‘పైన పటారం.. లోన లొటారం.. కెలికిసూడు’ అంటూ చెలరేగిన అనసూయ వీడియో
‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. ఇను బాసూ చెబుతాను లోకం యవ్వారం. పైకి బంగారం లోన గూడు పుటారం.. కెలికి చూడు తెలిసిపోద్ద అస్సలు బండారం’.. ఇదేందయ్యో!! ఈ యవ్వారం కాస్త తేడాగానే ఉంది.. అనేట్టుగానే ఉంది ఈపాట. అందులోనూ అనసూయ ఈ పాటకు చీరకు పైకి ఎగ్గొట్టి మరీ స్టెప్పులు వేస్తుంటే అబ్బో మాస్ ఆడియన్స్కి పండకే. జబర్దస్త్ యాంకర్గానే కాకుండా ఐటమ్ సాంగ్స్తోనూ అల్లాడించే అనసూయ ‘పైన పటారం’ అనే ఐటమ్ సాంగ్తో రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె ఖాతాలో మరో ఐటమ్ సాంగ్ చేరింది. కార్తికేయ గుమ్మకొండ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో అనసూయపై ఐటమ్ సాంగ్ చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ ఐటమ్ సాంగ్కి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శనివారం నాడు ఈ ఐటమ్ సాంగ్కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. పూర్తి పాట మార్చి 1న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు. ‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. కెలికి చూడు తెలిసిపోద్ద అస్సలు బండారం’ అంటూ అనసూయ వేస్తున్న మాస్ స్టెప్పులు జబర్దస్త్ అనేట్టుగానే ఉన్నాయి. లిరిక్స్కి తగ్గట్టుగా అనసూయ పలికించే హావభావాలు ఓ రేంజ్లో ఉన్నాయి. మంగ్లి, సాకేత్ పాడిన ఈ పాటకు జాక్స్ బేజోయ్ ట్యూన్స్ అందించారు. సా నా రే ఈ పాటను రాశారు. కౌశిక్ పెగళ్లపాటి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Post a Comment