Posts

Showing posts from February, 2021

స్పెషల్ అప్‌డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. యంగర్ బాయ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ అంటూ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Image
సినిమాల పరంగా హవా మామూలుగా లేదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే ఒక సినిమాలతో కాదు వ్యాపార పరంగా కూడా సత్తా చాటాలని డిసైడ్ అయిన రౌడీ స్టార్.. 'కింగ్ ఆఫ్ ది హిల్స్'‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ నిర్మాణ సంస్థ కార్యకలాపాలు యాక్టీవేట్ చేసిన విజయ్ దేవరకొండ, తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా '' అనే సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తూ స్పెషల్ అప్‌డేట్ ఇచ్చారు విజయ్. మూడో సినిమాగా ఈ 'పుష్ప‌క విమానం' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డార్క్ కామెడీ మూవీగా కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ దేవ‌ర‌కొండ సరసన శాన్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సునీల్, సీనియ‌ర్ న‌రేష్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విజయ్ దేవరకొండ చిత్ర బృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. యంగర్ బాయ్ ఆనంద్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ స్టఫ్‌తో మీ ముందుకొస్త

హీరోయిన్ పూజా హెగ్డే ఇంట విషాదం.. బామ్మ మృతితో ఎమోషనల్ అయిన బుట్టబొమ్మ

Image
పలు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ నెలకొంది. పూజా బామ్మ మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించిన పూజా.. ఆమెను తలచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ''ఈ క్యూటీని మేం కోల్పోయా. కష్టాల్లో ఉన్నా న‌వ్వుతూనే ఉండాల‌ని ఆమె మాకు నేర్పించింది. ధైర్యంగా ఉండ‌డం, కావ‌ల‌సిన వారి కోసం ఈగోల‌ను ప‌క్క‌న పెట్ట‌డం అన్నీ అలవాటు చేసింది. నా బామ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది. ల‌వ్ యూ ఆజీ. నీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను'' అని పేర్కొంటూ బామ్మపై ఉన్న ఇష్టాన్ని వెల్లడించింది పూజా. పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆమె, ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాను పీరియాడికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జూలై 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీంతో పాటు అక్కిని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మూవీలో నటిస్తోంది పూజా.

రేయ్ రేయ్.. పేరు మార్చేయ్ ఇక! అల్లరి నరేష్‌పై నాని కామెంట్స్ వైరల్

Image
స్నేహితులన్నాక 'ఏరా.., ఒరేయ్' అని పిలుచుకోవడంలో ఉన్న మజానే వేరు. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా స్నేహం విలువ, ఆ పిలుపులో తేడా అనేది ఉండదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది హీరోల్లో ఏరా.. అని పిలుచుకునేంత స్నేహ బంధం ఉంది. తాజాగా నాచురల్ స్టార్ అలాంటి చనువుతోనే అల్లరి నరేష్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్రసీమలో కామెడీ పండిస్తూనే హీరోగా రాణిస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు అల్లరి నరేష్. అప్పుడప్పుడూ విలక్షణ పాత్రల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్న ఈ అల్లరోడు.. చాలా ఏళ్లకు '' రూపంలో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా లాభాల బాటలో కొనసాగుతోంది. ఈ మూవీలో అల్లరి నరేష్ కనబర్చిన నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'నాంది' చూసిన హీరో నాని ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ఇక నీ భవిష్యత్తంతా బంగారుబాటే అన్నట్లుగా హింట్ ఇస్తూ ట్వీట్ చేశారు. ''మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను. రేయ్‌ రేయ్‌ రేయ్‌.. ‘’ పేరు మార్చేయ్‌ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. నీలో ఓ గొ

రామ్ సమక్షంలో అవినాష్, అరియానా డ్యాన్స్.. బిగ్ బాస్ జంట రొమాంటిక్ షో!

Image
‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన ‘ముక్కు’ అవినాష్.. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఈ షోలో అరియానా గ్లోరీతో అవినాష్ కెమిస్ట్రీ బాగా పండింది. అవినాష్ కోసం అరియానా ఏడ్వడం.. అవినాష్ ఊరుకోబెట్టడం.. ఇదంతా చూసిన ప్రేక్షకులు వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవడం ఇవన్నీ తెలిసిన విషయాలే. బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరవాత కూడా వీళ్లిద్దరూ తమ ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. అయితే, ఈ జంట తాజాగా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసింది. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’. టాలీవుడ్‌లో రూపొందిన తొలి హాకీ ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిలిం మేకర్ డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా నిర్మించారు. మార్చి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర ప్రచారంలో భా

తన సినిమాలో నటించిన మల్లయోధులను సన్మానించిన పవన్ కళ్యాణ్

Image
తన సినిమాలో నటించే స్టంట్‌మెన్, ఫైటర్స్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటారు. ‘గబ్బర్ సింగ్’ విలన్ గ్యాంగ్‌‌‌ను ఆయన ఏ విధంగా సత్కరించారో గతంలో చూశాం. ఆ గ్యాంగ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా కొలుస్తారు. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి తన సినిమాలో నటించిన ఫైటర్స్‌పై తన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ప్రాచీన యుద్ధ కళలను చూపించబోతున్నారు. ఈ యుద్ధ కళలతో కూడిన ఒక ఫైట్ సీక్వెన్స్‌లో నటించడానికి ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర నుంచి 16 మంది మల్లయోధులను రప్పించారు. షూటింగ్ కూడా పూర్తి చేశారు. చిత్రీకరణ సమయంలో ఆ మల్లయోధుల ప్రతిభకు ముగ్ధులైన పవన్ కళ్యాణ్ వారందరినీ సత్కరించి పంపించారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయానికి ఆ మల్లయోధులను తీసుకువెళ్లి వారిని సన్మానించారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరున

నటి అలేఖ్య ఏంజెల్‌కు ఎమ్మెల్సీ కవిత సన్మానం.. కారణం ఏంటంటే!

Image
కరోనా మహమ్మారి వల్ల గతేడాది సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. నిరుపేదలు నరక యాతన అనుభవించారు. కరోనా విజృంభనను అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించడంతో దేశం స్తంభించిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో చాలా మంది మానవతావాదులు నిరుపేదలకు అండగా నిలబడ్డారు. వారికి ఆహారాన్ని అందించారు. నిత్యవసరాలు పంపిణీ చేశారు. సినిమా పరిశ్రమ నుంచి సైతం ఎంతో మంది ప్రముఖులు పేదలకు నిత్యవసరాలను సరఫరా చేశారు. వీరిలో నటి అలేఖ్య ఏంజెల్ కూడా ఉన్నారు. లాక్‌‌డౌన్ సమయంలో దాదాపు న‌ల‌భై వేల మందికి పైగా నిరుపేద‌ల‌కు నిత్యవసరాలను పంపిణీ చేశారు న‌టి అలేఖ్య. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. కొవిడ్ వారియర్ రియల్ హీరో 2021 అవార్డుతో అలేఖ్యను సత్కరించింది. ఇటీవల ముంబైలో జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2021 వేడుకలో కొవిడ్ వారియర్ రియల్ హీరో పురస్కారాన్ని అలేఖ్య అందుకున్నారు. ఒక తెలంగాణ అమ్మాయి ఇంత గొప్ప అవార్డును అందుకోవడంతో ఆమెను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సత్కరించారు. ఆమెను ఆదివారం తన ఇంటికి పిలుపించుకుని సన్మానించారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారని అలేఖ్య

తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ.. ఓ సీక్రెట్ దాచి పెట్టాం అంటూ ఓపెన్ అయిన బ్యూటిఫుల్ హీరోయిన్

Image
రిచా గంగోపాధ్యాయ.. ఈ బ్యూటీ వెండితెరకు దూరమై చాలారోజులే అయినా ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. 'లీడర్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ''మిరపకాయ్, మిర్చి'' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. అందం, అభినయం పరంగా భేష్ అనిపించుకున్నా కెరీర్‌ పరంగా ఎక్కువ రోజులు నిలువలేదు. సినీ పరిశ్రమలో ఉంటూనే చివరకు తన ప్రియుడిని పెళ్లిచేసుకొని ఓ ఇంటిదైపోయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ సీక్రెట్ బయటపెడుతూ ఓపెన్ అయింది. చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన .. పెళ్లి గురించి ముందుగా ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా సీక్రెట్ మెయిన్‌టైన్ చేసింది. ఆ తర్వాత సడెన్‌గా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో వీరి పెళ్లి మ్యాటర్ బయటకొచ్చింది. ఇదే కంటిన్యూ చేస్తూ తన ప్రెగ్నెన్సీ మ్యాటర్‌ కూడా సీక్రెట్‌గా ఉంచిన రిచా.. తాజాగా తన బేబీ బంప్ లుక్ పోస్ట్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. తాను తల్లి కాబోతోన్నాని ఆనందం వ్యక్తం చేస్తూ తన భర్తతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేసింది రిచా గంగోపాధ్యాయ. ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచాం కానీ..

సంపూర్ణేష్ బాబు హీరోగా కొత్త సినిమా.. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తోన్న బర్నింగ్ స్టార్

Image
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా ఓ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించేందుకు మ‌ధుసూధ‌న క్రియేష‌న్స్‌, రాధాకృష్ణ టాకీస్ స‌న్నాహాలు చేస్తున్నాయి. ఆర్‌.కె.మ‌లినేని ద‌ర్శక‌త్వం వ‌హించే ఈ చిత్రానికి ఆశాజ్యోతి గోగినేని నిర్మాత‌. సంపూర్ణేష్ బాబు స‌ర‌స‌న నాయిక‌గా వ‌సంతి న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి శ్రీ‌ధ‌ర్ స‌మ‌ర్పకునిగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఒక డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో, ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌నుంది. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి క‌థ‌ను కానీ, ఇలాంటి పాత్రను కానీ సంపూర్ణేష్ బాబు చేయ‌లేద‌ని ద‌ర్శకుడు ఆర్‌.కె. మ‌లినేని తెలిపారు. ఒక చ‌క్కని క‌థ‌తో, సంపూర్ణేష్ బాబు హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని.. మార్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రంలో ఇంకా పోసాని కృష్ణముర‌ళి, వైవా హ‌ర్ష, గెట‌ప్ శ్రీ‌ను, రోహిణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ కిరణ్ కథను అందించగా.. రైటర్ మోహన్, శివరామ్ డైలాగులు రాస్తున్నారు. పూర్ణాచారి, సురేష్ బనిశెట్టి సాహిత్యం అందిస్తు్న్నారు. ప్రజ్వల్ సంగీతం సమకూరుస్తున్నారు. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ సి

ఈ కథలో పాత్రలు కల్పితం: రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Image
ఈ రోజుల్లో సినిమాను రూపొందించడం ఒకెత్తయితే.. దాన్ని జనాలకు తెలిసేలా ప్రమోట్ చేయడం మరో ఎత్తు. అందుకే ఈ జనరేషన్ మేకర్స్ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరోలు, స్టార్ దర్శక నిర్మాతలతో పాటు రాజకీయ నాయకుల సహకారం పొందుతూ తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మొన్నా మధ్య '' అనే పాటను వైఎస్ షర్మిల చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అది బాగానే వర్కవుట్ కావడంతో ఈ సారి మంత్రి చేతుల మీదుగా లీజ్ డేట్ పోస్టర్‌ను వదిలారు. పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌, సాంగ్స్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన తెచ్చుకున్నాయి. డిఫరెంట్ టైటిల్ కావడంతో జనం అట్రాక్ట్ అయ్యారు. ఒక్కో అప్‌‌డేట్‌తో మూవీపై అంచనాలు పెంచేసిన యూనిట్.. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇటీవలే సెన్సార్ పనులను జరుపుకున్న ఈ సినిమాను మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రక

Prabhas: ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వేసవిని మరింత వేడెక్కించనున్న ప్రభాస్

Image
‘కె.జి.యఫ్’ లాంటి సెన్సేషనల్ మూవీని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ ద్వయం ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్‌ను చూపించనున్నారు ప్రశాంత్ నీల్. జనవరి 15న లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ చిత్ర విడుదల తేదీని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఆదివారం ప్రకటించింది. వచ్చే ఏడాది వేసవిలో ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు హోంబలే ఫిలింస్ ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో వస్తోన్న మూడో పాన్ ఇండియా మూవీ ఇది. ఇప్పటికే ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’తో కన్నడ సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లింది హోంబలే. ఇప్పుడు ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ను అత్యంత భారీగా నిర్మించి ఈ ఏడాది జులై 16న విడుదల చేస్తోంది. దీని తరవాత మూడో పాన్ ఇండియా మూవీగా ‘సలార్’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 22న ప్రే

PSPK 27: సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుతో ఆసక్తికర పోరు

Image
సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు పెద్ద పండుగ మాత్రమే కాదు సినిమా పండుగ కూడా. స్టార్ హీరోల అభిమానులు, సినీ ప్రేక్షకులు సంక్రాంతికి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. స్టార్ హీరోలు సైతం సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసుకుని సినిమాలను ప్లాన్ చేసుకుంటారు. వచ్చే సంక్రాంతి సీజన్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే టార్గెట్ చేశారు. ఆయన హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట’ సంక్రాంతికి విడుదలకానుంది. అయితే, సంక్రాంతికి మరో స్టార్ హీరో సినిమా కూడా వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి PSPK27గా పిలుస్తున్నారు. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ ఆదివారం ప్రకటించింది. ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న చిత్రం

నిర్మాత సందీప్ కొరిటాల హఠాన్మరణం.. నారా రోహిత్ భావోద్వేగం

Image
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత సందీప్ కొరిటాల హఠాన్మరణం చెందారు. ఆదివారం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. సందీప్ కొరటాల మరణానికి సంతాపం తెలుపుతూ హీరో నారా రోహిత్, దర్శకుడు సుధీర్ వర్మ ట్వీట్లు చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘స్వామిరారా’, పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘రౌడీ ఫెలో’ సినిమాలకు సందీప్ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించారు. సందీప్ కొరిటాల కన్నుమూసిన విషయాన్ని ముందుగా నారా రోహిత్ ఖరారు చేశారు. ‘నా రౌడీ ఫెలో సినిమా సహ నిర్మాత, నా శ్రేయోభిలాషి సందీప్ కొరిటాల ఇకలేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఈరోజు ఇంత బాధాకరంగా ప్రారంభమవుతుందని అనుకోలేదు. ఓం శాంతి’’ అని నారా రోహిత్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అలాగే, ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ కూడా సందీప్ కొరిటాల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘నా ఆత్మీయ స్నేహితుడు సందీప్ కొరిటాల మరణవార్త విని చాలా బాధపడ్డాను. ‘స్వామిరారా’ రూపొందించడంలో మీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర. నిన్ను మేం కోల్పోతున్నాం’’ అని సుధీర్ వర్మ ట

Saranga Dariya: 'డాన్స్ సాంగ్ ఆఫ్ ది సీజన్' అంటూ రిలీజ్ చేసిన సమంత.. ఇరగదీసిన సాయి పల్లవి

Image
అక్కినేని , హీరోహీరోయిన్లుగా శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న 'లవ్‌స్టోరి' మూవీ నుంచి '' లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సమంత రిలీజ్ చేసిన ఈ సాంగ్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయి మిలియన్‌కి పైగా వ్యూస్ రాబట్టింది. "డాన్స్ సాంగ్ ఆఫ్ ది సీజన్.. సాయిపల్లవి నువ్వు మెస్మరైజ్‌ చేశావు" అని పేర్కొంటూ ఈ లిరికల్ సాంగ్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది సమంత. 'దాని కుడీ భుజం మీద కడువా.. దాని పుస్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' అనే ఫోక్ సాంగ్‌ను రీమిక్స్ చేశారు. చక్కని తెలంగాణ జానపదానికి సాయిపల్లవి ఎనర్జిటిక్‌ స్టెప్స్ తోడుకావడం, శేఖర్ కమ్ముల టేకింగ్ ఈ సాంగ్‌ని ఎక్కడికో తీసుకెళ్లాయి. శేఖర్‌ మాస్టర్‌ ఈ సాంగ్‌కు డాన్స్ కంపోజ్ చేశారు. ఓ అమ్మాయి గుణగణాలను పొగుడుతూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్‌ తేజ రాయగా, మంగ్లీ ఆలపించారు. పాటకు తగ్గట్టు పవన్ సీహెచ్ మంచి బీట్‌తో కూడిన బాణీలు కట్టారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ 'లవ్ స్టోరీ' సినిమాను నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్

సునీల్ సర్‌ప్రైజింగ్ బర్త్ డే గిఫ్ట్.. అప్పుడు 'మర్యాద రామన్న' ఇప్పుడు 'మర్యాద క్రిష్ణయ్య'

Image
నేడు (ఫిబ్రవరి 28) టాలీవుడ్ కమెడియన్, నటుడు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేస్తూ సర్‌ప్రైజింగ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. కమెడియన్‌గా ఈ జనరేషన్‌కి బాగా దగ్గరైన సునీల్.. అవకాశం దొరికినప్పుడల్లా హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారిన ఆయన, ఆ తర్వాత ‘మర్యాద రామన్న’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ''గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సునీల్. తాజాగా సునీల్ బర్త్ డే పురస్కరించుకొని ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఏటీవీ ఒరిజినల్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కిషోర్‌ గరికపాటి, టీజీ విశ్వప్రసాద్‌, అర్చనా అగర్వాల్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వివేక్‌ కూచిబొట్ట సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సునీల్ గోడ చాటు నుంచి భయం భయంగా ఎవరినో గమనిస్

ముదిరిన శృతి హాసన్ డేటింగ్ వ్యవహారం.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో చిల్లింగ్.. తండ్రితో ఇద్దరి మీట్

Image
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొద్ది రోజులపాటు సినిమాలు కూడా పక్కన పెట్టేసి తన మాజీ ప్రియుడు, ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో ఆయన్ను ఇండియాకు తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. దీంతో ఈ ఇద్దరి పెళ్లి కన్ఫర్మ్ అని అంతా ఫిక్సయ్యాక.. మెల్లగా అతనితో కట్ చేసుకుంది శృతి. కారణాలేంటనేవి బయటకురానప్పటికీ వారి ప్రేమ బంధానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత తిరిగి సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన శృతి.. కొద్ది రోజులుగా మరో వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందని, డేటింగ్ వ్యవహారం ముదిరిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ తన కొత్త బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా‌ను తండ్రి కమల్ హాసన్‌కి పరిచయం చేసింది . ముంబైకి చెందిన ఆర్టిస్టు శంతను హజారికాతో కలిసి చెన్నైలో ఆమె చేసిన హంగామా, తండ్రి కమల్ హాసన్‌కి పరిచయం చేయడం చూస్తుంటే ఈ ఇద్దరి లవ్ ఎఫైర్ ఎక్కడిదాకా వెళ్లిందో అర్థమవుతోంది. రాజకీయ పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్‌కు శంతను హజారికా ఓ అపురూపమైన గిఫ్ట్ ఇవ్వడం గమనార్హం. తమిళ రాజకీయ ప్రక్షాళనకై బయ

‘పైన పటారం.. లోన లొటారం.. కెలికిసూడు’ అంటూ చెలరేగిన అనసూయ వీడియో

Image
‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. ఇను బాసూ చెబుతాను లోకం యవ్వారం. పైకి బంగారం లోన గూడు పుటారం.. కెలికి చూడు తెలిసిపోద్ద అస్సలు బండారం’.. ఇదేందయ్యో!! ఈ యవ్వారం కాస్త తేడాగానే ఉంది.. అనేట్టుగానే ఉంది ఈపాట. అందులోనూ అనసూయ ఈ పాటకు చీరకు పైకి ఎగ్గొట్టి మరీ స్టెప్పులు వేస్తుంటే అబ్బో మాస్ ఆడియన్స్‌కి పండకే. జబర్దస్త్ యాంకర్‌గానే కాకుండా ఐటమ్ సాంగ్స్‌తోనూ అల్లాడించే అనసూయ ‘పైన పటారం’ అనే ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె ఖాతాలో మరో ఐటమ్ సాంగ్ చేరింది. కార్తికేయ గుమ్మకొండ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో అనసూయపై ఐటమ్ సాంగ్ చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శనివారం నాడు ఈ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. పూర్తి పాట మార్చి 1న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు. ‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. కెలికి చూడు తెలిసిపోద్ద అస్సలు బండారం’ అంటూ అనసూయ వేస్తున్న మాస్ స్టెప్పులు జబర్దస్త్ అనేట్టుగానే ఉన్నాయి. లిరిక్స్‌కి తగ్గట్టుగా అనసూయ పలికించే హావభావాలు ఓ రేంజ్‌లో ఉన్

Chandrababu Zoom: చంద్రబాబు జూమ్ మీటింగ్స్.. ఏడ్చిన సందర్భాలు బోలెడు: దివ్యవాణి షాకింగ్ కామెంట్స్

Image
పార్టీలో ఉన్న అంతర్గత సమస్యల్ని ఫేస్ చేస్తూ.. బయటవాళ్లని ఎదుర్కోవడమే నిజమైన రాజకీయం అని ఈ కరోనా తరువాత నాకు బాగా అర్థమైందని అన్నాడు అధికార ప్రతినిధి, సినీనటి . ఇటీవల ఆమె పార్టీ మారతారనే వార్తలు రావడంతో వాటిపై స్పందించిన ఆమె.. దేనికైనా టైం రావాలని అన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇన్ సైడ్ పాలిటిక్స్ గురించి ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాకు రాజకీయాలు చేతకావు.. అంతా ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం నేను టీడీపీ పార్టీలో హ్యాపీగానే ఉన్నాను.. నాకు రాజకీయాలు చేయడం చేతకాదు.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంటా. ఈ షార్ట్ పొలిటికల్ జర్నీలో నాకు చంద్రబాబు గారు ఉన్నతమైన స్థానం ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి అని మంచి హోదా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాకపోవడం బ్యాడ్ లక్ కానీ.. చంద్రబాబు గారు పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారు. ఆయనలాగ ఇంకొకరు పుట్టరు.. పుట్టబోరు. అటువంటి వ్యక్తి దొరకడం అరుదు. అటువంటి వ్యక్తితో సహవాసం చేస్తూ నడుస్తుంటే చాలా నేర్చుకోవచ్చు. అలాంటి వ్యక్తిదగ్గరకు నిజాన్ని చేరవేయడానికి వెయ్యి మంది అడ్డు పడినా.. నేను చెప్పాల్సింది చెప్తా. విశ్వ ప్రయత్నం చేస్తుంటా.. అదొక్కటే కష్టంగా అనిపిస్తుంటుంది

‘చెక్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. నిర్మాతలకు గట్టిదెబ్బ.. భీష్మ కంటే వీక్

Image
నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘చెక్’ చిత్రం శుక్రవారం నాడు భారీ అంచనాలతో థియేటర్స్‌లో విడుదలైంది. మోస్ట్ వ‌ర్స‌టైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ‘భవ్య క్రియేషన్స్’‌ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ చిత్రానికి యావరేజ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా 875పైగా స్క్రీన్స్‌లో విడుదలైన ఈ చిత్రం.. తొలిరోజు 3.59 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. నైజాం 1.46 కోట్ల షేర్ సీడెడ్ 0.47 కోట్ల షేర్ ఉత్తరాంధ్ర 0.34 కోట్ల షేర్ ఈస్ట్ 0.14 కోట్ల షేర్ వెస్ట్ 0.10 కోట్ల షేర్ గుంటూరు 0.58 కోట్ల షేర్ కృష్ణా 0.21 కోట్ల షేర్ నెల్లూరు 0.09 కోట్ల షేర్ ఏపీ + తెలంగాణ (టోటల్) 3.39 కోట్ల షేర్ రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 కోట్ల షేర్ ఓవర్సీస్ 0.10 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ (టోటల్) 3.59 కోట్ల షేర్ నితిన్ గత చిత్రం ‘భీష్మ’తో పోల్చుకుంటే ‘చెక్’ చిత్రానికి ఫస్ట్ డే కలెక్షన్స్ వీక్ అనే చెప్పాలి. ‘భీష్మ’ చిత్రం తొలిరోజు రూ. 6.42 కోట్ల రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. దాంట్లో సగానికి మ

A: డిఫరెంట్ కథ ఇంప్రెస్ చేసిందన్న విజయ్ సేతుపతి.. చూడగానే థ్రిల్ అయ్యారట

Image
కోలీవుడ్ సూపర్ స్టార్ టాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్నారు. వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంటూ తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరవుతున్నారు. ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ విలక్షణ రోల్స్ పోషిస్తున్న ఆయన ఇటీవలే 'ఉప్పెన' విజయంలో కీలకం అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా 'A' అనే తెలుగు మూవీకి సపోర్ట్‌గా నిలుస్తూ ఆ కథ ఎంతో బాగుందని చెబుతూ సినిమాపై హైప్ పెంచేశారు విజయ్ సేతుపతి. నితిన్ ప్రసన్న, హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో ‘A’ మూవీ రూపొందింది. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన ఈ చిత్రం డిఫరెంట్ థ్రిల్లర్‌గా అలరించనుందట. విజయ్ కురాకుల సంగీతం అందించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయగా ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ముంబైలో షూటింగ్స్‌లో పాల్గొంటున్న విజయ్ సేతుపతిని ప్రత్యేకంగా కలిసి తమ సినిమాకు సపోర్ట్‌గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకనిర్మాతలు. ఈ సందర్భంగా A చిత్రంలోని కొంత పార్ట్‌ని చూసి అయన ఎంతో థ్రిల్ అయ్యారని చిత్ర దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంటుందని ఆయన అన్

శ్రీవారిని ద‌ర్శించుకున్న ఉప్పెన టీమ్.. కాలినడక కొండెక్కిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి

Image
'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్‌ తేజ్ తొలి సినిమా తోనే సూపర్ సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. సుకుమార్ శిష్యుడు, నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్ ప్రవాహం పారిస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఒక్కసారిగా 'ఉప్పెన' టీమ్ మొత్తానికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆనందంలో టీమ్ అంతా కలిసి నేడు (శనివారం) తిరుమ‌ల‌ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. , కృతి శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు అంతా కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి కాలినడకన కొండెక్కడం విశేషం. వారు కొండెక్కుతుండ‌గా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ.. ''ఈ సినిమా స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందాము. ఆ ఆశీస్సులతో ఉప్పెన సినిమా విజ‌యం సాధించింది. తదుపరి సినిమా స్క్రిప్ట్‌ను కూడా శ్రీవారి పాదాల

ప్రతి అమ్మాయికి అలాంటోడే కావాలంటూ లాజిక్ బయటకు తీసిన శ్రీ విష్ణు.. 'గాలి సంపత్'కి రాజమౌళి సపోర్ట్

Image
నటకిరీటి టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘’. ఈ సినిమాలో యంగ్ హీరో , లవ్‌లీ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం. షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసి మార్చి 11వ తేదీన ఈ సినిమాను విడుద‌ల చేయబోతున్న చిత్రయూనిట్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ లాంచ్ చేయించారు. 2 నిమిషాల 17 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్‌తో సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. ''పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ఆ తప్పులను కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏమి చేసినా ఊరికే చిరాకులొచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది'' అంటూ హీరో శ్రీ విష్ణు చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగిపోయింది. ''ప్రతి

Nithiin: బతుకు బస్టాండ్ అయిందంటున్న నితిన్.. పెళ్లి తర్వాత పడుతున్న కష్టాలన్నీ చెప్పుకున్న యంగ్ హీరో

Image
రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకొని ఓ ఇంటివాడైన నితిన్.. పెళ్లి తర్వాత పడుతున్న కష్టాలను పాట రూపంలో ప్రెజెంట్ చేశారు. పెళ్లి తర్వాత బతుకు బస్టాండ్ అయిపోయిందంటూ తన గోడు వినిపించారు. కాకపోతే ఇది రియల్ లైఫ్ స్టోరీ కాదు.. రీల్ లైఫ్ స్టోరీ. అదేనండీ.. హీరోగా రాబోతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'రంగ్ దే' మూవీలో మ్యాటరే ఇది. తాజాగా ఈ సినిమా నుంచి 'బతుకు బస్టాండ్' సాంగ్ రిలీజ్ చేసి పెళ్లి తర్వాత నితిన్ కష్టాలను తెలిపారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగ్ దే' మూవీ మార్చి 26వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ సాంగ్ రిలీజ్ చేశారు. నితిన్, కీర్తి సురేష్‌లపై అందమైన లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. నితిన్ గోడు వెలిబుచ్చుతూ ఈ పాటను సాగర్ ఆలపించగా, శ్రీమణి లిరిక్స్ అందించారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నితిన్, జంటగా నటించారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషో

మనసులో మాట బయటపెట్టిన ప్రియా ప్రకాష్.. అల్లు అర్జున్‌తో ఆ ఛాన్స్ కోసం వెయిటింగ్ అంటూ ఓపెన్

Image
కన్నుకొట్టి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన బ్యూటిఫుల్ హీరోయిన్ తన తొలి తెలుగు సినిమా `చెక్‌`తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్‌ హీరోగా నటించగా, మరో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. కాగా టాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ అప్పుడే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కన్నేసింది. ఆయనతో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ప్రియా ప్రకాష్ రిజెక్ట్‌ చేసిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయానికి చెక్ పెట్టేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రియా. తాను చిన్నప్పటి నుంచే బన్నీ సినిమాలు చూస్తూ పెరిగానని, బన్నీ అంటే తనకెంతో అభిమానం అని చెప్పుకొచ్చింది. ఆయన సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చిందని, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని రీసెంట్‌గా వార్తలు నిజం కాదని ప్రియా స్పష్టం చేసింది. ఏది ఏమైనా అల్లు అర్జున్ సరసన నటిస్తానని, ఒకవేళ ఆ అవకాశం రావాలే గానీ అస్సలు వదిలేదే లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది ప్రియా ప్రకాష్. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రియాకు టాలీవుడ్ నుం

ఆ మాటంటూ స్టార్ హీరోయిన్ భయపడింది.. వెంటనే కాజల్‌కి కాల్ చేయడంతో! సీక్రెట్ చెప్పిన మంచు విష్ణు

Image
గత కొన్నేళ్లుగా కెరీర్‌లో సరైన హిట్ పడక సతమతమవుతున్న .. ఓ భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సారి ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టాలని 'మోసగాళ్లు' సినిమాతో బరిలోకి దిగుతున్నారు. 50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. చిత్రంలో మంచు విష్ణుకి చెల్లెలిగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు విష్ణు. ఈ సినిమాలో సిస్టర్ పాత్రకు మొదట ప్రీతీ జింటాను అనుకున్నామని, కానీ అమెరికాకు సంబంధించిన మనీ స్కామ్ స్టోరీ అనగానే ఆమె నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటించలేను. ఇలాంటి సినిమా చేస్తే నన్ను కొడతారు. నా ఫ్యామిలీ మొత్తం యూఎస్‌లో ఉంటోందని ఆమె చెప్పారని విష్ణు పేర్కొన్నారు. దీంతో కాజల్‌కు ఫోన్ చేయడంతో వెంటనే ఒప్పుకుందని ఆయన తెలిపారు. రిస్క్ అని తెలిసినా కూడా మోసగాళ్ళు సినిమా నా మార్కెట్ పరిధిని బ్రేక్ చేయగలదనే నమ్మకం ఉందని విష్ణు తెలిపారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్

భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ మూవీ `మడ్డీ`.. టీజ‌ర్‌ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

Image
పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. భారీ బడ్జెట్‌తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నడూ చూడని కాన్సెప్ట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ 'మడ్డీ' మూవీ తెలుగు టీజర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ 'మడ్డీ' టీజర్‌లో రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెజీ రతీష్ సినిమాటోగ్రఫీ చాలా క్రిస్ప్‌గా ఉండి టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి. టీజ‌ర్‌ చూస్తుంటే మడ్డీ చిత్రం ప్రేక్షకులను ఒక థ్రిల్లింగ్ రైడ్‌కి తీసుకెళ్ళడం ఖాయం అనిపిస్తోంది. సాహసోపేతమైన సన్నివేశాలతో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుత అనుభవాన్ని అందించనుంది. టీజ‌ర్‌‌తో సినిమా మీద ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి. చిత్ర దర్శకుడు ప్రగభల్‌కి ఆఫ్ రోడ్ రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అనుభ

కన్నడ వాళ్లు నాకు ఇచ్చిన రెస్పెక్ట్ తెలుగు వాళ్లు కూడా ఇవ్వలేదు: జగపతిబాబు

Image
కన్నడ ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శన్ క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం ‘రాబర్ట్’. తరుణ్ కిషోర్ సుధీర్ దర్శకత్వం వహించారు. ఉమాప‌తి ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఉమాప‌తి శ్రీనివాస గౌడ నిర్మించారు. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. కన్నడలో మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న దర్శన్.. ఇప్పుడు ‘రాబర్ట్’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా ‘రాబర్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం (ఫిబ్రవరి 26న) హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో దర్శన్‌తో పాటు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన జగపతిబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ హీరో దర్శన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘నేను ఫంక్షన్లకు రావడం మానేశాను.. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కానీ, ఈ ఫంక్షన్‌కు నేను రావాలి అని అనుకున్నాను. ఎందుకంటే కన్నడ వాళ్లను చూడాలి, వాళ్లతో మాట్లాడాలి, వాళ్ల గురించి చెప్పాలి. ఇంతకు ముందు నేను కన్నడ సినిమాలు చేశాను. అన్నీ ఫ్లాపయ్యాయి. సాధారణంగా నాకు ఆలస్యంగానే హిట్లొస్తాయి. ఈ సినిమా కథ చెప్పగానే ఇది సూపర్ డూప

‘శ్రీకారం’లో ఆ డైలాగ్ చాలా బాగుంది.. శర్వానంద్ సినిమాకు త్రివిక్రమ్ కితాబు

Image
శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి. దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను సమకూర్చారు. కాగా ‘శ్రీకారం’ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. శుక్రవారం హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్‌తో పాటు చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, చిత్ర దర్శకుడు కిషోర్ బి, నటుడు సప్తగిరి, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. ఈ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘14 రీల్స్ రామ్, గోపీ నాకెంతో ఇష్టమైన నిర్మాతలు. వాళ్లు దూకుడికి ఎప్పుడో శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు కొత్తగా మరో చాప్టర్ స్టార్ట్ చేసి దానికి ‘శ్రీకారం’ చుడుతున్నారు. మా రాంజో బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ఈ చిత్రంలోని మూడు పాటలు చూశాను. చాలా బాగున్నాయి. ‘శ్రీకారం’ టైటిల్ సాంగ్.. 4వ పాట నా చేతుల మీదుగా విడుదలవడం సంతోషంగా ఉంది. టీజర్ చూశాను.. నాకు బాగా నచ్చింది

విజయ్ సేతుపతి, నిహారిక జంటగా సినిమా.. విడుదల తేదీ ఖరారు

Image
మెగా డాటర్ నిహారిక కొణిదెల చివరిగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కనిపించారు. ఆ తరవాత ఆమె వెంకట చైతన్యను పెళ్లాడారు. పెళ్లి తరవాత ఇక ఆమెను వెండితెరపై చూడటం కష్టమే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్. తెలుగు ప్రేక్షకులు నిహారికను మళ్లీ వెండితెరపై చూడబోతున్నారు. అయితే, ఇది తెలుగు సినిమా కాదు. తమిళ సినిమా అనువాదం. నిహారిక నటించిన ఏకైక తమిళ సినిమా తెలుగులోకి అనువాదమై విడుదలవుతోంది. విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్’. 2018 ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం విజయవంతం అయ్యింది. మూడేళ్ల తరవాత ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘ఓ మంచి రోజు చూసి చెప్తా చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి నటన ఈ చిత్రాన

శ్రీ రెడ్డి 'క్లైమాక్స్'కి సెన్సార్ బోర్డు క్లియరెన్స్.. రిపోర్ట్ చూస్తే!!

Image
సంచలన తారగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న వెండితెరపై తన ప్రతాపం చూపించే సమయం వచ్చేసింది. టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై లైంగిక ఆరోపణలతో విరుచుకుపడుతున్న ఆమె '' అనే మూవీ పూర్తి చేసింది. ఇందులో తన లైఫ్‌కు దగ్గరగా ఉండే క్యారెక్టర్‌లో నటించిందట శ్రీ రెడ్డి. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. తాజాగా ఈ మూవీ సెన్సార్ ఫినిష్ అయిన నేపథ్యంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. `డ్రీమ్‌` చిత్రంతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చింది. చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఈ 'క్లైమాక్స్' చిత్రాన్ని మార్చి 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు దర్శకనిర్మాతలు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. ఇందులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ రోల్ మేజర్ అట్రాక్షన్ అయింది. ఆయన రోల్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను పోలి ఉండటం, అతనికి అమ్మాయిల వీక్నెస్ ఉండటం సినిమాలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. కరుణాక

Chandrababu Naidu: చంద్రబాబుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ.. కుప్పంలో చేదు అనుభవం.. అభిమానుల నినాదాలు

Image
పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతకు షాక్ ఇచ్చారు . చిత్తూరు జిల్లా శాంతిపురంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించగా.. జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీలోకి ఆహ్వానించి.. కీలక బాధ్యతలు ఇవ్వాలంటూ ఆయన అభిమానులు నినాదాలు చేయడంతో చంద్రబాబు మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌ ముందు జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాటు.. కుప్పంకి ఎన్టీఆర్‌ని తీసుకుని రావాలంటూ నినాదాలతో హోరెత్తించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో పాటు చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించడం విశేషం. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ పార్టీలో చురుకుగా పాల్గొనే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ అధినేత ముందుంచారు టీడీపీ కార్యకర్తలు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కష్టకాలంలో ఎన్టీఆర్ సాయం కోరతారో.. లేక కొడుకు లోకేష్ బాబుతోనే ఎన్నికలకు వెళ్తారో వేచి చూడాల్సిందే.

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో ‘ముబి’ సర్వీస్.. ఇకపై ఆ సినిమాలన్నీ చూసేయొచ్చు!

Image
ముబి.. చాలా తక్కువ మందికి తెలిసిన క్యూరేటెడ్ ఫిల్మ్ స్ట్రీమింగ్ సర్వీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మాదిరిగా ఇది కూడా ఒక స్ట్రీమింగ్ సర్వీస్. కాకపోతే వాటికి.. ఈ ‘ముబి’కి తేడా ఉంది. ఇందులో ఏ సినిమా పడితే ఆ సినిమాను తోసేయరు. చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి అప్‌లోడ్ చేస్తారు. ప్రస్తుతం వినోదం అనేది ప్రపంచీకరణ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాలను, సిరీస్‌లను మాత్రమే చూడటం లేదు. ఇంగ్లిష్, కొరియన్, చైనీస్, జపనీస్.. ఇలా అన్ని భాషల కంటెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారా చూస్తున్నారు. అయితే, ఇప్పటికీ చాలా కంటెంట్ మనకు ఓటీటీల ద్వారా దొరకడం లేదు. అలాంటి కంటెంట్‌ను ముబిలో చూడొచ్చు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన.. అవార్డులను సొంతం చేసుకున్న సినిమాలు చాలానే మరుగున పడిపోయాయి.. పడిపోతున్నాయి. అలాంటి గొప్ప సినిమాలను అంతర్జాతీయంగా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి ‘ముబి’లో ఉంచుతున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో లేని ఇండియన్, ఇంటర్నేషనల్ మూవీస్‌ని ముబి యాప్‌లో చూడొచ్చు. ఈ యాప్‌లో రోజుకో కొత్త సినిమా అందుబాటులోకి వస్తుంది. అందు

RGV గోవా ఆఫీసులో అప్సర రాణి.. తడిసిన అందాలతో రచ్చరచ్చ! ఏకంగా ఆ మాట చెప్పి షాకిచ్చిన వర్మ

Image
ఈ సృష్టిలో దేన్నైనా తనదైన కోణంలో మాత్రమే చూసే తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతుంటారు. ఏ విషయంలో నైనా మనసుకు ఏదనిపిస్తే అదే ముక్కుసూటిగా మాట్లాడేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిల అందం గురించి ఆయన చేసే కామెంట్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. చివరకు తనకు పోర్న్ సినిమాలు చూసే అలవాటు కూడా ఉందనే విషయాన్ని బయటపెట్టిన వర్మ తాజాగా స్విమ్ సూట్‌లో తడిసిన అందాలు చూస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో మియా మాల్కోవాతో న్యూడ్ వెబ్ సిరీస్ తీసి వర్మ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. మహిళ శరీరంలో అంగాంగాన్ని వర్ణిస్తూ రచ్చ రచ్చ చేశారు వర్మ. ఆ తర్వాత లాక్‌డౌన్ వేళ పలు సినిమాలతో రొమాంటిక్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేశారు. ఆ క్రమంలోనే 'థ్రిల్లర్' మూవీతో అప్సర రాణి అందాలను ప్రేక్షకుల ముందుంచారు. అప్పటి నుంచి వర్మ- అప్సర రాణి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. సమయం దొరికినప్పుడల్లా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరికి సంబంధించిన ప్రతి విషయం ఓ సంచలనం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అప్సర బికినీ లుక్ షేర్ చేస్తూ తనదైన కోణంలో కామెంట్స్ చేశారు వర్మ. తన గోవా ఆఫీసులోని స్విమ్మిం

Love Story: 'సారంగ దరియా' సాంగ్ టీజర్.. అట్రాక్ట్ చేస్తున్న తెలంగాణ ఫోక్‌, సాయి పల్లవి లుక్స్

Image
రియాలిటీ, నాచురల్ నటనకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు రూపొందించే దర్శకుడు శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' అనే మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'ఫిదా' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా, పైగా నాచురల్ బ్యూటీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండటంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమాలోని 'సారంగ దరియా' సాంగ్ టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. గతంలో తెలంగాణలో ఓ సింగర్ పాడిన 'దాని కుడీ భుజం మీద కడువా.. దాని పుస్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' అనే ఫోక్ సాంగ్‌ను ఈ 'లవ్ స్టోరీ' సినిమాలో రీమిక్స్ చేశారు. తెలంగాణ పల్లె పదాలపై సాయి పల్లవి చిందులేసింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన ఆలోచనలకు పదును పెడుతూ ఈ సాంగ్‌కి తగ్గట్టుగా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే లొకేషన్స్ ఎంచుకొని షూట్ చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ టీజర్‌లో సాయి పల్లవి నాచురల్ లుక్స్ పాటకు ప్రాణం పోశాయి. మంగ్లీ పాడిన ఈ పాట ఫుల్ వీడియో ఫిబ్రవరి 28వ తేదీన స్టార్ హీరోయిన్

'అర్జున్ రెడ్డి' నటికి యాక్సిడెంట్.. ఇది హత్యాయత్నం అంటూ సినీ ప్రముఖుడిపై అనుమానం.. పోలీసులకు ఫిర్యాదు

Image
'అర్జున్ రెడ్డి' నటి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవరిపై తన కారు ప్రమాదనికి గురైందని, అయితే ఇది యాక్సిడెంట్ కాదని, తనను చేయడానికి చేసిన కుట్ర అని పేర్కొంటూ శ్రీ సుధ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ యాక్సిడెంట్ వెనక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కుట్ర దాగి ఉందేమో అని ఆమె అనుమానం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయింది. సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడుపై నటి శ్రీ సుధ లైంగిక ఆరోపణలు చేస్తూ గతంలో పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి శారీర‌కంగా వాడుకుని మోసం చేశాడంటూ ఆమె పేర్కొంది. ఈ విషయమై అప్పట్లో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఆమె కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో శ్యామ్ కె.నాయుడు- శ్రీ సుధ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, అతని వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ మరోసారి శ్రీ సుధ పోలీసులను ఆశ్రయించింది. తనను హత్యచేసే క్రమంలో భాగంగానే ఈ యాక్సిడెంట్‌ చేయించి ఉంటాడంటూ శ్యామ్‌ కె. నాయుడిపై శ్రీ సుధ సందేహం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరి గొడవ మరోసారి

అజిత్ సైకిల్ రైడ్.. వేల కిలోమీటర్ల ప్రయాణం పెట్టుకున్న స్టార్ హీరో.. హైదరాబాద్ రోడ్లపై అలా!!

Image
సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక సాధారణంగా ప్రజల మధ్యలో కనిపించడానికి కాస్త కొంతమంది వెనుకాముందు అవుతుంటారు. కానీ కోలీవుడ్ స్టార్ హీరో మాత్రం సాధారణ జీవితం గడపడం, తన హాబీస్ అలాగే కొనసాగించడం లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ హీరోకు బైకుల పిచ్చి మరీ ఎక్కువ. కొన్నిసార్లు షూటింగ్స్‌కు బైక్ పైనే వచ్చిన అనుభవం ఆయన సొంతం. షూటింగ్ స్పాట్ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే బైక్ మీద రైడ్ చేయడమంటే ఆయనకు మహా సరదా. ఈ క్రమంలోనే సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న ఆయన.. కొన్నిరోజుల రోజుల క్రితం ఓ లాంగ్ టూర్ వేశారు. తన స్నేహితులతో కలిసి 30 వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు ప్రయాణం పెట్టుకున్న అజిత్.. తాజాగా హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ చేస్తూ కనిపించారు. ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేలా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఫేస్‌ను క‌వ‌ర్ చేస్తూ సిటీ రోడ్లపై సైకిల్ రైడ్ చేశారు. సైకిల్‌పై హైదరాబాద్ చుట్టేసిన ఆయన, ఓ కేఫ్ దగ్గర చాయ్ తాగుతూ కనిపించారు. అయితే అజిత్‌తో రైడ్ చేసిన వ్య‌క్తులు తీసిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. సౌత్ ఇండియన్ తెరపై, ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీ మాస్ ఫాలోయి

'ఉప్పెన' మేకింగ్ వీడియో.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టికి సూపర్ స్టార్ట్ ఇచ్చిన మూవీ తెరకెక్కిందిలా!!

Image
మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు తొలి సినిమాతోనే కిక్ స్టార్ట్ అయ్యాడు. 'ఉప్పెన'తో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఆయన నటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు సహా పలువురు సినీ స్టార్స్ సైతం ప్రశంసలు గుప్పించడం చూశాం. ఇక హీరోయిన్ నాచురల్ అందాలతో ఆకట్టుకుంది. కెమెరా ముందు ఆమె కదిలిన తీరు సినిమాకు ప్రధాన బలం అయింది. అలాగే విజయ్ సేతుపతి విలనిజం 'ఉప్పెన'కు కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. కాగా, సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా మేకింగ్ వీడియోతో మరోసారి ఆకట్టుకున్నారు మేకర్స్. బేబమ్మగా కృతి శెట్టిని, ఆశీర్వాదం పాత్రలో వైష్ణవ్ తేజ్‌ని‌, కృతి తండ్రి రాయణం పాత్రలో విజయ్‌ సేతుపతిని దర్శకుడు బుచ్చిబాబు మలిచిన తీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రతి సీన్‌పై ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నారని మేకింగ్ వీడియో చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. రాసుకున్న కథని తెరపై చూపించడానికి దర్శకుడు పడిన కష్టం, సెట్‌లో నటీనటులతో బుచ్చిబాబు అనుకున్నట్లుగా అవుట్‌పుట్ రాబట్టడం, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సందడి ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఎలాగైతేనేం మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరి

చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ రిపోర్ట్ ఇదీ.. పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్స్

Image
యూత్ స్టార్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘చెక్’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా.. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేటి శుక్రవారం (ఫిబ్రవరి 26న) ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది ఈ మూవీ. నాంది, ఉప్పెన, జాంబీరెడ్డి వంటి వరుస హిట్ చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ తరుణంలో ‘చెక్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు కల్ట్ బోయ్ నితిన్. ఈ యంగ్ హీరో నితిన్‌కి వీరాభిమాని కావడంతో ప్రతి సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సపోర్ట్ ఉండనే ఉంటుంది. ఈ సినిమాకి ట్వీట్‌లతో హీటెక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నితిన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా నితిన్ ‘చెక్’ సినిమాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం.. రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరుకావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇంతకీ ఈ సినిమా టాక్ ఏంటి?? యూఎస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉంది? ట్విట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటో చూద్దాం. ఫస్టాఫ్

ఏ హీరోయిన్‌కి దక్కని ఘనత నాకు దక్కింది: నందితా శ్వేత

Image
‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కన్నడ నాయిక నందితా శ్వేత. ఆ తర్వాత ‘ప్రేమ కథా చిత్రమ్ 2’, ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ఇటీవలే ‘కపటధారి’ చిత్రంతో పలకరించిన నందితా శ్వేత తన కొత్త సినిమా ‘అక్షర’తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. బి.చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. రేపు (ఫిబ్రవరి 26న) ‘అక్షర’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘అక్షర’ చిత్రంలో నటించిన అనుభవాలను మీడియాతో పంచుకుంది నందితా శ్వేత. ఆమె మాట్లాడుతూ... ✦ నా కెరీర్‌లో హారర్ ఫిలింస్ ఎక్కువ చేయలేదు. ‘ప్రేమ కథా చిత్రమ్ 2’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మాత్రమే చేశాను. ✦ ‘అక్షర’ కథలో ట్విస్ట్ ఉంటుంది. ఆ మలుపు ఏంటి అనేది చెప్పను. సినిమాలో చాలా ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. ఏదో సందేశం చెబుతున్నాం.. మీరు కూర్చుని చూడండి అన్నట్టు ఉండదు. మెసేజ్ మాత్రమే కాకుండా సినిమాకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అక్షర నాకు ఒక ఛేంజ్ ఓవర్ మూవీ అనుకోవచ్చు. ✦ కెరీర్ బిగినింగ్‌లోనే ఫీమేల్ స్క్రిప్ట్ చేయడం అంట

పవర్ స్టార్ సినిమా ఎప్పుడేసినా చూస్తారు.. మాలాంటి వాళ్లకు అలా కాదు: ఆర్కే నాయుడు

Image
‘మొగలిరేకులు’ సీరియల్‌‌తో బుల్లితెర ప్రేక్షకుల అభిమాన నటుడిగా మారిపోయారు ఆర్కే నాయుడు అలియాస్ వీర్ సాగర్. ఆర్కే నాయుడు అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఎంతో హుందాగా పోషించారాయన. ఈ ఒక్క సీరియల్‌తోనే సాగర్‌కు ఒక హీరోకు వచ్చినంత క్రేజ్ వచ్చింది. ఉత్తమ నటుడిగా నంది టీవీ అవార్డ్‌ను కూడా సొంతం చేసుకున్నారు సాగర్. ‘మొగలిరేకులు’ సీరియల్ తరవాత సాగర్ సినిమాల వైపు వెళ్లారు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ప్రభాస్‌ను స్నేహితుడిగా నటించారు. ఆ తరవాత హీరోగా సినిమాలు చేశారు. కానీ, సినిమాల్లో సాగర్ సక్సెస్ కాలేకపోయారు. దీంతో నటనను పక్కనబెట్టి బిజినెస్‌లో బిజీ అయ్యారు. అయితే, చాలా కాలం తరవాత మళ్లీ హీరోగా తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు సాగర్. ‘షాదీ ముబారక్’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. సాగర్ సరసన దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటించారు. ఝాన్సీ, హేమ, రాజశ్రీ నాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అదితి, అజయ్‌ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లోని ప్

నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌.. నాదీ గ్యారంటీ: ‘షాదీ ముబారక్’పై నిర్మాత దిల్‌ రాజు

Image
స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల‌నే కాదు.. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ హృద‌యాలు హ‌త్తుకునేలా కూల్ అండ్ ప్లెజెంట్ మూవీస్‌ను అందిస్తూ ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌. ఈ బ్యాన‌ర్ నుంచి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించ‌డానికి సిద్ధమ‌వుతోన్న మ‌రో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘షాదీ ముబారక్‌’‌. వీర్‌సాగర్‌ (ఆర్కే నాయుడు), దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పద్మశ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు, శిరీష్ నిర్మాత‌లు. ‘షాదీ ముబారక్‌’ మార్చి 5న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ట్రైల‌ర్‌ను నిర్మాత దిల్‌ రాజు విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘‘2020లో కొవిడ్ రావడం ఏంటో కానీ.. 2021లో సినిమాలు విడుద‌ల‌వుతున్న తీరు చూస్తుంటే 90ల్లో ప్రతి వారం రెండు, మూడు సినిమాలు విడుద‌ల‌య్యే రోజులు గుర్తుకువ‌స్తున్నాయి. ఇప్పుడు సినిమాల ఫ్లో స్టార్ట్ అయ్యింది. చిన్న, పెద్ద సినిమాలు ఫ్లో అవుతున్నాయి. ఈ ఏడాది మా బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న సినిమాలు, ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌లిసి స

‘మోసగాళ్ళు’ ట్రైలర్: డియర్ మంచు విష్ణు అంటూ చిరంజీవి ట్వీట్

Image
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మోసగాళ్ళు’. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని విష్ణు భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించారు. నిజ ఘటనల ఆధారంగా ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్‌‌ను ఈ చిత్రం ద్వారా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. మంచు విష్ణు నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ‘మోసగాళ్ళ’ను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి గురువారం (ఫిబ్రవరి 25న) విడుదల చేశారు. ట్విట్టర్ ద్వారా ‘మోసగాళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన చిరంజీవి.. నిజంగా జరిగిన ఒక కథ ఆధారంగా, యూఎస్ఏను వణికించిన అతిపెద్ద ఐటీ స్కామ్‌ను ఈ చిత్రంలో చూపించబోతున్నారని వెల్లడించారు. ప్రియమైన మంచు విష్ణుకు ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నారు. మొత్తం టీమ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు, ‘మోసగాళ్ళు’ ట్రైలర్ విడుదలైన సందర్భంగా హైదరాబ

Virata Parvam : మనసుకు హత్తుకునే మెలోడీతో మరోసారి 'ఫిదా' చేసిన సాయి పల్లవి

Image
నాచురల్ అందం, అంతకుమించి అన్నట్లుగా నాచురల్ స్టెప్పులతో ఫిదా చేయడంతో సాయి పల్లవిని మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. 'ఫిదా' మూవీ, ఈ సినిమాలోని పాటలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ చిన్నది.. తాజాగా '' నుంచి మరో పాటతో ఫిదా చేసేసింది. నాచురల్ లొకేషన్స్‌లో బ్యూటిఫుల్‌గా చిత్రీకరించిన ఈ పాటను కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు విక్టరీ వెంకటేష్. ''కోలు కోలుమ్మా.. కోలు కోలు నా సామి.. మనసే మేలు కొని చూసే.. కలలో నిండిన వాడే.. కనుల ముందుట ఉంటే నూరేళ్లు నిదుర రాదులే'' అంటూ మనసుకు హత్తుకుంటోంది ఈ సాంగ్. లంగా వోణిలో లుక్స్ యూత్ ఆడియన్స్‌ని యమ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. దివ్య మాలికా ఆలపించారు. సురేశ్‌ బొబ్బిలి బాణీలు కట్టారు. రానా, సాయి ప‌ల్లవి జంట‌గా డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ 'విరాటపర్వం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో 'రెవ‌ల్యూష‌న్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్' అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్‌‌తో మూవీ రూపొందిస్తున్నారు. వెన్నెల అనే పాత్రలో సా

Nithiin: 'చెక్' సినిమాపై ఎన్టీఆర్ కామెంట్స్.. నేరుగా ఆ మాట చెప్పేస్తూ బూస్ట్ ఇచ్చిన యంగ్ టైగర్

Image
విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా వైవిద్యభరితమైన కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. డిఫరెంట్ ఆలోచనలతో కథ రాసుకొని ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకుంటున్న ఆయన ఫిబ్రవరి 26 అనగా రేపు '' అనే ఆసక్తికర కథాంశంతో మనముందుకొస్తున్నారు. హీరోగా.. ఉరిశిక్ష పడ్డ ఓ ఖైదీ చెస్‌ గేమ్‌ టాలెంట్‌తో తన లక్ష్యాన్ని ఎలా చేరుకోగలిగాడు అనే ఆసక్తికర పాయింట్‌తో ఈ సినిమా రూపొందించారు. కాగా, తాజాగా ఈ మూవీ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెబుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో 'చెక్' మూవీ పోస్టర్‌ షేర్ చేసిన ఎన్టీఆర్.. ''డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటికి నేనెప్పుడూ అభిమానినే. ఆయన రాసుకునే కథ, వెండితెరపై స్టోరీని చూపించే విధానం నాకు చాలా ఇష్టం. 'చెక్' మూవీ చాలా ఆసక్తికరంగా ఉంది. రేపు సినిమా విడుదల అవుతున్న సందర్భంగా హీరో నితిన్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు'' అని తెలిపారు ఎన్టీఆర్. ఈ ట్వీట్ చూసిన నితిన్ వెంటనే స్పందిస్తూ తారక్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విడుదలకు ముందు తారక్ చేసిన ఈ ట్వీట్ 'చెక్' సి

న్యూడ్ ఫొటో పెట్టమంటూ శ్రీముఖికి రిక్వెస్ట్.. ఆ ఫొటో షేర్ చేస్తూ దిమ్మతిరిగే షాకిచ్చిన రాములమ్మ

Image
సోషల్ మీడియా ఖాతాల్లో చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్, ఫోటోషూట్స్ అప్ లోడ్ చేసే సెలబ్రిటీ జాబితాలో ముందువరుసలో ఉంటుంది యాంకర్ . బుల్లితెర పాపులర్ యాంకర్‌గా హవా నడిపిస్తూనే నిత్యం తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. లైవ్ చిట్ చాట్స్‌లో పాల్గొంటూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజా చిట్ చాట్‌లో ఆమెకు ఓ వింత అనుభవం ఎదురు కావడంతో చాలా చాకచక్యంగా వ్యవహరించింది బుల్లితెర రాములమ్మ. తాజాగా తన ఫాలోవర్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది శ్రీముఖి. అభిమానులు అడిగే ఫొటోలు పంపుతాన‌ని, ఏదైనా ఆస‌క్తికర విష‌యాలు అడిగితే చెబుతాన‌ని శ్రీముఖి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొనడంతో ఓ నెటిజన్ అత్యుత్సాహం చూపిస్తూ ఏకంగా న్యూడ్ ఫొటో పెట్టమని అడిగాడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన శ్రీముఖి.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘నగ్నం' సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది. అంతేకాదు దీని తాలూకు స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంలో శ్రీముఖి తెలివి, చాకచక్యంగా వ్యవహరించిన త

అందుకోసమే ప్రత్యేకంగా ముంబైలో ఫ్లాట్! ఎక్కడా తగ్గని రష్మిక.. అమ్మడి రేంజ్ మామూలుగా లేదే!!

Image
కలిసొచ్చే కాలం రావాలే గానీ ఆపడం ఏ ఒక్కరి తరం కాదనేది పెద్దలమాట. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ స్పీడు చూస్తుంటే అదే ఫార్ములా ఈ అమ్మడికి అప్లై అవుతోందనిపిస్తోంది. కన్నడ సినిమా కిర్రిక్ పార్టీతో సినీ గడప తొక్కిన ఈ బ్యూటీ.. 'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కి తెలుగు ప్రేక్షకుల క్రీజీ హీరోయిన్ అయింది. వరుస ఆఫర్స్‌తో బిజీ అయిపోయింది. ఇక రీసెంట్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసిన ఆమె.. ఏకంగా ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనేసిందని సమాచారం. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో నటిస్తున్న రష్మిక మందన.. బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా సరసన 'మిషన్ మజ్ను' సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఆ వెంటనే బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో డాడీ అనే చిత్రంలో నటించడానికి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మరికొన్ని బాలీవుడ్ కథలను వింటోందట ఈ కన్నడ భామ. ఈ నేపథ్యంలో షూటింగ్స్ నిమిత్తం ముంబై వెళ్లడం, అక్కడి హోటల్స్‌లో ఉండటం ఎందుకని భావించి ఏకంగా ఓ ముంబైలో ఫ్లాట్ కొనేసిందట రష్మిక. ఈ ఫ్లాట్ ముంబైలో

మెగా అప్‌డేట్ రెడీ చేసిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకమైన రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్న పవర్ స్టార్

Image
రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ యమ జోష్‌లో సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే తన రీ- ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్ చేసిన ఆయన, తదుపరి సినిమాల సెట్స్‌పై చురుకుగా ఉంటున్నారు. సమయాన్ని వృధా చేయకుండా చకచకా షెడ్యూల్స్ ఫినిష్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానుల్లో జోష్ నింపేలా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, టైటిల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టైటిల్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 11వ తేదీన విడుదల చేయబోతోన్నట్లుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆ ప్రత్యేకమైన రోజున తమకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనుండటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. కాగా, ఈ సినిమాకు మొదట 'విరూపాక్ష' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు రాగా.. రీసెంట్‌గా 'హరిహర వీరమల్లు' అనే టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది. ఏ.ఎం.రత్నం నిర్మాణంలో భారీ రేంజ్‌లో ఈ సినిమాను

డైరెక్టర్ ట్రైలర్: సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఇంట్రెస్టింగ్ వీడియో

Image
'నాటకం' లాంటి విభిన్నకథాచిత్రంతో తనని తాను ప్రూవ్ చేసుకున్న వెర్సటైల్ యాక్టర్ .. మరో సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. '' పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో శ్యామ్ మరో హీరోగా మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని శరవేగంగా ఈ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేశారు. 2 నిమిషాల 2 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో సస్పెన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు చూపించారు. తన సరికొత్త కథలతో ఎలాగైనా ఓ సినిమా డైరెక్టర్ కావాలని తాపత్రయపడే కుర్రాడి రోల్‌లో ఆశిష్ కనిపించాడు. అయితే ఈ పాత్రను మలిచిన విధానం వైవిధ్యంగా ఉందని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. కేవలం అతడికి మాత్రమే కనిపించే పాత్ర సినిమాపై హైప్ పెంచేసేలా ఉంది. హీరోయిన్ ఐశ్వర్య రాజ్ గ్లామర్ రోల్‌లో కనిపించింది. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెసివ్‌గా ఉంది. మాస్టర్ జశ్విన్ రెడ్డి సమర్పణలో విజన్ సినిమాస్, దీపాల ఆర్ట్స్ బ్యానర్లపై కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ దర్శకత్వంలో ఈ 'డై

గ్రాండ్‌గా సుక్కు కూతురి ఫంక్షన్.. చై, మహేష్ ఫ్యామిలీస్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్ అయిన సమంత

Image
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్‌లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి విచ్చేశారు. నాగచైతన్య, సమంత కూడా జంటగా వచ్చి వేడుకలో తెగ సందడి చేశారు. క్లీన్ షేవ్‌తో నాగచైతన్య స్టైలిష్ లుక్‌లో కనిపించగా మోడ్రన్ డ్రెస్‌లో సమంత స్పెషల్ అట్రాక్షన్ అయింది. మహేష్, నమ్రత సింప్లీ సూపర్‌ అన్నట్లుగా ఆకట్టుకున్నారు. వీళ్ళతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఫంక్షన్‌కి వచ్చారని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ నిమిత్తం కేరళ బయల్దేరబోతోంది సుకుమార్ అండ్ టీమ్. 'పుష్ప' సినిమా పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండతో ఓ సినిమాను చేయనున్నారు సుకుమార్

‘ఆచార్య’ సెట్స్‌పై చిరంజీవి, రామ్ చరణ్.. మారేడిమిల్లి ఫారెస్ట్‌లో అలా! వీడియో వైరల్

Image
మెగాస్టార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఆచార్య' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చెప్పిన డేట్ మే 13 కల్లా ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ అంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియో బయటకురావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. మారేడిమిల్లి ఫారెస్ట్‌లో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని ప్లాన్ చేసిన కొరటాల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు కూడా భాగమవుతున్నారు. దీంతో షూటింగ్ స్పాట్ వద్ద మెగా అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ వీడియో, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి, రామ్ చరణ్‌ లుక్ స్పష్టంగా తెలుస్తోంది. వీడియో చూసిన వారంతా ఈ వేసవిలో 'ఆచార్య' మెగా ట్రీట్‌ మాములుగా ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ సామాజిక కోణంలో ఈ 'ఆచార్య' మూవీ రూపొందిస్తున్నారు. చిత్ర నిర్మాణంలో భాగం కావడంతో పాటు 'సిద్ద' అనే కీలకపాత్ర

Check Movie: పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్.. ఆయన్ని వాడుకునే స్కోప్ ‘చెక్‌’లో లేదు: నితిన్ ఇంటర్వ్యూ

Image
యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానున్న నేపథ్యంలో పాత్రికేయ నితిన్‌ సమావేశమయ్యారు. నితిన్‌ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ‘చెక్‌’ సినిమా ఎలా మొదలైంది? – ‘భీష్మ’ సినిమా అంగీకరించిన సమయంలోనే ‘చెక్‌’ అంగీకరించా. ఒక కమర్షియల్‌ సినిమా, ఒక డిఫరెంట్‌ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాకు ఓకే చెప్పా. లాస్ట్‌ ఇయర్‌ ‘భీష్మ’ విడుదలైంది. తర్వాత లాక్‌డౌన్‌ రావడంతో ‘చెక్‌’ చిత్రీకరణ ఆలస్యమైంది. డిఫరెంట్‌ సినిమాలు, ప్రయోగాలు చేయాలని ఎప్పుడు అనిపించింది? – ‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత! మూడు ఫ్లాపులు రావడంతో ఓ కమర్షియల్‌ సినిమా, మరో డిఫరెంట్‌ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యా. డిఫరెంట్‌ సినిమాలు తీయడంతో చంద్రశేఖర్‌ యేలేటిగారు మాస్టర్‌ కాబట్టి ‘చెక్‌’ ఒప్పుకొన్నా. చంద్రశేఖర్‌ యేలేటిగారు ‘చెక్‌’ స్ర్కిప్ట్‌, మీ క్యారెక్టర్‌ చెప్పినప్పుడు ఏమనిపించింది? – ఫస్ట్‌ వేరే కథ చెప్పారు. ఆ స్క్రిప్ట్ లైన్‌ బావుంది. రెండు నెలలు ట్రావెల్‌ చేశ