పుణ్యకోటి రాయబారిగా కిచ్చా సుదీప్.. 31 ఆవులను దత్తత తీసుకుంటున్న హీరో
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) ఒక పుణ్యకార్యంలో భాగస్వామి అయ్యారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పుణ్యకోటి దత్తు యోజన’ కార్యక్రమంలో కిచ్చా సుదీప్ పాలుపంచుకుంటున్నారు. ఈ పథకానికి ఆయన అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు. తాను 31 ఆవులను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కర్ణాటకలోని ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఆవును ఆయన దత్తత తీసుకోనున్నారు.
Comments
Post a Comment