Veera Simha Reddy: రాజసం నీ ఇంటిపేరు.. జై బాలయ్య.. అప్డేట్ అదిరిందయ్యా!
Veera Simha Reddy: మైత్రీ మూవీ మేకర్స్ ఇటు మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అటు నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులకు వరుస ట్రీట్లు ఇస్తోంది. ఈరోజు ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ‘బాస్ పార్టీ’ పాటను విడుదల చేసిన మైత్రీ.. మరో రెండు రోజుల్లో ‘వీరసింహారెడ్డి’ నుంచి ‘జై బాలయ్య’ అనే పాటను తీసుకొస్తోంది. ఈ మేరకు బుధవారం ఒక అప్డేట్ ఇచ్చింది. ‘రాజసం నీ ఇంటిపేరు’ అంటూ ఒక కొత్త పోస్టర్ను వదిలింది. ఈ పోస్టర్లో బాలయ్య వింటేజ్ లుక్లో మెరిసిపోతున్నారు.
Comments
Post a Comment