ప్రాణ స్నేహితులు కలిసి వెళ్లిపోయారు.. కృష్ణంరాజు భార్య కంటతడి
రెబల్స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) భార్య శ్యామలా దేవి.. సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కృష్ణ భౌతికకాయాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న శ్యామలా దేవి.. ఆ తరవాత మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణంరాజు, కృష్ణ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారని.. ఇద్దరూ ఒకేసారి కలిసి వెళ్లిపోయారని శ్యామలా దేవి కంటతడి పెట్టుకున్నారు. మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది తీవ్ర శోకమని.. వరుసగా తల్లిని, అన్నను, తండ్రిని కోల్పోవడం బాధాకరమని చెప్పారు.
Comments
Post a Comment