Posts

Showing posts from October, 2021

RRR Glimpse: రోమాలు నిక్కబొడిచే సీన్స్.. మెగా, నందమూరి అభిమానులకు కిక్కే కిక్కు!!

Image
యావత్ భారతదేశం కళ్ళలో ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా RRR. బాహుబలి సిరీస్ తర్వాత రూపొందిస్తున్న భారీ సినిమా కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఊహకందడం లేదు. పైగా టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ , మెగా పవర్ స్టార్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతుండటంతో యావత్ సినీ లోకం దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసి కిక్కిచ్చారు జక్కన్న. ఓ వైపు శరవేగంగా RRR షూటింగ్ కంప్లీట్ చేస్తూనే గత కొన్ని నెలలుగా రాజమౌళి వదులుతున్న ఒక్కో అప్‌డేట్ ప్రేక్షక లోకంలో పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన RRR పోస్టర్స్, ఫస్ట్‌ సింగిల్‌ భారీ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రామరాజు ఫర్ భీమ్, భీమ్ ఫర్ రామరాజు వీడియోస్ మెగా, నందమూరి అభిమాన వర్గాలను హుషారెత్తించాయి. అలాగే స్నేహితుల దినోత్సవం కానుకగా విడుదల చేసిన 'RRR దోస్తీ' సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్స్ తిరగరాసింది. ఇక తాజాగా మరో రికార్డుల సునామీకి ఊతమిస్తూ RRR గ్లింప్స్ రిలీజ్ అయింది. కేవలం 45 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ రివీల్ చేస్తూ భారీ విజువల్స్‌తో సినిమాపై ఉన్న

Samantha : ‘గే’ కపుల్ పెళ్లి గురించి సమంత పోస్ట్.. ప్ర‌త్యేకంగా స‌మంత ఈ పోస్ట్ చేయ‌డానికి కార‌ణ‌మేంటని గుస‌గుస‌లు?

Image
సమంత తెలిసో తెలియ‌కో అప్ప‌ట్లో వార్తల్లో ఎక్కువ‌గా నిలిచింది. అయితే ఈ మ‌ధ్య భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత మాత్రం ఆమె రెగ్యుల‌ర్‌గా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచిపోయారు. ఒక‌సారి విడాకుల కార‌ణంగా, మ‌రోసారి త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండిస్తూ యూ ట్యూబ్ ఛానెల్స్‌పై వేసిన కేసుల కార‌ణంగా..త‌న కొత్త సినిమాల‌ను అనౌన్స్ చేసిన‌ప్పుడు.. ఆధ్యాత్మిక యాత్ర‌ల‌కు వెళ్లిన‌ప్పుడు..ఇలా ఆమె ఏది చేసినా వార్తగానే నిలిచింది. రీసెంట్‌గా ఆమె పోస్ట్ చేసిన మ‌రో పోస్ట్ కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇంత‌కీ స‌మంత దేని గురించి పోస్ట్ చేశారో తెలుసా? రీసెంట్‌గా తెలంగాణ‌లో గే క‌పుల్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిపై వ‌చ్చిన వార్త ఉన్న పేప‌ర్ క‌టింగ్‌ను స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ద్వారా. మామూలుగా అయితే ఈ వార్త‌ను ఏదో కూతూహలం కొద్ది స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశార‌ని అంద‌రూ అనుకోవ‌చ్చు. అయితే విడాకులు త‌ర్వాత ఆమె ఈ పోస్ట్ చేయ‌డంతో అంద‌రూ చెవులు కొరుక్కుంటున్నారు. డివోర్స్ త‌ర్వాత స‌మంత‌పై వ్య‌క్తిగ‌తంగానూ చాలా వార్త‌లు పుట్టుకొచ్చాయి. ఈమె త‌న స్టైలిష్‌తో రిలేష‌న్‌

దానికి సిగ్గెందుకు? బోరున ఏడుస్తూ పెళ్లిపై ఇలియానా కామెంట్స్! బ్రేకప్ తర్వాత ఓపెన్ అయిన గోవా బ్యూటీ

Image
ఒకానొక సమయంలో తెలుగు తెరను తన అందాలతో షేక్ చేసింది గోవా బ్యూటీ . 'దేవదాసు' సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరో రామ్‌తో రెచ్చిపోయి నటించింది. అప్పటిదాకా తెలుగు ప్రేక్షకులు చూసిన అందాలకు కొత్త రూపమిస్తూ తన నాజూకు అందాలతో హల్చల్ చేసింది. అలా మొదటి సినిమాతోనే యూత్ ఆడియన్స్‌ని పులకరింపజేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని బాలీవుడ్ బాట పట్టింది. ఈ మధ్యకాలంలో తెలుగు తెరపై అంతగా కనిపించకపోయినా సోషల్ మీడియా వేదికగా అందరితో టచ్‌లో ఉంటోంది ఇల్లీ బేబీ. ఈ నేపథ్యంలోనే ఇన్‏స్టాలో బోరున ఏడ్చేసింది ఇలియానా. అంతేకాదు ఏడవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని ఆమె అంటోంది. మరి ఈ ఏడుపుకి కారణం ఏంటంటే.. వంట చేయడానికి కూరగాయలు తరుగుతుంటే రెండు వేళ్లకు గాయం అయిందట. కత్తి చాలా పదునుగా ఉండటం వల్ల పొరపాటున గాయం అయిందట. ఈ విషయాన్ని చెబుతూ తన రెండు వేళ్లకు గాయం కావడంతో చిన్నపిల్లలా ఏడ్చేశానని ఇలియానా పేర్కొంది. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్లు ఆమెను పెళ్లిపై ప్రశ్నించారు. దీంతో ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది ఇలియానా. తనకు కూడా త్వరగా చేసుకోవాలని ఉందని చెబుతూనే.. తనకు కావాల్సిన విధంగా ఉండే వరుడు ద

Megastar Chiranjeevi : దెయ్యం లుక్‌లో చిరంజీవి.. అంద‌రినీ భ‌య‌పెడుతున్న మెగాస్టార్!

Image
కెరీర్ ప్రారంభంలో దొంగ సినిమా చూసిన వారికి ‘గోలీమార్‌.. కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తారో.. ’ అనే పాట గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్‌ను భ‌య‌పెట్ట‌డానికి మెగాస్టార్ దెయ్యంలా మారిపోతారు. మైకేల్ జాక్స‌న్ ఆల్బ‌మ్‌ను స్ఫూర్తిగా తీసుకుని చిరంజీవి అప్ప‌ట్లో చేసిన ఈ సాంగ్ ఆడియెన్స్‌ను తెగ ఆక‌ట్టుకుంది. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌రోసారి చిరంజీవి దెయ్యం లుక్‌లో మ‌ళ్లీ క‌నిపించారు. ఎప్పుడూ న‌వ్వుతూ కూల్‌గా క‌నిపించే చిరంజీవి దెయ్యం లుక్‌ను చూస్తే పిల్ల‌లు జ‌డుసుకుంటారు. అయితే ఇప్పుడు చిరంజీవి చేస్తున్న సినిమాల్లో ఏదీ హార‌ర్ సినిమా లేదే. ఎందుకలా ఆయ‌న దెయ్యం లుక్‌లో క‌న‌ప‌డుతున్నార‌నే సందేహం రాక మాన‌దు. అయితే చిరంజీవి దెయ్యం లుక్‌.. సినిమా కోసం కాదండోయ్‌.. హాలోవీన్ సంద‌ర్భంగా ఆయ‌న వేసిన రియ‌ల్ గెట‌ప్‌. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు హాలోవీన్ సెలబ్రేష‌న్స్ చేసుకున్నారు. వారిలో చిరంజీవి కూడా ఉన్నారు. ఆయ‌న త‌న హాలోవీన్ లుక్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు ఎగ్జ‌యిట్‌మెంట్ డే అని క్యాప్ష‌న్ పోస్ట్ చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఆరున్న‌ర ప‌దులు వ‌య‌సు దాటినా ఆయ‌న ఎంతో ఉత్సాహంగా పిల్ల‌ల

ఎన్టీఆర్‌ను అలా చూపిస్తే ఒప్పుకుంటారా?... డైరెక్టర్ కాకపోయుంటే.. రాజమౌళి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు

Image
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కి మ‌ధ్య చాలా మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రి కాంబినేష‌న్లో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, య‌మ‌దొంగ‌, ఇప్పుడు సినిమాలు రూపొందాయి. అయితే RRRలో ఎన్టీఆర్‌తో పాటు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నారు. రీసెంట్‌గా ఓ కాలేజ్ ఈవెంట్‌లో పాల్గొని అక్క‌డున్న వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు ఇచ్చారు. ఆ క్ర‌మంలో ఒక‌వేళ మీరు డైరెక్ట‌ర్ కాక‌పోయుంటే ఏమై ఉండేవారు అని ఒక‌రు ప్ర‌శ్నిస్తే.. నాకు డ్రైవింగ్ వ‌చ్చు.. క‌చ్చితంగా మంచి డ్రైవ‌ర్‌ను అయ్యేవాడిని అని చెప్పారు జ‌క్క‌న్న‌. అలాగే RRRలో పాత్ర 30 నిమిషాలే ఉంటుంద‌ట క‌దా..నిజ‌మేనా! అని మ‌రొక‌రు ప్ర‌శ్నించారు. నిజంగా అలా చేస్తే ఎవ‌రైనా ఒప్పుకుంటారా? మీరు చెప్పండి త‌న‌దైన స్టైల్లో స‌మాధానం ఇచ్చేశారు రాజ‌మౌళి. బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా RRR..కావ‌డంతో ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఇదొక ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా. ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల‌కు సంబంధించింది. ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్‌గా క‌నిపిస్తుంటే, మ‌న్యం వీర

Puneeth RajKumar : పునీత్ చ‌దువు చెప్పించిన 1800 పిల్ల‌ల బాధ్య‌త నాదే: హీరో విశాల్‌

Image
పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ‌కే కాదు, స‌మాజానికి కూడా ఎంతో సేవ చేశారు. ఎన్నో అనాథాశ్ర‌మాలు, వృద్ధాశ్ర‌మాలల‌కు సాయం చేయ‌డ‌మే కాకుండా, 1800 పిల్ల‌లకు చ‌దువు చెప్పిస్తున్నారు. ఇప్పుడాయ‌న లేరు క‌దా! మ‌రి ఆ పిల్ల‌ల భ‌విష్య‌త్తు ఏంటి? అనే సందేహం ఉంటుంది. అయితే మంచి మ‌న‌సుతో మంచి ప‌నులు చేసేవారికి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో అండ‌గా నిల‌బ‌డుతూ ఉంటారు. పునీత్ ఎంతో ఇష్టంగా చేస్తున్న ఈ ప‌నికి ఓ స్నేహితుడిగా నేనున్నానంటూ ముందుకు వ‌చ్చారు హీరో విశాల్‌. పునీత్ చ‌దువు చెప్పిస్తున్న 1800 పిల్ల‌ల‌కు వ‌చ్చే ఏడాది చ‌దువుకు అయ్యే ఖ‌ర్చును నేను చూసుకుంటాన‌ని హీరో తెలిపారు. విశాల్, ఆర్య న‌టించిన చిత్రం ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పునీత్ రాజ్‌కుమార్‌తో ఉన్న స్నేహాన్ని విశాల్ గుర్తు చేసుకున్నారు. అంతే కాదు. ఆయ‌న బాధ్య‌త‌లో తాను కొంత బాగం తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ‘‘పునీత్ రాజ్‌కుమార్ ఓ మంచి వ్య‌క్తి.. ఆయ‌న లేరనే వార్త‌ను చ‌దివినా, వింటున్నా న‌మ్మాల‌నిపించ‌డం లేదు. క‌ళ్ల‌లో నీళ్లు తిరుగుతున్నాయి. త‌

ఫామ్‌హౌస్‌ను పేకాట క్ల‌బ్‌గా మార్చేసిన యంగ్ హీరో...షాకిచ్చిన పోలీసులు.. అస‌లు నిజాలేంటి?

Image
రేవు పార్టీలు జ‌ర‌గ‌డం అనేవి గుట్టు చ‌ప్పుడు కాకుండా పోలీసుల క‌ళ్లు గ‌ప్పి జ‌రిగిపోతుంటాయి. ఒక రేవు పార్టీలే కావు.. చాలా విష‌యాలు పోలీసుల‌కు తెలియ‌కుండా జ‌రుగుతుంటాయని ఓ ప్ర‌ముఖ ఛానెల్ నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌లో బ‌ట్ట‌బ‌య‌లైంది. అస‌లేం జ‌రిగింద‌నే విష‌యంలోకి వెళితే, హైద‌రాబాద్ శివార్లులోని మంచి రేవుల ద‌గ్గ‌ర ఓ ఫామ్ హౌస్ ఉంది. అది కేవ‌లం ఫామ్ హౌస్ అనుకుంటే పొర‌బ‌డ‌ట్టే. పెద్ద జూద‌శాల‌గా మారిపోయింది. ఈ విష‌యాన్ని పోలీసులు, ఛానెల్‌వాళ్లు క‌నిపెట్టేశారు. ఈ యంగ్ హీరో ఆధ్వ‌ర్యంలోనే ఈ ఫామ్ హౌస్ క‌మ్ పేకాట క్ల‌బ్ ర‌న్ అవుతుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. ఇక్క‌డొక రేంజ్‌లో బిజినెస్ జ‌రుగుతుంది. క్యాసినోను మించిన రేంజ్‌లో వ్యాపారం జ‌రుగుతుండ‌టం కొస‌మెరుపు. ఇదంతా సుమంత్ చౌద‌రి అనే వ్య‌క్తి న‌డిపిస్తున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చినా, అస‌లు సూత్ర‌ధారి మాత్రం స‌ద‌రు యంగ్ హీరోనే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నుంచి ఈ ఫామ్‌హౌస్‌ను ఐదేళ్ల పాటు లీజుకు తీసుకుని దాన్ని పేకాట క్ల‌బ్‌గా మార్చార‌ట‌. ఇప్పుడీ కేసులో స‌ద‌రు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా చిక్కుకున్న‌ట్లైంది. ఫామ్ హౌస్‌పై రైడ్ చే

Rajinikanth : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్

Image
సూప‌ర్‌స్టార్ హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు. ‘‘నా చికిత్స పూర్తయ్యింది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగు ప‌డాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల‌కు హృద‌య పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు. మూడు రోజుల ముందు ర‌జినీకాంత్‌కు త‌లనొప్పిగా ఉంద‌నిపించ‌డంతో ఆయ‌న్ని కావేరి హాస్పిట‌ల్‌లో జాయిన్ చేయించారు. అక్క‌డ వైద్యులు ఆయ‌న్ని ప‌రిశీలించి మెద‌డులోని న‌రాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయ‌ని గుర్తించి చికిత్స అందించారు. క‌రోటిడ్ ఆర్ట‌రీ రివాస్కుల‌రైజేష‌న్ శ‌స్త్ర చికిత్స చేయించుకోవాల‌ని వైద్యులు ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సూచించారు. డాక్ట‌ర్స్ సూచ‌న మేర‌కు వైద్య నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ర‌జినీకాంత్‌కు క‌రోటిడ్ ఆర్ట‌రీ రివాస్కులైజేష‌న్ శ‌స్త్ర చికిత్స పూర్త‌య్యింది. రెండు రోజుల పాటు హాస్పిట‌ల్‌లోనే రెస్ట్ తీసుకున్న ర‌జినీకాంత్ ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు. ఈ మ‌ద్య‌నే గ‌త వారమే ర‌జినీకాంత్ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి స్వీ

RC15 : రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్‌

Image
మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్‌ను పూనేలో భారీ సెట్ వేసి ప్రారంభించారు. అది కూడా రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వానీల‌పై పాట‌తోనే షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. కొన్ని రోజులుగా షూటింగ్ జ‌రుగుతోంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు, న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు షూటింగ్ జ‌రుగుతుంది. దాంతో తొలి షెడ్యూల్ పూర్త‌వుతుంది. ఈ షెడ్యూల్‌ను ఓ పాట‌, కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను పూర్తి చేశారు. తదుప‌రి షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో ప్రారంభిస్తార‌ట‌. చిన్న బేక్ త‌ర్వాత ఈ షెడ్యూల్‌ను ప్రారంభిస్తార‌ని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలోకి ఓ సీనియ‌ర్ మ‌ల‌యాళ స్టార్‌ను విల‌న్ రోల్‌కు శంక‌ర్ తీసుకున్నార‌ని వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆ సీనియ‌ర్ మ‌ల‌యాళ స్టార్ ఎవ‌రో కాదు.. సురేశ్ గోపి. ప‌లు అనువాద చిత్రాల‌తో ఇది వ‌ర‌కే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు ఈ సీనియ‌ర్ న‌టుడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పూర్తి చేసిన రామ్‌చ‌ర‌ణ్ ఆ వెంట‌నే పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా చేయాల‌నుకుని శంక‌ర్‌తో చేతులు క‌లిపారు. తెలుగ

భర్తతో కలిసి మందు కొడుతూ పేకాట.. ఛీ ఛీ సిగ్గు లేదా?..కాజల్‌పై నెటిజన్ల ఆగ్రహం

Image
కొందరు సెలెబ్రిటీలు ఈ మధ్య మరీ హద్దులు దాటుతున్నారు. సామాజిక బాధ్యత అంటూ ఒకటి ఉందని కూడా మరిచిపోతోన్నారు. మద్యం హానికరమని తెలిసినా కూడా జనాలు తాగడం మానేయడం లేదు. అయితే జనాల ఆరోగ్యం పట్ల సెలెబ్రిటీలకు కాస్తైన శ్రద్ద లేదనిపిస్తుంది. పొగాకు, గుట్కా, మద్యం వంటి వాటికి సెలెబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. ఇంకా చెడగొడుతున్నారు. మొన్నటికి మొన్న అమితాబ్ పొగాకు ఉత్పత్తుల యాడ్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ మధ్య హీరోయిన్లు సైతం ఆల్కహాల్‌కు సంబంధించిన ప్రకటనల్లో నటిస్తున్నారు. ఆ మధ్య రెజీనా కూడా ఇలానే విస్కీ బ్రాండ్ సిగ్నేచర్‌ను ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేసింది. అసలే సెలెబ్రిటీలను గుడ్డిగా నమ్మే వారు కోకొల్లలు. ఇలాంటి ఆల్కహాల్‌ను ప్రమోట్ చేస్తే వాటి ప్రభావం ఇంకా ఉంటుంది. కానీ సెలెబ్రిటీలకు మాత్రం కాసింత కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాజల్ కూడా ఇదే దారిలో నడిచింది. భర్తతో కలిసి మందు కొడుతున్నట్టుగా, పేకాట ఆడుతున్నట్టుగా ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో టీచర్స్ బ్రాండ్‌కు సంబంధించిన మందు బాటిల్ ఉంది. ఇక ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన పోస్ట్ చేసిన కాజల్ ఇప్పుడు నెటి

RRR Movie: హీరోలంద‌రూ అలా కావ‌డానికి పూరీనే కార‌ణమంటోన్న రాజ‌మౌళి!

Image
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న పాన్ ఇండియామూవీ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డం ఫుల్ బిజీగా ఉన్నారు. సోమ‌వారం RRR గ్లింప్స్ విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే అనౌన్స్ చేసేశారు. అంద‌రూ గ్లింప్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక వైపు సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌గా ఇప్ప‌టి నుంచే జ‌క్క‌న్న త‌న RRR సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి.. ఇప్ప‌టి నుంచి ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో ఓ కాలేజ్‌లో జ‌రిగిన ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు. అక్క‌డ వారు సినిమా గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ ఎంతో ఓపిక‌గా బ‌దులిచ్చారు. ఈ సంద‌ర్భంలో ఒక‌రు ప్ర‌భాస్‌తో త‌ర్వాత సినిమా ఎప్పుడు చేస్తార‌ని అడిగారు. ఇప్పుడు ప్ర‌భాస్ చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నార‌ని, ఆయ‌నతో సినిమా ఇప్ప‌ట్లో కుద‌ర‌క‌పోవ‌చ్చున‌ని, కుదిరితే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని చెప్పేసి న‌వ్వేశారు రాజ‌మౌళి. ఈ సంద‌ర్భంలో రాజ‌మౌళి డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి మాట్లాడారు. పూరితో ప్ర‌భాస్ చేసిన బుజ్జిగ

చెరుకు రసం అమ్ముతున్న సప్తగిరి!.. వీడియోతో అసలు గుట్టు విప్పిన గెటప్ శ్రీను

Image
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమాకు సంబంధించిన బాగానే ప్రమోట్ చేసుకుంటాడు. అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటాడు. లైవ్‌లోకి వచ్చి నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటాడు. బుల్లితెర, వెండితెరపై గెటప్ శ్రీను ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయాడు. తన చేతిలో ఐదారు ప్రాజెక్ట్‌లున్నాయి. హీరోగానూ చేస్తూనే మరో వైపు సైడ్ కారెక్టర్లతో దూసుకుపోతోన్నాడు. అలా వెండితెర మీద ఎంత బిజీగా ఉన్న జబర్దస్త్ షోను మాత్రం వదలడం లేదు. తాజాగా గెటప్ శ్రీను ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో కమెడియన్, హీరో, నటుడు చెరుకు రసం తయారు చేస్తున్నాడు. రోడ్డు పక్కన ఉన్న చెరుకు బండి వద్ద ఆగారు. శ్రీను, సప్తగిరి ఇద్దరూ కలిసి చెరుకు రసాన్ని తయారు చేసినట్టు కనిపిస్తోంది. ఆ చెరుకు బండి యజమానిని పక్కకు తప్పించినట్టు కనిపిస్తోంది. ఇందులో సప్తగిరి చెరుకు రసాన్ని తయారు చేస్తుండగా.. శ్రీను సాయం చేశాడు. చెరుకు గడలు, అల్లం ముక్కలు అందిస్తూ శ్రీను సాయం చేశాడు. సప్తగిరి చెరుకు రసాన్ని పట్టేస్తున్నాడు. మొత్తానికి చిన్నప్పటి మెమోరీస్ అంటూ గెటప్ శ్రీను ఈ వీడియోను షేర్ చేశాడు. ఇక ఈవీడియో మీద నెటిజన్లు రకరకాల కామెంట్లు

BalaKrishna : చిరంజీవిపై నిజంగా మీకున్న అభిప్రాయమేంటి?.. మోహన్‌బాబుని ఇరకాటంలో పెట్టిన బాలయ్య

Image
టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహన్‌బాబు మ‌ధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడ‌వ న‌డుస్తూనే ఉంటుంది. కొన్నిరోజులు స్నేహంగానే ఉంటారు. మ‌రికొన్ని రోజులు ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకోరు. రీసెంట్‌గా జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల గొడ‌వ‌తో చిరంజీవి, మోహ‌న్‌బాబు మ‌ధ్య డైరెక్ట్‌గా మాట‌లు లేవు. దీనిపై మోహ‌న్‌బాబు కొన్నిసార్లైనా స్పందించారు కానీ.. చిరంజీవి త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లే ఉన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా మెగా కుటుంబ స‌భ్యులు మాత్రం వారిద్ద‌రూ చాలా మంచి స్నేహితుల‌నీ చెప్పేస్తున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవితో నీకేం గొడ‌వ‌? అని మ‌రోసారి మ‌రొక‌రు మోహ‌న్‌బాబు డైరెక్ట్‌గా ప్ర‌శ్నించారు. అయితే ఈసారి మోహ‌న్‌బాబు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే అక్క‌డ ప్ర‌శ్న వేసింది నంద‌మూరి బాల‌కృష్ణ‌. చిరంజీవిగారి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయం ఏంటి? అని బాల‌కృష్ణ మ‌రో ప్ర‌శ్న వేయ‌గానే మోహ‌న్‌బాబు ఏం చెప్పాలా? అని పైకి చూశారు. అవును నిజ‌మే! నంద‌మూరి బాల‌కృష్ణ తొలి డిజిట‌ల్ ఎంట్రీ ఆహాలోని టాక్‌షో అన్‌స్టాప‌బుల్ ద్వారా జ‌రిగింది. బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ ష

కొన్ని సార్లు వదిలేయడమే ముఖ్యం!.. డిప్రెషన్‌లో అలా చేస్తానన్న సమంత

Image
ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. విడాకుల విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. నాగ చైతన్యకు సంబంధించిన మెమోరీస్‌ను కూడా తన వద్ద ఉంచుకోవడం లేదనిపిస్తోంది. చైతూ ఫోటోలను తన ఇన్ స్టాగ్రాం నుంచి సమంత డిలీట్ చేసేస్తోంది. అయితే సమంత ఇప్పుడు మాత్రం తన స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. గత వారం అంతా ఛార్ ధామ్ యాత్ర అంటూ తీర్థ యాత్రల్లో మునిగి తేలిసింది. హిమాయలయాలు, పుణ్య క్షేత్రాలు అంటూ దైవ చింతనలో గడపింది. ఈ వారం అంతా కూడా దుబాయ్‌లో దుమ్ములేపేసింది. అయితే సమంత తన ఫ్రెండ్స్ ప్రీతమ్, సాధన సింగ్‌లతో కలిసి దుబాయ్ వీధుల్లో నానా హంగామా చేసింది. ఇంకా అక్కడే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే సమంత తన రూం ఎలా ఉంటుంది..బెడ్రూం ఎంత దారుణంగా ఉంటుందో చూపించింది. అలా చిందరవందరగా ఎక్కడపడితే అక్కడే బట్టలు పడేసి ఉంటాయని సమంత చెప్పేసింది. అలా గందరగోళంగా ఉన్న రూంను ఎంతో నీట్‌గా చేసేశారంటూ ఆర్గనైజ్ విత్ ఈజ్ అనే కంపెనీ గురించి సమంత ప్రమోషన్ చేసింది. ఆర్గనైజ్ విత్ ఈజ్ ఇలా మన రూంను ఎంతో అందంగా చేసేసిందని సమంత చెప్పుకొచ్చింది. మామూలుగా అయితే తనకు ఎప్పుడైనా మూడ్ బాగా లేకపోయినా, డిప్రెషన్‌లా అనిపించినా కూడా

hero Nani: త‌న విల‌న్‌కు స‌పోర్ట్‌ చేయడానికి ముందుకొచ్చిన నేచుర‌ల్ స్టార్ నాని!

Image
త‌న విల‌న్‌కు నేచుర‌ల్ స్టార్ స‌పోర్ట్ ఇవ్వ‌టం ఏంటి? అనే సందేహం రాక‌మాన‌దు. ఇంత‌కీ నాని విల‌న్ ఎవ‌రా? అంటే కార్తికేయ‌. కార్తికేయకు నాని ఏవిధంగా స‌పోర్ట్ చేస్తున్నారంటే.. హీరోగా న‌టించిన రాజా విక్ర‌మార్క చిత్రం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ద్వారా. యువ క‌థానాయ‌కుడు కార్తికేయ లేటెస్ట్ మూవీ ‘రాజా విక్ర‌మార్క‌’. యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమాను న‌వంబ‌ర్ 12న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. న‌వంబ‌ర్ 1న సాయ‌త్రం 4 గంట‌ల 15 నిమిషాల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమా ట్రైల‌ర్‌ను నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇది వ‌ర‌కు నాని హీరోగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్‌లో కార్తికేయ విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇలా ఓ అప్‌క‌మింగ్ హీరోకు ఆల్ రెడీ సెటిల్ అయిన హీరో స‌పోర్ట్ చేయ‌డం అనేది అభినందించాల్సిన విష‌య‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు కార్తికేయ ప‌క్కా మాస్‌కు, యూత్‌కు క‌నెక్ట్ అయ్యే పాత్ర‌ల‌ను పోషించారు. కానీ తొలిసారి తన రూట్ మార్చి రాజా విక్ర‌మార్క‌తో డిఫ‌రెంట్ అట

TDP పగ్గాలు చంద్రబాబుకు ఎందుకిచ్చావ్? బాలయ్యకు మోహన్ బాబు సూటి ప్రశ్న.. నటిసింహం షాకింగ్ రియాక్షన్

Image
నందమూరి నటసింహం ట్రాక్ మార్చేశారు. ఇన్నాళ్లు రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, ఇక డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ''అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం'' అని గర్జిస్తూ నేరుగా ఆన్ లైన్ వేదికలపై అడుగు పెడుతున్నారు నటసింహం. 'అన్‌స్టాప‌బుల్‌' అంటూ రంగంలోకి దూకుతున్నారు. ఈ షో తొలి ఎపిసోడ్‌ను మంచు మోహ‌న్‌ బాబు అండ్ ఫ్యామిలీపై చిత్రీక‌రించారు. ఇది దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు. కేవలం 3 నిమిషాలతో కట్ చేసిన ఈ వీడియోలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా కొత్త అవతారంలో దర్శనమిచ్చారు బాలయ్య బాబు. సీనియర్ హీరోలు బాలకృష్ణ, మధ్య నడిచిన సంభాషణ ఎపిసోడ్‌పై అంతులేని ఆసక్తి నెలకొల్పింది. కామెడీ, కాంట్రవర్సీ కలగలపి సందడి చేశారు ఇద్దరు బడా హీరోలు. అలాగే ఈ ఇద్దరి జీవితాలకు సంబంధించిన సినీ, రాజకీయ విషయాలపై ఎన్నో సీక్రెట్స్ ఈ ఎపిసోడ్‌ ద్వారా తెలుసుకోవచ్చని ప్రోమో చూస్తుంటే స్పష్టమవుతోంది. ఇక ఈ ప్రోమోలో బాలయ్యను కొన్ని విషయాలపై మోహన్ బాబు సూటిగా ప్రశ్నించడం హైలైట్ అయింది

అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్‌తో ఆడుకోవడం సరదా!.. కామాంధుడి గుట్టు విప్పిన చిన్మయి

Image
సింగర్,డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. మహిళ సమస్యలను ఎప్పుడూ ప్రపంచానికి తెలిసేలా చేస్తుంటుంది. మహిళలు ఎదుర్కొనే బాధలను, సమాజంలో అమ్మాయిలపై జరిగే అకృత్యాలను ఎప్పటికప్పుడూ ఎత్తి చూపిస్తూనే ఉంటుంది. అలాంటి చిన్మయి తాజాగా కొన్ని స్టోరీలను షేర్ చేసింది. తన ఇన్ స్టాగ్రాం స్టోరీల్లో ఓ కామాంధుడి కథను చెప్పింది. ఇద్దరు వ్యక్తులు చాటింగ్ చేసుకున్న తీరు.. అందులోనే చర్చించుకున్న విషయాలు, మాట్లాడుకున్న అసభ్యకర పదజాలం గురించి చిన్మయి స్పందించింది. మొన్నటికి మొన్న సబ్యసారి అడ్వర్టైజ్మెంట్, మంగళసూత్రాల మీద ఆయన చేసిన అసభ్యకర యాడ్ వివాదాస్పదంగా మారింది. దానిపై చిన్మయి స్పందించింది. మంగళసూత్రం కేవలం ఓ ఆభరణం లాంటిదేనని చిన్మయి అభిప్రాయపడింది. అయితే అది కేవలం ఆడవారికే ఎందుకు.. మరి మగవాళ్లకు పెళ్లైందని చూపించేందుకు ఎందుకు ఎలాంటి ఆభరణాలు పెట్టలేదని చిన్మయి ప్రశ్నించింది. అయితే తాజాగా ఓ కామాంధుడు చేసిన చాటింగ్, తన ఫ్రెండుతో పెట్టిన ముచ్చట్ల గురించి చిన్మయి గుట్టు విప్పింది. వాడికి పద్నాలుగేళ్ల వయసు వచ్చినప్పుడు అమ్మాయిల వక్షోజాల మీద కన్ను పడింది. వాటిని పట్టుకోవడ

ఏడుపొస్తోంది.. నా బిడ్డలకు మోసం చేస్తున్నాను.. బాలయ్య ముందు కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ బాబు

Image
అదేంటి? మోహ‌న్‌బాబు త‌నేంతో ప్రేమించే త‌న పిల్ల‌ల‌ను మోసం చేస్తున్నారా? అనే సందేహం రాక మాన‌దు. ఈ మాట అన్న‌ది మోహ‌న్‌బాబే. అయితే మాట‌ల‌కు అర్థం సంద‌ర్భాన్ని బ‌ట్టి మారిపోతూ ఉంటుంది. ఇంత‌కీ మోహ‌న్‌బాబు ఏ సంద‌ర్భంలో ఈ మాట చెప్పార‌నే విష‌యం తెలియాలంటే మాత్రం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ చూడాల్సిందే. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న అన్‌స్టాప‌బుల్ షో ఆహాలో ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. అస‌లు బాల‌కృష్ణ‌తో టాక్ షో అంటే ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ప్రోమో చూస్తే మాత్రం త‌ప్ప‌కుండా ఇదొక డిఫ‌రెంట్ టాక్ షో అని అర్థ‌మ‌వుతుంది. రొటీన్ టాక్ షోకు బాల‌య్య త‌న‌దైన ఎనర్జీని జోడించారు. మాస్‌, క్లాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునేలా డైలాగులేశారు. ఇక ప్ర‌శ్న‌ల సంగ‌తి స‌రేస‌రి! అటు మోహ‌న్‌బాబుని, ఇటు బాలకృష్ణ‌ని సినీ జ‌ర్న‌లిస్టులు అడ‌గ‌టానికి సంకోచించే ప్ర‌శ్న‌ల‌కు ఈ టాక్ షో స‌మాధానం చెప్పేస్తుంది. అలాగే ఒక ప‌ర్స‌న‌ల్ క్వ‌శ్చ‌న్ అని బాల‌కృష్ణ అన‌గానే మోహ‌న్‌బాబు విస్కీనా? అని అన్నారు. అప్పుడు బ్యాగ్రౌండ్‌లో ఏక్ పెగ్ లా అనే పాట రావ‌డం ఆక‌ట్ట

RRR : ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లలో ఎవరు బెస్ట్ చెప్పిన రాజమౌళి

Image
బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌దుప‌రి చిత్రం RRR. పాన్ ఇండియా రేంజ్‌లో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇంకా హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రుల‌తో ఈ సినిమాను రూపొందించారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ ఇది. భారీ తారాగ‌ణం.. నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగానే బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై అంద‌రిలో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా ఓ ప‌క్క జ‌రుగుతుండ‌గా మ‌రోవైపు రాజ‌మౌళి త‌న సినిమాకు కావాల్సిన ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. రీసెంట్‌గా జ‌క్క‌న్న ఓ ఇంట‌ర్వ్యూలో RRR గురించి మాట్లాడారు. ఆ స‌మ‌యంలో ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.. ఈ ముగ్గురితో మీరు ప‌నిచేశారు. మీ దృష్టిలో మీరు ఎవ‌రికీ ఓటేస్తారు? అని ఒక‌రు ప్ర‌శ్నించారు. అస‌లు రాజ‌మౌళి ఎలాంటి స‌మాధానం చెబుతారా? అని అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది. అయితే రాజ‌మౌళి తెలివైన ప్ర‌శ్న‌ను చ

Bala Krishna : బాలకృష్ణ అన్‌స్టాపబుల్.. ఐదు ఎపిసోడ్స్ లిస్టు ఇదే..నిజంగా ఆహా అనాల్సిందే!

Image
నందమూరి బాల‌కృష్ణ డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక స్క్రీన్‌పై సంద‌డి చేయాల్సింది మాత్రమే మిగిలింది. తెలుగు ఓటీటీ మాధ్య‌మ‌మైన ఆహాలో బాల‌య్య అన్‌స్టాప‌బుల్ అనే టాక్‌షో కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షోకు సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలో షోకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. తొలి ఎపిసోడ్‌ను మంచు మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో చిత్రీక‌రించారు. ఇందులో మంచు మోహ‌న్‌బాబు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌, విష్ణు పాల్గొన‌గా..వారిని బాల‌కృష్ణ ప్ర‌శ్న‌ల‌డిగారు. ఈ షోకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఎప్పుడో ముగిసింది. దీన్ని దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న విడుద‌ల ప్ర‌సారం చేయ‌బోతున్నారు. నంద‌మూరి అభిమానులంద‌రూ ఈ షో కోసం చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండ‌స్ట్రీ తాజా స‌మాచారం మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అన్‌స్టాప‌బుల్‌లో ఐదు ఎపిసోడ్స్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింద‌ట‌. తొలి ఎపిసోడ్‌ను మోహ‌న్‌బాబు అండ్ ఫ్యామిలీపై చిత్రీక‌రించారు. ఇక రెండ‌వ షోను రానా ద‌గ్గుబాటిపై చిత్రీక‌రించారు. ఇక మూడో ఎపిసోడ్‌ నేచుర‌ల్ స్టార్ నానితో ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ ఎపిసోడ్‌కు

ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు! రోజులు మారుతుంటే జరిగేది అదే.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

Image
ట్విట్టర్ ఖాతా నుంచి ఎప్పుడైతే అక్కినేని పేరును తొలగించిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో పేరు మారుమోగిపోతోంది. నాగ చైతన్యతో విడాకుల విషయమై బోలెడన్ని వార్తలు షికారు చేసిన అనంతరం అవన్నీ నిజమే అని ప్రకటించి షాకిచ్చింది సమంత. చైతూతో వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఆ క్షణం నుంచి తనదైన దారిలో వెళుతూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది సమంత. సోషల్ మీడియా ఖాతా ద్వారా తన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూనే మోటివేషనల్ లైన్స్ షేర్ చేస్తోంది. వ్యక్తిగత జీవితానికి దైర్యం ముఖ్యమంటూ ఆమె షేర్ చేస్తున్న సందేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అమ్మాయి చదువు, పెళ్లి అంటూ ఆడపిల్లల తల్లిదండ్రులకు సూచనలిచ్చిన సామ్.. తాజాగా మరో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ప్రముఖ రైటర్ రాబర్ట్ రాసిన పదాలను ఇన్స్‌స్టా స్టోరీగా పెట్టేసింది. ఒక మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే ఆ మనిషి ఏంటనేది తెలియజేస్తాయని, ఆ సమయంలో మనిషి స్వభావం బయట పడుతుందని రాబర్ట్ రాసిన వాక్యాలను అందరి ముందు పెట్టింది సమంత. అంతేకాదు రోజు రోజుకూ పరిస్థితులు మారుతాయని, మీ కోసం ఏది ఉద్దేశించబడి ఉంటుందో, ఏదైతే

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

Image
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను శనివారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లోనే ప్రమాదవశాత్తు జారి పడ్డారు. అప్పటి నుంచి మందులు వాడుతున్నా పెద్దగా ప్రయోజనం లేకపోగా నిన్న రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న .. టాలీవుడ్ మూడు తరాల హీరోలతో తెరపంచుకున్నారు. సిపాయి కూతురు సినిమాతో 1959లో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత వెండితెరకు దూరంగా ఉంటున్నారు. వయసు మీద పడటంతో ఆనారోగ్య కారణాలతో ఇంటిపట్టునే ఉంటున్నారు కైకాల. గత 60ఏళ్లుగా తెలుగు సినిమా రంగంలో 777 సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ. నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసిన ఆయన.. పలు చిత్రాల్లో హాస్య నటుడిగా, ప్రతినాయకుడిగా, నాయకుడిగా ప్ర

RT70 : నిర్మాత‌గా మారిన ర‌వితేజ‌.. రామాయణంతో మాస్ మ‌హారాజాకు లింకు .. వివాదాల‌కు దారి తీస్తుందా!

Image
మాస్ మ‌హారాజా ర‌వితేజ రెండు వైపులా ప‌దున్న క‌త్తిలా దూసుకెళ్లిపోతున్నారు. ఒక‌వైపు సినిమాలు పూర్తి చేస్తున్నారు.. మ‌రోవైపు కొత్త సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. ఇప్ప‌టికే ఖిలాడి సినిమాను పూర్తి చేసిన ఈ కమ‌ర్షియ‌ల్ స్టార్ హీరో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ధ‌మాకా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అల్యూమియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను కూడా చాలా త్వ‌ర‌గా పూర్తి చేసేస్తున్నారు మాస్‌రాజా. ఈ సినిమా కంప్లీట్ కాకుండానే నెక్ట్స్ సినిమాకు ఓకే చెప్పేశారు. 70వ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఓ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఇందులో హీరోలు వెళ్లిపోరు అనే లైన్ ఉంది. దీనికి త‌గిన‌ట్లు ఆల‌యంపై ఉండే శిల్పాలు.. అందులో మ‌న ఇతిహాసం రామాయ‌ణంను సూచిస్తున్నాయి. అందులో రావణాసురుడు శిల్పం ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. అంటే రాముడు.. రావ‌ణాసురుడుకి ఈ క‌థ‌కు ఉన్న లింకేంట‌నేది తెలుసుకోవాలంటే వేచి చూడక త‌ప్ప‌దు. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌ను న‌వంబ‌ర్ 5న ఉద

ఆశ ఎన్‌కౌంటర్ ట్రైలర్: కల్పితం అంటూనే అంతా చూపించిన ఆర్జీవీ

Image
కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే చూపు అక్కడే. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు.. ఆయన తీరు చూసే ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. వివాదాస్పద సినిమాలు తీయడంలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఎవరెన్ని విమర్శలు చేసినా తన దారి తనదే అన్నట్లుగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన నేపథ్యంలో సినిమా రూపొందించారు ఆర్జీవీ. నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన దిశ సామూహిక అత్యాచారం యావత్ భారత దేశాన్ని ఆగ్రహంలో ముంచెత్తింది. ఆ తర్వాత దిశ నిందితులు ఎన్‌కౌంటర్ చేయబడ్డారు. అయితే నలుగురు యువకులు అత్యంత పాశవికంగా దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన ఈ దుర్ఘటనను, ఆ తర్వాత ఆ దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు యువకుల ఎన్‌కౌంటర్ దృశ్యాలను తన సినిమాలో చూపించబోతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీకి ఆశ ఎన్ కౌంటర్ అని పేరు పెట్టిన ఆర్జీవీ.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల నిడివితో కూడిన ఈ వీడియోలో దిశ ఘటనను చూపించే ప్రయత్నం చేశారు. అయితే ట్రైలర్ మొదట్లో మాత్రం 'ఈ చిత్రం ఏ వ్యక్తుల పైన, ఏ ఘటనల పైన ఆధారపడి తీయలేదు కేవలం కల్పితం' అని చెబుతూ తనదైన దారిలో వెళ్లారు వర్మ

అందుకే పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయలేదు.. ఓ సారి ఆయన్ని కలిస్తే! సీక్రెట్ బయటపెట్టిన రాజమౌళి

Image
తెలుగు సినిమా రేంజ్ ఏంటనేది ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు . బాహుబలి లాంటి భారీ సినిమాతో గత రికార్డులన్నీ తుడిపేశారు జక్కన్న. ఇక ఎల్లలుదాటిన క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు పవన్. మరి అలాంటి ఈ ఇద్దరు దిగ్గజాలు కలిస్తే ఆ సంచలనాలు ఉహించగలమా? రాజమౌళి- పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా రావాలనేది ఎంతోమంది సినీ ప్రియుల కోరిక. తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయ్యారు రాజమౌళి. తాజాగా శ్రీకాకుళంలో జరిగిన ఓ కాలేజ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు ఛేహారు. పవన్‌తో మీ సినిమా ఎప్పుడని ఓ స్టూడెంట్ అడగడంతో ఓపెన్ అయ్యారు జక్కన్న. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని చాలా సంవత్సరాలు వెయిట్ చేశానని, కానీ అది కుదరలేదని చెబుతూ గత విషయాలు ప్రస్తావించారు రాజమౌళి. ''ఓ సారి ఓ మూవీ షూటింగ్ జరుగుతుండగా పవన్‌ని కలిశాను. ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆ తర్వాత సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది అని అడిగా. మీరు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో అది చెప్పండి. ఎలాంటి సినిమా చేయడానికైన

పునీత్‌కు కన్నీటి వీడ్కోలు.. అశ్రు నయనాల నడుమ ముగిసిన స్టార్ హీరో అంత్యక్రియలు

Image
కన్నడ పవర్‌ స్టార్‌ శుక్రవారం గుండెపోటుతో మరణించడంతో యావత్ సినీ ఇండస్ట్రీ షాక్ అయింది. ఉదయం జిమ్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఆయన ఆసుపత్రికి తరలించాక చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పునీత్‌ మరణవార్త సౌత్ ఇండియాలో సినీ ప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇక శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునీత్‌ అంతిమ దర్శనానికి తెలుగు, తమిళ చిత్రసీమలకు చెందిన నటీనటులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కంఠీరవ మైదానంలో పునీత్ భౌతిక కాయానికి నివాళులర్పించి శ్రద్థాంజలి ఘటించారు. బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ పునీత్‌ పార్ధివ శరీరాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే నిన్న (శనివారం) సాయంత్రమే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరగాల్సి ఉండగా.. ఆయన పెద్ద కూతురు అమెరికా నుంచి వచ్చేందుకు ఆలస్యం కావడం వల్ల నేటి తెల్లవారు జామున పునీత్ అశ్రు నయనాల నడుమ పునీత్ అంత్యక్రియలు జరిపారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగి

S. S. Rajamouli: ప్రభాస్‌- రాజమౌళి వార్! జనాల్లో ఓ రేంజ్ చర్చలు.. ఈ విషయమై జక్కన్న రియాక్షన్ వైరల్

Image
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజామౌళి.. ఇద్దరూ ఇద్దరే. ఎల్లలు దాటిన క్రేజ్ ఈ ఇద్దరి సొంతం. బాహుబలి సిరీస్‌తో యావత్ సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ చెప్పుకునే భారీ హిట్ ఇచ్చిన ఘనత ఈ ఇద్దరి సొంతం. ఇద్దరూ కలిశారంటే అదో సంచలనం. మరి అదే ఇద్దరూ విడివిడిగా పోటీకి దిగితే?. మరికొద్ది రోజుల్లో అదే సీన్ చూడబోతున్నాం. వచ్చే జనవరిలో సినిమాతో జక్కన్న బరిలోకి దిగబోతుంటే సినిమాతో ప్రభాస్ రంగంలోకి దూకుతున్నారు. దీంతో ఈ ఇద్దరి 'ఢీ'పై టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అటు తెరకెక్కిస్తున్న భారీ సినిమా RRR, ఇటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమాలు చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎట్టకేలకు ఈ రెండు సినిమాలు జనవరి నెలలోనే, అది కూడా వారం గ్యాప్‌లో రిలీజ్ కానున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల దృష్టి మొత్తం సంక్రాంతిపై పడింది. జనవరి 7వ తేదీన RRR గ్రాండ్ రిలీజ్ ఉండగా, జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీంతో ఈ రెండు సినిమాలు పోటీపడనున్నాయనే టాక్ షురూ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీగా

ఆ కోరిక తీరకుండానే పునీత్ వెళ్లిపోయారు.. విషయం చెబుతూ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్

Image
క‌న్న‌డ స్టార్ హీరో శుక్ర‌వారం గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయన మరణంతో యావత్ సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఎంతో భవిష్యత్, ఇతరులను ఆదుకోవాలనే మంచి మనసున్న పునీత్ ఇకలేరనే వార్తను ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక ఆయ‌న‌తో అనుబంధం ఉన్న పలు భాషల సినీ సెల‌బ్రిటీలయితే కన్నీరుమున్నీరయ్యారు. పలువురు స్టార్స్ బెంగుళూరు చేరుకొని పునీత్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అయితే పునీత్ తన చిరకాల కోరిక నెరవేరకుండానే వెళ్లిపోయారని పేర్కొంటూ దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ అసలు విషయం చెప్పారు. పునీత్ వల్లే తాను వెండితెరకు పరిచయమయ్యానని గుర్తు చేసుకున్నారు. తన రెండో ప్రాజెక్ట్‌ ‘అజయ్‌’ కూడా ఆయనతోనే చేశానని చెప్పారు. తాను గారితో '' సినిమా ప్రకటించిన వెంటనే తనకు పునీత్ కాల్ చేసి అభినందించారని మెహర్ రమేష్ చెప్పారు. అలాగే చిరంజీవి గారితో నటించాలనే తన కోరికను ఈ సినిమాతో తీర్చాలని ఆయన కోరినట్లు తెలిపారు. వీలైతే అతిథి పాత్ర లేదంటే కనీసం పాటలోనైనా ఆయనతో కలిసి ఓ చిన్న స్టెప్పు వేస్తానని పునీత్ తనతో అన్నారని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.

ఆనంద్ దేవరకొండ పేరు మరిచిన అల్లు అర్జున్.. స్టేజ్ మీదే సారీ చెప్పిన బన్నీ

Image
తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో స్క్రిప్ట్‌లకు ప్రాధాన్యమిస్తూ కథలను ఎంచుకుంటున్నా. అందుకే మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా వచ్చింది. హిట్ అయింది. ఇక ఇప్పుడు అంటూ రాబోతోన్నాడు. నవంబర్ 12న రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే స్టేజ్ మీద బన్నీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. విజయ్ దేవరకొండ ఎంత ఇంటెలిజెంటో అంత స్వీట్. కొందరు అలా ఉండరు. కానీ విజయ్ మాత్రం చాలా స్వీట్. అందుకే నాకు చాలా ఇష్టం. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ స్టార్డం వచ్చింది. విజయ్ మీద ఎన్ని ప్రయోగాలైనా చేయోచ్చు. ఆయన ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. కేవలం నటనే కాదు.. వ్యాపారాల్లోనూ సక్సెస్ అయ్యాడు. రౌడీ వేర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మామూలుగానే నాకు బట్టలంటే ఇష్టం. రౌడీ నుంచి బట్టలు వచ్చాయంటే ఎంతో ఎగ్జైట్ అవుతాను. ఇక నిర్మాతగానూ మారాడు. యంగ్ టాలెంట్‌కు సాయం చేస్తున్నాడు. విజయ్ అలా ఎదిగిపోతూ ఉంటే మీకు జెలస్ అనిపించదా? అని కొందరు అడిగారు. జెలస్ ఎందుకు ఉంటుంది. అలా అనుకున్నప్పుడు మనం కరెక్ట్‌గా పని చేయడం లేదన్నట్టు. ఈ పరుగు ప

ఇండస్ట్రీలో వాడుకుని వదిలేస్తారు!.. డైరెక్టర్ మారుతి సంచలన కామెంట్స్

Image
డైరెక్టర్ సినిమాను తెరకెక్కించే విధానం గురించి అందరికీ తెలిసిందే. చిన్న బడ్జెట్‌లో సినిమాను చుట్టేయగలడు. భారీ బడ్జెట్ చిత్రాలనూ హ్యాండిల్ చేయగలడు. అయితే మారుతి ఏ సినిమాను తెరకెక్కించినా కూడా తన మార్క్ మాత్రం కచ్చితంగా కనిపిస్తుంటుంది. హాస్య ధోరణిలోనే సినిమాను ముందుకు తీసుకెళ్తాడు. కరోనా కంటే ముందు పక్కా కమర్షియల్ అనే సినిమాను గోపీచంద్‌తో మొదలుపెట్టాడు. అయితే మధ్యలో కరోనా రావడం, షూటింగ్‌లు అన్నీ బంద్ అయిపోవడంతో మారుతి కొత్త ఆలోచన వచ్చింది అందరూ కరోనా భయంతో కొట్టుమిట్టాడుతున్నారని, ఎప్పుడూ భయపడని మిడిల్ క్లాస్ వాళ్లు కూడా భయాందోళనలో ఉన్నారని మారుతి అన్నాడు. అలాంటి వారి కథను తీయాలనే ఆలోచన రావడం, 20 రోజుల్లో కథను రాయడం, ముప్పై రోజుల్లో సినిమాను ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. చాలా చిన్న బడ్జెట్‌తో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే అజయ్ ఘోష్ అయితే ఎంత ఇస్తే అంత తీసుకుంటాడని ఈ కారెక్టర్‌కు ఎంచుకున్నట్టు చెప్పాడు. అలా చాలా తక్కువ బడ్జెట్‌లో ఏదో టైం పాస్‌కు తీసినట్టు తీశాను. కానీ సినిమా చాలా సీరియస్‌గా వచ్చింది అని అన్నాడు. ఈ చిత్రం మనసుకు వేసే వ్యాక్సిన్. మీ భయాలను అన్నింటిని పోగొడుతుందన

Srikanth On Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ చనిపోయింది జిమ్ వల్ల కాదు.. అసలు విషయం బయటపెట్టిన హీరో శ్రీకాంత్

Image
కన్నడ పవర్ స్టార్ మరణంతో యావత్ సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగులో స్ట్రైట్ సినిమా చేయలేకపోయినప్పటికీ.. అగ్రహీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరితోనూ పునీత్ రాజ్ కుమార్‌తో మంచి అనుబంధం ఉంది. ఇటీవల ఆయన నటించిన ‘యువరత్న’ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇక ఎన్టీఆర్ ఆయన సినిమాలో పాటపాడటం.. పూరీ జగన్నాథ్, మెహర్ రమేష్ వంటి దర్శకులతో పనిచేయడంతో పాటు.. చాలామంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు పునీత్ రాజ్ కుమార్. ఈ సందర్భంలో ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించడానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్‌లతో కలిసి వెళ్లిన హీరో .. పునీత్ రాజ్ కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంలో పునీత్ జిమ్ చేస్తూ చనిపోయాడంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆయన లేదంటే నమ్మలేకపోతున్నా.. కళ్లముందే కనిపిస్తున్నారు.. ఎందుకంటే ఆయనతో ‘జేమ్స్’ అనే సినిమాను రీసెంట్‌గా చేశాను. సుమారు 40 రోజులు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన నాకు ముందే తెలుసు.. పునీత్ వాళ్ల ఫ్యామిలీ కూడా నాకు బాగా తెలుసు. పునీత్ నేను కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం

Puneeth Rajkumar : మీ అన్నదమ్ములను చూస్తే మాకు మేం గుర్తొస్తాం!.. పునీత్‌పై నాగబాబు ఎమోషనల్ కామెంట్స్

Image
కన్నడ పవర్ స్టార్ (46) గుండెపోటుతో శుక్రవారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణంతో దక్షిణాది చిత్ర సీమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అప్పు అంటూ ప్రేమగా పిలుచుకునే తమ అభిమాన హీరో మరణించడంతో లక్షల మంది అభిమానులు పొటెత్తారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియ్ంలో నేడు పునీత్ పార్థీవ దేహాన్ని సందర్శానార్థం ఉంచారు. మన టాలీవుడ్ నుంచి ప్రముఖులందరూ కూడా వెళ్లారు. పునీత్‌కు నివాళ్లు అర్పించారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్ ఇలా హీరోలందరూ కూడా పునీత్‌ను చివరి చూపు చూసుకుని వచ్చారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు తాజాగా పునీత్ రాజ్ కుమార్‌ను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. మీ ముగ్గురు అన్నదమ్ముళ్లను చూస్తే.. మా అన్నదమ్ములం గుర్తుకు వస్తామని ఆయనతో ఉన్న మెమోరీస్‌ను నాగబాబు గుర్తుకు చేసుకున్నారు. ‘డియర్ పునీత్.. నువ్ ఎప్పుడూ నాకు తమ్ముడిలాంటివాడివే. ఎవ్వరూ ఊహించటనట్టుగా నువ్ ఎప్పుడూ నా సోదరుడివే. మీ ముగ్గురు అన్నదమ్ములు.. మా ముగ్గురిలా కనిపిస్తారు.. అంతే కాకుండా కళ్యాణ్ బాబులా మీరు కూడా పవర్ స్టార్ అని పేరొందారు.. అయితే కేవలం ఇవే కారణాలు కాదు.. మీరు చేసిన మంచి పనులు, మీ చారిటీలు, సేవా గుణం, మంచి

అందాల ఆరబోతలో హద్దులు దాటేసింది!.. అంతా బయటపెట్టేసిన సోనాల్ చౌహాన్

Image
తెరపై ఎంతలా హల్చల్ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. తెరపై అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయదు. బికినీలో తన వయ్యారాలను ఒలకబోస్తూ ఉంటుంది. అలా తాను నటించిన దాదాపు ప్రతీ సినిమాలో బికినీలో కనిపిస్తుంటుంది. లెజెండ్, పండగ చేస్కో, డిక్టేటర్ ఇలా అన్నీ చిత్రాల్లోనూ సోనాల్ చౌహాన్ అందాలను ఆరబోసింది. ఇక బాలీవుడ్ తెరపై మాత్రం మామూలుగా రచ్చ చేయదు. అన్నింటికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో సోనాల్ చౌహాన్ దుమ్ములేపుతూ ఉంటుంది. తాజాగా సోనాల్ చౌహాన్ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. లో దుస్తులు మాత్రమే ధరించి పై అందాలను ప్రదర్శించింది. బెడ్డుపై అలా కూర్చుని తన పరువాలను బయటపెట్టేసింది. అయితే తాజాగా ఈ ఫోటోలు నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. ఇక ఆమె నల్ల రంగు లో దుస్తుల్లో కనిపించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ హాట్ బ్యూటీకి తాజాగా మంచి ఆఫర్ వచ్చింది. అనిల్ రావిపూడి వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఎఫ్ 3 సినిమాలో సోనాల్ చౌహాన్‌కు మంచి రోల్ దక్కింది. ఇందులో సునీల్ పాత్ర కొత్తగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే సునీల్‌కు జోడిగా సోనాల్ చౌహాన్‌ను తీసుకున్నట్టు కనిపిస్తోంద

Pushpaka Vimanam : ‘పెళ్లాం లేచిపోయిందా?’.. కొత్తగా ట్రై చేసిన ఆనంద్ దేవరకొండ

Image
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. దొరసాని అంటూ మొదటి సినిమాతో ప్రయోగమే చేశాడు. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడిస్ అంటూ సక్సెస్ కొట్టేశాడు. కానీ అది ఓటీటీకే పరిమితమైంది. అలా వచ్చిన సక్సెస్‌ను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాడు. కానీ ఈ సారి మాత్రం థియేటర్లో హిట్ కొట్టేందుకు అంటూ రాబోతోన్నాడు. తాజాగా ఐకాన్ స్టార్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. పుష్ఫక విమానం ట్రైలర్‌లో కథ ఏంటో అర్థమైపోతోంది. బావిలో కప్పలాంటి ఓ ప్రభుత్వ లెక్కల మాస్టారు. పెళ్లి తరువాత సిటీకి వచ్చి సెటిల్ అవుతాడు. కానీ అతని భార్యను మాత్రం ఎవ్వరికీ చూపించడు. భార్య ఇంట్లోనే ఉన్నట్టుగా అందరినీ నమ్మిస్తాడు. హోటళ్లు నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినతన భార్య చేసిందని స్కూల్‌లో స్టాఫ్ అందరికీ వడ్డిస్తుంటాడు. అలా తన భార్య ఇంట్లోనే ఉందని నమ్మించేందుకు నానా కష్టాలు పడతాడు. కానీ అసలు తన భార్య ఉండదు. పెళ్లైన పది రోజులకే లేచిపోతుంది. ఇక ఈ విషయంలో అతడి చుట్టూ పోలీసులు తిరుగుతుంటారు. లేచిపోయిందని చెప్పడానికి ఒక్క ఫ్రూప్ చూపించరా? అని పోలీస్ కారెక్టర్‌లో ఉన్న సునీల్ అడిగితే.. ఆమె రాసిన లెటర్ ఉందంటూ హ

పునీత్ రాజ్‌కుమార్‌కి చిరంజీవి, వెంకటేశ్ నివాళి... కంఠీరవ స్టేడియాని ధృతి రాజ్‌కుమార్.. అంత్య‌క్రియ‌లు వాయిదా!

Image
క‌న్న‌డ హీరో పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో శుక్ర‌వారం మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను అభిమానులు ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక ఆయ‌న‌తో అనుబంధం ఉన్న సినీ సెల‌బ్రిటీల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోష‌ల్ మీడియా ద్వారా సంతాపాన్ని ప్ర‌క‌టించిన మ‌న టాలీవుడ్ హీరోలు చిరంజీవి, వెంక‌టేశ్‌, శ్రీకాంత్‌, అలీ శనివారం రోజున బెంగుళూరు చేరుకుని పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మీడియాతో కూడా మాట్లాడారు. ‘‘జీర్ణించుకోలేని విష‌యం. పునీత్‌ను మ‌న‌కు దూరం చేసి ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు. ఎంతో బాధ‌గా ఉంది. ఎప్పుడూ బెంగుళూరు వ‌చ్చిన రాజ్‌కుమార్‌గారి కుటుంబాన్ని క‌లిసేవాడిని. రాజ్‌కుమార్‌గారైతే వారి పిల్ల‌లంద‌రితో న‌న్ను క‌లిపించేవారు. త‌ర్వాత శివ‌, పునీత్‌ల‌తో మా బంధం కొన‌సాగింది. ఈరోజు పునీత్ మ‌ర‌ణంపై ఇంత మంది దుఃఖాన్ని వెలిబుచ్చుతున్నారంటే ఆయ‌నెంత గొప్ప వ్య‌క్తో అర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి అన్నారు. ‘‘పునీత్ వంటి మంచి వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోవడం చాలా దురదృష్ట‌క‌రం’’ అన్నారు వె

Shyam Singha Roy : RISE OF SHYAM అంటూ నాని రచ్చ.. ఫస్టి సింగిల్ ఎప్పుడంటే?

Image
నేచురల్ స్టార్ వరుసగా సినిమాలు రెడీ చేస్తున్నాడు. లాక్డౌన్ వచ్చి పెద్ద హీరోలు కూడా ఎవ్వరూ సినిమాలను రిలీజ్ చేయలేదు. కానీ నాని మాత్రం గత లాక్డౌన్ సమయంలో ఓ చిత్రాన్ని వదిలాడు. మళ్లీ ఈ లాక్డౌన్ తరువాత ఇంకో చిత్రాన్ని వదిలాడు. అయితే అలా నాని ఓటీటీలో తన చిత్రాలను వదిలేస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. కానీ సినిమాలు మాత్రం అనుకున్నంతగా ఆడటం లేదు. నాని వీ, టక్ జగదీష్ సినిమాలు అంతగా వర్కవుట్ అవ్వలేదు. అలా ఓటీటీలు నానికి కలిసి రావడం లేదో ఏమో గానీ.. ఇక ఇప్పుడు మాత్రం నాని దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. నాని రాహుల్ సంకృత్యాన్ కాంబోలో అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. కలకత్తా నేపథ్యంలో, పునర్జన్మల బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతోన్నట్టు టాక్. అందుకే రెండు షేడ్స్ ఉన్న లుక్స్‌ను రివీల్ చేశారు. ఒక దాంట్లో ఎంతో సీరియస్‌గా ఉంటే ఇంకో దాంట్లో ఎంతో కూల్‌గా కనిపించాడు. మొత్తానికి ఈ సారి కథను కలకత్తాకు తీసుకెళ్లి హిట్ పట్టుకొస్తాడేమో. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేశార

Vishnu Manchu : మంచు విష్ణు పరువుతీసీన హైపర్ ఆది.. తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు.. పర్యావసానం ఎలా ఉంటుందో?

Image
వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ట్రెండ్‌కు తగ్గట్టుగా కౌంటర్లు వేస్తుంటారు. నిత్యం జరిగే వాటిపై కౌంటర్లు వేస్తుంటారు. ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారో అలాంటి వారిపై ఆది కౌంటర్లు వేస్తుంటాడు. అలా గతంలో కత్తి మహేష్, రాకేష్ మాస్టర్, కతర్ పాప, శ్రీరెడ్డి ఇలా కొందరిపై హైపర్ ఆది పంచ్‌లు వేశాడు. అలా ఎవరు ఎప్పుడు ట్రెండ్ అయితే వారి మీద తన స్కిట్లలో వెరైటీ పంచ్‌లు రాసుకుంటాడు. వారిపై సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా హైపర్ ఆది కన్ను మీద పడింది. మా ఎన్నికల్లో మంచు విష్ణు చేసిన హడావిడి అంతా కాదు. మీడియాతో మాట్లాడుతూ మంచు విష్ణు చెప్పిన మాటలు, చేసిన అతిపై నెట్టింట్లో లెక్కలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఓ సందర్భంగా నా గురించి పది ఊర్లను దత్తత తీసుకున్నాను.. నేను చెప్పను... మీరే వెళ్లి చూసుకోండి అని అంటాడు.. చెప్పను అన్న తరువాత ఎలా తెలుస్తుంది.. ఎలా వెళ్లి తెలుసుకోవాలి? అంటూ ట్రోల్స్, మీమ్స్ జరిగాయి. ఇక మంచు విష్ణు తన ప్రసంగాల్లో ఎక్కువగా వాడిన పదం అంకుల్. లెట్ దెమ్ నో అంకుల్ అంటూ ఎక్కువగా వాడేశాడు. ఇక టంగుటూరి వీరేహం పకహం అంటూ ఏదేదో మాట్లాడేశాడు. ఇలా మంచు విష్ణు నాడు సోషల్ మీడియ

పెళ్లై ఏడాది.. భర్త సీక్రెట్ చెప్పిన చందమామ.. రాత్రి అలా చేస్తాడన్న కాజల్

Image
గత ఏడాది ఈ సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. కరోనా దెబ్బకు అందరూ విలవిల్లాడిపోయారు. ఫస్ట్ వేవ్ దెబ్బకు అందరూ కుదేలయ్యారు. కొన్ని కొన్నిరంగాలు అలా పుంజుకోవడం ప్రారంభించాయి. ఎక్కడా ఎక్కువ మంది కలిసి ఈవెంట్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు లేవు. అలాంటి సమయంలోనే తన ప్రేమను బయపెట్టేసింది. తన ప్రేమ గురించి ప్రపంచానికి వింతగా తెలియజేసింది. గౌతమ్ కిచ్లూతో ఎప్పటి నుంచో స్నేహబంధాన్ని కొనసాగిస్తూ వచ్చిన కాజల్ మొత్తానికి లాక్డౌన్ ఎఫెక్ట్‌తో ప్రేమ పీఠల వరకు తెచ్చేసింది. అలా అక్టోబర్ 30న గత ఏడాది ముంబైలో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య కాజల్ పెళ్లి వేడుకలు జరిగాయి.. సెలెబ్రిటీలు ఎవ్వరూ కూడా వెళ్లలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగానే శుభాకాంక్షలు అందించారు. అలా కాజల్ గౌతమ్ పెళ్లి నిరాండబరంగానే జరిగినా కూడా వారం రోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె ధరించిన పెళ్లి చీర, వాడిన కాస్ట్యూమ్స్, హనీమూన్ పిక్స్ ఇలా ఎన్నోన్నో విషయాలతో నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది. అయితే మొత్తానికి కాజల్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉంది. తన పెళ్లై ఏడాది అవుతోంది. వివాహా బంధానికి ఏడాది పూర్తి కావడంతో కాజల్ ఎమ

NTR: పునీత్ రాజ్‌కుమార్‌కు ఎన్టీఆర్ నివాళి...కాసేపు మౌనంగా అలానే చూసిన తార‌క్‌

Image
క‌న్న‌డ అగ్ర క‌థానాయ‌కుడు పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణ వార్త తెలిసిన సినీ ఇండ‌స్ట్రీ షాక‌య్యింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్ తో పునీత్ రాజ్‌కుమార్‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. పునీత్ మ‌రి లేర‌నే వార్త విన‌గానే తార‌క్ షాక‌య్యారు. శ‌నివారం ఆయ‌న బెంగుళూరు చేరుకుని పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయ‌న చాలా సేపు పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని అలా చూస్తుండిపోయారు. ఆ స‌మ‌యంలో ఎవ‌రితోనూ మాట్లాడ‌లేదు. క‌ళ్లార్ప‌కుండా అలా కొద్ది సేపు చూసిన చివ‌ర‌కు న‌మస్కారం చేసి అక్క‌డ నుంచి పునీత్ అన్న‌య్య శివ రాజ్‌కుమార్‌ను క‌లిసి ఆయ‌న్ని ఓదార్చారు. అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఎన్టీఆర్‌ను పునీత్ రాజ్‌కుమార్ త‌న సోద‌రుడిగా భావించేవారు. ఆ అనుబంధంతోనే పునీత్ హీరోగా న‌టించిన చ‌క్ర‌వ్యూహ చిత్రంలో ఎన్టీఆర్ గెల‌యా..గెలయా అనే పాట‌ను పాడారు. ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించారు. అంత‌కు ముందుగానే పునీత్ పార్థివ దేహాన్ని సంద‌ర్శించిన బాల‌కృష్ణ ఎమోష‌న‌ల్‌గా క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా విధిరాత అంటూ త‌ల కొట్టుకున్నారు. రాజ్‌కుమ

RRR గ్లింప్స్ రిలీజ్‌డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. అందరిలో పెరుగుతోన్న అంచనాలు

Image
జ‌క్క‌న్న రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఆప్ ఇండియా RRR. నిజానికి ఈ శుక్ర‌వారం(అక్టోబ‌ర్ 29)రోజున ఈ సినిమా నుంచి ముప్పై, న‌ల‌భై సెక‌న్ల పాటు గ్లింప్స్‌ను విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావించింది. అయితే క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఆక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డంతో కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే తాజాగా గ్లింప్స్‌ను ఆదివారం అంటే న‌వంబ‌ర్ 1న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ గ్లింప్స్ 45 సెక‌న్ల పాటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా కావ‌డంతో ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ అంతా ఎదురుచూస్తుంది. అగ్ర న‌టీన‌టులు చేసిన సినిమా కావ‌డంతో సి

దేవుడు అన్యాయం చేశాడు..నాకు వ్య‌క్తిగ‌తంగా తీర‌ని లోటు అంటూ అంటూ బాల‌కృష్ణ ఎమోష‌న‌ల్ స్పీచ్‌

Image
కన్నడ అగ్ర కథానాయకుడు మ‌ర‌ణం క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. అయితే న‌టుడిగా, వ్య‌క్తిగా ఆయ‌న ఓ క‌న్న‌డ సినీ రంగానికే ప‌రిమితం కాలేదు. తెలుగు, త‌మిళ‌, హిందీ స‌హా ప‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో ఆయ‌న మంచి స్నేహ బంధాన్ని కొన‌సాగించారు. పునీత్ ఇక లేర‌నే వార్త అంద‌ర‌నీ షాక్‌కు గురి చేసింది. శ‌నివారం పునీత్ పార్థివ దేహాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ సంద‌ర్శించి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ త‌ల కొట్టుకుని విధిరాత అంటూ చాలా ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అక్క‌డున్న మీడియాతో మాట్లాడారు. ‘‘పునీత్ రాజ్‌కుమార్‌గారు లేర‌నే వార్త న‌మ్మ‌లేని నిజం. వార్త తెలియ‌గానే షాక‌య్యాను. ఒకే త‌ల్లికి పుట్ట‌క‌పోయినా సోద‌రుల్లాగా క‌లిసి పోయాం. రెండు కుటుంబాల మ‌ధ్య చాలా మంచి స్నేహ బాంధ‌వ్యాలున్నాయి. నాన్న‌గారు, రాజ్‌కుమార్‌గారు రెండు ఫ్యామిలీల మ‌ధ్య అలాంటి అనుబంధాన్ని ఏర్ప‌రిచారు. దేవుడు చాలా అన్యాయం చేశాడు. న‌టుడిగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తో ఎంద‌రికో అండ‌గా నిల‌బ‌డ్డారు. చ‌నిపోయిన త‌ర్వాత కూడా ఆయ‌న త‌న క‌ళ్ల‌ను దానం చేశారు. అంత మంచి మ‌

పునీత్ రాజ్‌కుమార్‌కు బాల‌కృష్ణ నివాళి.. త‌ల కొట్టుకుని.. క‌న్నీళ్లు పెట్టుకున్న నంద‌మూరి హీరో

Image
క‌న్న‌డ ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌ను శోక సంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా పునీత్‌కు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోని స్టార్స్‌తో మంచి అనుబంధాన్ని ఏర్ప‌రుచుకున్నారు. శ‌నివారం కంఠీర‌వ మైదానంలో పార్థివ దేహాన్ని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచారు. ప్ర‌జ‌లు ల‌క్ష‌ల్లో పునీత్ పార్థీవ దేహాన్ని సంద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివ రాజ్‌కుమార్ ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా విధిరాత అంటూ త‌ల కొట్టుకుని త‌న భావోద్వేగాన్ని ప్ర‌ద‌ర్శించారు. బాల‌కృష్ణ‌తో నిర్మాత సాయి కొర్ర‌పాటి ఉన్నారు. తెలుగు చిత్ర‌సీమంటే క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. మ‌న నటీనటుల‌ను ఎంత‌గానో ఆద‌రించేవారు. పునీత్ రాజ్‌కుమార్ విష‌యానికి వ‌స్తే.. వారి ఫ్యామిలీలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీతో అంద‌రికంటే ఆయ‌నే ఎక్కువ స్నేహ సంబంధాల‌ను ఏర్ప‌రుచుకున్నారు. ఇక్క‌డి నుంచి ఏ హీరో బెంగుళూరు వెళ్లినా, పునీత్ వెళ్లి ప్ర‌త్యేక

నేను వాటిని ప‌ట్టించుకోలేదు.. ఆలియాభ‌ట్ టార్చ‌ర్ పెట్టింది.. వాళ్ల‌తో ప‌నిచేయడం చాలా ఈజీ..రాజ‌మౌళి సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

Image
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న ప్రెస్టీజియ‌స్ మూవీ RRR ప్ర‌మోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఒక‌వైపు మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో త‌ల‌మున‌క‌లై ఉంటూనే పాన్ ఇండియా రేంజ్‌లో త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌డంపై కూడా దృష్టి పెట్టారు. రాజమౌళి రీసెంట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న సినిమా RRR ..ఆలియా గురించి, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌హా ఇత‌ర స్టార్స్‌ను డైరెక్ట్ చేయ‌డం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆయ‌న తెలియ‌జేశారు. ‘‘నేను డైరెక్టర్‌గా న‌టీన‌టులు ఉత్తరాదివారా, ద‌క్షిణాదివారా, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ .. అంటూ వారి మ‌ధ్య హ‌ద్దుల‌ను చూడ‌టం మ‌ర‌చిపోయాను. ఆడియెన్స్ విష‌యంలోనూ అంతే నేను భాషా బేదాలు చూడటం మ‌ర‌చిపోయాను. స్క్రిప్ట్ కూడా అంతే నా స్క్రిప్ట్‌కు భాష‌తో సంబంధం లేకుండా ఏ న‌టుడు అయితే న్యాయం చేస్తాడా? అని ఆలోచించే అప్రోచ్ అవుతాను. అలాగే నేను డైరెక్ట్ చేసిన బాహుబ‌లి కార్డ్‌ను కూడా ఉప‌యోగించుకోను. స్క్రిప్ట్ ప్ర‌కార‌మే ముందుకెళ‌తాను. RRR లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌గారు కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న ఈగ హిందీ వెర్ష‌న్ మ‌క్కీకి డ‌బ్బింగ్ చెప్పారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో అనుబంధం

Puneeth Rajkumar: పునీత్ మరణవార్తతో ఆగిన అభిమాని గుండె

Image
ఫ్యాన్స్‌లో డైహార్డ్ ఫ్యాన్స్ వేరు. త‌మ అభిమాన హీరోను ఎవ‌రైనా ఏమైనా చిన్న మాట అంట‌నే విన‌డానికి ఒప్పుకోరు. వారిపైకి గొడ‌వ‌కెళ‌తారు. కొట్టేసుకుంటారు. వారి ప్ర‌వ‌ర్త‌న చూస్తే అబ్బో త‌న హీరో కోసం చ‌నిపోయేలా ఉన్నాడ‌నేంత ప్రేమ ఉందే అనిపిస్తుంది. కానీ నిజంగానే ఇప్పుడుత‌ను ప్రాణంగా ప్రేమించే హీరో లేడ‌ని తెలియ‌గానే ఓ అభిమాని గుండె ఆగింది. కన్నడ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం అభిమానుల‌కు షాక్ ఇచ్చి వారిని శోక సంద్రంలో ముంచేసింది. శుక్ర‌వారం ఉద‌యం గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ అకాల మ‌ర‌ణం చెందారు. మ‌ర‌ణ‌వార్త విన్న త‌ర్వాత క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంది. థియేట‌ర్స్‌ను మూసి వేసింది. మ‌ద్యపాన విక్ర‌యాల‌పై ఆదివారం వర‌కు ప్ర‌భుత్వం నిషేధం విధించింది. అయితే త‌మ అభిమాన క‌థానాయ‌కుడు ఇక లేర‌నే వార్త‌ను అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పునీత్ మర‌ణ‌వార్త విన‌గానే మునియ‌ప్ప‌న్ అనే అభిమాని గుండె ఆగిపోయింది. పొన్నాచ్చి తాలూకాలోని మ‌రూరుకి చెందిన మునియ‌ప్ప‌న్‌కు పునీత్ అంటే ప్రాణం. ఇప్పుడు నిజంగా ఆ ప్రాణ‌మే పోయింది. పునీత్ చ‌నిపోయార‌నే వార్త తెలియ‌గానే మునియ‌ప్ప‌న్‌కు గుండెపోటు వ

నిహారిక కొణిదెల కొత్త వెబ్ సిరీస్‌.. సీక్రెట్ రివీల్ చేసిన మెగాడాట‌ర్‌!

Image
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌క ముందుగానే మెగాడాట‌ర్ నిహారిక ..వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సంగ‌తి తెలిసిందే. సినిమాల్లోహీరోయిన్‌గా న‌టిస్తే ల‌క్ క‌లిసి రాలేదు. ఆ త‌ర్వాత ఆమె పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ త‌న ప్రాజెక్ట్స్‌తో బిజీగా మారాల‌ని అనుకుంటున్నారు. అందులో భాగంగానే కొన్ని రోజుల నుంచి ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓసీఎఫ్ఎస్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జ‌త చేస్తూ పోస్టులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అస‌లు దీని అర్థ‌మేంటో తెలియ‌క చాలా మంది నెటిజ‌న్స్ నిహారిక‌ను అదేంటో చెప్ప‌మ‌ని కూడా అడిగారు. కానీ ఇన్ని రోజులు నిహారిక వారి ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని దాట వేస్తూ వ‌చ్చింది. అయితే శుక్ర‌వారం ఆమె తండ్రి, న‌టుడు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇన్నిరోజులు దాచి పెడుతూ వ‌చ్చిన సీక్రెట్‌ను నిహారిక రివీల్ చేసింది. ఓసీఎఫ్ఎస్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి అని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది నిహారిక‌. ఇది తాను నిర్మాత‌గా జీ5 సంస్థ కోసం నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ అని కూడా ఈ సంద‌ర్భంగా ఆమె తెలియ‌జేసింది. దానికి సంబంధించిన ఫ

Puneeth Raj Kumar: పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం..క్వ‌శ్చ‌న్ మార్క్‌లా మారిన‌ రూ.400 కోట్ల మార్కెట్‌

Image
సినీ రంగంలో ఓ స్టార్ హీరో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చూపించే ప్ర‌భావం ఎంతో ఎక్కువ‌గా బ‌లంగా ఉంటుంది. నిర్మాత‌లే కాదు..డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌.. థియేట‌ర్స్ యాజ‌మాన్యం ఇలా అంద‌రూ స్టార్ హీరో సినిమా స‌క్సెస్ కావాల‌నే కోరుకుంటారు. ఎందుకంటే స్టార్ హీరో సినిమా స‌క్సెస్ అయితే లాభాల‌ను చూడొచ్చనేది వారి ఆశ‌. అలాంటి ఓ స‌క్సెస్‌ఫుల్ స్టార్ ఆక‌స్మాత్తుగా సుదూర లోకాల‌కు వెళ్లిపోవ‌డం అనేది చాలా మందికి బాధ‌నే మిగిలిస్తే.. బాక్సాఫీస్‌కు ప్ర‌శ్నార్థకాన్ని చూపించింది. ఎందుకంటే ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ వేల్యూ రూ.400 కోట్ల‌కు పైమాటేన‌ని బాక్సాఫీస్ వ‌ర్గాల స‌మాచారం. ఎందుకంటే ఆయ‌న సినిమా వ‌స్తుందంటే త‌క్కువ‌లో త‌క్కువ‌గా వంద కోట్ల రూపాయ‌ల బిజినెస్ జ‌రుగుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల అంచనా. ఇప్పుడు ఆయ‌న రెండు సినిమాలు చేస్తున్నారు. జేమ్స్‌, దిత్వ‌. ఈ రెండు సినిమాలకు ఒక్కో దానికి 50-60 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌ను అనుకుంటే రెండు సినిమాల‌కు క‌లిసి వంద నుంచి నూట ఇర‌వై కోట్ల రూపాయ‌లు బ‌డ్జెట్ అవుతుంది. ఇప్పుడు ఇవి సగంలోనే అగిపోతాయి. మ‌రి ఈ ద‌ర్శ‌క నిర్మాత‌ల ప‌రిస్థితేమిటో అంతు ప‌ట్ట‌డ

Puneeth RajKumar: టాలీవుడ్‌లో అందరి బంధువయా.. పునీత్ రాజ్‌కుమార్

Image
తెలుగు చిత్ర‌సీమంటే క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. మ‌న నటీనటుల‌ను ఎంత‌గానో ఆద‌రించేవారు. పునీత్ రాజ్‌కుమార్ విష‌యానికి వ‌స్తే.. వారి ఫ్యామిలీలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీతో అంద‌రికంటే ఆయ‌నే ఎక్కువ స్నేహ సంబంధాల‌ను ఏర్ప‌రుచుకున్నారు. ఇక్క‌డి నుంచి ఏ హీరో బెంగుళూరు వెళ్లినా, పునీత్ వెళ్లి ప్ర‌త్యేకంగా క‌లిసేవారు. ఫంక్ష‌న్స్‌కు అటెండ్ అయ్యేవారు. తార‌క్‌ను నా సోద‌రుడు అనేవారు. ఆ అనుబంధంతోనే ఆయ‌న హీరోగా చేసిన ‘చ‌క్ర‌వ్యూహ‌’లో ‘గెల‌యా గెల‌యా..’ అనే పాటను పాడారు తారక్. అలాగే నందమూరి బాలకృష్ణ అంటే కూడా ఎంతో ఇష్టం. ఆయ‌న సినిమా ప్ర‌మోష‌న్స్‌కు వెళ్లిన‌ప్పుడు పునీత్ ఆయ‌న ప‌క్క‌నే కూర్చున్నారు. బాల‌కృష్ణ ముఖంపై ఏదో ఉంటే త‌న ఖ‌ర్చీఫ్ తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. తానో పెద్ద హీరోన‌నే ఫీలింగ్‌ను ఎక్క‌డా చూపించేవారు కాదు పునీత్‌. ఆర్య సినిమా చూసి బన్నీకి స్పెషల్‌గా ఫోన్ చేసి మాట్లాడారంటే ఆయన మంచితనం, కలుపుగోలుతనం అర్థం చేసుకోవచ్చు. అలాగే చరణ్‌తో ఫ్రెండ్లీగా ఉండేవారు. అదే అంద‌రికీ ఆయ‌న్ని చాలా ద‌గ్గ‌ర చేసింద‌ని అందరూ అంటారు. కేవలం నటీనటులతో సత్సంబంధాలుండేవి కాదు. టెక్నీషియన్స్‌ను కూడా ఎ

చివరి నిమిషంలో RRR గ్లింప్స్ వాయిదా వేసిన జక్కన్న.. రీజన్ ఏంటంటే?

Image
మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఆప్ ఇండియా RRR. నిజానికి ఈ శుక్ర‌వారం(అక్టోబ‌ర్ 29)రోజున ఈ సినిమా నుంచి ముప్పై, న‌ల‌భై సెక‌న్ల పాటు గ్లింప్స్‌ను విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావించింది. అందుకు త‌గిన‌ట్లు భారీగా ప్లాన్ కూడా చేసుకుంది. అప్‌డేట్ కోసం ఇటు మెగాభిమానులు, అటు నంద‌మూరి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూడ‌సాగారు. ఈ నేపథ్యంలో క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ గుండెపోటుతో క‌న్నుమూశారు. దీంతో శాండిల్‌వుడ్ సినీ పరిశ్ర‌మే కాకుండా, యావ‌త్ సినీ ప్ర‌పంచం శోక సంద్రంలో మునిగిపోయింది. దీంతో RRR మేక‌ర్స్ ఇలాంటి ప‌రిస్థితుల్లో గ్లింప్స్ విడుద‌ల చేయ‌డం స‌రికాద‌ని భావించారు. దాంతో గ్లింప్స్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. ‘‘RRR గ్లింప్స్‌ను ఈరోజు సాయంత్రం విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నాం’’ అన్నారు. త్వ‌ర‌లోనే RRR గ్లింప్స్ విడుద‌ల‌కు సంబంధించిన అప్‌డేట్ అనౌన్స్ చేస్తారు. పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాన్మ‌రణంకు గౌర‌వమిస్తూ RRRఅప్‌డేట్‌ను వాయిదా వేయ‌డం మంచి విష‌య‌మ‌ని అంద‌రూ జ‌క్క‌న్న అండ్ టీమ్‌ను అప్రిషియేట్ చేస్తున్నారు. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్

Puneeth Rajkumar Death : పునీత్ రాజ్ కుమార్‌లోని మరో కోణం.. దానాలు, సేవా కార్యక్రమాలతో కోట్ల మంది అభిమానం!

Image
కన్నడ ఇండస్ట్రీకి చెందిన పునీత్ రాజ్ కుమార్(46) మరణ వార్తతో ఒక్కసారి సౌత్ ఇండియా ఉలిక్కి పడింది. సోషల్ మీడియాలో మీద ప్రతీ ఒక్కరూ స్పందిస్తున్నారు. భాషా బేధం లేకుండా పునీత్ గురించి ఎంతో గొప్పగా చెబుతూ సెలెబ్రిటీలు ట్వీట్లు పెడుతున్నారు. ఆయన మరణం తమకెంతో బాధ కలిగించిందని, ఎంతో మంచి మనిషి అంటూ ప్రతీఒక్కరూ చెబుతూ తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అలా అందరి అభిమానం కేవలం నటనతోనే సంపాదించుకున్నాడా? అంటే కాదనే చెప్పాలి. కన్నడ ఆరాధ్య దైవం రాజ్ కుమార్ వారసత్వాన్ని కొనసాగిస్తూ పునీత్ రాజ్ కుమార్ తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే జాతీయ అవార్డులను అందుకున్నాడు. అప్పు అంటూ పూరి జగన్నాథ్ తీసిని సినిమాతో పునీత్ రాజ్ కుమార్‌కు స్టార్డం వచ్చింది. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, సింగర్‌గా, హోస్ట్‌గానూ పునీత్ ఫేమస్. పలు ఉత్పత్తులకు పునీత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. సింగర్‌గా తాను సంపాదించే డబ్బంతా కూడా చారిటీలకే ఇస్తాడట. ఇక తన రెమ్యూనరేషన్‌లోంచి కూడా సేవా సంస్థలకు పెద్ద మొత్తంలోనే వెళ్తుందట. ఇప్పటికే చాలా అనాథ ఆశ్రమా

హీరో యష్‌తో కలిసి స్టేజ్‌పై చివరిసారిగా స్టెప్పులేసిన పునీత్ రాజ్ కుమార్.. వైరల్ అవుతోన్న వీడియో

Image
నిన్న మొన్నటి వరకు మనతో ఆడి పాడిన వ్య‌క్తి ఈరోజు ఉన్న‌ట్లుండి మ‌న మ‌ధ్య లేరు అనే విష‌యం తెలిస్తే ఎలా ఉంటుంది? మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇప్పుడు క‌న్న‌డ స్టార్ హీరో కుటుంబ స‌భ్యుల ప‌రిస్థితి అలాగే ఉంది. ఇక శాండిల్‌వుడ్ స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోని అభిమానులు, ఇత‌ర న‌టీన‌టులకు ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. శుక్ర‌వారం ఉద‌యం జిమ్ చేస్తున్న పునీత్ రాజ్‌కుమార్‌కు గుండె నొప్పి రావ‌డం, వెంట‌నే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఆయ‌న సుదూర లోకాల‌కు వెళ్లిపోవ‌డం జ‌రిగింది. ఈ విషయాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అంద‌రూ ఆయ‌నతో ఉన్న మ‌ధుర స్మృతుల‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు పునీత్ రాజ్ కుమార్ అన్న‌య్య శివ రాజ్‌కుమార్ హీరోగా న‌టించిన ‘జై భ‌జ‌రంగీ 2’ మూవీ విడుద‌లైంది. రాజ్‌కుమార్ ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్న స‌మ‌యంలో అంద‌రికీ పునీత్ హఠాన్మ‌ర‌ణం షాక్ ఇచ్చింది. రెండు రోజుల ముందు అంటే అక్టోబ‌ర్ 27న ‘జై భ‌జ‌రంగీ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ వేడుక‌కు హీరో య‌ష్‌, పునీత్ రాజ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌లో స్టేజ్‌పై శివ రాజ్‌కుమార్‌, పునీత్ రాజ్‌కుమార్‌,