Allu Aravind: నిన్న ‘కాంతార’.. రేపు ‘భేదియా’.. మరో బ్లాక్ బస్టర్పై కన్నేసిన అల్లు అరవింద్
వరుణ్ ధావణ్, కృతి సనన్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ ‘భేదియా’. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ఇటీవలే కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కాంతార’ను తెలుగులో విడుదల చేసి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ‘భేదియా’ విజయంపై కన్నేసింది. అల్లు అరవింద్ సినిమా హక్కులను కొనుగోలు చేశారంటే కచ్చితంగా అది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలే ఎక్కువ.
Comments
Post a Comment