తిరుపతి: గిరిజనులతో నటి నిత్యామీనన్.. బిడ్డను ఎత్తుకొని లాలిస్తూ
Nithya Menen in Tirupati District: నటి నిత్యామీనన్ తన సింప్లిసిటీని చాటుకున్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కాంభాగం కాలనీలో గిరిజన ప్రజలతో కాసేపు గడిపారు. అక్కడ ఓ బిడ్డను ఎత్తుకొని లాలించారు. గిరిజనుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బత్తలవల్లం గ్రామంలోని కల్కి ఆశ్రమాన్ని సందర్శించారు. వారం రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నట్లు సమాచారం. నూతన సంవత్సరంలోకి అడుగిడనున్న సమయాన్ని పేద ప్రజలతో గడుపేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Post a Comment