వాళ్లను ఓదార్చడమే సరిపోయింది నాకు.. రూమర్స్‌పై ఎస్.జానకి మండిపాటు

దిగ్గజ గాయని చనిపోయారంటూ ఆదివారం సోషల్ మీడియాలో వదంతులు వచ్చిన విషయం తెలిసిందే. ఎవరో సోషల్ మీడియాలో పుట్టించిన ఈ తప్పుడు వార్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. దీంతో జానకి కుమారుడు మురళీ కృష్ణ స్పందించాల్సి వచ్చింది. తన తల్లి ఆరోగ్యంగా ఉన్నారని, దయచేసి ఇలాంటి రూమర్లు వ్యాప్తి చేయొద్దని ఆదివారం సాయంత్రం మురళీ కృష్ణ వేడుకున్నారు. అలాగే, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనికిమాలిన రూమర్లు ఎందుకు క్రియేట్ చేస్తారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. తాను జానకి అమ్మతో మాట్లాడానని, ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. దయచేసి సోషల్ మీడియాలో పాజిటివిటీని వ్యాప్తి చేయాలని, ఇలాంటి వదంతులతో ఇతరులను బాధపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. Also Read: కాగా, ఈ వదంతులపై ఇప్పుడు స్వయంగా జానకి అమ్మ స్పందించారు. ఇలాంటి వదంతులు పుట్టించేవారిపై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఒక ఆడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ‘‘నాపాటికి నేను ఎక్కడో ఉన్నాను. హైదరాబాద్‌లో కూడా లేను మైసూరులో ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. నాకే సమస్యా లేదు. ఎవరో అనవసరంగా పిచ్చిపిచ్చిగా ఏవేవో పెడుతుంటారు. ఇలాంటివి నమ్ముతూ కూర్చుంటే మనం ఏం చేయలేం’’ అని జానకి అసహనం వ్యక్తం చేశారు. ఎంతో మంది ఫ్యాన్స్ ఫోన్ చేసి ఏడుస్తున్నారని.. వాళ్లను ఓదార్చడమే తనకు సరిపోయిందని అన్నారు. తెలిసీ తెలియకుండా పిచ్చిపిచ్చిగా ఇలాంటి వదంతులు ఎందుకు పుట్టిస్తారో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఉన్నారా లేదా అని తెలుసుకుని పెట్టాలి. వాళ్లకు ఇష్టమొచ్చినట్టు వీళ్లు చచ్చారు.. వాళ్లు చచ్చారు అని పెట్టడమేంటి? హైదరాబాద్‌లో కరోనా మరీ ఎక్కువగా ఉందంటున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి’’ అని తన మెసేజ్‌లో జానకి వెల్లడించారు. ఎస్.జానకి ఆడియో మెసేజ్..


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ