‘ఆచార్య’ బీజీఎం.. నేను చేసిన వెర్షన్ డైరెక్టర్ వద్దన్నారు: మణిశర్మ
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన భారీ చిత్రం ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా చాలా కాలం తరవాత చిరంజీవికి సంగీతం అందించారు మెలోడి బ్రహ్మ మణిశర్మ. అయితే, సినిమా డిజాస్టర్ కావడంతో మణిశర్మపై కూడా విమర్శలు వచ్చాయి. ఆయన అందించిన నేపథ్య సంగీతం బాగాలేదని విమర్శించారు. అయితే, దీనిపై మణిశర్మ స్పందించారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆయన ఓపెన్ అయ్యారు.
Comments
Post a Comment