పవర్ స్టార్ సినిమా ఎప్పుడేసినా చూస్తారు.. మాలాంటి వాళ్లకు అలా కాదు: ఆర్కే నాయుడు

‘మొగలిరేకులు’ సీరియల్‌‌తో బుల్లితెర ప్రేక్షకుల అభిమాన నటుడిగా మారిపోయారు ఆర్కే నాయుడు అలియాస్ వీర్ సాగర్. ఆర్కే నాయుడు అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఎంతో హుందాగా పోషించారాయన. ఈ ఒక్క సీరియల్‌తోనే సాగర్‌కు ఒక హీరోకు వచ్చినంత క్రేజ్ వచ్చింది. ఉత్తమ నటుడిగా నంది టీవీ అవార్డ్‌ను కూడా సొంతం చేసుకున్నారు సాగర్. ‘మొగలిరేకులు’ సీరియల్ తరవాత సాగర్ సినిమాల వైపు వెళ్లారు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ప్రభాస్‌ను స్నేహితుడిగా నటించారు. ఆ తరవాత హీరోగా సినిమాలు చేశారు. కానీ, సినిమాల్లో సాగర్ సక్సెస్ కాలేకపోయారు. దీంతో నటనను పక్కనబెట్టి బిజినెస్‌లో బిజీ అయ్యారు. అయితే, చాలా కాలం తరవాత మళ్లీ హీరోగా తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు సాగర్. ‘షాదీ ముబారక్’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. సాగర్ సరసన దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటించారు. ఝాన్సీ, హేమ, రాజశ్రీ నాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అదితి, అజయ్‌ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సాగర్, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, స‌హ నిర్మాత శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వీర్ సాగ‌ర్ మాట్లాడుతూ.. ‘‘దిల్‌ రాజు గారి బ్యాన‌ర్‌లో నా పేరు ప‌డుతుంద‌ని నేను అనుకోలేదు. ఆయ‌న బ్యాన‌ర్‌లో నా పేరు రావాల‌నే కోరిక మాత్రం ఉండింది. అది ఈరోజు నిజ‌మైంది. నా క‌ల‌ను నిజం చేసిన దిల్‌ రాజు గారికి థాంక్స్ అనే ప‌దం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. చాలా చిన్న విష‌యాల్లో ఆయ‌న త‌న వంతు స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. అలాగే శిరీష్‌ గారికి ప్రత్యేక కృత‌జ్ఞత‌లు. సినిమా దిల్‌ రాజు, శిరీష్‌ గారి చేతుల్లోకి వెళ్లడం అనేది మిరాకిల్ అనే చెప్పాలి. లాక్‌డౌన్ త‌ర్వాత శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ గారి ‘వ‌కీల్‌ సాబ్’ సినిమా రిలీజ్ అవుతుంద‌ని అనుకుంటే మ‌ధ్యలో వీడెవ‌డ్రా ‘షాదీ ముబారక్’ అంటూ దూరాడు అని మెగా ఫ్యాన్స్‌, ప‌వ‌ర్‌ స్టార్ ఫ్యాన్స్ అనుకు‌న్నారు. కానీ వాళ్లు అర్థం చేసుకుంటార‌ని భావిస్తున్నాను. నేను ఎనిమిదేళ్లుగా స‌క్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప‌వ‌ర్‌ స్టార్‌ గారి సినిమా ఎప్పుడేసినా జ‌నాలు చూస్తారు. కానీ మాలాంటి వాళ్ల సినిమాల‌కు చిన్న టైమ్ స్టార్ట్ మాత్రమే దొరుకుతుంది. అప్పుడు సినిమాను రిలీజ్ చేస్తే స‌క్సెస్‌తో పాటు నిర్మాత‌ల‌కు లాభాలు కూడా వ‌స్తాయి. రాజు గారు మంచి ఉద్దేశంతో ఎంక‌రేజ్ చేయ‌డానికి తీసుకున్న నిర్ణయ‌మిది. నన్ను కూడా ఎంక‌రేజ్ చేస్తార‌ని భావిస్తున్నాను. మెగాభిమానిగా స్టార్ట్ అయిన నేను బుల్లితెర‌పై మెగాస్టార్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకుని మ‌ళ్లీ బిగ్ స్క్రీన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాను. ఎస్‌వీసీ బ్యాన‌ర్ అంటే అంద‌రూ భారీగా ఊహిస్తారు. అంద‌రిలానే నేను కూడా ‘వ‌కీల్‌ సాబ్’ కోసం వెయిట్ చేస్తున్నాను. మ‌ధ్యలో ఈ మూవీని ఎంక‌రేజ్ చేస్తున్నందుకు ధ‌న్యవాదాలు. నా స్నేహితుడు శ్రీనివాస్ రెడ్డి, వినోద్‌, సాయిలతో పాటు మేం క‌లిసి ట్రావెల్ అయ్యాం. నా ఫ్రెండ్స్‌కు, నాకు ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందా అనే చిన్న సందేహం కూడా ఉండేది. అయితే వాళ్లు నా స‌క్సెస్ కోసం ఈ సినిమా చేశారు. నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫ‌ర్ట్ పెట్టి సినిమా చేశాను. క‌చ్చితంగా సినిమా అంద‌రికీ న‌చ్చుతుందని భావిస్తున్నాను. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో ఉన్న టెంపో సినిమాలోనూ ఉంటుంది. ఎక్కడా బోర్ ఫీల్ కారు. మార్చి 5న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. అంద‌రూ మ‌మ్మల్ని ఎంక‌రేజ్ చేస్తార‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాం’’ అని అన్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ