Posts

Showing posts from October, 2019

‘మీకు మాత్రమే చెప్తా’ ట్విట్టర్ రివ్యూ.. నిర్మాతగా విజయ్ దేవరకొండ పాస్

Image
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తారు. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ‘పెళ్లి చూపులు’ సినిమా సమయంలో తన వద్దకు వచ్చిన కథను.. ఆ సినిమా డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌ను హీరోగా చేసి ఇప్పుడు తెరకెక్కించారు. ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ ఇప్పటి వరకు రాని ఒక కొత్త స్టోరీ లైన్‌తో వచ్చిన చిత్రంలో అభినవ్ గోమఠం, అనసూయ, వాణి భోజన్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అంతికా మిశ్రా నటించారు. షమీర్ సుల్తాన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నటీనటలు, సాంకేతిక వర్గం సంగతి పక్కనబెడితే.. ఇది విజయ్ దేవరకొండ నిర్మించిన సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు. విజయ్ దేవరకొండ అయితే ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ వీడియో కూడా చేశారు. మొత్తం మీద అంచనాల నడుమ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. మరోవైపు, హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో గురువారం రాత్రి సెలబ్రిటీ ప్రీమియర్ షో కూడా వేశారు. సినిమా చూసినవ

నా బుజ్జి జొన్నా.. దశాబ్దానికోసారైనా స్త్రీలతో ఎంజాయ్ చేయి, లేదంటే పోతావ్: వర్మ ఎటాక్

Image
వివాదాల దర్శకుడు సినీ రచయితపై సంచలన కామెంట్స్ చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ వర్మ రెండు వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొడుతున్నారంటూ వర్మను ఏకిపారేసిన విషయం తెలిసిందే. ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వర్మ.. రచయిత జొన్నవిత్తులకు ‘జొన్నవిత్తుల చౌదరి’ అని బిరుదు ఇచ్చారు. దీంతో జొన్నవిత్తుల ఘాటుగా స్పందిస్తూ.. రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ పైన నేను పప్పువర్మ అనే బయోపిక్ తీస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా.. వర్మ బతికున్న శవం లాంటివాడు. ఇలాంటి బరితెగించినవాడు సమాజంలో ఉండకూడదు. ఇతని దిక్కుమాలిన ఆలోచనలు వలన సొసైటీకి కలిగే దుష్పరిణామాలను తొలగించే ప్రయత్నమే ఈ ‘పప్పువర్మ’ అంటూ వర్మని ఏకిపారేశారు జొన్నవిత్తుల. వీటిపై రివర్స్ కౌంటర్ ఇస్తూ జొన్నవిత్తులపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ వదిలారు వర్మ. ‘ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్. నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబీ.. లేకపోతే ఫ్రస్ట్రేషన్‌తో చచ్చిపోతావ్ జొన్నా. నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్. వాళ్ళ మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్.. కానీ ఐ లవ్ యు డా’ అ

మా నాన్న వద్దన్నారు.. సంపాదనంతా దీనిపైనే పెట్టా: విజయ్ దేవరకొండ

Image
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారారు. వాణి భోజన్, అభినవ్ గోమఠం, అనసూయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. నవంబర్ 1న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు నిర్మాత విజయ్ దేవరకొండ బోలెడన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇక సినిమా విడుదలకు ఒక్కరోజు ఉందనగా మీడియా ముందుకు వచ్చారు. సినిమా గురించి కాసేపు ముచ్చటించారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మీరు చేయాల్సిన సినిమాకు మీరే నిర్మాత అయ్యారా? నేను ‘పెళ్లి చూపులు’ చేసిన తరవాత.. ఈ సినిమా డైరెక్టర్, కో- డైరెక్టర్ షమీర్చ, అర్జున్ మొదటిసారి నన్ను కలిశారు. అప్పటికే వాళ్లు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఏ మాత్రం బడ్జెట్ లేకుండా చాలా రిచ్‌గా వాటిని తీశారు. వాళ్ల స్కిల్ చూసి యాక్టర్‌గా అయినా, నిర్మాతగా అయినా ఏదో విధంగా వాళ్లతో సినిమా చేస్తానని చెప్పా. ఆ తరువాత వాళ్ళు నాకు ‘మీకు మాత్రమే చెప్తా’ స్క్రిప్ట్ చెప్పారు. నేను చేద్దాం అన్నాను. అయితే ‘అర్జున

ఆ వార్త తెలియగానే షాక్‌కు గురయ్యాను: బాలకృష్ణ

Image
సీనియర్ నటి గీతాంజలి మృతి పట్ల హీరో నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. తమ కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒకరని తెలిపారు. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఆమెకు ఎంతో అభిమానమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘గీతాంజలి గారు పరమపదించారినే వార్త తెలియగానే షాక్‌ అయ్యాను. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు. మా కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒకరు. నాన్నగారంటే ఆవిడకు ఎంతో అభిమానం. నాన్నగారు డైరెక్ట్‌ చేసిన ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో సీత పాత్రలో గీతాంజలిగారు నటించారు. నటనలో ఆవిడ నాన్నగారిని ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవారు. తెలుగు సినిమాల్లో నటిగా తనదైన ముద్ర వేశారు. అలాంటి గొప్ప నటి మనల్ని విడిచిపెట్టి పోవడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యానివ్వాలని ప్రార్ధిస్తున్నాను’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు. Also Read: కాగా, గీతాంజలి గుండెపోటుతో గురువారం ఉదయం మృతిచెందారు. ప్రస్తుతం ఆమె వయసు 72 సంవత్సరాలు. 1947లో తూర్పుగోదావరి జిల్ల

గీతాంజలికి కన్నీటి నివాళి.. తీవ్ర భావోద్వేగానికి గురైన హేమ

Image
సీనియర్ నటి గీతాంజలి కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం గుండెపోటుకు గురైన గీతాంజలిని కుటుంబసభ్యులు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గీతాంజలి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లోని సభ్యులు గీతాంజలి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు కన్నీటి నివాళి అర్పించారు. గీతాంజలి నివాసంలో ఉంచిన ఆమె మృతదేహాన్ని ‘మా’ సభ్యులు ఉత్తేజ్, హేమ, రమాప్రభ, శివాజీ రాజా తదిరులు సందర్శించి నివాళులర్పించారు. అలాగే, స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అయితే, గీతాంజలి మృతి పట్ల నటి హేమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకానొక దశలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. Also Read: మరోవైపు గీతాంజలికి నివాళులర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘క్షణంలో జీవితం ఏమైపోతుందో అర్థంకాని విషయం. ఈరోజు భోజనానికి వస్తానని చెప్పిన మనిషి ఏకంగా స్వర్గానికి వెళ్లిపోవడం చాలా బా

సముద్రంలో జలకాలాట.. మాల్దీవుల్లో ఒంటరిగా ఎంజాయ్ చేస్తోన్న రేణు దేశాయ్

Image
మల్టీ టాలెండెట్ రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత తన ఇద్దరు పిల్లలతో జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. కేవలం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. హైదరాబాద్ నుంచి పుణే వెళ్లిపోయిన ఆమె.. మరాఠి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దర్శకురాలుగా ఒక సినిమా, నిర్మాతగా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగులోనూ ఒక సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఒకవైపు తన ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీగా ఉంటూనే పిల్లలతోనూ ఆనందమైన వ్యక్తిగత జీవితాన్ని గుడుపుతున్నారు రేణు. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం ఆమె ఒంటరిగా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా అందమైన మాల్దీవుల్లో. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, రెండు అందమైన ఫొటోలను కూడా షేర్ చేశారు. సముద్రంలో ఒంటరిగా జలకాలాట ఆడటం ఎంతో బాగుందని పేర్కొన్నారు. Also Read: ‘‘పర్వతాలు నా హృదయమైతే, మహాసముద్రం నా ఆత్మ అని ఇప్పుడు నాకు తెలిసింది. ఈ మాల్దీవులు విహారయాత్రలో సముద్రంలో నేను ఒంటర

రెమ్యునరేషన్ పెంచేసిన బాలకృష్ణ.. స్పందించిన నిర్మాత

Image
నటిసింహా నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేశారని, ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘రూలర్’ సినిమాకు భారీగా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. గతేడాది వచ్చిన ‘జైసింహా’ సినిమాకు రూ.6 కోట్లు తీసుకున్న బాలయ్య.. ఇప్పుడు ‘రూలర్’ సినిమాకు రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఈ రెండు సినిమాలకు సి.కళ్యాణే నిర్మాత. దీంతో ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపించింది. బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేయడంతో బడ్జెన్‌ను సరిచేసుకోవడానికి మిగిలిన డిపార్ట్‌మెంట్లలో పనిచేసేవారికి సి.కళ్యాణ్ కోత విధిస్తున్నారని కూడా రూమర్ వచ్చింది. Also Read: అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత సి.కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. బాలయ్య పారితోషికం కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టే మనిషి కాదని కళ్యాణ్ అన్నారు. ‘‘బాలకృష్ణతో గతంలో పనిచేశాను. ఆయన చాలా మంచివారు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. ఎప్పుడూ ఏదీ డిమాండ్ చేయలేదు. రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతున్నారనే వార్తల్లో నిజం లేదు. మా మధ్యన రెమ్యునరేషన్ గురించి అసలు చర్చే జరగలేదు. సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది’’ అని కళ్యాణ్ చెప్పుకొచ్చారు. Also Read: క

అలనాటి మేటి నటి గీతాంజలి గుండెపోటుతో కన్నుమూత

Image
సీనియర్‌ నటి గీతాంజలి గురువారం కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన గీతాంజలి.. ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ఆయనే కథానాయుడిగా నటించిన సీతారాముల కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. అన్ని భాషల్లోనూ 500కు పైగా చిత్రాల్లో నటించారు. కలవారి కోడలు, డాక్టర్‌ చక్రవర్తి, లేతమనసులు, బొబ్బిలియుద్ధం, ఇల్లాలు, దేవత, గూఢచారి116, కాలం మారింది, శ్రీ శ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. తొలి చిత్రం సీతారాముల కళ్యాణంలో గీతాంజలి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆమె ఎన్టీఆర్‌కు పోటీగా నటించి మెప్పించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు జన్మిం. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివిన గీతాంజలి. మూడేళ్ల వయసు నుంచే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకున్నారు. నాలుగో ఏట నుంచి అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ప్రారంభించారు. గీతాం

నన్ను ‘అక్క’ అని పిలవడం కష్టమే.. సారీ బోయ్స్: అనసూయ

Image
అనసూయ పేరు చెబితే మనకు ముందుగా గుర్తొచ్చే పాత్ర రంగమ్మత్త. ‘రంగస్థలం’లో అనసూయ చేసిన ఈ పాత్ర ఆమె కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే అనసూయ ఎక్కడికెళ్లినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడికొచ్చే అభిమానులు రంగమ్మత్త అనే పిలుస్తారు. కానీ, ఇప్పుడు అనసూయను ‘అక్క’ అని పిలవాల్సి వస్తుందట. కుర్రాళ్లు తనను అలా పిలవడం కష్టమేనన్న అనసూయ.. ఈ విషయంలో తన అభిమానులకు సారీ చెప్పారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రీ రిలీజ్ వేడుక వేదికైంది. Also Read: విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా షమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో అనసూయ ఒక ముఖ్య పాత్ర పోషించారు. అది అక్క పాత్ర అని అనసూయ స్వయంగా చెప్పారు. చాలా స్ట్రిక్ట్‌గా ఉండే అక్క పాత్రట. అందుకే, ఇప్పటి వరకు అత్తగా తనను చూసిన ఈ కుర్రాళ్లు సడెన్‌గా అక్క అంటే జీర్ణించుకోగలరా అని అనసూయ వేదికపై అన్నారు. నిజం చెప్పాలంటే అనసూయ మాట్లాడటానికి వేదికపై వచ్చిన వెంటనే గోల మొదలైంది. అస్సలు ఆమెను మాట్లాడనివ్వకుండా ఒకటే అరుపులు, కేకలు. Also Read: ఇంకేముంది.. అనసూయను ఆపలేం కదా. ఆ అభిమ

‘భాస్కర్ ఒక రాస్కల్’ అంటున్న అమలాపాల్

Image
మలయాళ భామ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘బెజవాడ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమలాపాల్.. రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాలో నటించి అందరినీ ఆకర్షించింది. ఆ వెంటనే బన్నీ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో ఆడిపాడింది. ఆ తరవాత ఆమె తెలుగులో చెప్పుకోదగిన సినిమా చేయలేదు. ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్‌లో అమలాపాల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంటే, రెండేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు ముఖం చూపించని అమలాపాల్ ఇప్పుడు ఒక తమిళ అనువాద చిత్రంతో వస్తోంది. అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో దర్శకుడు సిద్ధికీ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కల్’. ఈ సినిమా ఇప్పడు తెలుగులో ‘భాస్కర్ ఒక రాస్కల్’ పేరుతో రాబోతోంది. కార్తికేయ మూవీస్ పతాకంపై పఠాన్ చాన్ బాషా అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ నెలలో విడుదల కానుంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత పఠాన్ చాన్ బాషా మాట్లాడుతూ.. ‘‘ఇదే చిత్రాన్ని తొలుత మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా దర్శకుడు సిద్ధికీ రూపొందించారు. అక్కడ విజయం సాధించడంతో మళ్లీ తన దర్శకత్వంలోనే నటీనటుల మార్పుతో తమిళంలో తెరకెక్కించారు. తమిళంలో క

‘తెరి’ రీమేక్.. రవితేజ సరసన శృతిహాసన్

Image
దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘తెరి’. 2016లో విడుదలైన ఈ సినిమాను ‘పోలీస్’ పేరుతో తెలుగులో అనువాదం చేసి కూడా విడుదల చేశారు. అయితే, అప్పటికి విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో అస్సలు మార్కెట్ లేదు. దీంతో, చాలా మందికి ఈ సినిమా గురించి తెలీలేదు. అందుకని, ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అది కూడా మాస్ మహారాజా రవితేజ హీరోగా. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బి. మధు నిర్మిస్తున్నారు. ఇది రవితేజకు 66వ చిత్రం. Also Read: ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు దర్శకుడు గోపీచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘బలుపు’ తరవాత రవితేజ, శృతిహాసన్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. వాస్తవానికి ‘తెరి’లో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. మరి తెలుగులో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా? లేదంటే శృతిహాసన్ ఒక్కరేనా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌లో పాయల్ రాజ్‌పుత్

నాగబాబు బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన వరుణ్, నిహారిక.. మెగా ఫ్యామిలీ సందడి

Image
మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు వేడుక హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఘనంగా జరిగింది. తండ్రి నాగబాబు బర్త్‌డేను వరుణ్ తేజ్, నిహారికా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. చిరంజీవి-సురేఖ, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహా, కళ్యాణ్ దేవ్-శ్రీజ దంపతులు సహా కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందిన సభ్యులంతా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Also Read: కాగా, 1961 అక్టోబర్ 29న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన నాగబాబు నిన్నటితో 58 సంవత్సరాలు పూర్తిచేసుకుని 59వ ఏట అడుగుపెట్టారు. అన్నయ్య చిరంజీవి టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన రోజుల్లోనే నాగబాబు కూడా నటుడిగా తెరంగేట్రం చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నటుడిగా నాగబాబు పరిచయం అయ్యారు. ఆ తరవాత వరుసగా చిరంజీవి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. అక్కడి నుంచి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ నాగబాబు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్

రామ్ ‘రెడ్’ మూవీ ఓపెనింగ్.. పూరి, ఛార్మి హంగామా

Image
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేయనున్నారు. దీపావళి సందర్భంగా సోమవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. నిన్న టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈరోజు (అక్టోబర్ 30న) సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. Also Read: ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన రామ్.. తనతో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి క్లాసికల్ మూవీస్ తీసిన తిరుమల కిషోర్‌ను నమ్ముకున్నారు. అయితే, పోస్టర్లు చూస్తుంటే ఇది మంచి మాస్ మూవీలా అనిపిస్తోంది. అందుకే, ఈ సినిమా ఓపెనింగ్‌కు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు అతిథిగా తీసుకొచ్చారు రామ్. ముహూర్తపు సన్నివేశానికి ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ తొలి క్లాప్ కొట్టారు. ఈ సమయంలో ఛార్మి అరుపులు, కేకలతో హంగామా చేశారు. ఆ తరవాత పూరి, ఛార్మిలను రామ్ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇదిలా ఉంటే, ‘రెడ్’ సినిమా

బన్నీకి విలన్‌గా మక్కల్ సెల్వన్.. ఓకే చెప్పిన తమిళ స్టార్ నటుడు

Image
కోలీవుడ్‌లో సూపర్ స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తోన్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి పాత్రల్లో నటిస్తున్నారు విజయ్. తమిళ అనువాద చిత్రం ‘పిజ్జా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ 41 ఏళ్ల నటుడు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో తమిళ యోధుడు రాజా పాండిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం, పంజా వైష్ణవ్ తేజ్ ఆరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ సేతుపతి టాలీవుడ్ భారీ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్టు వార్తలు వస్తు్న్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా చేయనున్నారని టాక్. ఇది అల్లు అర్జున్ 20వ సినిమా. బుధవారం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంతకు మించి వివరాలను వెల్లడించలేదు. Also Read: అయితే, ఇప్పటికే విజయ్ సేతుపతికి సుకుమార్ స్టోరీ లైన్‌ను చెప్పారని.. పాత్రను కూడా వివరించారని అంటున్నా

అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ప్రారంభం

Image
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే మనకు గుర్తొచ్చే సినిమా ‘ఆర్య’. వాస్తవానికి అల్లు అర్జున్‌కు స్టార్ డమ్‌ను తీసుకొచ్చిన సినిమా ఇది. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య 2’ వచ్చినా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో సుకుమార్, అల్లు అర్జున్ సినిమా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది బన్నీకి 20వ సినిమా. అయితే, ఈ సినిమాను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మైత్రీ మూవీస్ కార్యాలయంలో జరిగిన పూజాకార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నిచ్చారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరో దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. నాని ‘గ్యాంగ్ లీడర్‌’కు కెమెరామెన్‌గా పనిచేసిన మిరోస్లావ్ కూబా బ్రోజెక్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా సంస్థతో కలిసి ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.

పూనమ్ కౌర్ ట్వీట్.. మళ్లీ Pawan Kalyanనే టార్గెట్ చేసిందా?

Image
ప్రముఖ నటి మరోసారి తన ట్వీట్‌తో వార్తల్లోకెక్కింది. ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేస్తూ అందరి నోళ్లలో నానుతూ ఉండే పూనమ్ ఇప్పుడు మరో ట్వీట్ చేసింది. ‘ఓ అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడేమో కానీ నాయకుడు కాలేడు’ అని ట్వీట్ చేసింది. దాంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది. పూనమ్ టార్గెట్ చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నే అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జనసేనాని అభిమానులేమో అనవసరంగా ఆయన్ను ఈ వివాదంలోకి లాగొద్దు అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా సేపటి వరకు ఈ ట్వీట్‌పై చర్చ జరిగింది. దాంతో పూనమ్ దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. ‘నా ఆలోచనల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మీ ఆలోచనలన్నీ ఊహాగానాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పెయిడ్ మీడియా వర్గాలు సొమ్మలు చేసుకోవాలని అనుకుంటున్నాయి. నేను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తిని. మీరు మీ ఊహా ప్రపంచంలోనే ఉండండి. మీలాంటివారిపై నాకు జాలేస్తుంటుంది. గాడ్ బ్లెస్’ అని పూనమ్ పేర్కొంది. పూనమ్ చేసే ట్వీట్లకు స్పందించి అనవసరంగా ఆమెకు ప్రచారం కల్పిస్తున్నారని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నోటికొచ్చినట్లు చేసే ట్వీట్లకు అసల

‘విజిల్’ కలెక్షన్లు.. తెలుగులోనూ విజయ్‌కి విజిల్స్

Image
తమిళ స్టార్ హీరో విజయ్ ‘విజిల్’ (బిగిల్) మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అట్లీ దర్శకత్వంలో గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో తిరుగులేని కలెక్షన్లను సాధిస్తోంది. తెరి, మెర్సల్ వంటి బ్లాక్ బాస్టర్ బస్టర్ హిట్స్ తరువాత అట్లీ, విజయ్ కాంబినేషన్‌లో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘బిగిల్’ చిత్రం తెలుగులో విజిల్ పేరుతో విడుదలైంది. మాస్ ఆడియన్స్ మెప్పిస్తూ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి నాలుగురోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మార్క్ దాటి.. రెండొందల కోట్ల కలెక్షన్ల వైపు దూసుకువెళ్తోంది. ఒక్క ఇండియాలోనే రూ. 97. 68 కోట్లను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు విజయ్. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విజిల్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నాలుగు రోజుల్లో మొత్తంగా 12 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. మూడోరోజు నైజాంలో 1.92 కోట్లు, సీడెడ్‌లో 1. 64 కోట్లు, ఉత్తరాంధ్రలో 0. 67 కోట్లు, గుంటూరులో 0. 81 కోట్లు, ఈస్ట్, వెస్ట్‌లో 7.06 కోట్లు, క్రిష్ణాలో 0. 44 కోట్లు, నెల్లూరులో 0. 28 కోట్లు సాధించి మూడురోజులకు గాను 6. 50 కోట్ల షేర్

వీడియో: బిగ్ బాస్ భాను శ్రీ.. బొడ్డు చూపిస్తూ ‘EMI’ కట్టేస్తోంది!

Image
బిగ్ బాస్ సీజన్ 2తో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన .. వెండితెరపైన వెలుగులు జిమ్మే ప్రయత్నం చేస్తుంది. నాజూకు నడుము, ఆకట్టుకునే రూపం, అబ్బురపరిచే అంద చందాలు.. అన్నింటికీ మించి హస్కీ గొంతుతో ‘బాహుబలి 2’ చిత్రంలో తమన్నాకు కొన్ని సీన్లలో డూప్‌గా నటించి తనదైన శైలి శరీర ఆకృతితో అందాల అవంతికలా మాయ చేసింది భానుశ్రీ. ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘ఇద్దరి మధ్యలో 18’, ‘కుమారి 21F’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించడమే కాకుండా మంచి డాన్సర్‌గా కూడా పేరు సంపాదించింది బిగ్ బాస్ సీజన్ 2లో మెరిసింది. ఇటీవల ‘ఏడు చేపల కథ’ అనే బూతు చిత్రంలో కూడా నటించి తన నాజూకు అందాలతో గాలం వేసింది. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉండగా మరో సినిమాను లైన్‌లో పెట్టింది. తన సినిమా అప్డేట్స్‌తో తన అంద చందాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే భాను శ్రీ.. తన అప్ కమింగ్ మూవీ అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ‘EMI’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లో ఉండగా.. ఆమెపై చిత్రీకరించిన వీడియోను షేర్ చేసింది. ఫ్లవర్స్ మధ్య వయ్యారాలను ఒలకబోస్తూ స్కిన్ షో చేస్తుంది భాను శ్రీ. తన అభిమానులు చూపు తిప్పుకోకుండా నడుము ఒంపుల్ని,

పెళ్లిపీటలు ఎక్కుతోన్న అర్చన.. హైదరాబాద్‌లో వివాహం

Image
హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయమై ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన నటి అర్చన అలియాస్ వేద పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్‌ను అర్చన పెళ్లిచేసుకోబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న జగదీశ్, అర్చన అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అర్చన, జగదీశ్ నిశ్చితార్థ వేడుకలో హీరోలు సుమంత్, శివబాలాజీ, నవదీప్, నటి మధుమితతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే, తాజాగా వీరి పెళ్లి తేదీని ఖరారు చేశారు. నవంబర్ 13న వీరి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ మేరకు వధూవరుల కుటుంబ సభ్యులు మంగళవారం మీడియాకు ప్రకటించారు. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా అర్చన-జగదీశ్ పెళ్లి జరగనుంది. Also Read: కాగా, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అర్చన ‘తపన’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమ్యారు. ఈ సినిమాలో ఆమె స్క్రీన్ నేమ్ వేద. ఆ తరవాత ‘నేను’ సినిమాతో అర్చన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో త్రిష స్నేహితురాలిగా నటించి మెప్పించారు. ఇక అప్పటి నుంచి హీరోయి

ప్రభాస్‌ను పెళ్లిచేసుకుంటా: కాజల్

Image
రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి డిస్కషన్ చేయని రోజంటూ ఉండదు. ఆయన ఎక్కడికెళ్లినా, ఏ ఇంటర్వ్యూకి హాజరైనా, ఆఖరికి ఆయన సినిమాల గురించి ఎవరైనా మాట్లాడుకున్నా మధ్యలో పెళ్లి ప్రస్తావన అయితే కచ్చితంగా వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే టక్కున ప్రభాస్ అని చెప్తారు ఎవరైనా. ఆయన పెళ్లిపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు వచ్చాయి. కానీ, వాటిలో ఓ ఒక్కటి నిజరూపం దాల్చలేదు. అయితే, ప్రభాస్‌ని పెళ్లిచేసుకోవడానికి తాను సిద్ధమంటున్నారు అందాల చందమామ కాజల్ అగర్వాల్. మంచు లక్ష్మి హోస్ట్‌గా నిర్వహిస్తోన్న ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’ షోలో తాజాగా కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ షోలో కాజల్ చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. షోలో భాగంగా అందరినీ అడిగినట్టే కాజల్‌ను కూడా కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు అడిగారు మంచు లక్ష్మి. కాజల్‌కు అస్సలు ఇష్టంలేని సుగర్ క్యాండీలను ఆమె నోట్లో పెట్టి మరీ.. ఈ ప్రశ్నలను మంచు లక్ష్మి అడిగారు. వాటిలో మొదటి ప్రశ్న ‘‘నిషా అగర్వాల్‌తో నువ్వు గొడవపడతావా?’’ అని. దీనికి కాజల్ సమాధానం చెప్తూ.. ‘‘గొడవ కాదు, ఇద్దరం ఒకరినొకరు కరుచుకుంటాం’’ అని అన్నారు. Also Read: ఇక రెం

Ismart Shankar: వంటలక్క దెబ్బకి ‘ఇస్మార్ట్ శంకర్‌’ దిమాక్ ఖరాబ్

Image
బుల్లితెర బాహుబలిగా మారింది ‘కార్తీకదీపం’ సీరియల్. టీవీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రేటింగ్స్‌తో బుల్లితెరను షేక్ చేస్తుంది. చిన్నా, పెద్దా, ఆడా, మడా అందరూ కూడా రాత్రి 7:30 అయ్యిందంటే టీవీలకు అతుక్కుపోయేలో చేస్తుంది కార్తీకదీపంలోకి వంటలక్క. వంటలక్క విశ్వరూపానికి మిగతా సీరియల్స్ ఏవీ దరిదాపుల్లో కూడా లేకపోగా.. 18.36 టీవీఆర్ రేటింగ్‌తో బుల్లితెరపై సరికొత్త రేటింగ్ రికార్డుల్ని నమోదు చేసింది. ఓవరాల్‌గా ఈ సీరియల్‌కి 15.44 వీవీఆర్ రేటింగ్ తగ్గడంలేదంటే వంటలక్క హవా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. జబర్దస్త్, బిగ్ బాస్ వంటి ప్రేక్షకాదరణ ఉన్న కార్యక్రమాలు సైతం ముందు తేలిపోయాయి. ఇక ఈ వంటలక్క హవాను తట్టుకోవడం స్టార్ హీరోల వల్ల కూడా కావడంలేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా అక్టోబర్ 13న జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డీ ఛానెల్స్‌లో ప్రసారమైంది. రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రామ్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమైన ఈ సినిమాకు 16

KRKR Trailer: లోకేశ్‌ని ‘పప్పు’ అంటారా, నాకు తెలీదే.. వర్మ వెటకారం

Image
నాకు నచ్చింది నేను తీస్తా.. ఇష్టముంటే చూడండి, లేకపోతే మానేయండి అనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వివాదం అనేది లేకపోతే ఆయనకు అస్సలు నిద్ర పట్టదు. ఈ మధ్య కాలంలో ఆయనకు వివాదాల పిచ్చి మరీ ఎక్కువైంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే వివాదాస్పద చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరవాత ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అంటూ కాకరేపుతున్నారు. ఇది వివాదాస్పద పాత్రలతో అస్సలు వివాదాస్పదం కాని సినిమా అంటూ రామ్ గోపాల్ వర్మ చెబుతున్నా.. ఆయన చేసే ప్రచార కార్యక్రమాలు మాత్రం వివాదాస్పదంగానే ఉన్నాయి. ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. దీపావళి సందర్భంగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ట్రైలర్‌ను వర్మ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఆ రోజు టాప్ ట్రెండ్‌గా నిలిచింది. ఈ ట్రైలర్‌ను చూసిన తరవాత వర్మను తిట్టేవాళ్లు తిట్టారు, పొగిడే వాళ్లు పొగిడారు. అయితే, ఈ ట్రైలర్‌లో లోకేశ్ పాత్రధారికి చంద్రబాబు పాత్రధారి పప్పు వడ్డించే సన్నివేశం బాగా హైలైట్ అయ్యింది. అది ఎందుకు అయ్యిందో మీకు ప్రత్యేక

పిల్లాడిని దత్తత తీసుకోండి.. నేను చదివిస్తా: పుట్టినరోజు నాడు లారెన్స్ గొప్ప నిర్ణయం

Image
తమిళనాడులో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్ మృతిచెందిన సంగతి తెలిసిందే. తిరుచ్చిలో ఈనెల 25న రెండేళ్ల సుజిత్ దురదృష్టవశాత్తు బోరు బావిలో పడిపోయాడు. 35 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. అధికారులు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టి నాలుగు రోజులపాటు కష్టపడినా సుజిత్ ప్రాణాలను కాపాడలేకపోయారు. సుజిత్ క్షేమంగా బయటకు రావాలని తమిళనాడు ప్రజలతో పాటు యావత్తు దేశం ఆకాంక్షించింది. కానీ, దేశ ప్రజల ప్రార్థనలు సుజిత్‌ను కాపాడలేకపోయాయి. కాగా, బిడ్డను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న సుజిత్ తల్లిదండ్రులకు హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన సానుభూతిని తెలియజేశారు. సుజిత్ ఎక్కడికి వెళ్లిపోలేదని, దేశ ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడని అన్నారు లారెన్స్. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈరోజు (అక్టోబర్ 29న) తన పుట్టినరోజు అయినప్పటికీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోవడంలేదని పేర్కొన్నారు. సుజిత్ మరణం తనకు అంత బాధను కలిగించిందని లారెన్స్ పరోక్షంగా వెల్లడించారు. అయితే, ఈ సందర్భంగా సుజిత్ తల్లిదండ్రులకు లారెన్స్ ఒక విన్నపం చేశారు. దేశంలో ఎంతో మంది పిల్లలకు తలిదండ్రులు లేరని. అలాంటి పిల్లల్లో ఒక

‘Mega Family’పై వర్మ షాకింగ్ ట్విస్ట్

Image
వివాదాల దర్శకుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి బాంబ్ పెడతాడో ఆయనకే తెలీదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ తెలుగు రాష్ట్రల్లో దుమ్మురేపింది. చంద్రబాబు నాయుడు, జగన్, లోకేష్ పాత్రధారులను పరిచయం చేస్తూ విడుదల చేసిన ట్రైలర్ విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ సినిమాతోనే జనాలు తట్టుకోలేకపోతుంటే నిన్న మరో సినిమాను ప్రకటించారు వర్మ. ‘మెగా ఫ్యామిలీ’ అనే టైటిల్‌ను ప్రకటించి ఇదే తన తర్వాతి సినిమా అన్నారు. దాంతో వర్మ.. చిరంజీవి ఫ్యామిలీని టచ్ చేస్తున్నాడని అనుకున్నారు చాలా మంది. ఈ సినిమా ఏమై ఉంటుంది అని ఆలోచించేలోపే తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాడు వర్మ. తాను ‘మెగా ఫ్యామిలీ’ సినిమా చేయడంలేదని ప్రకటించారు. ఇందుకు కారణం ఏంటో తెలిస్తే పగలబడి నవ్వుకుంటారు. ‘మెగా ఫ్యామిలీ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ఓ వ్యక్తికి 39 మంది సంతానం ఉంటారు. చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి, నేను చిన్న పిల్లలపై సినిమాలు చేయను కాబట్టి, ఈ సినిమాను చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్ చేశారు. కావాలనే

హీరో విజయ్ ఇంటికి బాంబ్ బెదిరింపు

Image
ప్రముఖ తమిళ నటుడు దళపతి విజయ్‌ ఇంటి చుట్టూ చెన్నై పోలీసులు భారీగా పోలీసులను నియమించారు. శనివారం రాత్రి చెన్నై కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ వచ్చింది. ఇంట్లో బాంబ్ పెట్టామని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. అది ఏ క్షణానైనా పేలొచ్చని బెదిరించాడు. దాంతో పోలీసులు హుటాహుటిన విజయ్ ఇంటికి చేరుకున్నారు. చెన్నైలోని పనైయూర్ ప్రాంతంలో విజయ్ నివసిస్తున్నాడు. వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని ఇల్లంతా తనిఖీలు చేశారు. అయితే బాంబ్ మాత్రం దొరకలేదు. ఎందుకైనా మంచిదని ఆయన ఇంటి చుట్టూ భారీగా భద్రత ఏర్పాటుచేశారు. అనంతరం విజయ్ తండ్రి ప్రముఖ నిర్మాత చంద్రశేఖర్ నివాసానికి కూడా పోలీసులు వెళ్లారు. అక్కడ కూడా తనిఖీలు చేశారు. అక్కడా బాంబ్ దొరకలేదు. ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అళపాక్కమ్ ప్రాంతంలోని పోరూర్ సమీపం నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ చేసిన కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశావ్ అని పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పి వారిని అయోమయానికి గురిచేస్తున్నాడు. మరో మూడు రోజుల్లో అసలు విషయం బయటపెట్టకపోతే పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెడతారు. ఇకపోతే విజయ్

‘మీకు మాత్రమే చెప్తా’ సెన్సార్ పూర్తి.. ఒక్క కట్ కూడా లేదు!

Image
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ స్థాపించిన నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’. తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా పరిచయం చేస్తున్నారు. అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ చెప్పకుండా యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ‘మీకు మాత్రమే చెప్తా’ టీంను అభినందించారని చిత్ర యూనిట్ వెల్లడించింది. న్యూ ఏజ్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపోందిన ఈ సినిమా పరిశ్రమతో పాటు ప్రేక్షకులలోనూ అటెన్షన్‌ని క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్‌తో పాటు విజయ్ దేవరకొండ చేసిన ప్రొమోషనల్ వీడియో సాంగ్ ‘నువ్వే హీరో’కు మంచి రెస్సాన్స్ వచ్చింది. Also Read: ఇదిలా ఉంటే, తమ సినిమా సెన్సార్ పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాత విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘సెన్సార్ సభ్యులు నుంచి మంచి రెస్సాన్స్ వచ్చింది. సినిమా నిర్మాణంలో అడుగ

అలీ రెజా నా శిష్యుడు.. అతన్ని పర్ఫెక్ట్‌గా తయారుచేసింది నేనే: కౌశల్

Image
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా చెప్పుకుంటోన్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ సీజన్ విజేత ఎవరో మరో ఆరు రోజుల్లో తెలిసిపోనుంది. ఎప్పటిలానే టైటిల్ కోసం మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్‌లలో ఎవరు టైటిల్ గెలుచుకుంటారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టంట్ల గురించి ‘బిగ్ బాస్’ సీజన్ 2 విజేత కౌశల్ మండ ఆసక్తికర విషయాలు చెప్పారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ‘బిగ్ బాస్’ సీజన్ 3లో ఫైనల్‌కు చేరిన కంటెస్టెంట్ల గురించి మాట్లాడారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. Also Read: ఈ వీడియోలో ఒక్కో కంటెస్టెంట్ గురించి విడివిడిగా చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ అనేది తాను సపోర్ట్ చేయడం వల్లనో లేదంటే కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ సపోర్ట్ వల్లనో గెలిచే గేమ్ కాదని కౌశల్ అన్నారు. ఎవరైతే ఎక్కువమంది ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటారో వాళ్లే విజేతగా న

అనితకు ఓటేయమంటున్న మెహర్ రమేష్.. విషయమేంటి?

Image
ఉదయ్ కిరణ్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘నువ్వు నేను’తో హీరోయిన్‌గా పరిచయమైన అనిత గుర్తున్నారు కదా..? టాలీవుడ్‌లో తొలి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముంబై బ్యూటీ.. సుమారు 10 తెలుగు చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయారు. కానీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును అయితే సంపాదించుకోగలిగారు. తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, హిందీ సినిమాల్లో వరసపెట్టి సినిమాలు చేసిన అనితకు ప్రస్తుతం అవకాశాలు లేవు. ప్రస్తుతం ఆమె హిందీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, అనిత తన భర్త రోహిత్ రెడ్డితో కలిసి ‘నాచ్ బలియే 9’ డ్యాన్స్ షోలో పోటీపడుతున్నారు. ‘రోనిత’ పేరుతో ఈ జోడి కంటెస్ట్ చేస్తోంది. రవీనా టాండన్, అహ్మద్ ఖాన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న ఈ పాపులర్ డ్యాన్స్ షోలో ‘రోనిత’ జోడి ఫైనల్‌కు చేరింది. వీరితో పాటు మరో నాలుగు జంటలు కూడా ఫైనల్‌కు చేరాయి. ప్రిన్స్ నారులా-యువికా చౌదరి, శాంతను మహేశ్వరి-నిత్యామి షిర్కే, విశాల్ ఆదిత్య సింగ్-మధురిమ తులి, అలై గోని-నటాషా స్టాంకోవిచ్ జోడీలతో ‘రోనిత’ జోడి తుది పోరులో పోటీపడనుంది. Also Read: ఈ షోలో విజేతను నిర్ణయించడంలో ప్

టాలీవుడ్‌లో అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా: ‘సంపంగి’ దీపక్

Image
సరిగ్గా 18 ఏళ్ల క్రితం అంటే 2001లో వచ్చిన ‘సంపంగి’ సినిమా గుర్తుందా..? ఈ సినిమా ద్వారా ఢిల్లీ కుర్రాడు దీపక్ బజ్వా టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కనులు మూసినా నీవాయే’, ‘ప్రేమలో పావని కళ్యాణ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దీపక్‌గా దగ్గరయ్యారు. ‘భద్ర’ సినిమా నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన దీపక్.. ‘అరుంధతి’, ‘కింగ్’, ‘మిత్రుడు’ వంటి భారీ చిత్రాల్లో చేశారు. తాజాగా ఈయన తమిళ చిత్రం ‘బిజిల్’లో ఓ ముఖ్య పాత్రలో నటించారు. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో ‘విజిల్’ పేరిట విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, సుధీర్ఘ విరామం తరవాత మళ్లీ తెలుగు ప్రేక్షకులకు తాను వెండితెరపై కనిపించడంపై దీపక్ ఆనందం వ్యక్తం చేశారు. తొలినాళ్లలో తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి మంచి సినిమాతో మళ్లీ కనిపించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోన్న దీపక్.. మళ్లీ తెలుగులో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానంటున్నారు. ఈ మేరకు తెలుగులో తనకు అవకాశాలు ఇచ్చిన దర్శకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు. Also Read: ‘‘బాలీవుడ్‌లో ‘గురు’, ‘ప్యాషన్’ చిత్రాల తర

రామ్ కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్.. ఇదిగో ఫస్ట్‌లుక్

Image
సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని దీపావళి సందర్భంగా ఆదివారం ప్రకటించారు. చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అన్నట్టుగానే ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఈ చిత్రం టైటిల్‌ను, హీరో రామ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘రెడ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రామ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టైటిల్ మాదిరిగానే పోస్టర్‌లో రామ్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ‘‘దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి సో బ్లడీ డిఫరెంట్’’ అని రామ్ తన ట్వీట్‌కు క్యాప్షన్‌గా పెట్టారంటే సినిమా ఎంత డిఫరెంట్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల సందర్భంగా నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు రామ్‌ చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. రామ్‌ - తిరుమల కిషోర్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ‘నేను శైలజ’, ‘ఉన్నది

చిరంజీవి ఇంట దీపావళి వేడుక.. నలుగురు పిల్లలతో కలిసి హాజరైన పవన్

Image
దీపావళి అంటేనే వెలుగుల పండుగ. అసలు.. దీపావళి ఎందుకు జరుపుకుంటాం అనే కథను పక్కనబెడితే.. ఈ పండుగ రోజున ఇంటిళ్లపాది ఎంతో సంతోషంగా గడుపుతారన్నది వాస్తవం. ఉదయం పూజలు, పిండి వంటలు చేసుకుని.. సాయంత్రం కుటుంబమంతా కలిసి ఎంతో ఉత్సాహంగా టపాసులు కాలుస్తారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి ఇంట ఈ దీపావళి మరింత కాంతివంతంగా జరిగింది. ఎందుకంటే, ఈ దీపావళి రోజున కేవలం చిరంజీవి కుటుంబమే కాకుండా మొత్తం కొణిదెల ఫ్యామిలీ అంతా కలిసి సంబరాలు జరుపుకుంది. ఆదివారం రాత్రి చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, నాగబాబు కుటుంబం పాల్గొన్నాయి. అన్నయ్యతో కలిసి ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన నలుగురు పిల్లలతో కలిసి (రేణు దేశాయ్ పిల్లలు అకీరానందన్, ఆద్య.. అన్నాలెజినోవా పిల్లలు మార్క్ శంకర్ పవనోవిచ్, పొలెనా అంజన పవనోవ) పాల్గొన్నారు. అలాగే పవన్ భార్య అన్నాలెజినోవా కూడా పాల్గొన్నారు. Also Read: త‌ల్లి అంజ‌నాదేవీతో క‌లిసి చిరంజీవి, సురేఖ, నాగ‌బాబు అండ్ ఫ్యామిలీ, ప‌వ‌న్ అండ్ ఫ్యామిలీ స‌హా ఇత‌ర కుట

రాములమ్మ కాంటెస్ట్: శ్రీముఖితో డ్యాన్స్ చేసే అవకాశం.. ఓట్ల కోసం ఇదో రకం ప్రచారం

Image
‘బిగ్ బాస్’ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లు.. శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, రాహుల్, బాబా భాస్కర్‌లలో విజేత ఎవరో ఆదివారం తెలిసిపోనుంది. ఈ ఐదుగురిలో రూ.50 లక్షలు సొంతం చేసుకోబోయేది ఎవరు అనే విషయంలో ‘బిగ్ బాస్’ షో అభిమానులకు విపరీతమైన ఎగ్జయిట్‌మెంట్ ఉంది. అయితే, విజేతగా నిలిచేది శ్రీముఖినే అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే శ్రీముఖి టీం కూడా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా శ్రీముఖి అధికారిక ఖాతాల నుంచే ‘ఓట్ ఫర్ శ్రీముఖి’ అంటూ విపరీతంగా ప్రచారం చేస్తు్న్నారు. ఈ ప్రచారంలో భాగంగా ‘రాములమ్మ కాంటెస్ట్’ను కూడా ప్రవేశపెట్టారు. ఇంతకీ ఏంటీ ఈ రాములమ్మ కాంటెస్ట్.. అక్కడికే వస్తు్న్నా. శ్రీముఖిని బుల్లితెర రాములమ్మ అని అంటారని అందరికీ తెలిసిందే. అంతేకాదు ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలోని పాట వచ్చినప్పుడు శ్రీముఖి ఒక సిగ్నేచర్ స్టెప్ కూడా వేస్తుంటుంది. ఇప్పుడు అదే స్టెప్పుతో ‘రాములమ్మ కాంటెస్ట్’ను నిర్వహిస్తున్నారు. Also Read: ఈ కాంటెస్ట్‌లో భాగంగా ఆసక్తిగల అమ్మాయిలు, అబ్బాయిలు రాములమ్మ సిగ్నేచర్

`అర్జున్‌ రెడ్డి తరువాత విజయ్‌ చేయాల్సిన సినిమా ఇది`

Image
పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తరుణ్‌ భాస్కర్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నవంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా విశేషాలను అభినవ గోమటం మీడియాతో పంచుకున్నారు. తరుణ్‌తో నా అనుబంధం అలాంటిది `నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే, సినిమాలంటే ఆసక్తితో మొదట థియేటర్ ఆర్టిస్ట్‌గా చేశాను తరువాత సినిమాల్లోకి వచ్చాను. నేను నటించిన ఈ నగరానికి ఏమైంది బాగా సక్సెస్ కావడమే కాకుండా నా పాత్రకు మంచి గుర్తింపు లభించింది. యస్ సినిమా తరువాత కొన్ని చిత్రాల్లో నటించాను. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సినిమాలో చెయ్యమని ఆడినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. తరుణ్‌తో నా అనుబంధం అలాంటిది. Also Read: అర్జున్‌ రెడ్డి తరువాత విజయ్‌ చేయాల్సిన సినిమా ఇది మీకు మాత్రమే చెప్తా డైరెక్టర్ షమ్మీర్‌ సుల్తాన్‌ ఈ సినిమా కాన్సెప్ట్ మొదట విజయ్‌కు చెప్పాడు, అప్పటికి అర్జున్ రెడ్డి విడుదల కాలేదు. అర్జున్ రెడ్డి విడుదల తరువాత విజయ్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ ఇది, కానీ అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్‌న

రామ్‌ గోపాల్ వర్మపై కేసు నమోదు

Image
సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో వివాదానికి తెర తీశాడు. ఇటీవల కాలంలో రామ్ గోపాల్‌ వర్మ తన సినిమాలతో కన్నా అవి సృష్టిస్తున్న వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. తాజాగా అలాంటి ఓ వివాదాస్పద చిత్రాన్ని తెర మీదకు తీసుకువస్తున్నాడు రామ్‌ గోపాల్ వర్మ. ఎన్నికలకు ముందు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పేరుతో ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల అనుబంధం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన వర్మ, ఇప్పుడు అంటూ మరో వివాదాస్పద చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. గత ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి, తరువాతి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. Also Read: ఇప్పటికే పోస్టర్లతో తనదైన స్టైల్‌లో వివాదాలు సృష్టించిన వర్మ దీపావళి సందర్భంగా ఆటం బాంబు లాంటి ట్రైలర్‌ను రిలీజ్‌ చేశాడు. ట్రైలర్‌లో జగన్‌, చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌, కేఏ పాల్‌ను పోలిన పాత్రలతో ట్రైలర్‌ను చేశాడు. ఈ ట్రైలర్‌ ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్రైలర్‌ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందంటూ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా అనంతరపురం కాంగ్రెస్‌ నాయకులు వర్మపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వర్మ తె

ఒక దశలో `సైరా` ఆపేద్దామనుకున్నాం: రామ్‌ చరణ్‌

Image
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్‌ స్టార్ నిర్మించిన భారీ హిస్టారికల్‌ మూవీ . సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించిన నార్త్‌లో మాత్రం నిరాశపరిచింది. వార్‌, జోకర్‌ సినిమాలతో పోటి పడాల్సి రావటంతో సైరా హిందీలో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. తాజాగా దీపావళి సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత రామ్‌ చరణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా బాలీవుడ్‌లో అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిందన్న విషయాన్ని కూడా అంగీకరించాడు చరణ్. అంతేకాదు ఒక దశలో సైరా సినిమాను ఆపేద్దామా అన్న ఆలోచన కూడా చేసినట్టుగా చెప్పి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. Also Read: గ్రాఫిక్స్‌, సెట్స్‌ ఇలా అన్ని కలిపి బడ్జెట్‌ 75 కోట్లకు పైగా ఖర్చు చేసిన తరువాత సినిమా విషయంలో ముందుకెళ్లాలా వద్ద అన్న ఆలోచన కూడా చేశామని తెలిపాడు. అయితే ఆ దశలో ఏ నిర్మాత సినిమాను ఆపే ప్రయత్నం చేయడని అందుకే నేను కూడా మొండి ధైర్యంతో ముందుకెళ్లానని తెలిపాడు. అంతేకాదు సైరా కోసం చిరు, తమన్నాలపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. దాదాప

రానా సంచలన ఆరోపణలు..`ఆ నిర్మాతను నమ్మొద్దు..!`

Image
ఒకప్పుడు తన సినిమాలతో వార్తల్లో ఉండే ఇటీవల వరుసగా రూమర్స్‌, వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా దీపావళి సందర్భంగా రానా కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఒకటి రిలీజ్‌ అయ్యింది. 2017లో 1945 పేరుతో ఓ పీరియాడిక్‌ పేట్రియాటిక్‌ సినిమాను ప్రకటించాడు రానా. తరువాత ఇతర సినిమాలతో రానా బిజీ కావటంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పడిపోయింది. ఆ సినిమాకు సంబందించిన ఎలాంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఇక ఆగిపోయినట్టే అని భావించారు అంతా. కానీ సడన్‌ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ను ఇచ్చారు చిత్రయూనిట్‌. ఈ సినిమా జనవరి 24న రిలీజ్‌ అవుతుందని వెల్లడించారు. Also Read: ఎస్‌ ఎన్‌ రాజరంజన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివకుమార్‌దర్శకుడు. తన సినిమాల ప్రమోషన్‌ విషయంలో చాలా యాక్టివ్‌గా ఉండే రానా ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మాత్రం ట్వీట్ చేయలేదు. అంతేకాదు సదరు చిత్ర నిర్మాతపై సంచలన ఆరోపణలు చేశాడు. 1945 సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్న రానా. `నిర్మాత పారితోషికాల విషయంలో మోసం చేయటంతో సినిమా పూర్తి కాలేదు. దాదాపు సంవత్సర కాలంగా నేను ఈ చిత్రయూనిట్‌ను కనీసం కలవ

సౌత్‌లో నెంబర్‌ వన్‌.. రికార్డ్‌లు సృష్టిస్తున్న `రాములో రాములా`!

Image
స్టైలిష్ స్టార్‌ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం . త్రివిక్రమ్‌ మార్క్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌. రెండు పాటలను రిలీజ్ చేశారు. తొలి పాట సామజవరగమన ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతుండగా లేటెస్ట్ సెన్సేషన్‌ యూట్యూ్‌బ్‌ రికార్డ్‌లను బ్రేక్‌ చేస్తోంది. దీపావళి సందర్భంగా శనివారం విడుదల చేసిన ఈ పాట 24 గంటల్లో 8.3 మిలియన్ల (83 లక్షల) వ్యూస్‌ సాధించి రికార్డ్ సృష్టించింది. లైక్స్‌ విషయంలోనూ రాములో రాములా రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టిస్తోంది. ఈ పాటకు ఇప్పటి వరకు 3లక్షల 40 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. Also Read: సౌత్‌లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌ సాధించిన పాటగా రికార్డ్‌ సృష్టించింది రాములో రాములా. మాస్‌ బీట్‌లో తమన్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ (సత్యవతి) అలపించారు. కాశర్ల శ్యామ్‌ సాహిత్యమందించా

మనోజ్‌కు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా..? మంచు కుటుంబంలో అంతా ఓకెనా..?

Image
సీనియర్ హీరో మోహన్‌ బాబు వారుసులుగా ఆయన ముగ్గురు పిల్లలు సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా టెలివిజన్‌ హోస్ట్‌గా మంచి విజయాలు సాధించారు. కూడా హీరోగా పరవాలేదనిపించాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌లతో సక్సెస్‌లు సాధించి హీరోగా ప్రూవ్‌ చేసుకున్నాడు. కానీ మనోజ్‌ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా కథల ఎంపికలో తడబడుతూ వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను పాడు చేసుకున్నాడు మనోజ్‌. దీంతో కొంత కాలం సినిమాలకు దూరమయ్యాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ మనోజ్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణతి రెడ్డితో మనస్పర్థలు రావటంతో ఆమెతో విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. ఇక మీదట పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెడతానని, చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని తెలిపాడు. Also Read: ఇటీవల తన వ్యక్తిగత, సినీ జీవితాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్న మనోజ్‌ త్వరలో తిరిగి సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. తాజాగా దీపావళి సందర్భంగా తన నిర్మాణ సంస్థ పేరును ప్ర

థ్రిల్లర్‌ రీమేక్‌లో `ఇస్మార్‌ శంకర్‌`.. ఆ డైరెక్టర్‌ డీల్ చేస్తాడా?

Image
ఎనర్జిటిక్‌ స్టార్‌ చాలా కాలం తరువాత సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్‌ కెరీర్‌ను గాడిలో పెట్టింది. ఇస్మార్ట్‌ శంకర్‌ ఇచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఓ సూపర్‌ హిట్ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దీపావళి సందర్భంగా ఆదివారం తన తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశాడు రామ్‌. తన 18వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తన హోం బ్యానర్‌ స్రవంతి మూవీస్‌లో తెరకెక్కిచనున్నారు. అంతేకాదు ఈ సినిమాకు గతంలో రామ్‌ హీరోగా నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలను తెరకెక్కించిన దర్శకత్వం వహించనున్నారు. Also Read: అయితే ఇక్కడే రామ్‌ సెలక్షన్‌ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయి. రామ్‌చేయబోయేది తమిళ్‌లో సూపర్‌ హిట్ అయిన తడం సినిమాకు రీమేక్‌ అన్న ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్‌ నటుడు అరుణ్‌ విజయ్‌ హీరోగా మగిల్‌ తిరుమణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించింది. అరుణ్ విజయ్‌ ద్విపాత్రాభినయంలో నటించగా విద్యా ప్రదీప్‌, తానా హోపేలు హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఇదే సిన

చిన్న కూతురిని చిరంజీవికి పరిచయం చేసిన మంచు విష్ణు

Image
హీరో, నిర్మాత మంచు విష్ణు తన చిన్న కూతురు ఐరా విద్యను మెగాస్టార్ చిరంజీవికి పరిచయం చేశారు. మెగాస్టార్ ఒళ్లో తన కూతురుని పెట్టి ఆశీర్వదించమని అడిగారు. దీనికి శంషాబాద్‌లోని మంచు విష్ణు నివాసం వేదికైంది. ఆదివారం దీపావళి సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మంచు విష్ణు విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్‌తో సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. Also Read: ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు ముచ్చటించిన విష్ణు, విరానికా దంపతులు.. తమ గారాలపట్టిని ఆయన చేతిలో పెట్టారు. అక్కడ తీసుకున్న ఫొటోలను విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘కూలెస్ట్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి అంకుల్‌కి ఐరా విద్యను పరిచయం చేశాను’’ అని తన పోస్టులో విష్ణు పేర్కొన్నారు. విష్ణు షేర్ చేసిన ఫొటోల్లో మోహన్ బాబు, రాజారవీంద్ర కూడా ఉన్నారు. కాగా, విష్ణు-విరానికా దంపతులకు నలుగురు సంతానం. విష్ణు 2009 మార్చిలో విరానికాని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2011 డిసెంబ‌ర్‌లో ఈ దంప‌తుల‌కి కవల ఆడపిల్లలు జన్మించారు. వారికి అరియానా, వివియానా అని పేరు పెట్టారు. ఇక 2018లో వారికి మగబిడ్డ జ‌న్మించాడు.

మంచు మనోజ్ కొత్త జర్నీ.. దీపావళి రోజున సంచలన ప్రకటన

Image
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడిగా చిత్ర సీమకు పరిచయమైన మంచు మనోజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. కమర్షియల్ హీరోగా మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకోలేనప్పటికీ టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అయితే, ఈ మధ్య మనోజ్ బాగా వెనకబడిపోయారు. గడిచిన ఐదేళ్లలో మనోజ్ నుంచి ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు. 2014లో వచ్చిన ‘కరెంట్ తీగ’ ఒక్కటే ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన చిత్రం. రెండేళ్ల క్రితం ‘ఒక్కడు మిగిలాడు’ అనే విరుద్ధమైన చిత్రంతో మనోజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్ పాత్రను ఈ సినిమాలో మనోజ్ పోషించారు. దీంతో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. కానీ, సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఆ సినిమా తరవాత మనోజ్ మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. మనోజ్ నుంచి తరవాత సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూశారు. కానీ, ఇటీవల ఆయన నుంచి ఒక షాకింగ్ నిర్ణయం వినాల్సి వచ్చింది. భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా మనోజ్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. తమ మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయని.. అందుకనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలి

రామ్ దీపావళి సర్‌ప్రైజ్.. మళ్లీ ఆ డైరెక్టర్‌తోనే సినిమా

Image
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఆ సినిమా విడుదలై 100 రోజులు పూర్తయినా ఇంకా తన తరవాత ప్రాజెక్ట్ ప్రకటించలేదంటని రామ్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి దీపావళి నాడు అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు రామ్. తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తనతో ‘నేను శైలజా’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలు చేసిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో తన తరవాత సినిమా చేయబోతున్నారు రామ్. Also Read: ఇది రామ్‌కు 18వ సినిమా. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఇంకో సర్‌ప్రైజ్ ఏంటంటే.. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రేపు (అక్టోబర్ 28న) విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని రామ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేస్తారు. ఇదిలా ఉంటే, కిశోర్ తిరుమల ఈ ఏడాది ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్‌ను మళ్లీ ట

సుధీర్ఘ విరామం తరవాత మళ్లీ ఒకే సెట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్

Image
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘RRR’ షూటింగ్ కిందటేడాది ప్రారంభమైంది. తొలి రెండు షెడ్యూల్స్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ పాల్గొన్నారు. వీరిద్దరిపై కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరవాత ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై వేర్వేవేరుగా కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. కొన్ని కారణాల చేత రామ్ చరణ్ షూటింగ్‌లో ఎక్కువగా పాల్గొనలేదు. చరణ్ కాలికి గాయం కావడం, ఆ తరవాత ‘సైరా’ సినిమా పనుల్లో ఆయన బిజీ కావడంతో ‘RRR’ షూటింగ్‌కు కాస్త దూరం కావాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు రామ్ చరణ్ తన పూర్తి సమయాన్ని రాజమౌళికే కేటాయించనున్నారు. మళ్లీ తారక్‌తో కలిసి నటించనున్నారు. ఈ మేరకు సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభంకాబోతోంది. ఈ షెడ్యూల్‌లో మళ్లీ చరణ్, తారక్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకమైన సెట్ వేసినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, ఎలాంటి విరామం లేకుండా ఈ షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తిచేయనున్నారని తెలిసింది. Also Read: ఇదిలా ఉంటే, ‘RRR’ సినిమ

నాడు.. వైఎస్ జగన్ చేతిలో తన్నులు తిన్నది అతనేనా వర్మా?

Image
ఓరి వర్మా.. నువ్ మామూలోడివి కాదురా సామీ.. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ చూశాక చాలామంది ప్రేక్షకుల నుండి వచ్చే మాట ఇదే. అయితే ట్రైలర్ నిజంగానే అంత అద్భుతంగా ఉందా? విజువల్స్ అదిరిపోయాయా? టేకింగ్ చింపేశాడా? కంటెంట్ కట్టిపడేశాలా ఉందా? అంటే.. ఇవన్నీ ఉండి అట్రాక్ట్ చేస్తే అతను వర్మ ఎందుకు అవుతాడు. అతని సినిమాల్లో ఇవేమీ మచ్చుకైనా కనిపించవు. ఆరోజులు పోయి దశాబ్ధాలు దాటేసింది. అయినా సన్సేషన్స్ క్రియేట్ చేస్తాడు. వివాదం అనేదే అతని సినిమాకి పెట్టుబడి, రాబడి. కథలో కంటెంట్ లేకపోయినా వివాదం ఉంటే మన డబ్బులు మనకు వచ్చేస్తాయ్.. కాస్తో కూస్తో జేబులు కూడా నింపుకోవచ్చనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అప్ కమింగ్ మూవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్‌ను దీపావళి కానుకగా విడుదల చేశాడు. Read Also: 2.50 నిమిషాల నిడివితో విడుదల చేసిన ఈ ట్రైలర్ విడుదలై కొన్ని నిమిషాల్లోనే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 2019 ఎన్నికల అనంతరం వైఎస్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీలోని రాజకీయ పరిస్థితులు, కుల సమీకరణాలను ప్రధానంగా చూపించారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు వ్యూహాలు, పవన

‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ నిర్మాత మాంచి జల్సా రాయుడు

Image
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వింటేనే వివాదాలు గుర్తుకొస్తాయి. ఒకప్పుడు గొప్ప సినిమాలు తీసిన ఈ సీనియర్ దర్శకుడు ఇప్పుడు ఏ చిత్రం తీసినా వివాదమే. మొన్నామధ్య ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఒక వర్గం‌ను టార్గెట్‌ చేస్తూ తీసిన సినిమా ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఇంకో సినిమాను వదులుతున్నారు. అదే ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఈ చిత్ర ట్రైలర్‌ను దీపావళి సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ టాప్ 1 ట్రెండింగ్. ఈ ఆనందాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. Also Read: ఇదిలా ఉంటే, ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ద్వారా కొత్త నిర్మాత ఒకరు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఆయన పేరు అజయ్ మైసూర్. ఇంతకీ ఎవరితను అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తే ఉంటుంది. ఈ విషయాన్ని ఊహించే అజయ్ మైసూర్ గురించి వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అజయ్‌ను ఇండియన్ డాన్ బిల్జరియాన్‌గా పోల్చారు వర్మ. అంతేకాదు, అందమైన అమ్మాయిల మధ్య స్టైల్‌గా కారులో కూర్చున్న అజయ్ ఫొటోను కూడా వర్మ షేర్ చేశారు. అజయ్‌కు కార్లన్నా కూడా అ

చిట్టి నడుముని ఒడిసి పట్టు.. ‘భీష్మ’ ఫస్ట్‌లుక్ పోస్టర్లు అదుర్స్

Image
యంగ్ హీరో నితిన్, ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘భీష్మ’. రష్మిక మందన హీరోయిన్. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రావడం లేదని నితిన్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. అయితే, అభిమానుల దాహాన్ని తీర్చేలా దీపావళి సందర్భంగా అదిరిపోయే పోస్టర్లను నితిన్ వదిలారు. ‘భీష్మ’ ఫస్ట్‌లుక్‌గా రెండు పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లు అదిరిపోయాయి. Also Read: ఒక పోస్టర్ డుష్యుం డుష్యుం ఫైట్లతో మాస్‌గా ఉంటే.. మరొక పోస్టర్ రష్మిక మందన చిట్టి నడుముతో రొమాంటిక్‌గా ఉంది. రష్మిక ఏదో ఆలోచిస్తూ వెళ్తుంటే వెనుక నుంచి నితిన్ ఆమె చిట్టి నడుమును ఒడిసి పట్టుకోవాలన్నంటు చాలా దగ్గరగా వచ్చినట్టు ఒక పోస్టర్‌లో ఉంది. ఈ రెండు పోస్టర్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక, నితిన్ ఉన్న పోస్టర్ చాలా రొమాంటిక్‌గా అనిపిస్తోంది. రష్మిక చీరలో చాలా అందంగా కనిపించగా.. నితిన్ సూట్‌లో హుందాగా ఉన్నారు. ఇక రెండో పోస్టర్‌లో నీట్‌గా టక్ చేసుకుని ఉన్న నితిన్..

చీకటి తెరలను చీల్చుకుంటూ వెలుగులోకి వస్తున్నా.. అందరికీ చెప్పండి: నిఖిల్

Image
యంగ్ హీరో నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది. గతేడాది మార్చిలో ‘కిరాక్ పార్టీ’ విడుదలైంది. ఆ తరవాత మళ్లీ నిఖిల్ నుంచి ఇంకో సినిమా రాలేదు. వాస్తవానికి నిఖిల్ హీరోగా ‘అర్జున్ సురవరం’ అనే సినిమా ఎప్పుడో పూర్తయిపోయింది. ఈపాటికే ఆ సినిమా విడుదలైపోవాలి. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. గడిచిన ఆరు నెలలుగా వాయిదా పడుతూ వస్తోన్న ‘అర్జున్ సురవరం’ ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నవంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అర్జున్ సురవరం’ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ ప్రేక్షకుల్లో ఇంకా అనుమానమే. నిజంగా ఆ తేదీకి సినిమా వస్తుందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ, హీరో నిఖిల్ మాత్రం పక్కా అంటున్నారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పమని అడుగుతున్నారు. ఈ మేరకు దీపావళి నాడు.. అంటే ఆదివారం నిఖిల్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నిఖిల్ స్టైల్లోనే ఉంది. ‘‘ఒక మహానుభావుడు చెప్పాడు.. కొన్ని సార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా. దీపావళి సందర్భంగా చెప్తున్నా.. చీకటి తెరలను చీల్చుకుంటూ వెలుగులోకి నా సినిమా వచ్చే సమయం వచ్చ

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్: కొడుక్కి పప్పు వడ్డిస్తున్న బాబు!

Image
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ వచ్చేసింది. దాదాపు మూడు నిమిషాల నిడివితో వర్మ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం వివాదాస్పదంగానే ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ వర్మ తన కాంట్రవర్సీ మార్క్ చూపించారు. ‘బ్రేకింగ్ న్యూస్.. మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ.. చరిత్రలోనే ఎవరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి’ అంటూ ఏపీ రాజకీయ పరిస్థితుల్ని హింసాత్మకంగా చూపించారు వర్మ. ‘ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడు’ అని చంద్రబాబు పాత్రధారి.. ‘ఇక ప్రశ్నించే ప్రసక్తిలేదు.. చేయడమే’ అని పవన్ పాత్రధారి చెప్తున్న డైలాగ్స్ ఆయ పార్టీల్లో మంటపుట్టించేవిగా ఉన్నాయి. ఇక డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్న లోకేష్ బాబు పాత్రధారి ఏడుస్తూ అన్నం తింటూ ఉంటే.. చంద్రబాబు పాత్రధారి పప్పు వడ్డించడాన్ని బట్టి వర్మ లోకేష్‌ని గట్టిగానే టార్గెట్ చేశారు. ఇక ఈ ట్రైలర్‌లో అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువ

‘రాములో.. రాములా’ ఊపేస్తుందిరో! బన్నీ దీవాళి ట్రీట్ సూపరో

Image
‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు’.. ఏ నోట విన్నా ఈ పాటే ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. అల వైకుంఠపురములోని ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్, 313 లైక్స్ సాధించి రికార్డ్‌ సృష్టించింది. ఇప్పటి వరకూ ఈ పాటకు 45 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ రావడంతో అత్యధిక వ్యూస్ లైక్స్ సాధించిన పాటగా ‘సామజవరగమన’ పాట సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఈ పాటకు సిద్ శ్రీరామ్ ఆలపించగా.. తమన్ స్వరపరిచారు. ఇక ఇదే జోష్‌ను కొనసాగిస్తూ దీపావళి కానుకగా మారో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘‘రాములో రాములా’’ అంటూ మంచి ఊపునిచ్చే బీట్‌ సాంగ్‌తో బన్నీ రచ్చ చేస్తున్నాడు. పబ్‌లో ఈ ఊరమాస్ పాట పిక్చరైజేషన్ అదిరిపోతుంది. సింగర్ మంగ్లీ కంచుకంఠం ఈ పాటకు మరింత ఊపినిచ్చింది. అనురాగ్ కులకర్ణి, మంగ్లి ఆలపించిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. ఈ సాంగ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో పాటు గాయకులు అనురాగ్, మంగ్లీలతో పాటు ఈ చిత్రంలో నటించిన అల్లు అర్జున్, పూజా, సుశాంత్, సునీల్, నవదీప్, టబు తదితరులంతా స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. సాంగ్ ఎండింగ్‌లో వీరంతా కలిసి ప్రేక్షకులకు దీవ

మహేష్ దివాళి గిఫ్ట్.. బుల్లెట్‌పై ‘సరిలేరు నీకెవ్వరు’

Image
దీపావళి పండుగ వేళ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నుండి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మహేష్ బాబు లేటెస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు బుల్లెట్‌పై కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ‘సరిలేరు నీకెవ్వరు’ అన్నట్టుగానే ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోండగా.. లేడీ అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంతో రెండు దశాబ్ధాల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్. ఇందులో విజయశాంతి భారతిగా కనిపించబోతున్నారు. మొత్తంగా దీపావళి కానుకగా.. విజయ శాంతి లుక్‌తో పాటు, మహేష్ లేటెస్ట్ పోస్టర్‌ను విడుదల చేసి డబుల్ ట్రీట్ ఇచ్చింది చిత్ర యూనిట్. మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2 లాంటి వరుస బ్లాక్ బస్టర్ అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెం