేసి మహేష్ ఇంటికి పార్సిల్ పంపింది. పంపిన విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ అభిమానులకు తెలిపారు. అంతేకాకుండా అద్భుతమైన వాతావరణంలో... నోరూరించే గిఫ్ట్ పంపిన రష్మికకు ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో మాక

అయ్యో! పాపం.. తాప్సి పన్నుకి కరెంట్ షాక్!! హీరోయిన్ దిమ్మతిరిగిందట..

Image
ప్రస్తుత పరిస్థితుల్లో జనాలను కరోనా మహమ్మారి కాటేస్తుంటే.. కరెంటు బిల్లులు షాకిస్తున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. వేలల్లో, లక్షల్లో కరెంట్ బిల్లులు రావడం చూసి షాక్ అవుతున్నారంతా. సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరి నడ్డి విరుస్తున్నాయి విద్యుత్ సంస్థలు. దీంతో అందరు కూడా విద్యుత్ బోర్డుపై ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు. ఈ నేసథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే తమకొచ్చిన కరెంటు బిల్లులను సోషల్ మీడియా ద్వారా అందరికీ చూపిస్తూ విద్యుత్ బోర్డులపై దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే. తాజాగా తాప్సికి కూడా ఇది తప్పలేదు. ఆమె నివాసముంటున్న ఇంటికి జూన్ నెలకు గాను 36 వేల రూపాయల కరెంట్ బిల్ రావడంతో షాక్ అయిందట . దీంతో ఈ విషయాన్ని వెంటనే ఆమె విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. Also Read: తనకు ఏప్రిల్ నెలలో 4390, మే నెలలో 3850 రూపాయలు వచ్చిన విద్యుత్ బిల్లు.. జూన్ వచ్చేసరికి ఒక్కసారిగా పెరిగిపోయి 36 వేలు రావడమేంటని ఆమె ప్రశ్నించింది. ఇంతటి పిచ్చి పెరుగుదల గతంలో ఎన్నడూ చూడనేలేదని బోర్డ్ వాళ్లకు ఫిర్యాదు చేసింది. తన అపార్ట్‌మెంట్ ఖాళీగా ఉందని, ఖాళీగా ఉన్నదానికే

వనితా విజయ్‌కుమార్‌ మూడో పెళ్లి.. ఆ ముచ్చట తీరిందో లేదో అప్పుడే కొత్త జంటపై పోలీస్ కేసు

Image
సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై లోని ఓ ఫంక్షన్ హాల్‌లో క్రిస్టియన్ వివాహ పద్దతిలో శనివారం రోజు (జూన్ 27) ఆమె వివాహం జరిగింది. అనే వ్యక్తిని వనితా విజయ్‌కుమార్‌ పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహం జరిగిన మరునాడే ఈ కొత్త జంటపై నమోదు కావడం హాట్ ఇష్యూగా మారింది. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ అతికొద్ది మంది సమక్షంలోనే వనితా విజయ్‌కుమార్‌- పీటర్ పాల్ వివాహం జరిగింది. పెళ్లిలో ప్రత్యేకంగా వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా కనిపించి భర్తకు ముద్దులు పెడుతూ హల్చల్ చేసింది వనితా విజయ్‌కుమార్. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా మూడో భర్త అయిన పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ రూపంలో ఈ జంటకు సమస్య ఎదురైంది. Also Read: తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ పాల్ మరో వివాహం చేసుకున్నాడని పేర్కొంటూ కొత్త జంటపై ఎలిజిబెత్ హెలెన్ పోలీస్ కేసు పెట్టింది.హెలెన్ ఫిర్యాదుతో పోలీసులు కొత్త జంటపై కేసు నమోదు చేశారనేది లేటెస్ట్ సమాచారం. దీంతో జనాల్లో ఈ అంశం పలు చర్చలకు తావిచ్చింది. కాగా 2007లో ఆ

వర్కవుట్ అవుతుంది కానీ.. నెపోటిజంపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Image
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో తెరపైకి వచ్చింది. అతడి అకాల మరణం తర్వాత నెపోటిజంపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. సుశాంత్ మరణానికి కారణమంటూ కొందరు తమ వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు బాలీవుడ్ నెపోటిజంపై మండిపడ్డారు. ఇటు టాలీవుడ్‌లో కూడా చాలామంది ప్రముఖులు ఇప్పటికే నెపోటిజంపై స్పందించారు. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా నెపోటిజంపై రేణూ దేశాయ్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మంచి టాలెంట్ ఉన్న నటుడు. సెన్సిటివ్ పర్సన్‌. ఇండస్ట్రీలో మంచి సక్సెస్‌లు సాధించాడు అని రేణూ పేర్కొన్నారు. అయితే సుశాంత్ మరణానికి నెపోటిజం కారణమని చాలా మంది చెబుతున్నారు. నా అంచనా ప్రకారం నెపోటిజం ఒక్క ఇండస్ట్రీలోనే లేదు. పని చేసే ప్రతిచోట ఉందన్నారు . సినిమా ఇండస్ట్రీలో ముందు మాత్రమే బంధుప్రీతి వర్కవుట్ అవుతుందన్నారు. ఆ తర్వాత మన టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుందన్నారు రేణు. జీవితం టీ కప్పు లాంటిది కాదన్నారామె.

వకీల్ సాబ్ లీక్: కోర్టులో పవన్ కళ్యాణ్! అది చూడగానే షాకైన దర్శకనిర్మాతలు

Image
ఓ స్టార్ హీరో సినిమాను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయాలంటే చాలా కష్టం. ఎంతో మంది నిపుణులు, సాంకేతిక వర్గం సహకారంతో సినిమా రూపొందించడం, అది కూడా విడుదలకు ముందు ఎలాంటి లీక్స్ లేకుండా వెండితెరపై బొమ్మపడేలా చూసుకోవడమంటే మామూలు విషయం కాదు. మరోవైపు టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సినిమా ఇండస్ట్రీని లీకుల బెడద ఎక్కువవుతూ వస్తోంది. తాజాగా పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్‌కు కూడా లీకుల బెడద తప్పలేదు. ‘’ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ గత కొంతకాలంగా కరోనా విజృంభణ వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న చిత్ర యూనిట్‌కి సడెన్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కోర్టులో వాదిస్తున్న స్టిల్ ఒకటి లీక్ అయింది. ఇది కాస్త వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ స్టిల్ ఎలా లీక్ అయ్యిందనే విషయమై ఆరా దీస్తున్నారు యూనిట్ సభ్యులు. Also Read: మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసి వరుసగా 25 సినిమాలు చేసిన పవన్.. ఆ తర్వాత రాజకీయ బాట పట్టారు. అయితే నిర్మాతల కోరిక మేరకు తిరిగి కెమెరా

Jr. Ntr: ఎన్టీఆర్ విషయమై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. మీరంతా మూసుకొని ఉండండి అంటూ!!

Image
తెలుగు చిత్రసీమకు 'ప్రయాణం' సినిమాతో పరిచయమైంది హీరోయిన్ . ఆ తర్వాత హీరోగా వచ్చిన 'ఊసరవెల్లి' సినిమాలో మెరిసింది. ఓ పది సినిమాల్లో నటించినా కూడా టాలీవుడ్‌లో ఈ భామకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం తర్వాత అంశం సినీ ఇండస్ట్రీలో చర్చల్లో నిలుస్తోంది. టాలెంట్ ఉన్న నటీనటులను పక్కన బెట్టి కేవలం కొంతమంది వారసత్వం నుంచి వచ్చిన నటులే ఇండస్ట్రీని ఏలుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీరా చోప్రా మధ్య వివాదం చెలరేగడం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో దూషించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. Also Read: అయితే ఈ వివాదంలోకి పాయల్ ఘోష్ ఎంటరై.. ఎన్టీఆర్ మహిళలను ఎంతో గౌరవిస్తాడని చెప్పింది. దీంతో ఎన్టీఆర్ కూడా నెపోటిజం ప్రొడక్టే (నట వారసత్వం) అంటూ.. అతనికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటూ నెటిజన్స్ తనకు ట్వీట్స్ పెట్టారని తెలిపింది పాయల్. తాజాగా వీటిపై ట్విట్టర్ వేదికగా వారిపై తీవ్

అద్దె కట్టకుండా వేధింపులు.. సినీ నిర్మాతపై ఫిర్యాదు

Image
సినీ నిర్మాతపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఇంటి అద్దె చెల్లించకుండా దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారంటూ సినీ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో నివాసం ఉంటున్న నవ్వాడ శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. 2018లో మినిస్టర్‌ క్వార్టర్స్‌ ఎదురుగా తమ భవనాన్ని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌కు అద్దెకు ఇచ్చామన్నారు. తెలంగాణ ఫిలిం కల్చరల్‌ సెంటర్‌(టీఎఫ్‌సీసీ) ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చినట్లుగా శోభారాణి తెలిపారు. నెలకు నాలుగున్నర లక్షల అద్దెగా అంగీకరించారని రూ. 40 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామని చెప్పి రూ.30 లక్షలే ఇచ్చారని ఆమె ఆరోపించారు. అయితే అప్పటి నుంచి అద్దె సరిగ్గా ఇవ్వకుండా వేదింపులకు గురి చేశాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా పది రోజుల క్రితం తాను అద్దె చెల్లించలేనంటూ తాళాలు అప్పగించి వెళ్లిపోయిన ప్రతాని రామకృష్ణగౌడ్‌ తన కొడుకు సందీప్‌ను ఇంటి మీదికి పంపించి దౌర్జన్యానికి దిగాడని శోభరాణి ఆరోపిస్తున్నారు. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించడంతో పాటు తనకు ప్రభుత్వంలో పెద్ద వాళ్ళు పరిచయం ఉన్నారని తమ

‘శివన్’ ట్రైలర్: ఇది ప్రపంచంలోనే తొలి ఏటీటీ ఫిలిం

Image
ప్రపంచీకరణ ప్రభావం ఎంటర్‌టైన్మెంట్ మీద కూడా పడింది. డిజిటలైజేషన్ కారణంగా ఎంటర్‌టైన్మెంట్ ప్రజలకు మరింత చేరువైంది. ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫాంలలో వివిధ భాషలకు చెందిన బోలెడంత కంటెంట్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. అందుకే, కరోనా కాలంలో థియేటర్లు మూతబడినా ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారా ప్రజలు ఎంటర్‌టైన్మెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కొత్త కొత్త సినిమాలను వీక్షిస్తున్నారు. వెబ్ ఫిలింస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వెబ్ సిరీస్‌లు చూస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు చిత్రీకరణ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలనే చాలా మంది నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే, నిన్న మొన్నటి వరకు ఓటీటీనే చాలా మందికి కొత్త. కానీ, ఇప్పుడు ఏటీటీ ప్లాట్‌ఫాం వచ్చింది. అంటే ఎనీటైమ్ థియేటర్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రేయాస్ మీడియా ఈ ఏటీటీ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టింది. శ్రేయాస్ ఈటీ పేరుతో డిజిటల్ వరల్డ్‌ను సృష్టించింది. Also Read: అయితే, ఓటీటీ-ఏటీటీ వీటి మధ్య తేడా ఏంటి

దిగ్గజ గాయని ఎస్.జానకి ఇకలేరంటూ తప్పుడు ప్రచారం.. ఎస్పీ బాలు ఆవేదన

Image
దిగ్గజ గాయని ఇకలేరనే వదంతులు ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాప్తి చెందాయి. ఈ తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో చూసిన ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇక ఆమె కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన చెంది తరవాత జానకి అమ్మ ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. జానకి అమ్మ ఆరోగ్యంపై ఇలాంటి వదంతులు దయచేసి వ్యాప్తి చేయొద్దని ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేశారు. కాగా, జానకికి ఒక చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈలోపలే ఆమె కన్నుమూశారంటూ వదంతులను ఇంటర్నెట్‌లో వ్యాప్తి చేసేశారు. ఇదిలా ఉంటే, జానకి అమ్మ ఆరోగ్యంపై వచ్చిన రూమర్‌పై గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఇలాంటి రూమర్లు ఎందుకు పుట్టుకొస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన ఒక వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ‘‘జానకి అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఉదయం నుంచి నాకు 20 మంది ఫోన్ చేశారు. దీనికి కారణం సోషల్ మీడియాలో కొంత మంది జానకి అమ్మ చనిపోయారంటూ పోస్టులు పెట్టడమే. ఏంటి ఈ అర్థంపర్థంలేని పనులు. నేను ఆమెతో మాట్లాడాను. ఆమె చాలా బాగున్నారు’’ అని బాలు స్పష్టం చేశారు. సోషల్ మీడియాను పాజ

‘మనం సైతం’ కార్యాలయంలో మొక్కలు నాటిన వి.వి.వినాయక్, పూనమ్ కౌర్

Image
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు టాలీవుడ్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా, టీవీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు చాలా మంది మొక్కలు నాటారు. తాజాగా ఈ జాబితాలో దర్శకుడు , నటి చేరారు. హైదరాబాద్‌లోని ‘మనం సైతం’ కార్యాలయం ఆవరణలో నటుడు కాదంబరి కిరణ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. భావి తరాలకు మనం ఇచ్చే విలువైన బహుమతి లాంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. Also Read: పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది మానవతావాదులు ఎంతో సహాయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో ఎంత మంది మంచి మనుషులు ఉన్నారనే విషయం కూడా తెలుస్తుంది. సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. కొవిడ్-

హెబ్బా పటేల్‌తో ‘సరిగమ’ పాడుతోన్న రాజ్ తరుణ్

Image
యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి ‘స‌రిగ‌మ‌ప’ లిరికిల్ సాంగ్‌ను తాజాగా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ‘స‌రిగ‌మ‌గ‌మ‌ గామ హంగామ చేద్దామా.. ప‌ద‌నిస‌నిస నీస్సా నీ నీషా నీద‌మ్మా’ అంటూ హుషారుగా సాగే ఈ పాట‌లో రాజ్‌ తరుణ్ ఎన‌ర్జిటిక్ స్టెప్పులు, హెబా ప‌టేల్ అందాలు యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట‌కు వ‌న‌మాలి సాహిత్యం అందించ‌గా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్‌ రూబెన్స్ ఆలపించారు. ‘కుమారి 21ఎఫ్’, ‘అంధగాడు’, ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజ్‌ తరుణ్, హెబా ప‌టేల్ క‌లిసి న‌టిస్తోన్న మ‌రో చిత్రం ఇది. Also Read: కాగా, ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జ

అబ్బాయిలకు ఎలాంటి బౌండరీస్ లేవు.. లేడీ యాంకర్ వీడియోపై వర్మ క్రేజీ రియాక్షన్

Image
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ నిత్యం వార్తల్లో నిలవడం కేవలం రామ్ గోపాల్ వర్మకే సాధ్యం. ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ఆయన పలు టీవీ చానళ్లకు, యూ ట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా లేడీ యాంకర్స్‌తో ఆయన మెదిలే తీరు, వాళ్ళను పొగిడే విధానం, వేసే రొమాంటిక్ పంచెస్ అబ్బో! అనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ బ్యూటిఫుల్ యాంకర్‌తో మాట్లాడుతూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు వర్మ. ‘సార్.. రీసెంట్ టైమ్స్‌లో ఏ అమ్మాయిని చూస్తే.. వావ్ అనిపించింది’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు వెంటనే బదులిచ్చిన ఆయన.. ‘‘చాలా మంది అలా అనిపించారు. ఇన్‌క్లూడింగ్ యు’’ అనేయడంలో ఆ యాంకర్ మెలికలు తిరిగిపోయింది. దీంతో ఇందుకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: అయితే ఈ వీడియో క్లిప్‌కి ఇంకాస్త మసాలా జోడించి సినిమా పాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో టిక్ టాక్ వీడియో చేశారు కొందరు వ్యక్తులు. లేడీ యాంకర్‌తో వర్మ ‘నీతో కలిపి’ అనే మాట అనగానే ''అయిపాయె'' అనే పదం వచ్చేలా, బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమాలోని పాట మ్యూజిక

పవర్ స్టార్ సినిమా: వర్మపై పూనమ్ ఆగ్రహం.. రహస్యాలు బయటపెట్టిన నటి

Image
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటి ఫైర్ అయ్యారు. తాను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆర్జీవీ అంటే గౌరవం ఉండేదని, ఇప్పుడు ఆయనను చూసి తనకు బాధ కలుగుతోందని అన్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవీ సినిమాను ప్రకటించడమే. ప్రస్తుత కరోనా సమయంలో ఆన్‌లైన్ ద్వారా వరుసపెట్టి సినిమాలను వదులుతోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ పేరిట ప్రేక్షకుల ఇంటి వద్దకే సినిమాలను ఆన్‌లైన్ ద్వారా పంపుతున్నారు. ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ అనే రెండు సినిమాలను విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ‘పవర్ స్టార్’ టైటిల్‌తో సినిమాను రూపొందిస్తు్న్నారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ ద్వారా వర్మ ప్రకటించారు. అంతేకాదు, ‘పవర్ స్టార్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర చేయబోయే నటుడిని కూడా పరిచయం చేశారు. Also Read: ‘‘బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నా తరవాత సినిమా టైటిల్ ‘పవర్ స్టార్’. పీకే, ఎంఎస్, ఎన్‌బీ, టీఎస్, ఒక రష్యా మహిళ, నలుగురు పిల్లలు, 8 బర్రెలు, ఆర్జీవీ పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలు ఏమిటో అర్థం చేసుకున్నవారికి ఎలాంటి బహుమతులు ఉండవు’’ అని వర్మ ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌కు పూనమ్ కౌర్ కౌంట

నగ్నం: లోకల్ అమ్మాయి స్వీటీతో వర్మ.. పెట్టింది 5 లక్షలే అయినా! భలే వ్యాపారం చేస్తున్నాడే..

Image
ట్రెండ్ ఫాలో అవుతూ సిచువేషన్ చూసి స్టెప్ తీసుకుంటున్న .. గత కొంతకాలంగా అడల్ట్ మూవీస్ రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అంతకుముందు ఇంటర్నేషనల్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన, ఇటీవలే మరోసారి అదే మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' మూవీ రూపొందించి ప్రస్తుత పరిస్థితులను సొమ్ము చేసుకున్నారు. ఓటీటీ వేదికలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాన్స్‌కి క్రమంగా డిమాండ్ పెరుగుతుండటం గమనించిన రామ్ గోపాల్ వర్మ.. దాన్ని ఎలా క్యాచ్ చేసుకోవాలి అనే మార్గంలోనే అడుగులేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఓ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసి ఆ వేదికపైనే 'క్లైమాక్స్' మూవీ రిలీజ్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా కేవలం తనకు తానే సోషల్ మీడియా ద్వారా సినిమా ప్రమోషన్స్ చేసుకున్న ఆయన, ఒక్కో వ్యూకి 100 రూపాయల పైకం డిసైడ్ చేసి భారీ సొమ్ము కూడగట్టుకున్నారు. దీంతో ఆ రుచి తెలిసి మరిన్ని సినిమాలను లైన్ లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే నిన్న (జూన్ 27) రాత్రి తన లేటెస్ట్ అడల్ట్ మూవీ 'నగ్నం' రిలీజ్ చేసి మరోసారి సొమ్ము చేసుకున్నా

Power Star: రామ్ గోపాల్ వర్మ సంచలనం.. ఇతనే పవర్ స్టార్ అంటూ షాకింగ్ వీడియో రిలీజ్

Image
సంచలనాలకు మారు పేరైన మరో సంచలనానికి తెరలేపారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ వేదికలపై హల్చల్ చేస్తూ బోల్డ్ కిక్ ఇస్తున్న వర్మ.. తాజాగా 'పవర్ స్టార్' అంటూ మరో సినిమాను ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పటికే పరిటాల రవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖుల నిజ జీవితాలపై సినిమా తీసిన వర్మ తాజాగా పవన్ కళ్యాణ్‌పై సినిమా తీస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. బ్రేకింగ్‌ న్యూస్‌... ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్‌ అని పేరు పెట్టాను. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారంటూ ట్వీట్ చేసిన వర్మ.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన సినిమాలో 'పవర్ స్టార్' ఇతనే అంటూ ఓ షాకింగ్ వీడియో పోస్ట్ చేశారు. Also Read: ఈ వీడియోలో అచ్చం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్‌లో ఉన్న ఓ నటుడు.. పవన్ లాగే స్టైల్‌గా నడుస్తూ కనిపించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన వర్మ.. ''నా కొత్త సినిమా పవర్ స్టార్‌లో స్ట

బ్రేకింగ్ న్యూస్: పవర్ స్టార్ పేరుతో రామ్ గోపాల్ వర్మ మూవీ

Image
వరుసగా సినిమాలు తీస్తూ... ట్రైలర్లు, పోస్టర్లు రిలీజ్ చేస్తూ బిజీగా మారారు. ఒక దాని తర్వాత ఒకటి వరుస సినిమాలను తీస్తూ వర్మ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే పరిటాల రవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖుల నిజ జీవితాలపై సినిమా తీసిన వర్మ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సినిమా తీస్తానంటూ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. మారుతి రాసిన అమృతప్రణయ గాథ అంటూ ఆయన ప్రస్తుతం నిజజీవిత కథ ఆధారంగా 'మర్డర్'‌ సినిమాను కూడా తీస్తున్నారు. అయితే తాజాగా వర్మ దృష్టి ఇప్పుడు పవర్ స్టార్‌పై పడింది. 'బ్రేకింగ్‌ న్యూస్‌... ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్‌ అని పేరు పెట్టాను. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. పవర్‌ స్టార్‌ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను' అంటూ ప్రకటన చేశారు. వర్మ తాజాగా చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వర్మ ఇచ్చిన క్లూస్‌తో ఈ సినిమాలో ఎవరెవరు ఉంటున్న

కృష్ణ అండ్ హిజ్ లీల: మోతాదుకు మించిన రొమాన్స్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

Image
ఈ మధ్యకాలంలో సినిమాలపై ఫిర్యాదులు నమోదు కావడం కామన్ అయిపోయింది. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీశారంటూ రిలీజ్‌కి ముందు లేదా మూవీ రిలీజ్ తర్వాత ప్రేక్షకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే పలు సినిమాల విషయంలో ఇదే జరిగింది. తాజాగా యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా '' సినిమాపై ఇలానే ఓ ఫిర్యాదు నమోదైంది. గుంటూరు టాకీస్, గరుడవేగ సినిమాలతో నటనా ప్రతిభను చాటిన సిద్దు జొన్నలగడ్డ హీరోగా 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమా రూపొందింది. రానా ద‌గ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరోయిన్, జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ నటించింది. మరో ఇద్దరు హీరోయిన్స్ సీరత్ కపూర్, షాలిని వాడ్నికట్టి ముఖ్యపాత్రలు పోషించారు. గురువారం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అయితే తాజాగా సినిమాపై వివాదం చుట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. Also Read: 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాలో హీరోహీరోయిన్ల పాత్రలకు హిందూ దేవతల పేర్లు పెట్టడమే కాకుండా మోతాదుకు మించిన రొమాన్స్ సన్నివేశాలను పెట్టారని రాకేష్ అనే వ్య‌క్తి అభ్

‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ ఫ్రమ్ గోదావరి.. NAKED ఫొటోలు వైరల్

రామ్ గోపాల్ వర్మ సన్సేషనల్ మూవీ నగ్నం చిత్రాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. రికార్డ్ స్థాయిలో బుకింగ్స్‌లో జరుగుతుండగా.. ఈ చిత్రంలో నటించిన నగ్న సుందరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NAKED Movie: ‘నగ్నం’ రిలీజ్.. స్వీటీని నగ్నంగా చూడాలంటే రూ.200, తొలి అరగంటలోనే రికార్డ్ బుకింగ్స్

Image
వివాదాస్పద దర్శకుడు ఈ లాక్‌డౌన్‌ను బూతు సినిమాలతో తనకు అనువుగా మార్చుకున్నారు. థియేటర్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడు సినిమాలు విడుదలయ్యేది ఎప్పుడూ.. మన సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేదెప్పుడు.. ఈ తిప్పలన్నీ మనకెందుకులే అనుకుని ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ ప్రారంభించిన వర్మ.. ఆన్ లైన్‌లో వరుసగా బూతు చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఇటీవల పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తీసిన ‘క్లైమాక్స్’ చిత్రానికి రూ.100 రేటుకట్టి ఆన్‌ లైన్‌లో విడుదల చేసిన వర్మ.. తాజాగా నగ్నం NAKED చిత్రాన్ని విడుదల చేశారు. ‘క్లైమాక్స్‌ను ఒకసారి చూడటానికి రూ.100 తీసుకుని.. దానికన్నా రూ.100 అధికంగా ‘నేక్డ్’కు రూ.200 పెట్టడానికి కారణం ఉంది. అదేంటంటే.. నేను విదేశీ మహిళల కన్నా భారతీయ మహిళలకు రెట్టింపు విలువ కడతాను’’ అంటూ ఈ నగ్నం-NAKED చిత్రాన్ని విడుదల చేశారు వర్మ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో 'నగ్నం' (NAKED) మూవీ రూపొందించిన వర్మ. ముందుగా ప్రకటించిన సమయానికి జూన్ 27 రాత్రి 9 గంటలకు RGVWorld.in/ShreyasET ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ నగ్న చిత్రాన్ని చూడాలంటే ఒక్కసారికి రూ. 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Coronavirus In Hyderabad: యాంకర్ ఓంకార్‌కి కరోనా పాజిటివ్! ఇస్మార్ట్ జోడీలో హడల్!!

Image
టీవీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు టీవీ ఆర్టిస్టులకు హరిక్రిష్ణ, ప్రభాకర్‌‌లకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్‌లో పాల్గొన్న మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు బెంబేతెల్తిపోతున్నారు. ఈ తరుణంలో తెలుగు పాపులర్ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్‌ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం ఆయన హోస్ట్ అండ్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇస్మార్ట్ జోడీ’ షోకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్న ఓంకార్‌కు కరోనా సోకినట్టు సమాచారం. జ్వరం అలసట ఉండటంతో ఓంకార్ ఇటీవల టెస్ట్‌లు చేయించుకోగా.. కరోనా వైరస్ సోకిందని తెలిసిందట. ప్రస్తుతానికి ఇస్మార్ట్ జోడీ షూటింగ్‌కి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. కాగా ఓంకార్‌తో పాటు షూటింగ్‌లో పాల్గొన్న ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. దీనికి సంబందించి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఇటీవల కరోనా సోకిన టీవీ నటుడు ప్రభాకర్‌ (ఈటీవీ ప్రభాకర్ కాదు) తో కాంటాక్ట్ అయిన 33 మంది కరోనా పరీక్షలు పూర్తి కాగా.. 33 మందికి నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ప్రభుత్వ గైడ్ లెన్స్ ప్రకారం మరింత జాగ్రత్తలతో టీవీ షూటింగ్స్ జరుగుతున్నాయి.

వెనక నుంచి పట్టుకోవడం ఆపరేమో.. ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో ఎక్ ట్రా రుద్దుడు.. హే పృథ్వీ!

Image
లాక్ డౌన్‌కి ముందు కమెడియన్ పృథ్వీ.. ఒక మహిళతో రొమాంటిక్‌గా ‘వెనుక నుండి పట్టుకుంటా..’, ‘గుర్తుకు వస్తున్నావ్..’ అంటూ మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ‘వెనకనుంచి పట్టుకోవడం’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. దాంతో ఎవరికి ఇష్టం మొచ్చినట్లు వాళ్లు వాడేస్తున్నారు. అప్పటి నుంచి అన్ని కామెడీ షోల్లోనూ ఈ ‘వెనక నుంచి పట్టుకోవడం’ అనే డైలాగ్‌ని విరివిగా వాడుతూ కామెడీ చేస్తున్నారు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో కూడా అదే రుద్దుడు కనిపిస్తోంది. జూలై 3 ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో.. కమెడియన్ శాంతి స్వరూప్ ఈ డైలాగ్ వాడి.. మరోసారి పృథ్వీని, ఆ ఆడియో క్లిప్పింగ్‌ని గుర్తుచేస్తూ పంచ్ వేశాడు. స్కిట్‌లో భాగంగా గబ్బర్ సింగ్ బ్యాచ్.. శాంతి స్వరూప్‌ని పల్లకిలో మోసుకొస్తారు. ‘జేజమ్మా మాయమ్మా’ సాంగ్ ప్లే అవుతుంటే.. శాంతి బయటికి రావడం భలే కామెడీగా ఉంది. తర్వాత గబ్బర్ సింగ్ బ్యాచ్.. ‘శాంతి మా చెల్లెలు, ఆమెకు అన్నీ నేర్పించేందుకు ఓ టీచర్‌ కావాలి’ అంటూ ఓ వ్యక్తిని పిలిపిస్తారు. ‘వినవే బర్రెపిల్లా..’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన రాకింగ్ రాకేష్.. శాంతికి అన్నీ నేర్పించే ప్