Posani Krishna Murali: నా కళ్లకు అది ‘కమ్మ’నందిలా కనిపించింది.. నంది అవార్డులపై పోసాని సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఇచ్చిన నంది అవార్డుల (Nandi Awards) విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali). ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న పోసాని.. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన ఏపీ ఫైబర్‌నెట్ ప్రెస్ మీట్‌లో ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ, జోగినాయుడుతో కలిసి పాల్గొన్నారు. నంది అవార్డుల గురించి మీడియా అడిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. గతంలో ప్రకటించిన నంది అవార్డులు ఇవ్వాలా వద్దా.. కొత్తగా ఇవ్వాలా అనే విషయంలో తమకు కన్‌ఫ్యూజన్ ఉందని, దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనికి కాస్త సమయం పడుతుందన్నారు. ఇదే సమయంలో గతంలో నంది అవార్డుల విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో జరిగిన వివాదాలను ప్రస్తావించారు. ఇక్కడ నంది అవార్డులు ప్రతిభకు రావని.. పంచుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ