అందరూ బాధ్యతగా ఉండాలి.. కరోనా విజృంభనపై మహేష్ మెసేజ్

కరోనా వైరస్ మన దేశంలోకి ప్రవేశించిన తొలిరోజుల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నప్పుడు సినీ తారలు ధైర్యం చెప్పారు. ఆందోళన చెందవద్దని జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని ప్రజలకు సూచించారు. మెగాస్టార్ చిరంజీవి, , ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు వీడియో మెసేజ్‌ల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. అయితే, లాక్‌డౌన్ సమయంలో వైరస్ వ్యాప్తి పెద్దగా లేకపోయినా.. లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన తరవాత కరోనా విజృంభన మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ప్రతిరోజూ 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో మనమంతా బాధ్యతగా వ్యవహరించాలి అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రజలంతా జాగ్రత్తతో, బాధ్యతతో వ్యవహరించి కరోనాతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. Also Read: ‘‘లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చినప్పటి నుంచీ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. మనల్ని మనం కాపాడుకునే సమయం ఇది. అలాగే, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడాలి. బయటికి వెళ్లే ప్రతిసారి మాస్క్ ధరించండి. మీ చుట్టుపక్కల నుంచి జాగ్రత్తగా ఉండండి. భౌతిక దూరాన్ని పాటించండి. అన్ని జాగ్రత్తలూ పాటించండి. అలాగే, ఆరోగ్య సేతు యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పాజిటివ్ కేసులను ట్రాక్ చేయడానికి ఈ యాప్ సహాయపడుతుంది. కోవిడ్ పాజిటివ్ ఉన్న ఎవరైనా మీకు దగ్గరగా వచ్చినా అలర్ట్ చేస్తుంది. ఆరోగ్య భద్రత, అత్యవసర సేవలను సులభంగా పొందొచ్చు. అందరం భద్రతగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి’’ అని తన పోస్ట్‌లో మహేష్ పేర్కొన్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ