Coronavirus In Hyderabad: యాంకర్ ఓంకార్‌కి కరోనా పాజిటివ్! ఇస్మార్ట్ జోడీలో హడల్!!

టీవీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు టీవీ ఆర్టిస్టులకు హరిక్రిష్ణ, ప్రభాకర్‌‌లకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్‌లో పాల్గొన్న మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు బెంబేతెల్తిపోతున్నారు. ఈ తరుణంలో తెలుగు పాపులర్ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్‌ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం ఆయన హోస్ట్ అండ్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇస్మార్ట్ జోడీ’ షోకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్న ఓంకార్‌కు కరోనా సోకినట్టు సమాచారం. జ్వరం అలసట ఉండటంతో ఓంకార్ ఇటీవల టెస్ట్‌లు చేయించుకోగా.. కరోనా వైరస్ సోకిందని తెలిసిందట. ప్రస్తుతానికి ఇస్మార్ట్ జోడీ షూటింగ్‌కి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. కాగా ఓంకార్‌తో పాటు షూటింగ్‌లో పాల్గొన్న ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. దీనికి సంబందించి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఇటీవల కరోనా సోకిన టీవీ నటుడు ప్రభాకర్‌ (ఈటీవీ ప్రభాకర్ కాదు) తో కాంటాక్ట్ అయిన 33 మంది కరోనా పరీక్షలు పూర్తి కాగా.. 33 మందికి నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ప్రభుత్వ గైడ్ లెన్స్ ప్రకారం మరింత జాగ్రత్తలతో టీవీ షూటింగ్స్ జరుగుతున్నాయి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ