Vijay Deverakonda: యాదాద్రిలో విజయ్ దేవరకొండ.. గుడిలోనే పట్టేసుకున్న అమ్మాయి
‘ఖుషి’ విజయంతో చాలా ఖుషీగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు ‘ఖుషి’ నిర్మాతలు వై.రవిశంకర్, నవీన్ యెర్నేని, దర్శకుడు శివనిర్వాణ తదితరులతో కలిసి ఆదివారం ఉదయం యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కుటుంబానికి, ‘ఖుషి’ టీమ్కి ముందుగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారికి స్వామివారి దర్శనం కల్పించారు. ప్రత్యేక అర్చన నిర్వహించారు.
Comments
Post a Comment