సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై బాలకృష్ణ స్పందన.. బాధతో కూడిన మెసేజ్

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతితో టాలీవుడ్‌ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నందమూరి రియాక్ట్ అవుతూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ''తెలుగు పాటను తన సాహిత్యంతో దశ దిశలా వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత గారు నాకు ఎంతో ఆప్తులు. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాయడం జరిగింది. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల గారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని బాలకృష్ణ పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతదేహాన్ని రేపు (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. ఈ రోజు కిమ్స్ హాస్పిటల్లోనే సిరివెన్నెల మృతదేహం ఉంచనున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ