Enforcement Directorate: ‘లైగర్’ తలనొప్పి.. విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
విజయ్ దేవరకొండ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 25న పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. అయితే డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా నిర్మాణంలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో చిత్ర యూనిట్కి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి కౌర్ ఈఢీ విచారణకు హాజరయ్యారు. బుధవారం విజయ్ దేవరకొండ ఈడీ ఆఫీసుకి వచ్చారు.
Comments
Post a Comment