‘లైగర్’ డిజాస్టరని తెలిసీ అగ్రిమెంట్ మీద సంతకం చేశా.. రూ.20 కోట్ల నష్టం: వరంగల్ శ్రీను
‘లైగర్’ (Liger) సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుపై (Warangal Srinu) ఆ సినిమా దర్శకుడు, నిర్మాత పూరీ జగన్నాథ్ కొన్ని నెలల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా పరాజయం నేపథ్యంలో వరంగల్ శ్రీను తనను బెదిరిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించారు పూరీ. అయితే, ఈ విషయంపై తాజాగా గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరంగల్ శ్రీను స్పందించారు. ఈ విషయంలో కనీసం తనతో పూరీ కానీ, ఛార్మి కానీ మాట్లాడలేదని.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాను చాలా బాధపడ్డానని అన్నారు.
Comments
Post a Comment