Andhra Pradesh: వాళ్లు మనుషులు కారు.. ఒక అమ్మ, నాన్నకు.. ఫొటో ట్రోలింగ్పై కన్నీళ్లు పెట్టుకున్న మినిష్టర్ రోజా
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రోజా, ఆమె అన్నయ్య కలిసి ఉన్న ఫొటోపై కొందరు ట్రోలర్స్ అభ్యంతకరమైన మెసేజ్లతో ట్రోల్ చేశారు. దీనిపై రీసెంట్గా మినిష్టర్ రోజా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ట్రోలర్స్పై రివర్స్ పంచులేశారు. అదే సమయంలో ఆమె ఎమోషనల్ కూడా అయ్యారు. అన్నా చెల్లె బంధాన్ని తప్పుడు కోణంలో చూస్తూ తప్పుగా చూపిస్తూ ట్రోల్ చేస్తున్న వారు అసలు మనుషులే కాదని రోజా సెల్వమణి అన్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను రాజకీయంగా ఎన్నో పోరాటాలు, ధర్నాలు చేశానని, తనపై ట్రోలింగ్ ఇంతకు ముందు జరిగినప్పుడు తానెప్పుడూ బాధపడలేదని కానీ ఇప్పుడు బాధపడుతున్నానని ఆమె అన్నారు. ఆమె అసలు ఏం అన్నారనే వివరాల్లోకి వెళితే..
Comments
Post a Comment