Chiranjeevi విలక్షణమైన నటుడు.. తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
మెగాస్టార్ చిరంజీవిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి విలక్షణమైన నటుడని.. అద్భుత వ్యక్తిత్వం ఆయన సొంతమని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల్లో చిరంజీవికి ఈ అవార్డును కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దీంతో చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Post a Comment